"రసపట్టులో తర్కం కూడదు" అంటూ మాయాబజార్ కృష్ణుడు మందస్మితుడై రుక్మిణి దేవి తో చిలిపిగా అన్నప్పుడు మా దుర్గా కళా మందిరంలో సంతోషం తో కూడిన కలకలం నాకు ఇంకా కళ్ళకి కట్టినట్టు గా గుర్తు ఉంది. పింగళి వారి మాటలు ఒక ఋషి పలుకులు లాగా, మెరుగైన శిల్పానికి మల్లె ఇంకా కొత్త గా ప్రజానీకం మనస్సుల్లో కదలాడుతూనే ఉన్నాయి. మచ్చుక్కి కొన్నిటిని (నాకు గుర్తు ఉన్నంత వరకు) స్ప్రుసిస్తాను
ముందుగా ఒక్క మాయబజార్ లోనే వాడిన వాక్య నిర్మాణం సరి కొత్త నిఘంటువు కి మల్లె ఇంకా తన సేవలు అందిస్తూనే ఉంది.
"ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి" అని రహస్యం భేదిస్తాడు ఘటోద్గజుడు.
"శశిరేఖ కనికట్టు ఏమైనా నేర్చిందా లేక నా కన్ను ఏమైనా చెదిరిందా" పాచిక పారని శకుని మామ.
"పండితులు అంటూ సుద్ద మొద్దులు తయారు అయ్యారు" అంటూ ఎద్దేవా.
"భళి భళి భళి ఓ దేవా !! బాగున్నదయా నీ మాయ" అన్న జానపద తత్త్వం.
"ఇదిగో శశి, నీ బావ సత్యవంతుడై వచ్చాడు" అంటూ అభిమన్యుడిని ఉద్దేశిస్తూ కృష్ణుడు జరగబోయే పరిణామాలు చెప్పబోతే "అయితే మా శశి సావిత్రి అవుతుంది లెండి" అంటూ రుక్మిణి వారిస్తుంది.
"లక్ష శని గ్రహాల పెట్టు మా శకుని మామ" అంటూ అతని కుటిలత్వాన్ని ఒక్క మాట తోనే తేల్చుతాడు కృష్ణుడు. "బాల కుమారులంట, చాలా సుకుమారులంట, పెళ్ళికొడుకు నన్ను చూసి , మురిసి మూర్చ పోవునంట" అన్న మన సావిత్రి.
మరి "అస్మదీయులకు విరుగుడు తస్మదీయులు" అన్న ప్రయోగం, ఆశ్చర్యానికి "ఆసచర్యం" అనిపించడం, "ఆ నీటు గోటు" ఇలా ఎన్నో !!
జగదేక వీరుని కధ లోని ఇంద్రకుమారి తన సఖులని "హల" అని సంభోదించడం చూస్తే దేవలోకం లో ఈయన కొన్నాళ్ళు అక్కడ నివాసం చేసారా అని అనిపిస్తుంది. అట్లాగే మూడు లోకాలు ని పాలించే అమ్మని "జేజి" అని పిలవడం ఆయనకే చెల్లింది. "వరించి వచ్చిన మానవ వీరుడు ఏమయ్యాడని విచారమా" అంటూ ఇంద్ర కుమారి ని ఆట పట్టించడం అతికి నట్టు సరిపోతుంది.
అలాగే మిస్సమ్మ లో "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అన్నప్పుడు స్త్రీ హృదయం ఈయన ఒక్కడికే అర్ధం అయ్యిందా అని అనిపించక మానదు. "చూస్తారా నా conduct certificate" అని NTR అడిగినప్పుడు ఇప్పటికి చూసే వారు పక్కున నవ్వుతారు. "తన మతమేదో తనది, మన మతమసలే తగదోయ్" అన్నప్పుడు చంద్రుడిని ఎలా మన హీరో కలుపు కొన్నాడో చర్చ కొన్నాళ్ళు జరగాల్సిందే. SVR "అదే" అని పదే పదే అనడం ఊత పదం నించి సరసమైన హాస్యం ని పుట్టిస్తారు.
"నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా" చేతులు కట్టుకొని మన NTR అడగడం, "సాహసం సేయరా డింబకా, రాజ కుమారి లభిస్తుంది" కుటిల ప్రోత్సాహం చూపే నేపాలి మాంత్రికుడు. ఇవన్నీచేరి ఈరోజుకి రాజ మౌళి వంటి డైరెక్టర్ లని మళ్లీ తీద్దామా అని అనిపిస్తోంది.
ఈయన నాగుపాము కుబుసం విడిచి నట్టుగా ఒక సినిమా లో వాడిన ప్రయోగాల కనీసపు వాసన కూడా మరో వాటిల్లో రాకుండా పడిన జాగ్రత్త చూస్తే ఇవ్వాల్టి వాళ్ళ దివాలా కోరు తనం కనపడుతుంది. ఉదాహరణ కి గాయం సినిమా లో హిట్ అయ్యిన డైలాగ్ లు హిందీ సత్య లో వినపడితే "అయ్యో" అని అనిపించక మానదు.
అటువంటి మహానుభావుణ్ణి మళ్లీ తలుచుకొనే ప్రయత్నం ని హర్షిస్తారు అని భావిస్తున్నాను.
ముందుగా ఒక్క మాయబజార్ లోనే వాడిన వాక్య నిర్మాణం సరి కొత్త నిఘంటువు కి మల్లె ఇంకా తన సేవలు అందిస్తూనే ఉంది.
"ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి" అని రహస్యం భేదిస్తాడు ఘటోద్గజుడు.
"శశిరేఖ కనికట్టు ఏమైనా నేర్చిందా లేక నా కన్ను ఏమైనా చెదిరిందా" పాచిక పారని శకుని మామ.
"పండితులు అంటూ సుద్ద మొద్దులు తయారు అయ్యారు" అంటూ ఎద్దేవా.
"భళి భళి భళి ఓ దేవా !! బాగున్నదయా నీ మాయ" అన్న జానపద తత్త్వం.
"ఇదిగో శశి, నీ బావ సత్యవంతుడై వచ్చాడు" అంటూ అభిమన్యుడిని ఉద్దేశిస్తూ కృష్ణుడు జరగబోయే పరిణామాలు చెప్పబోతే "అయితే మా శశి సావిత్రి అవుతుంది లెండి" అంటూ రుక్మిణి వారిస్తుంది.
"లక్ష శని గ్రహాల పెట్టు మా శకుని మామ" అంటూ అతని కుటిలత్వాన్ని ఒక్క మాట తోనే తేల్చుతాడు కృష్ణుడు. "బాల కుమారులంట, చాలా సుకుమారులంట, పెళ్ళికొడుకు నన్ను చూసి , మురిసి మూర్చ పోవునంట" అన్న మన సావిత్రి.
మరి "అస్మదీయులకు విరుగుడు తస్మదీయులు" అన్న ప్రయోగం, ఆశ్చర్యానికి "ఆసచర్యం" అనిపించడం, "ఆ నీటు గోటు" ఇలా ఎన్నో !!
జగదేక వీరుని కధ లోని ఇంద్రకుమారి తన సఖులని "హల" అని సంభోదించడం చూస్తే దేవలోకం లో ఈయన కొన్నాళ్ళు అక్కడ నివాసం చేసారా అని అనిపిస్తుంది. అట్లాగే మూడు లోకాలు ని పాలించే అమ్మని "జేజి" అని పిలవడం ఆయనకే చెల్లింది. "వరించి వచ్చిన మానవ వీరుడు ఏమయ్యాడని విచారమా" అంటూ ఇంద్ర కుమారి ని ఆట పట్టించడం అతికి నట్టు సరిపోతుంది.
అలాగే మిస్సమ్మ లో "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అన్నప్పుడు స్త్రీ హృదయం ఈయన ఒక్కడికే అర్ధం అయ్యిందా అని అనిపించక మానదు. "చూస్తారా నా conduct certificate" అని NTR అడిగినప్పుడు ఇప్పటికి చూసే వారు పక్కున నవ్వుతారు. "తన మతమేదో తనది, మన మతమసలే తగదోయ్" అన్నప్పుడు చంద్రుడిని ఎలా మన హీరో కలుపు కొన్నాడో చర్చ కొన్నాళ్ళు జరగాల్సిందే. SVR "అదే" అని పదే పదే అనడం ఊత పదం నించి సరసమైన హాస్యం ని పుట్టిస్తారు.
"నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా" చేతులు కట్టుకొని మన NTR అడగడం, "సాహసం సేయరా డింబకా, రాజ కుమారి లభిస్తుంది" కుటిల ప్రోత్సాహం చూపే నేపాలి మాంత్రికుడు. ఇవన్నీచేరి ఈరోజుకి రాజ మౌళి వంటి డైరెక్టర్ లని మళ్లీ తీద్దామా అని అనిపిస్తోంది.
ఈయన నాగుపాము కుబుసం విడిచి నట్టుగా ఒక సినిమా లో వాడిన ప్రయోగాల కనీసపు వాసన కూడా మరో వాటిల్లో రాకుండా పడిన జాగ్రత్త చూస్తే ఇవ్వాల్టి వాళ్ళ దివాలా కోరు తనం కనపడుతుంది. ఉదాహరణ కి గాయం సినిమా లో హిట్ అయ్యిన డైలాగ్ లు హిందీ సత్య లో వినపడితే "అయ్యో" అని అనిపించక మానదు.
అటువంటి మహానుభావుణ్ణి మళ్లీ తలుచుకొనే ప్రయత్నం ని హర్షిస్తారు అని భావిస్తున్నాను.
nabhutho nabhavishyathi
ReplyDelete