Monday, November 7, 2011

కృష్ణం వందే జగద్గురుం


కొన్ని విషయాలని యధాలాపం గా చదువుతాం, వింటాం, అర్ధం చేసికొంటాం. అకస్మాత్తుగా మన పక్కన ఉన్న పిల్లవాడో లేక స్నేహితుడో మనం చదివిన లేదా విన్న విషయంపై ఒక ప్రశ్న వేస్తాడు. "అరేరే !! మనకి ఈ విషయం ఎందుకు తట్టలేదురా" అనుకునే సందర్భాలు కొల్లలు. కాకపోతే ఈ యొక్క ప్రేరేపణ వెంటనే జరగవచ్చు లేదా కొన్ని విషయాలలో చాల సంవత్సరాలు కూడా పట్టా వచ్చు.
చాల రోజులు అయింది అనుకొంటా, కృష్ణావతారం సినిమా చూసి !! మన NTR చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. మళ్లీ ఎవరికీ అయినా నమ్మకం కలగదేమో అని, ఆ బోయడు ముసలంలో మిగిలిన చివరి ముక్కని సానదీసి బాణానికి తగిలించు కొన్నాడని కూడా సినిమా లో చూపిస్తారు.  నేను కూడా సరేలే ముని శాపం మరియు యాదవ ముసలం అన్ని కలిసొచ్చాయి కదా అని అనుకోని సరి పెట్టుకొన్నా ఇన్నాళ్లూను. అయితే మొన్న ఎప్పుడో ఈ సందర్భంలో గురించి ప్రస్తావిస్తూ ఒక అయన "ఏమండీ !! ఇది అసలు నమ్మశఖ్యముగా ఉందా" అని ప్రశ్నించారు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?
విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు. ఏమో మరి అసలు ఆ కోణములో అసలు అలోచిన్చనే లేదు మరి ఇన్నాళ్లూను.
అట్లాగే ఇంకొక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!

Tuesday, July 12, 2011

అభిప్రాయలు

 నా అభిప్రాయలు, నా ఇష్టం అని అనుకొన్నప్పుడు పదిమందికి నీ విషయం తెలియాలి అని తాపత్రయం ఎందుకు ? నీకు కలిగిన భావనలు అందరికి తో పంచేసుకోవాలి  అన్న ఆదుర్దా ఎంచేతా ? ఒక వేళ అది రెండో వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తోందని అనిపించినా, నా యొక్క విలువైన ఆలోచనలు చెప్పే తీరుతాను అని అనే మహానుభావులుని ఏమని అనాలి ?
చాలా మంది "నన్ను అడిగితే సార్" అని మొదలు పెడతారు కాని అడిగే దాక ఆగే మర్యాద లేదా శ్రద్ధ వహించరు.అవతల వాళ్ళు అడిగినా అడగక పోయినా తోచింది చెప్పక మానరు. ఈ రోజుల్లో  సోషల్ వెబ్ సైట్స్ లో తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలూ తెలియ పరచడం సర్వ సాధారణం అయ్యింది. దీని వలన మంచి లేదా చెడు ఎంతో చెప్పేటంత గొప్ప వాడిని కాకా పోయినా, ఒక సహజమైన సందర్భాన్ని పరిశీలిద్దాము. మనము అందరు ఏదైనా వార్తలు చదివినా లేక చూసినా ఏ విధంగా స్పందిస్తాము ? లేదా ఎవరు అయినా మీతో ఒక విషయం మీద చర్చ చేసినా సరే. దాని తాలూకు ప్రభావం ఎంతో కొంత అవతలి వారిపై ఉంటుంది అన్న సత్యం నిర్ద్వందం. కాగ నిష్పత్తి మారొచ్చు.
ఎందుకండీ ఇంత ఆందోళన ? ఏమి అవుతుందండి ? ఒక సారి వింటారు, రెండో సారి వినీ విన్నట్టు ఉంటారు, తర్వాత నించి వినడం మానేస్తారు కదా !! ఏదో చేస్తూ, మరేదో ఆలోచిస్తూ వంట పట్టించుకొనే వాటితో మనకి ఎటువంటి ప్రమాదం లేదనుకోండి.ఉదాహరణకి శ్రీ రామ నవమి నాడు మన దర్శక రత్నం రామ గోపాలుడు తన ప్రేలాపాలు అన్నీ త్విట్టేర్ ప్రవేశింప చేసి యువ జనావళి ని ఆలోచించ చేసాను అని సంతృప్తి పడ్డాడట. "వేయి వృక్షాలు" కాదు "విష వృక్షాలు" ప్రశస్తం అని నొక్కి వోక్కా నించాడు. అదేమన్నా అంటే భావ, వాఖ్ స్వాతంత్రం అని అంటారు మరి. మరి ఈ సమాజం లో సదరు ప్రముఖులు అంతా వాళ్ళకి ఇష్తం వచ్చినట్టు వారి వారి భావ జాలాన్ని ప్రదర్శిస్తే ఏమీ తప్పు లేదా ?
ఎవరి గురుంచి అయినా చెడు చెప్పడం ఎంత లోకండి ? రోడ్డున పోయే కుక్కలు కూడా మొరుగు తాయి. దేవుడయితే మరీ ఈజీ ? దిక్కు మొక్కు లేని వాడు కదా ? నేను పదమూడు ఏళ్ళ వయస్సు లో ఇండోర్ కి రైల్ లో వెళ్తూ "రంగ నాయకమ్మ విష వృక్షాలు" ఎదురు కూర్చున్న అయన దగ్గర అరువుచ్చుకొని చదివిన విషయాలు ఇప్పటికి కొన్ని జ్ఞాపకానికి ఉన్నాయంటే కొన్ని సంగతులు చెప్పకనే చెప్పబడతాఎమో. విజ్ఞులు ఆలోచించండి. ఈ రోజున సమాచారం ని లక్షల, కోట్ల మందికి చేరవేసే సాధనాలు ఉన్నాయని ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఇష్టానికి ప్రవర్తించ వచ్చా ? 
నిన్న రాత్రి నిద్ర బాగా పట్టిందండి !!
మా వీధి చివర కుక్క బాగా మొరుగుతోందండి !!
మా కార్ లో ఈ రోజు గ్యాస్ కొట్టిన్చానండి
నాకు గళ్ళ చొక్కా కంటే పూల చొక్కా అంటే ఇష్టం
మొక్క జొన్న పొత్తు కి ఉప్పు కారం అద్దుకొని తినడం ఇష్టం
శని అది వారాల్లో స్నానాలు చెయ్య బుద్ది కాదండీ, అసలు ఎందుకు చెయ్యాలి ?
ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టనే పట్టాడు సుమా
సచిన్ కి భారత రత్న ఇవ్వరాదు !! ఇంకా కొన్ని సంవత్సారాలు ఆగాల్సిందే !!
మాదిరి చొప్పదంటు సమాచారం ఇంటర్నెట్ లో ప్రపంచం అంతా చాటేసుకోవడం మనకి ప్రస్తుత సరదా. మన లాంటి కోన్ కిస్కా గొట్టం గోపాల కృష్ణ లాంటి అభిప్రాయాలు కొంత మందిని ప్రభావితం చేస్తే ప్రపంచానికి ఒనగూరే (అ) ప్రయోజనం కొద్ది మాత్రమే. అయినా కాని నా నించి నా చుట్టూ ఉన్నసమాజం శాస్త్ర బద్ధ జీవనం ఆశిస్తూ ఉన్న అప్పుడు, ఈ పెద్దలందరికీ ఏ నిభందనలు వర్తించవా ?
మరి ఎవడికి వాడు వాడి ఇష్టానుసారం భావ వ్యక్తీకరణ జరపలేనప్పుడు ఎందుకండీ ఈ ప్రజా స్వామ్యం, స్వతంత్రం ?   దిబ్బలో వేసి కొట్టుకోవడానికా ? అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించండి. చరిత్ర లో తమకి అబ్బిన, సిద్దించిన గుణాల ఆధారంగా వారి వారి కాలమానాల్లో ప్రసిద్ది గాంచిన ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే చిరస్మరణీయులు.  కాగ వీళ్ళందరి లో ప్రస్పుటం గా కనిపించేది "ఒదిగి" ఉండగలగడమే. మరియు వీరంతా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొన్నవాళ్ళే. కొద్ది కాలం క్రితమే ప్రముఖ మైన విప్లవాలకి కారణమైన సమాచార మనే పదునైన ఆయుధం, అత్యంత ప్రమాదకరం కాగలదన్న చిన్నపాటి సత్యం సమాజం లో ఉన్నత స్తానాల్లో ఉన్నవాళ్ళ కి తెలియదు అని అనుకోగలమా ? ఆలోచించవలసిందే మరి !!

Sunday, May 22, 2011

రామ రావణ - నిరంతర సంగ్రామం

श्री रामः भगवद्स्वरूपं वा अथवा सामान्य मानवस्वरूपं वा - इति चर्चायाः विषये बहवः जनाः विशेष आसकथाः भवन्ति।अनेक सम्प्रदायानाम् अनेक देवातास्वरूपाः सन्ति किन्तु केवल रामस्य विषये एव एतयाः चर्चा जनाः कुर्वन्ति। बहवः कवयः सहित्यकाराः च प्रशनार्थं अथवा विमर्शानर्थं अपि भगवतः श्री रामस्य उल्लेखनम् एव चिन्वन्ति । वस्तुतः त्रेतायुगं कल्पितं वा अथवा वास्तविकतां वा? मानवजात्याः अस्थित्वं तदा वर्तते वा ? तस्मिन् समये भूगोलकस्थितयः कथं सन्ति ? ते रामायण कव्यानुसारेण वर्तन्ते वा ? समुद्रे सेथु बन्धनं - कथं संभवं ? यदी रामः विष्णोः अवतारं अस्ति चेत् रावणसंहारं किं कारणेन दुष्करकार्यं अभवत्?राम सामन्यजनः साद्रुशः एव क्लेशकारणेन रुदितवान्।तर्हि वयं रामस्य प्रार्थनस्य किं प्रयोजनम् प्राप्नुमः?रामः वालेः वधं वृक्षस्य पश्चात् स्थित्वा कृतवान् - इति धर्मसंमतं वा ? हे भगवान्! रमाणस्य कृते अनेक प्रश्नाः सदा उत्पन्नं भवन्ति।सामान्य जनाः रामस्य चारित्रस्य समावलोकस्य अपेक्ष्य व्यर्थचर्चानि कर्तुं एव अधिक इच्छा प्रदर्शयन्ति।वस्तुतः भगवान् रामः कदापि दैविकमहिमाः न प्रदर्शितवान्।रामः तस्य संपूर्ण अवतारकाले "अहं दशरथस्य पुत्रः" - एतस्य स्वीयपरिचयम् एव कर्तुं इच्छतिवान्।रामस्य समीप जनाः एव रामे वोष्णोः दर्शनं कृतवन्तः।दसरथः, वसिष्ठः विश्वामित्रः, गुहः, साध्वी अहल्य रामे विष्णोः अवतारस्य महिमाम् अभिज्ञातवन्तः।अरण्ये अनेक मुनयः, ऋषयः च रामे विष्णोः दर्शनार्थं दीर्घकालम् प्रतीक्षा कृतवान्तः।सुगीवग्ननुसरेन पारिव्राजकरूपेण आगत्य महाभक्तः हनुमान् रामास्य प्रथमसन्दर्शनस्य अनन्तरं एव भगवतः दर्शनं कृत्वा साष्टाङ्गवन्दनं कृतवान्।रावणकुम्बकर्णयौ तयोः अन्तिम काले भगवतः दर्शनं कृत्वा अञ्जलिं कृतवन्तौ। रमावतारस्य मुख्यप्रयोजनं किं?केवल रावणकुम्भकर्णयोः निवारणं एव वा अथवा कोऽपि अन्य लक्ष्यं अपि अस्ति वा?यदी स्वदर्मस्य पालनस्य विशिष्टं भगवद्गीता सिद्दान्तरूपेण बोधयति चेत् रामावतारं प्रयोगात्मक निरूपणं भवति खलु।रामस्य गुणानाम् अन्वेषणम् वयं अन्यकुत्रचित प्रदेशे कर्तुं न आवश्यकम्। रामो विग्रहवान् धर्मः - इति स्वयं मारीचः उक्तवान्।रामावतारसमये सकल प्राणिनः रामकार्यस्य कृते अतापयन्।रामः कदापि अधर्मकर्यानां समर्धनम् कृतवान्।सः यदा आवश्यकता अस्ति तदा क्षमा प्रदर्शितवान्।सः धमस्य अतिक्रमणं कदापि न असहत् । ये रामस्य संपूर्णविश्वासेन जीवनं यापयन्ति ते क्रमशस् श्री रामतत्वं मनसि स्थापयन्ति।यदी सर्वदा शुष्कवादान् कर्तुं एव इच्छन्ति चेत् तेषां मनसि रावणस्य आह्वानं निश्चयेन कुर्वन्ति। రాముడు మానవుడా లేక దేవుడా అన్న ప్రశ్న మన అందరికి ఎంత ఇష్తమో !! అన్నీ మానేసి చర్చిస్తాము. ఇంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా అయినా కాని ఒక్క శ్రీ రాముడికే దైవాంశ లేదేమో అన్న వాదన ఇంత ఎక్కువగా ఎందుకని ఉంటోంది? జీసస్, గౌతమ బుద్ధుడు లేక కృష్ణుడు - ఇలా మిగతా వాళ్ళు మామూలు మనుషులే అన్న ప్రశ్న లేక చర్చ ఎందుకని మన భారత దేశం లో ఎక్కువ వినపడదు ? అప్పటి లో రంగ నాయకమ్మ రామాయణ విష వృక్ష్యమే కధాంశంగా ఎందుకని ఎన్నుకొన వలసి వచ్చింది ? పోనీ విమర్శకులే ఎక్కువ అని అనుకోవడానికి కూడా లేదు. మొన్నటి మొల్ల ఇంకా విశ్వనాధుల తదితరులని "రామాయణం గురించి అందరు స్పృశించారు కదా, మళ్లీ మీరు కొత్తగా వ్రాసేది ఏముందని" అడగ్గా, నా రాముడిని ఈ విధంగానైనా తలిచే భాగ్యం వస్తోంది కదా సమాధాన పడడం జరిగింది. అంతేకాదు ఆ మధ్యల్లో శ్రీ రామ నవమి నాడు తన త్వీట్స్ ద్వారా విమర్శలు చేసి యువ ప్రజానీకం లో కొద్దో గొప్పో పాపులారిటీ ని కూడా సంపాదించాడు, రాముడి పేరు ఉన్న మన దర్శక రత్నం "రామ్ గోపాల్ వర్మ" .


అసలు త్రేతా యుగం అనేది వాస్తవమా లేక మిధ్యా ? మనవ జాతి యొక్క మనుగడ అన్ని లక్షల సంవత్సరాల మధ్య ఉందా ? అప్పటి బౌగోళిక పరిస్తితులు రామాయణ ఇతిహసంతో ఏకీభవించగలవా ? సముద్రంలో సేతుభందనమా ? రాముడు భగవంతుడైతే రావణుడిని మట్టుపెట్టడానికి అంత కష్త పడాల్సి వచ్చింది ? రాముడు మన అందరిలాగా కష్తం వస్తే ఏడ్చాడు. ఆయన్ని ప్రార్ధిస్తే ఏమి వస్తుంది ? వాలి ని చెట్టు చాటు నిండి ఎందుకని మట్టు పెట్టాల్సి వచ్చింది ? రాముడు సీత కన్నా పెద్దవాడా కాదా ? ఒక వేళ పెద్దవాడు అయితే అది ఎలా సంభవం ? ధర్మాతిక్రమణం కాదా ? రామాయణం కవి కల్పన అని నిరూపించడానికి మా దగ్గర కావలసినంత ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి మీరు ఎవరు?


అయ్యా బాబోయి !! అమ్మో ఇలా మన ప్రశ్నలకి అంతు దరీ లేదు !! కొన్ని యుగాల కి సరిపడా చర్చ జరుగుతూనే వచ్చింది మరియు ఇంకా బవిష్యత్తులో కూడా  కొనసాగుతుంది అని అనడానికి ఏమీ డోకా లేదు. విచిత్రం ఏమిటి అంటే అవతారం చివరి వరకు అయన ఏ కోశానా దైవత్వం ఆపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యక పోగా కేవలం దశరధ తనయుడిగానే తన స్వధర్మాన్ని పాటించడానికే ప్రయత్నం చేసాడు. కాగా రామ అవతరాన్ని చుట్టూ ప్రాప్తి ఉన్న వాళ్ళు విష్ణు స్వరూపం గా గమనించారు, గుర్తించారు, పూజించారు తద్వారా తరించారు.  దశరధుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గుహుడు, అహల్య, సీత దేవి, అరణ్యం లో భగవంతుని రాక కై తపించిన మునులు, ఋషులు, గురువు మాటని గౌరవించి వేచిన శబరి ఇలా అందరు రాముడు నడిచిన ప్రతి సందర్భంలో ఆయనలో పరమాత్మని దర్శించారు. రాజాజ్ఞ మేరకు పూర్వ పరాలు విచారిద్దామని మాయా స్వరూపం లో వచ్చిన "హనుమ" తక్షణం ఎదురుగా ఉన్నది సకల విశ్వం తపించే జగదభి రాముడని వెను వెంటనే గుర్తించి తన యొక్క నిజ స్వరూపాన్ని దార్చాడు. చివరకి రావణ కుంభకర్ణలు కూడా తమ శరీరాలని విడుస్తూ రాముడి లో విష్ణు స్వరూపాన్ని దర్శించి పుణ్య లోకాలని చేరుకో గలిగారు. అయితే అందరూ రావణ వధ అయ్యేవరకు ఈ విషయాన్నీ గోప్యంగానే ఉంచారు.


రామ అవతారం కేవలం రావణ కుంభకర్ణ తదితర రాక్షస నిర్మూలనమేనా లేక మరి ఏదైనా ప్రయోజనమని ఆశించి వచ్చిందా ?ఒక్క మానవ జన్మ  లో సంసారంలో ఉంటూ స్వ ధర్మాన్ని పాటిస్తూ ముక్హ్తి సాధన సిద్దిస్తుందా లేక అది ఒక అభూత కల్పనా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ సాధ్యాసాధాలు నిరూపిస్తూ ధర్తి లో నిలబడ్డాడు. నిర్గుణ, నిరాకర, నిరాధారం అయిన ఆ భగవత్ స్వరూపం మానవాళి యొక్క మార్గ నిర్దేశం కోసం అన్ని భరిస్తూ, పాంచ భౌతిక స్వరూపం తీసికొని అవతారం యావత్తు ప్రకృతి కట్టుబాట్లు కి లోబడి కార్య సాధన ని సాధించాడు.  రాముడు యొక్క గుణగణాలు, విశేషాలు ఏమిటో మనం మరెక్కడో వెతకాల్సిన పని లేదు. మారీచుడు రావణాసురిడితో సంభాషిస్తూ  "ధర్మానికి పోత పోస్తే వచ్చే విగ్రహమే రాముడు" అంటూ అతని కుట్రాలోచానికి అడ్డం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. రామాయణం యావత్తు చుట్టూ ఉన్న ప్రకృతి సర్వం రామ కార్యం నిర్వహించడానికి ప్రతి క్షణం తపించింది, తల్లడిల్లింది. రామావతారం మొత్తం అధర్మాన్ని ఎక్కడ సహించలేదు. కుదిరిన చోట క్షమా గుణాన్ని భోదించింది అట్లాగే అతిక్రమణ ని శిక్షించింది. సులభ మార్గం లో లభించే ఐశ్వర్యాన్ని  తూలనాడింది. జాబాలి వంటి మంత్రులు రాజాపేక్ష చూపిస్తూ జరిపిన అవైదిక సంభాషణలని ఖండించింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరి మాటని ఆదరించే గుణాన్ని మానవాళి కి ఆవిష్కరించింది.


ఆనాటి నిండి రామ నామం యొక్క మహత్తు ని నమ్మిన వారు మననం చేసారు. పారాయణలు నిరంతరం జరిపారు. మనసా వాచా కర్మణా రాముని తత్వాన్ని అవలంభించారు. ఇంత కష్టం మనకేందులే అనుకొన్న వారు, రాముడు అభూత కల్పనే అని వాదనలు జరుపుతూ వస్తున్నారు. నమ్మినప్పుడు  కొలువు బంగారమై వారి వారి మనస్సుల్లో రామత్వాన్ని నింపాడు ఆ సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడే. "రాముడు ఎవడులే" అనుకొన్న ఆలోచనలు రావణ ప్రవుత్తికి దారి తీస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రామ రావణ సంగ్రామం ఈ జగత్తు ఉన్నంత వరకు ఇలా కొన సాగ వలసిందే !! 

Sunday, May 15, 2011

బ్లాగానందం

ఏం సార్ !! ఎలా ఉన్నారు ? ఏంటీ కబుర్లు ?
ఏముందండి !! అంతా మామూలే. విపరీతమైన బిజీ అయిపోయాం సార్ !!
ఏంటి ?? ఈ మధ్య ఏమి వదలట్లేదు ? రానీయండి సార్
ఎంటవి?
అవే సార్ !! బ్లాగులు
***********************************************************************************************
ఏంటి సత్య గారు !! వ్రాసార ? కొత్తగా ఏమైనా ?
అంటే వరల్డ్ కప్ కదండీ !! బాగా దగ్గర ఉండి గెలిపిస్తున్నాము !! ఇది ఇంపార్టంట్ కదా !!
కంపుల్సరీ కదండీ మరి !! సెహ్వాగ్ గాడికి మనం కుర్చీ లో లేకపోతె, అస్సలు బాట్ లేవదు తెల్సా ?
అబ్బ!! నిజమా ? అస్సలు కొంచం ఛాన్స్ ఇస్తే వదలరు గా!! దూసుకెళ్ళి పోటమే !!
ఏంటీ నమ్మరా ? బంగ్లాదేశ్ మీద 175 ఎలా కొట్టాడు అనుకొన్నారు ? కావాలంటే మా ఆవిడని అడగండి ?
***********************************************************************************************

తెలంగాణా మీద మీరు వ్రాసింది చాల బావుంది అండి !! ఏంటి మళ్లీ ఏమైనా వ్రాసార ?
ఇంకా లేదు సార్ !! ఉగాది సెలబ్రేషన్స్ తో బాగా బిజీ అయిపోయాము కదా !!
ఏంటీ మీరు బ్లాగ్లు వ్రాస్తార ? దేని మీద పోలిటిక్స్ మీదా?
అవునండి !! మనసుకి ఏది తోస్తే అది ?
మరి లింక్ పంపండి !!
పంపానండి, ఇది వరకు !! మళ్లీ కావాలి అంటే పంపుతా !!
ఓహ్ అవునా !! కరెక్టే నండి !! అదే లింకా ఇంకా ?
అవునండి !! మళ్లీ ఇంకో సారి పంపుతా

***********************************************************************************************
సత్య గారు !! ఆ మధ్య లో ఏదో వ్రాసారు !! ఇంకా వ్రాస్తున్నారా?
ఏదో సార్ !! మీ దయ !! ఎప్పుడైనా వీలుంటే వ్రాస్తున్నాను.
అవునా ?? వెరీ గుడ్ !! వేటి మీద వ్రాస్తారు ?
ప్రత్యేకంగా ఇది అని ఏమి లేదండి !! ఎలా వీలు అయితే అట్లా !!
ఈ సారి నించి మీరు ఏమి చేస్తారంటే, ఏమైనా వ్రాశారనుకోండి... అప్పుడు నాకు ఒక మెయిల్ కొట్టండి, లింక్ పెట్టి
తప్పకుండా అండీ !!

***********************************************************************************************
మనకి ఇండియా లో అనుకోండి !! ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయండి. ఇక్కడనుకోండి.... ఏమి ఉంటుందండి ? ఈ
రోజు కి నిన్నటికి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా !!
కరెక్ట్ సార్ !! ఇక్కడ అంతా Monday - Friday లైఫ్ కదండీ !!
రొటీన్ లోంచి బయటకు రావాలంటే చాల ప్రయత్నం చెయ్యాలండి !!
మరి అయితే ఇండియా కి వెళ్లి పోండి సార్ !! అక్కడ అయితే సినిమాల్లో ట్రై చేయచ్చు సార్ !!
అంత సీన్ లేదు లెండి బాబు !!
అట్లా కాదు సత్య గారు !! ఇలాంటి లైఫ్ చేంజ్ మొమెంట్స్ ని మిస్ అవ్వకూడదు సార్ !!***********************************************************************************************

Wednesday, April 27, 2011

చరిత్ర మరో సారి

తెలంగాణా ఉద్యమం మళ్లీ ఆగింది. దీని అర్ధం, పరమార్ధం పెరుమాళ్ళ కి ఎరుక. కొన్నాళ్ళ క్రితం ఈ ఉద్యమం నిజమైనదే ఏమో అన్న ఊహ తెలంగాణా మరియు ఏతరలుకి తోచిన మాట వాస్తవమే అని గమనించాలి. దీనికి ముక్ష్య కారణాలు.

  1. ఉద్యమం కనీసం ఒక సంవత్సర కాలం సాగింది. ఇంకా మరెంత కాలం సాగుతుందో చెప్పలేక పోతున్నాము.
  2. ఉద్యమ సారూప్యం ఏ విధంగా ఉన్నా ప్రజా బలం ఉందన్న సత్యాన్ని గమనించాలి.
  3. గతం లో ఈ ఉద్యమం వికృత రూపం తీసుకొని ఉన్నా పూర్తి స్తాయి లో ఇది రూపు మాపడం లేదు.  (చెన్నా రెడ్డి నాయకత్వం లో సాగిన ఉద్యమం తో కలుపుకొని)
  4. తమ అవకాశాలని వేరే ఎవరో పూర్తి స్తాయి లో తన్నుకు పోయారు అని తెలంగాణా ప్రజలు బలంగా విశ్వసించబట్టి.
నేను తెలంగాణా ఉద్యమం యొక్క ప్రస్తుత నాయకత్వానికి, ఎత్తుగడలకి, రూపు రేఖలకి పూర్తి స్తాయి లో వ్యతిరేకం అయినా కూడా ప్రజల ఆకాంక్షల ని తప్పు పట్ట గలమా అన్న ప్రశ్న వేసికోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య ని పక్కకి నెట్టడం సరి అయిన వ్యూహం కాదన్న సంగతి చరిత్ర ఇలాంటి ఒక సందర్భం లోనే ఒక సారి నాయకత్వానికి గుణపాటం నేర్పింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఏమైనా ప్రస్తుత పరిణామాలకి పాఠం నేర్పగలదా ? ఇప్పటి వరకు అధ్వానపు అధిష్టానం మరియు రాష్ట్ర (అ)నాయకత్వం స్వీకరించిన నిర్లక్ష ధోరణి రాబోయే తరాలకి ఎటువంటి మార్గ నిర్దేశనం చేయ బోతోంది ?

అప్పటి ఉద్యమం స్వచ్చమైనదా లేక ప్రస్తుత ఆందోళన బలమైనదా ? అసలు ఈ రెండింటి కి సారూప్యమే లేదా ? ఏది నిజమైనది లేదా నిజాయితీ కలది ? అసలు పొట్టి శ్రీ రాములు గారు నిర్వహించిన త్యాగం ఎటువంటిదో తెలుసు కోవాలన్న కుతూహలం తో గూగుల్ లో వెతుకుతూ ఉంటె 2003 లో హిందూ లో రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ఎందుకో ఆసక్తికరంగా కనిపించింది. కొన్ని నిజాలు మీ కోసం.

డిసెంబర్ 1950 లో సర్దార్ వల్లభ్భాయ్ మరణించారు. నెహ్రు ప్రధాన మంత్రి పదవి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు. మరో దశాబ్దం వరకు నెహ్రు అనుకొన్న ఇండియా తీర్చి దిద్దబడడానికి సంసిద్ధం అయ్యింది. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహార శైలి ఇలా దాదాపు అన్ని. కాని అనుకోకుండా జరిగిన కొన్నిసందర్భాలు నెహ్రు గారికి పంటి కింద రాయి లాగ, కంటి లో నలుసు గా మారాయి. అందులో ఒకటి....

బాషా పరమైన రాష్ట్ర ఏర్పాటు. కన్నడ, మలయాళం లేదా ఒరియా ఇలా కాంగ్రెస్ పెద్దలు తమ తమ రాష్ట్ర ఏర్పాటు కోసరం పాటు పాడడం మొదలు పెట్టాయి. ఇందులో తీవ్ర స్తాయి లో గళం విప్పింది మాత్రం ఆంధ్రులే. బాషా పరంగా హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత అధికులు తెలుగు వాళ్లే. అంతే కాకుండా బాషా పరంగా విజయ నగర పాలనా నించి వైభవం ని చవి చూసిన జాతి కూడా తెలుగు వాళ్లే. మద్రాస్ మరియు హైదరాబాద్ లలో అత్యంత చురుకు గా ఆంధ్ర మహాసభ సభ్యులు తమిళుల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. మద్రాస్ అసెంబ్లీ లో ఆంధ్ర శాసన సభ్యులు ఆంధ్ర ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు నకు సంఘీభావం వ్యక్త పరిచారు.

ఆంధ్ర రాష్ట్ర ఆందోళన ఇద్దరికి మాత్రం ఏ మాత్రం రుచించలేదు. నెహ్రు మరియు రాజగోపాలాచారి మాత్రం రాష్ట్ర ఏర్పాటు నకు అది సరి అయిన సమయం కాదని కొట్టి పారేసారు. ఆ సమయం ఏదో, ఎప్పుడు వస్తుందో తేల్చాల్సిందే అని ఆంధ్రులు పట్టుబట్టారు. పొట్టి శ్రీరాములు అన్న ఒక గాంధేయవాది తన జీవితం లో రెండవ సారి నిరాహార దీక్షలో కూర్చొన్నారు. మొదటి సారి మద్రాస్ లోని ఆలయాల్లో హరిజనుల ప్రవేశం కోసం 1946 సంవత్సరంలో దీక్ష చేసారు. అప్పటి మద్రాస్ లో ఉన్న కాంగ్రెస్ వాదులు స్వతంత్ర ఉద్యమం నకు ఇది ఒక అడ్డంకి అని భావించి గాంధీ గారిని పొట్టి శ్రీ రాములు చేత దీక్ష విరమణ చేయమని అభ్యర్ధించారు.  గాంధీ గారి అభ్యర్ధన మేరకు అప్పటి దీక్ష విరమించినా 1952 నాటికి తెలుగు రాష్ట్ర సాధనకై మళ్లీ ఉద్యమం చేపట్టారు.

"ఏదో ఒక నిరాహార దీక్ష అంటూ మొదలు పెట్టారు అని వార్త నా దృష్టి కి వచ్చింది. మనం ఎటువంటి పరి స్తితులలో అయినా కూడా ఈ యొక్క ఆందోళన కి ప్రాధాన్యత ఇవ్వరాదు" అని రాజగోపాలాచారి ఉత్తరం పంపారు పండిట్ నెహ్రు. అప్పటికే శ్రీరాములు గారు ఆరు వారాల బట్టి నిరాహార దీక్ష ని నిర్వహించారు. ఆధిపత్యం లో ఉన్న పెద్దలు ప్రత్యెక రాష్త్ర ఏర్పాటు నకు సరియైన సమయం రాలేదు అనే నమ్మారు అదే విషయం పార్లమెంట్ లో పదే పదే నమ్మించ డానికి ప్రయత్నం చేసారు.  దీక్ష అలాగే కొనసాగింది. రాష్ట్ర నలుమూలల రాజాజీ మరియు నెహ్రు ల వ్యతిరేక నినాదాలు పెల్లుబికాయి. నెహ్రు కి దిగిరాక తప్పలేదు. ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు కై మళ్లీ ఇంకొక లేఖ వ్రాసారు. కాని దురదృష్త వశాత్తు అధికారిక ప్రకటన వచ్చేలోపే పొట్టి శ్రీ రాములు గారు గతించారు. ఆంధ్ర రాష్త్రము అతలాకుతలం అయ్యింది. రైళ్ళు తగల పెట్టారు. పట్టాలు పీకేశారు. ఆంధ్రుల ఆగ్రహం తీవ్రత అంటే ఏంటో దేశమంతా చాటారు. సామరస్యంగా జరగవలసిన  విభజన రక్తపాతం తో జరిగింది.

మళ్లీ రాబోయే తరాలు ఈ విధమైన విభజన ని ఎదుర్కోవాల్సి వస్తుందా ? ఏ పాపం తెలియని నవ తరాల మనస్సులని విభజించే సావకాశం కల్గుతుందా ? చూద్దాం !!

Friday, March 4, 2011

భారత ఉపఖండం లో క్రికెట్

ఒప్పుకోడానికి కష్టం గా ఉన్నా క్రికెట్ స్వరూపము, సారుప్యత పూర్తిగా మారింది భారత ఉపఖండం లో ప్రాచుర్యం పొందిన తర్వాత. నిజంగా విశ్లేసిస్తే ఇది మనకి అసలు తగునా అని అనిపిస్తుంది. గత రెండు మూడు దశాభ్దాలు లలో అన్ని ఆటల తీరు తెన్నులు మారి నట్టే క్రికెట్ కూడా మారినా గత కొన్ని సంవత్సారాలలో జరిగిన పరిణామాలను చూస్తే ఈ విపరీత ధోరణులకి మనమే కారణం అని ఒప్పుకోక తప్పదు. నేను ఉత్తర అమెరికా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక తెల్ల అయన "Cricket used to be a relaxing and laid back sport until you and Pakistanis started winning it" అని అన్నప్పుడు ఈ వెధవలు ఇంతేలే ఇలా జాత్య అహంకారంతో మాట్లాడతారు అని అనుకొన్నాను. చూడగా చూడగా కొంచం నిజమే అనిపిస్తోంది. హైదరాబాద్ లో ఎవడైనా పాకిస్తాన్ టీం విజయం ని హర్షిస్తే వాడు తప్పకుండా "ISI" ఏజెంట్ అని ముద్ర వేసి పడేస్తాము. దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం అమెరికా లో ఇండియా టీం డేవిస్ కప్ ఆడదానికి వస్తే మేము ఒక పది మంది కలిసి "ఇండియా జిందాబాద్" వంటి స్లోగన్ లతో రచ్చ రచ్చ చేసాము. అమెరికా దేశస్తులు మా దగ్గరకి వచ్చి ఫొటోస్ కూడా తీసు కొన్నారు.


ఈ రోజు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మెంబెర్ ఒక అయన మా ఫాన్స్ వేసిన రాళ్ళు గురితప్పి వెస్ట్ ఇండీస్ వాళ్ళ బస్సు మీద పడ్డాయి, కొంచం సర్దుకోండి అని చెప్పడం కొంచం విడ్డురంగానే ఉంది మరి. నిన్న ఇంగ్లాండ్ ఐర్లాండ్ తో ఒడి పోయి నప్పుడు ఎంత మంది క్రికెటర్ ఇళ్ళ మీద రాళ్ళు వేయబడ్డాయి. పోనీ క్రికెట్ కాదు, ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఓడినప్పుడు ? 2007 లో ధోని ఇంటి గోడలు కి నల్ల రంగు వేసారు అంటే సిగ్గు పడ్డవారు ఎంత మంది ? naaku తెలిసిన కొంత మంది "తప్పేముంది అండి" అని కూడా వాదించారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏమిటి అంటే నిజంగా అవతల టీం బాగా ఆడి నెగ్గినా ఇందులో ఏదో మతలబు ఉంది ఏమో అని వ్యాఖ్యానిస్తున్నారు.

Ashes లో జరిగింది అంటే అవి విశేష పరిస్తితులు అని నేను భావిస్తున్నాను. ఇవ్వాల్టి రోజున క్రికెట్ ఆడేవాళ్ళు మనుష్యులు కాదు రోబోలు అని అనుకోమంటే ఎలా అండి. ఓటమి అస్సలు అట లో ఒక భాగమే కాదు అని వాదించే వాళ్ళని ఏమంటాము అండి ? ఒక మారు విజయవాడ రైల్వే స్టేషన్ లో మ్యాచ్ చూస్తూ ఉన్న సందర్భంలో గంగూలీ ఒక బాల్ కొట్టడం మిస్ అయితే "వీడికి నగ్మా తో తిగుగుళ్ళు ఎక్కువ అయితే బాల్ ఎక్కడ కనపడుతుందండి" అంటూ ఒకడి కామెంట్ వినపడింది. వెంటనే బాల్ ని సిక్స్ కొడితే "గంగూలీ కి తగిలితే దొరకదు గురువు గారు" అని అదే వ్యక్తి.

క్రికెట్ మ్యాచ్ ల కోసం హోమాలు, యజ్ఞాలు మరియు పూజలు. ఎంటండి ఇది ? అర్ధం ఉంటుందా ? పోనీ మనమే అనుకొంటే పాకిస్తాన్ వాళ్ళు మరీ మూర్ఖులు. పక్కన ఉన్న శ్రీ లంక వాళ్ళని అయినా చూసి బుద్ది తెచ్చుకొందాము అని ఉండదు. ఎంత హుందా గా వ్యవహరిస్తారో ఆటలా విషయములో ?

వికెట్ తీసి చాతిలు బాదుకోవడం, సెంచరిలు లు కొట్టి భూమి ని తాకుతూ ప్రార్ధనలు చెయ్యడం పాకిస్తాన్ వాళ్ళే నేర్పించారు అనుకొంటా. డ్రెస్సింగ్ రూం లలో మత ప్రార్ధనలు !! మన వాళ్ళు ఏమి తీసిపోరు లెండి. గవాస్కర్ లాంటి పెద్దలు కూడా సంనయనం ని కోల్పోయి కామెంటరీ చెపుతూ రెచ్చగొడతారు. వాళ్ళు ఏమి మాట్లాడతారో వాళ్ళకే అర్ధం కాదు. వీళ్ళ కామెంటరీ గురించి వ్రాయాలంటే కనీసం ఇంకో నలుగు అయిదు బ్లాగ్ లు పడుతుంది అనుకోండి.

Monday, February 21, 2011

పొగడ్తలు

భగవాన్ కీర్తన  ప్రియ !! ఆయనకే ఈ రిమ్మ తెగులు ఉంటే మనమెంత వాళ్ళ మండీ  ? ఆయనేప్పుడో చేసిన ఘన కార్యలన్నీ ప్రతి నిత్యం "సహాస్రం" పాటు తలుస్తూనే ఉంటామే. ఎవడైనా మన విభూతిని పొగిడితే వెంటనే మనస్సు లో నించి తీసి వేయలా ? ఎంత అన్యాయం అండీ !! అసలు ఇవ్వాల్టి రోజుల్లో ఎవడైనా మనసారా "చాల మంచి చేసారండీ" అన్న అభినందనే కరువై పోతూ ఉన్న రోజుల్లో మళ్లీ ఇది కూడా జోడిస్తే, ఇంకా ఏమైనా ఉందా ?

చెప్పద్దూ !! పొగడ్త లేని నాడు ఏ పని చెసినా నిరర్ధకం అనిపిస్తుంది కదండీ !! కాళ్ళ కి వేసు కొన్న చెప్పులు, కళ్ళకి పెట్టుకొనే జోడు, చేతి కి పెట్టుకొనే వాచ్, నడుముకి పెట్టె బెల్ట్, మెడలో వేలాడే గొలుసు ఇలా కాదేది పొగడ్త కి అనర్హం !! కొత్తగా చొక్కా వేసుకొంటే ఎవడూ బావుంది అని అనక పొతే ఏదో వెలితి. ఆటలైనా, పాటలైనా, మాటలైనా లేక వ్రాతలైన ఇలా ఏది చేసినా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం అన్న మాట ఒట్టి నీళ్ళ మీద మూటే !! అంతే కాదండీ మన అలవాట్లు, కార్య సిద్ది, పట్టుదల, నిర్వహణ ఇలా ఏదైనా సరే పక్కవాడు గమనించాలి అనే కోరతాం. లేని నాడు చేసిన పని కి సార్ధకత ఏదండీ ? ఎంత మంది ఉంటారు అండి సఫిలీకృత నిర్వహణకి కారణభూతం "నేను" కాదు అని అనగలిగిన వాళ్ళు. పొగడ్త ని చేయించిన వాడికే వదిలేసి నాదేమి లేదిందులో అని అనుకోవడం నిజానికి సాధ్యమా? పోనీ పొగిడే వాడు మనసార అభినందిస్తాడా అంటే అది ఎట్టి మాత్రం ప్రస్తుత కాల మాన పరిస్తితులలో సాధ్యం కానిది. పైగా రెండు మూడు సార్లు అలవాటు పడిన ప్రాణం నాలుగో సారి ఏమీ ప్రతిస్పందన లేక పొతే లేని పోనీ వైషమ్యం.

అంత పని చేసేసి "అమ్మా !! ఏమీ చేతకాని వాళ్ళని దూత గా పంపిస్తారు. ఉన్నవారంత నా కన్నా అధికులు, సములు గాని, తక్కువ వారు లేరమ్మా" అని త్రికరణ సుద్ది గా అనగలిగిన మానసిక పరిణితి ని ప్రదర్స్తిస్తారు హనుమ సుందర కాండలో. పైగా రాముల వారి దగ్గరకి సీతమ్మ కనుగొనపడినది అన్న వార్త చెప్పిన వారిలో చివరి వ్యక్తి హనుమే. స్వామి మన అందరకి ఏమైనా సందేశం ఇచ్చారా ? ఆచరణ సాధ్యం కానిదా ? ఏమో ..

"పోగిడితే చాలు బాజా కొట్టేమని మా సెగట్రీ ఎట్టించాడు" అంటూ ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు సెలవిచ్చినట్టు, మన మనసు లో సేపెరేట్ గా ఒక డిపార్టుమెంటు ఎట్టించాలేమో ఎవడైనా పొగిడితే బాజా కొట్టేయడానికి, అవి మన తల లో పేరుకు పోకుండా ఉండడానికి.

Wednesday, February 9, 2011

సుగ్రీవ విజయం

 రామాయణ అంతర్గతం గా కిష్కింద కాండ లో వివరింపబడిన ఒక అద్బుత సంఘటన మీకు వివరిస్తాను. ఇది నా ప్రజ్ఞ ఎట్టి మాత్రం కాదు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు సంపూర్ణ రామాయణము ప్రవచనం విని మననం చేసికొన్న ఘట్టం. మన జీవితాల్లో ఎలా అన్వఇంచుకోవాలో పెద్దలు మీరు అందరు నిర్ణయం చేసికోండి.

"నీ శత్రువు నాకు కూడా శత్రువే" అని సుగ్రీవునికి అభయం ఇచ్చి వాలి ని యుద్దానికి పిలువయ్యా అని మిత్రుడి కష్టం తనదిగా బావిస్తాడు, శ్రీ రామ చంద్రుడు. అప్పుడు సుగ్రీవుడు సాధారణముగా మన అందరి ప్రవర్తిస్తాడో అలాగే వ్యవహరించాడు. ఎవరైనా ఒక మహానుభావుడు సంపూర్ణ మనస్సు తో మన దగ్గరకి వచ్చి మిత్రత్వం ప్రకటిస్తే "పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు" అన్న చందాన రక రకాల నిర్లక్షానికి గురి చేస్తాము. మా అన్నయ్య ఇంత బలం, వేగము ఉన్నవాడు అని రాముడి ని అనుమానిస్తునట్టు బహిర్గతం చెయ్యకుండా అత్యంత లౌక్యం గా అయన కి సకల పరిక్షలు జరిపించాడు. ఈ క్రమంలో తన మనస్సు లో ఉన్న అనుమానాలు బయట పడకుండా తన పాండిత్యం అంతా ప్రదర్శిస్తాడు. అంటే సుగ్రీవుడు రాముడిని నమ్మాడు "కాని" ఎక్కడో ఏదో అనుమానం. మనమైన కూడా మన జీవితాల్లో ఎక్కడా సంపూర్ణ విశ్వసనీయత, శరణాగతి ప్రదర్సన చేయడానికి సకల అడ్డంకులు ఎదురు అవుతాయి. "కలడో లేడో" సందిగ్నత మనలని సదా వెంటాడుతూనే వుంటుంది. తద్వారా కార్యసిద్ధి మరియు ఆత్మ సంతృప్తి కలగక పోవడం !! ఎన్నో వాటి కోసం వెంపర్లాడిన తర్వాత చివరికి వెలితి. బహుశా మన అందరిలో ఉండే మానసిక జాడ్యం అయ్యుండవచ్చు. వాలిని పిలిచాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు కానీ అన్నీ యాంత్రికమే!! రాముడి సహాయం అందుతుందో లేదో లేక వాలి ని నిహతించే అంత శక్తి రాముడికి ఉందొ లేదో ఇలా అన్నీ అనుమానాలే. అనుకొన్నట్టే కార్యం నెరవేరలేదు.


మళ్లీ మన అందరిలాగానే రాముడి ని నిందిస్తాడు. సరే రాముడు వాలి మరియు సుగ్రీవుడు మధ్య వైవిధ్యం ఎందుకు గమనించలేక పోయాడో అనేది మరొక ధర్మ సూక్షం అనుకోండి. (ప్రాజ్ఞులు చెప్పిన ప్రవచనాలు చాల అందుబాటులో ఉన్నాయి, మీకు నిజముగా తెలుసు కోవాలి అంటే). ఈ సారి సుగ్రీవుడు సంపూర్ణ శరణాగతి చెయ్య గలుగుతాడు. ఇది చెయ్యగలిగిన వాడి మానసిక దృక్పదం ఈ విధం గా మారుతుందో అయన మళ్లీ వాలిని యుద్దానికి పిలవడానికి వెళ్తున్నప్పుడు జరిగిన విషయాల వర్ణన ని గమనిస్తే తెలుస్తుంది.


సుగ్రీవుడు ఈ సారి మార్గ మద్యం లో గతం లో మహాత్ములు నివసించిన ప్రదేశాలు ప్రస్పుటం గా కనపడతాయి. వాటిని దాటుతున్నప్పుడు వారి వారి సత్ప్రవర్తన ని మననం చేసికొంటూ అత్యంత భక్తీ శ్రద్దలతో స్మరిస్తాడు. ఇది ఒక మనిషి లో పాజిటివ్ అవుట్లుక్ ఉంది అన్నదానికి నిదర్శనము కాదా!! ఈ చిన్న మార్పుతో విజయలక్ష్మిని వరించిన సుగ్రీవుడు ని గమనిస్తూ మన జీవితాలని కూడా తీర్చు దిద్ది కోవచ్చు అన్న ఆలోచన తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

Friday, February 4, 2011

నమ్మకాలు - భయాలు

మనం నమ్మిన కొన్ని విషయాలు ఎప్పటకి తప్పు కాకూడదు లేదా ఇంకోలా జరిగితే ఒప్పుకోలేని మనస్తత్వం మనిషి ని మూర్ఖం వైపు కు తిప్పుతుందా ?? అందరు వేసుకోవాల్సిన ప్రశ్న!!  
ఉదాహరణకి భూమి వయస్సు అయిదు వేల సంవత్సరాలు అని కొన్ని ప్రామాణికాలు చెప్పాయి. తర్వాత కాలక్రమేనా పురావస్తు శాస్త్రవేత్తలు "కాదండీ !! 20 నుంచి 100 మిల్లియన్ సంవత్సరాలు ఉంటుందేమో" అని అన్నారు. తర్వాత మళ్లీ సరిదిద్దారు. ప్రస్తుతానికి 4.54 బిల్లియన్ సంవత్సరాలు అని నిర్ధారించారు. ఈలోగా చాల మంది బుర్రలు బద్దలు కొట్టుకొని ఉండి ఉంటారు. సకల జీవ జాలం నించి పరిణితి చెంది అది మానవుడు ఆవిర్భావం ఒక అయిదు నించి ఆరు వేల సంవత్సరాలు క్రితం జరిగి ఉంటుంది అని అన్ని పుస్తకాలలో అచ్చు వేయించారు కొంత మంది పెద్దవాళ్ళు చాన్నాళ్ళ ముందట. పురాణాలూ, బైబిల్ ఇంకా ఇతర చాదస్తాలు అన్నీపక్కకి తోసేసాము అని అన్నారు. నిజమెంతో అని మళ్లీ తర్వాత జరిగే శాస్త్రీయ పరిసోధనాల్లో అనుమానాలు మొదలు అయ్యాయి. రాజ్యం లో ఉన్నవాడు అచ్చువేయించి "నమ్ముతార చస్తారా" అని అన్నప్పుడు, వేరే సిద్ధాంతాల ని హేళన చేసిన నాడు తాత్కాలికం గా అయిన మనుషుల్లో భావోద్వేగాలు వచ్చి ఉండకుండా ఉంటాయా? మీలో ఎవరికీ అయినా భగవంతుడు వేరే మతం వాళ్ళు కొలిచే రూపం లో ప్రత్యక్షం అయ్యి జనావళి కి అంతా "ఒరే మూర్ఖులారా !! మిగతా అన్ని విశ్వాసాలు అన్ని తప్పు. ఈ ఒక్క మతమే నిజం" అని చెప్పాడు అనుకోండి. ఒప్పుకోగల సామర్ధ్యం ఉందా మన అందరిలో ??

Inhibitions అంటే తెలుగు లో ఏంటండి?  "అభ్యంతరము, ఆక్షేపణలు". ఒక్కొక్క కాల మాన పరిస్తితి ని బట్టి మూస గా  వీటి మధ్యలోనే పెరుగుతారు.

యూదులు అంత నిరర్ధకమైన ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. వాళ్ళని నాశనం చీసే తీరాలి  - ప్రపంచం లో ఒక ప్రాంతం అంతా కనీసం ఒక రెండు దశాభ్దాలు పాటు దీన్నే నమ్మింది.

ఆర్యులు, అనార్యులు అనే చీలిక హిందూ దేశాన్ని ఎప్పుడో చీల్చింది - ఉత్తర మరియు దక్షిణ భారతీయులు ఒకే వేదమును నమ్ముతున్నా ఒక జాతి కాదు.

పాకిస్తాన్ అనే దేశం లో ఒక్క మంచి వాడు కూడా పుట్టే/పెరిగే అవకాశమే లేనే లేదు - భారతీయ జాతి అంతా  ఈ సిద్దాంతాన్ని ఇంకా నమ్ముతూనే ఉంది. అలాగే అటువైపు వారు బ్రాహ్మణ భారతీయ సంస్కృతి అత్యంత ప్రమాదకరం. నశింప చేసే హక్కు మా మతం మాకు ఎప్పుడో ఇచ్చింది - ఇది పాకిస్తాన్ దేశ ఉనికి కి ఆయువు పట్టు.


పోనీ ఆధునికులు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలు వేరే విధం గా ఆలోచిస్తారు అని అనుకోవడానికి లేదు. సామాన్యమైన పరిస్తితుల్లో తాము విశ్వసించిన వాటిని తప్పేమో అని ఎవరు అయినా బయటికి అంటే దాన్ని దారుణంగా అణిచి వేసిన సంభందాలు ఎన్నో ఎన్నెన్నో !!


ఆశ్చర్యమైన విషయము ఏంటి అంటే మీరు నమ్మిన విషయము ఇంకొక ప్రాంతం లో కాని సమాజము లో కాని కాలమానము లో పూర్తిగా విరుద్దం అని తెలిస్తే సామాన్యంగా మూర్ఖత్వం ప్రబలుతుంది. బహుశా ఒక శకం మారాలి ఏమో పరిస్తితులు మారటానికి.  అందుకే సమాజం లో పెద్ద పీట లో ఉన్న వాళ్ళు ఇలాంటి సున్నితమైన విషయాల్లో బహు జాగ్రత్త వహించే వాళ్ళు. కొన్ని classified files లో భయంకర నిజాలని అత్యంత గోప్యం గా ఉంచడాన్ని నేను అయితే గొప్ప సమాజ సేవ గానే భావిస్తాను. కొంత శాంతి ఏర్పడినప్పుడు తగు జాగ్రత్త వహించి ప్రజ కి ఇవ్వడాన్ని సమర్ధించాలి అనుకొంటా. ఇవ్వాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ లో సామాన్యమైన ప్రజలు ఇంత మీడియా అత్యుత్సహమును చూపడాన్ని "దేశ ద్రోహం" గా చాల మంది పరిగణించడం లో తప్పు ఏమీ కనపడ్డం లేదు.


ఈ యొక్క మానసిక అడ్డంకులు ఏ స్తాయి లో అయినా ప్రబల వచ్చు. వీటిని ఏ మనిషి అయినా ఒక జీవిత కాలం లో అధిగమించ వచ్చు లేదా ఆ సంఘర్షణ లోనే సతమతం అవ్వ వచ్చు. మీ యొక్క నమ్మకాలు జీవితాలని ఉద్దరించవచ్చు లేదా మౌడ్యం లోకి నెట్టేయ వచ్చు. కొంత మంది విపరీత ధోరణి, కాల యాపన, వృధా వైరాలు, కార్పణ్యాలు, వ్యగ్రతలు ఇలా ఎన్నో జాడ్యాలకు గురి అవ్వడం చూస్తూ ఉంటాము.

అలాగే ఇంకో తీరు ఏంటంటే, మీరు నమ్మే సిద్ధాంతం తప్పు అని పని కట్టుకు చెప్పడం వల్ల కొంత మందికి చాల సంతృప్తి ని ఇస్తుంది ఏమో. పోనీ శాస్త్ర పరమైన సిద్దాంతి కరణ జరిగిన తర్వాత ఇలాంటి విమర్సాత్మక మైన ధోరణి నప్పుతుందేమో కాని అల్లా  టప్ప గా మాట్లాడే వాళ్ళని సమాజ విద్రోహులు గానే పరిగణించాలి. "నిజం నిలకడ మీద తేలుతుంది" అన్న మాట అక్షర సత్యం కాదా. ఇవ్వాళ్ళ రోజున వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని మాటల గారడీ తో తిమ్మి ని బొమ్మి చేసి ప్రజల మీదకు రుద్దే మహాను భావులని చూసిన తర్వాతే భూమి ని పిచ్చి పిచ్చి గా పరిశోదన చేసి వయస్సు కనిపెట్టే ప్రయత్నం ని మానవాళి అందరు హర్షించ వలసిన విషయమే !!! ఇంకా ఇలాంటి నిజాలు ని మరింత నిజమని చెప్ప్పే ప్రయత్నాలు అన్ని చూసి "చాల రోజులు నించి ఇలాంటివి చూసాను" అని మనమందరూ నిలబడిన భూ దేవి ఎన్ని రోజులు నించి చెపుతోందో తెలియాలి కదా.

Monday, January 31, 2011

మా రైల్వే కాలనీ క్రికెట్ - Rules of Engagement

మా రైల్వే కాలనీ క్రికెట్ 
********************

మొన్న వరల్డ్ కప్ ఫైనల్ లో సరి సమానం గా స్కోర్ అయినప్పుడు , మేధావులు ఏమీ చేయాలో తెలియక తలలు బద్దలు కొట్టుకొని , ఎవడు ఎక్కువ బౌండరీలు కొడితే వాడిని విజేత గా ప్రకటిస్తున్నాం అని చేతులు దులిపేసుకున్నారు, తద్వారా సమస్త ప్రజానీకం చేత అక్షింతలు కూడా వేయించుకున్నారు. ఇవ్వాల్టి రోజున ICC వాళ్ళు వచ్చి వాళ్ళిష్టం వచ్చినట్టు రూల్స్ అన్ని తిరగ రాస్తూ ఉంటే, మా కాలనీ లో మేధావులు ఏనాడో ఉచితంగా చేయగలిగిన దానికి వీళ్ళకి ఇంతేసి డబ్బులు ఎందుకు దండగ అని అనిపించక మానదు. 

మేము మా రైల్వే కాలనీ లో అడినదే అసలు సిసలు క్రికెట్ అండి !! నాకు గుర్తు ఉన్నంత వరకు మచ్చుక్కి కొన్ని మీతో మనవి చేస్తాను.
  1. మాకు ఫీల్డింగ్ చేసే అప్పుడు రెండు పోసిషన్స్ సెట్ అయిపోయి ఉండేవి. ఒకటి వికెట్ కీపెర్, మరొకటి bye వికెట్ కీపెర్. వికెట్ కీపెర్ కి మాములు gloves వేసికొని ఉంటే bye వికెట్ కీపెర్ మాత్రం హవాయి చెప్పులు తగిలించు కొని ఉండేవాడు. వీడు సాధారణముగా టీం లోకల్లా చిన్నవాడు కానీ, కొత్త గా వచ్చిన వాడు కానీ లేదా బాల్ డబ్బులు ఎగ్గొట్టిన వాడు కానీ అయిఉంటాడు.
  2. వికెట్ కీపెర్ మరియు bye వికెట్ కీపెర్ కనక ఒక లైన్ లో నిలబడ్డారు అంటేఅంపైర్ ఆ బంతి ని "నో బాల్" గా డిక్లేర్ చేస్తాడు. అటువంటి మహత్తర క్షణాల్లో ఒక బౌలర్ అతి కష్టం మీద బ్యాట్సమెన్ ని క్లీన్ బౌల్డ్ చేసి నెత్తి నోరు బాదుకొన్నా చేయగలిగింది ఏమీ లేదు.  
  3. బౌలర్ ఎటువైపు నించి ఏ చేత్తో బౌలింగ్ చేయ్యపోతున్నాడో అంపైర్ కి తెలియచెయ్యడాన్ని "గార్డ్"  చెప్పడం అని అంటారు. ఈ నియమం బౌలర్ కనక పాటించ లేదనుకోండి, ఆ బాల్ నో బాల్ అయి కూర్చుటుంది. అయితే తర్వాతి బాల్ కి కూడా చెప్ప లేదు అనుకోండి, అప్పుడు కూడాఅంపైర్ అతని తప్పు చెలియ చెయ్యడు. మళ్లీ ఆ బంతి ని "నో బాల్" గానే ప్రకటిస్తాడు. అప్పుడు కెప్టైన్ కలగ చేసుకొంటే "మీ వాడికి గార్డ్ చెప్పాలని ముందు చెప్పమ్మా" అంటూ గీరగా సమాధానం చెప్తాడు.
  4. సాధారణంగా లెగ్ అంపైర్  బాటింగ్ టీం నించి ఉంటాడు. ఒక్కొక సారి ఈ లెగ్అంపైర్ మారే కార్యక్రమం లో బాటింగ్ టీం వాళ్ళు తగిన సమయం లో వాడిని పంపడం మర్చి పోతారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఫీల్డింగ్ టీం వాళ్ళు బంతి తీసుకు వచ్చి స్టంప్స్ ని పడగొడతారు. ఇప్పుడు ఫీల్డింగ్ టీం వాళ్ళు బాట్స్మన్ లేదా రన్నర్ లలో ఎవరో ఒకరిని అవుట్ చెయ్యవచ్చు. పాపం అవుట్ అయిన వాడు టీం కెప్టైన్ ని ఏమి బూతులతో సత్కరిస్తాడో మీకు మళ్లీ చెప్పక్కర లేదు అనుకొంటా.
  5. ఇదే రూల్ లెగ్అంపైర్ బాట్స్మన్ కి లెగ్ సైడ్ కాకుండా ఆఫ్ సైడ్ లో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా  ఫీల్డింగ్ టీం వాళ్ళు గుంట నక్కల్లాగా వచ్చి బాట్స్మన్ ని నిర్ధాక్షిణ్యం గా అవుట్ చేసేస్తారు. ఇదే విధానానికి బలైన లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మన్ పాపం ఎందరో !!
  6. అవుట్ అయిన బాట్స్మన్ బౌండరీ లైన్ ని దాటినా తర్వాత కాని నెక్స్ట్ బాట్స్మన్ లోపలి వచ్చాడు అనుకోండి అప్పుడు అతను ఒక్క బాల్ కూడా ఆడకుండా స్టంప్ అవుట్ చేయ వచ్చు.
  7. చాల సందర్భాల్లో బాటింగ్ ఆర్డర్ కోసం ప్రొఫెషనల్ టీమ్స్ తెగ కష్ట పడుతుంటారు. మా కాలనీ లో అది చాల ఈజీ. ఎవడు బాల్ కోసం ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడు ఓపెనింగ్ బాట్స్మన్, తర్వాతే ఎవడైనా !!
ఏంటి ఇవన్ని అభూత కల్పనలు అని అనుకొంటున్నారా ? మా జీవితాలు మిలిటరీ కమాండ్స్ గా నిలిచిన రూల్స్ ఇవి. నాకు గుర్తు  ఉన్నంత వరకు మీతో షేర్ చేసుకొన్నాను. మీకు కూడా ఇంకా మిగిలి ఉన్న రూల్స్ షేర్ చేస్తే, అందరం కలిసి ఒక గ్రంధం తయారు చేద్దాం.  

జై హింద్ !!

Sunday, January 30, 2011

నటన రాని అగ్ర నటులు

వాచకము, విగ్రహము, ఉచ్చారణ, హావ భావాలూ ఇవేవి లేక పోవడం ఈ రోజున తెలుగు సినిమాలలో అగ్ర నటివర్గం గా చలామణి అవుతున్న వారి యొక్క ముఖ్య అర్హతలు. వాళ్ళ నాన్న, మామ, పెదనాన్న లేక బాబాయ్ ఇలా ఎవరో ఒకరి రక్తం వీళ్ళ ఒంట్లో వుంటే చాలట వీళ్ళు కూడా మహా నటుల జాబితా లో ఇట్టే చేరి పోతారు. కాని ఈ "వా" (వారసత్వం) బ్లడ్ గ్రూప్ ఒక్క తెలుగు హీరో కులానికే వర్తిస్తుంది అట. వీధి లోకి కొత్త కుక్క వస్తే ఎలా అయితే అది నిర్దయగా తరమపడుతుందో, ఈ కుల సంతతి ఈ "హీరో" ఇజంని తమ జన్మ హక్కు గా బావిస్తుంది. ఈ హీరో వర్గం ఒక్క బాధ్యత వట్టి సినిమా లో నటించడం మాత్రమే అని అనుకొంటే మీరు పొరపాటు పడినట్టే. ఉదహరణకి వీళ్ళ సినిమాలు లో పాటించవలసిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే.
  • సినిమా లో ముఖ్య నటి నట వర్గం ని మొత్తం మీద హీరో నే నిర్ణయిస్తాడు.
  • హీరో యొక్క సామర్ధ్యం ని బట్టి, అతని కన్నా నటన కొంచం అయినా వచ్చిన వాళ్ళని చిన్న చిన్న పాత్రలకి లేక తమ ని ఇంకా ఎలివేట్ పద్ధతి లో తగిన జాగ్రత్త డైరెక్టర్ తో సహా కలిసి తీసుకొంటారు.
  • అన్నిటి కన్నా ముఖ్యంగా హీరోయిన్ తెలుగు మాట్లాడం రాని అమ్మాయి అవ్వాలి. చెప్పా కదా మన హీరో గారు ముందర ఎక్కువ నిడివి లో కనిపించే వాళ్ళు నటన తప్ప మిగతా అన్నిటిలో సమర్ధులు అయ్యి ఉండాలి అని.
  • ఒక్క కమెడియన్ తప్ప మిగతా ఆర్టిస్ట్లు అందరు పక్క రాష్ట్రాలు వాళ్ళు అయి ఉండాలి.
  • డబ్బులు పెట్టె నిర్మాత ఒక పెద్ద supplier మాత్రంగా మిగిలి ఉండాలి.
  • హీరో గారి కి ఇష్టమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరిగే విధం గా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక్క పేరుపడ్డ హీరో వర్గీయులు అవ్వడం వలన వీళ్ళకి పెక్కు లాభాలు. మొదటగా వేషాలు కోసం ఎవడి కాళ్ళు పట్టుకోవక్కర లేదు. కను ముక్కు తీరు ఎలా ఉన్నా తిమ్మి ని బొమ్మి ని చేసి వీళ్ళ మొహాలు సరి చేస్తారు. సినిమా చతికిల పడినా కూడా తర్వాతి సినిమాల్లో వేషాలకి డోకా ఉండదు. వీళ్ళకి నటనకి సంభందించిన నైపుణ్యం ఏమి లేక పోయినా కూడా డైరెక్టర్ ప్రతిభతో మరియు గ్రాఫిక్స్ వగైరా లతో సినిమాల్లో ఒక్కింత ఎక్కువగా చూపిస్తారు. మొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ తన చిన్న వయస్సు లోనే వట్టి కనుబొమ్మలతోనే  ఆందోళన నించి ఆనందం హావభావాలు ఎలా మార్చవచ్చో మహానటి సావిత్రి గారు నేర్పింది అట. చాదస్తం కాక పొతే అవన్నీ ఎందుకు అండి సినిమా హిట్ అవ్వాలి అంటే ? సినిమాల్లో డబ్బులు రావాలి అంటే మంచి కధ, direction, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మంచి నటీ నట వర్గం... ఎవడండీ మీకు చెప్పింది ఇవన్నీ. మంచిగా ప్రింట్లు వేయించుకొని ధియేటర్ లు బ్లాక్ చేయించు కోగలిగితే సరిపోదూ !! జనాలు చచ్చి నట్టు వస్తారు అండి.

Wednesday, January 26, 2011

విలువలు

రాత్రంతా నిద్ర లేదు. కరెంట్ నాలుగు అయిదు సార్లు పోయుంటుందేమో. ఈరోజు తొందరగా వెళ్ళాలి అన్న టెన్షన్ ఒకటి. ఒక్క పది నిముషాలు పడుకుందాము కళ్ళు మూసుకోపోయాను. కొంచం మగత గా నిద్ర పట్టిందేమో లేదో "ఏమండి, ఈ రోజు తొందరగా వెళ్ళాలి అన్నారు. లేస్తున్నారా" అంటూ శ్రీ మతి గొంతు వినపడింది. ఇక లాభం లేదు అను కొంటూ లేచి బాత్ రూం వైపుకు సాగాడు.


"ఏమోయ్ !! నీళ్ళు రావడం లేదు. చెప్పవా రాత్రి owner కి పొద్దున్నే వెళ్తున్నాము. మోటర్ వెయ్యడం మరవద్దు అని" గావుకేక పెట్టాను. ఉలిక్కిపడి లేచింది మా ఆవిడ. "చెప్పానండి. రావట్లేదా నీళ్ళు ?" కళ్ళు మూతలు పడుతుంటే అతి కష్తం మీద మాట్లాడింది సతీమణి. "అబ్బా !! ఈయనతో చచ్చే చావు వచ్చింది. ఎప్పుడైనా పొద్దున్నే వెళ్ళాలి అంటే అప్పుడే ఈ పెంట పెడతాడు, ఇంట్లో ఏమైనా ఉన్నాయా నా వరకు సరిపోయేంత వరకు" కొంచం కంగారు గా అడిగాను. ఆవిడ ఆ బిందె, బకెట్ లో నించి మిగిలనవి కొన్ని అయిన వరకు సర్దింది. "ఛీ ఛీ వీళ్ళకి పక్క వాళ్ళు అంటే కొంచం విలువ కూడా లేదు" అంటూ సణుగుతూ ఏదో కాకి స్నానం కానించి బయట పడ్డాను.


సన్యాసి రావు బ్యాంకు లో  ఆఫీసర్ గా ప్రమోషన్ మీద ఈ మధ్యే కాకినాడ నిండి హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అయ్యే ప్రయత్నం లో ఉన్నాడు. ఈ రోజు తన చిన్న అమ్మాయి స్కూల్ అడ్మిషన్ కి తన దూరపు చుట్టం ఫ్రెండ్ ఈ ఏరియా కి corporator కావడంతో కొంచం recommendation కోసం బయలు దేరుదాము  అని ప్లాన్. చెప్పులు వేసుకుంటూ ఉండగానే సెల్ మోగింది. "బయలు దేరరా, సుబ్బా రావు గారు చాల నిక్కచ్చి గా ఉంటాడు టైం అంటే", హడావుడి గా అన్నాడు మా బావ మరిది కజిన్ సురేష్. "ఒక్క పదిహేను నిమిషాల్లో ఉంటానండి" ఆటోలు దొరకవేమో అన్న భయాన్ని దాచుకొంటూ చెప్పాను.


ఇల్లు కొంచం మెయిన్ రోడ్ దూరం ఉండడంతో ఆటో లు దొరకడం లాటరీ కన్నా ఘోరం. నాలుగు అడుగులు వేసాడో లేదో అదృష్టం కొద్ది ఆటో సౌండ్ వినపడింది.  "బాబు !! దిల్ సుఖ్ నగర్ ఆతా ?" సాధ్యమైనంత శ్రావ్యంగా అడిగాను. హైదరాబాద్ లో ఆటో వాళ్ళు అడిగే విధానం కి చాల ప్రాధాన్యం ఇస్తారు. నచ్చక పొతే అటుకేసి వెళ్తున్నా వాడు ఖాళీ గా వెళ్తాడు కాని బేరం ని ఖాతరు చెయ్యడు. "నై ఆతా" అంటూ రాజ కుమారుడు శ్వేత అశ్వాన్ని స్వారి చేసి నట్టు గా ముందరకి కదల పోయాడు. "బాబు !! కనీసం మెయిన్ రోడ్ వరకు వస్తావా" పూర్తిగా బతిమలుతున్నట్టు గానే అడిగాడు. ఏ కళ మీద ఉన్నాడో కాని "తీస్ రుపయ్యా" అన్నాడు. అయిదు నిమిషాల నడక అయినా కాని తప్పక ఎక్కాను. కడుపు మండుతున్నా ఏమీ మాట్లాడకుండా తర్వాతి ఆటో వాడిని ఎలా బుట్టలో వెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. మాములు గా మొత్తం కలిపి ముప్పై రూపాయలు అయ్యే ఆటో ఖర్చుకి డెబ్బై రూపాయలు చెల్లించి సుబ్బా రావు గారింటికి అనుకొన్న దానికన్నా అయిదు నిముషాలు లేట్ గా చేరుకొన్నాను. "ఏంటండి ఆలస్యం ? అయన కి అసలే కోపం ఎక్కువ" అంటూ సురేష్ కంగారు పెట్టాడు. "ఛీ ఛీ ఈ ఆటో వెధవలకి జనాలు అంటే కొంచం విలువ కూడా లేదు అండి. డబ్బు ఎలాగు కాజేస్తారు మళ్లీ మంచిగా కూడా మాట్లాడలేరు "  అన్నాను కొంచం చిరాగ్గా. "సరే సరే !! వాళ్ళ గురుంచి తెలిసిందే కదా !! పదండి, పదండి"  అంటూ పరుగు లాంటి నడక తో గేటు తీసుకొని లోపలి కి వెళ్ళాం. "బావున్నారా" అంటూ సుబ్బారావు గారి సతీమణి అనుకొంటా స్వాగతించారు మమ్మల్ని. "పర్వాలేదండి. ఈయన సన్యాసి రావు గారని మా చుట్టమండి" అంటూ పరిచయం చేసాడు. ఆవిడ నన్ను పలకరించే ముందరే "సుబ్బారావు గారు కలవ మన్నారండి" అని అసలు విషయానికి వచ్చాడు. "అవునా !! అయన ఇంతకు ముందరే మార్నింగ్ వాక్ కి వెళ్లారు అండి. కూర్చోండి అయినా" అంటూ మమ్మల్ని కూర్చోపెట్టింది.


మాకు చెప్పిన టైం కి ముఫై నిమిషాల తర్వాత సుబ్బారావు గారు నెమ్మదిగా వాళ్ళ కుక్క తో సహా వచ్చారు. "మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కమిటీ చైర్మన్ బాగా క్లోజ్ అండి. వాడు మనం వారానికి కనీసం ఒక్క సారైనా కలవసిందే" అంటూ ఇంకో పదిహేను నిమిషాల సోత్కర్ష తర్వాత "చూద్డామండి" అంటూ పస లేని భరోసా ఇచ్చాడు. పొద్దున్నే నా పని మీద బయలు దేరి వచ్చిందందుకు గాను మరో వంద రూపాయల బిల్ చెల్లించి ఇద్దరం కల్సి స్వాగత్ లో టిఫిన్ కార్యక్రమం కానిచ్చాము. "ఏంటండి !! ఈయన కి తన టైం తప్ప పక్కవాళ్ళ టైం అంటే కనీసం విలువ ఉండదా" అని గునిసాను. "పని మనది కదండీ. చూద్దాము" అంటూ సురేష్ secratariet  వైపు కి తన స్కూటర్ ని మళ్ళించాడు. నేను కూడా నా బ్యాంకు కి టైం అవుతూ ఉండడంతో బస్ స్టాండ్ వైపు కి కదిలాను.

ఇవ్వాల్టి రోజుల్లో బ్యాంకు లో ఉద్యోగం అంటే కనీసం ఒక నలబై చేతులు ఉండాల్సిందే. ఓపెన్ కౌంటర్ సిస్టం వచ్చిన తర్వాత బల్ల చుట్టుతా మూగే కష్టమర్లతో వేగాలి.
"సార్ !! జాయింట్ ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి సార్. ఇవ్వాల...." అంటూ ఒక కుర్రాడు వాళ్ళ అమ్మ తో వచ్చి ఇంకా ఏదో అడగ బోయాడు. "ఎకౌంటు ఓపెనింగ్ అన్ని 11 తర్వాతే" అని పక్కకి పంపించేసాను.
"నమస్తే రావు గారు !! ఏంటి మమ్మల్ని లాగించేస్తారా ఈ రోజు అయినా" అంటూ అన్నపూర్ణ బిల్డింగ్స్ పార్టనర్ నవ్వుతూ ఎదురుగ్గా నిలబడ్డాడు. "అయ్యో !! బలే వారు సార్. మీరు చెక్స్ ఇక్కడ వదిలెయ్యండి సార్. రెండింటికి కుర్రాడిని పంపితే బుక్ లో ఎంట్రీ వేయించి పంపుతాను సార్" అని నేను నా సీట్ లో నించి లేచి మరి చెప్పాను.
"సార్ !! నా ఆన్ లైన్ ఎకౌంటు authorize చెయ్యాలి అండి. కొంచం అర్జెంటు" అని ఒక కుర్రాడు స్టైల్ గా నా ముందు నిలబడి అడిగాడు. చూడడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు లాగా ఉన్నాడు. నాకు సెట్ అప్ చెయ్యడానికి access ఉన్నా కూడా, "ఆన్ లైన్ బ్యాంకింగ్ అంతా ఆ రైట్ సైడ్ లో నించి రెండో కౌంటర్" దగ్గర అని తల ఎత్తకుండానే చెప్పాను. "మరి ఇక్కడ కూడా అని అన్నారండి" అని ఏదో చెప్పుతున్నాడు ఆ కుర్రాడు. నేను మళ్లీ ఆ అబ్బాయి వంక చూడ కుండా నా పని లో మునిగి పోయాను. ఇంతలో మా బ్రాంచ్ మేనేజర్ లోపలి రమ్మని ఇంటర్ కం లో ఫోన్ చేసి చెప్పాడు. ప్రీమిఎర్ కస్టమర్ లతో ఒక గంట గడిపిన తర్వాత బయటకు వస్తుంటే ఇందాక ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి అన్న కుర్రాడు మళ్లీ ఎదురు పడ్డాడు. "సార్ !! మా పని పూర్తి చెయ్యండి సార్" అంటూ.  అతని కాగితాలు చూస్తూ,  "అందేంటి బాబు. మీ అమ్మది ID proof తీసుకు రాలేదు  ఏంటి". "నిన్న ఓన్లీ primary account holder ది ఉంటె చాలు అన్నారు సార్, ఆ కౌంటర్ లో ఉన్న అయన. సార్ కొంచం హెల్ప్ చెయ్యండి సార్" బతిమాలుకొన్నాడు ఆ కుర్రాడు. "కుదరదమ్మా !! రేపు వచ్చినప్పుడు అన్ని తీసుకు వచ్చేయి" అని adjust చేసి పని అయిపోగోట్టే ఛాన్స్ ఉన్నా దాటేసాను. వాళ్ళ అమ్మ తో కొంచం జాలి గా అక్కడ నించి కదిలాడు ఆ కుర్రాడు. మిగత పని సందడి లో పడి లంచ్ టైం  అన్న విషయం కూడా మర్చి పొయ్యాను. మరి ప్రపంచంలో జనం అందరికి డబ్బు తోనే నిత్య కళ్యాణం కదా, ఇండియా లో బ్యాంకు లు ఎన్ని పెట్టినా కిట కిట లాడుతునే ఉంటాయి. లంచ్ కానీ లేవ పోతూ ఉంటే కొంచం పెద్దాయన "అయ్యా !! కొంచం DD తెలియక తప్పు అడ్రస్ కి తీసుకొన్నాను. దీన్ని కాన్సిల్ చేసి మళ్లీ తీసుకోవాలి అండీ. అయన ఏమో మీ అప్రూవల్ ఉండాలి అంటున్నారు. చూస్తారా" అని అడిగాడు. "ఇది పర్సనల్ బ్యాంకింగ్ మేనేజర్ గారు చూడాలి అండీ. రేపు రావాలి మీరు. అయన ఈ రోజు లీవ్ లో ఉన్నారు" దాటేసాను. కొంచం గొనుక్కుంటూ అయన అక్కడ నించి వెళ్ళాడు. అసలే పొద్దున్న నించి చిరాగ్గా ఉన్నానేమో నా పనులే కాక మళ్లీ పక్కవాళ్ళ పనులు చేసే ఓపిక అస్సలు లేదు.

ఆఫీసు నించి సుమారు ఆరు ఇంటి సమయం లో బయట పడి ఇంక ఓపిక లేక ఆటో లో ఇంటికి బయలు దేరాను. వచ్చిన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో తొందరగా BP పెరగకుడా ఉండాలి అంటే ఆటో వాళ్ళ తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న ధర్మ సుక్ష్మం తెలుసు కొన్నాను. మెయిన్ రోడ్ లోనే దిగి
కొంచం నడిచి ఊసురూ మంటూ ఇంటికి చేరాను. గేటు దగ్గర మా ఓనర్ కనపడితే, "బావున్నారా సార్ !! సార్ పొద్దున్నే నీళ్ళకి కొంచం కష్టం అవుతోంది అండీ. రాత్రిళ్ళు మోటర్ వెయ్యడం మర్చి పోవడం మర్చి పోకుండా ఉంటారా" అంటూ వీలు అయినంత నెమ్మదిగా చెప్పాను. దానికే అయన మొహం మాడ్చుకొని, "ఇప్పటికి మూడు సార్లు చెప్పారు అండీ మీ మిస్సేస్స్ గారు. మళ్లీ మీరు చెపుతున్నారు ఇప్పుడు" అంటూ స్కూటర్ లో అక్కడ నించి కదిలి వెళ్ళిపోయారు.

"ఛ ఛ !! ఎం మనుషులో ఏంటో !! పక్కవాడికి కనీసం విలువ కూడా ఉండదు" అనుకొంటూ లోపలికి చేరాను. ఈ సారి ఒక నిండు బకెట్ నీళ్ళతో స్నానం చేసి భోజనం చేస్తూ ఉంటే, "ఏమండి !! దొరికిన్దనుకొన్న పని మనిషి లాస్ట్ లో రానని చెప్పింది. కధ మళ్లీ మొదలుకి వచ్చింది. మళ్లీ వెతుకు లాట మొదలు పెట్టాలి" అనింది నా సతీమణి.

"ఏమండి !! కాకినాడ నించి transport వాళ్ళు పోగొట్టిన మన కుర్చీలు మరియు బీరువా తాలూకు డబ్బులు ఇవ్వడం కుదరదు అట. కావాలి అంటే వాళ్ళ కోచిన్ లో ఉన్న హెడ్ ఆఫీసు కి కంప్లెయిన్ చేసుకో మన్నారు", అంటూ బాడ్ న్యూస్ ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టింది మా ఆవిడ.

"అబ్బా !! ఈ దేశం లో కష్ట పడకుండా అసలు ఒక్క పని అయినా అవడం నా ఈ జన్మ లో చూస్తానా. ఎవడి పనులు వాడు సక్రమంగా పని చేస్తే జనం కి ఇన్ని కష్టాలు ఉంటాయా. అయినా వీళ్ళని అని లాభం లేదు, యధా రాజ తధా ప్రజా !! వాళ్ళే అలా ఉంటే మిగతా జనాలు ఏమి చేస్తారు" అని ఒక చిన్న సైజు lecture మా ఆవిడ కి దంచి ఇంక బాగా నిద్ర రావడం తో పడుకోవడానికి మంచం మీద వాలా. కొంచం నిద్ర పడుతోంది అన్న సమయం లో పొద్దున్న బ్యాంకు లో వాళ్ళ అమ్మ తో సహా నిలపడ్డ ఎకౌంటు ఓపెన్ చెయ్యడానికి వచ్చిన కుర్రాడు మరియు DD మార్పించడానికి వచ్చిన పెద్దాయన సడన్ గా నా కళ్ళ ముందర కన పడ్డారు. ఇబ్బంది కరమైన ఆలోచనలు పక్కకి తోసేసి పడుకోడానికి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టా.

పింగళి వారు

"రసపట్టులో తర్కం కూడదు" అంటూ మాయాబజార్ కృష్ణుడు మందస్మితుడై రుక్మిణి దేవి తో చిలిపిగా అన్నప్పుడు మా దుర్గా కళా మందిరంలో సంతోషం తో కూడిన కలకలం నాకు ఇంకా కళ్ళకి కట్టినట్టు గా గుర్తు ఉంది. పింగళి వారి మాటలు ఒక ఋషి పలుకులు లాగా, మెరుగైన శిల్పానికి మల్లె ఇంకా కొత్త గా ప్రజానీకం మనస్సుల్లో కదలాడుతూనే ఉన్నాయి. మచ్చుక్కి కొన్నిటిని (నాకు గుర్తు ఉన్నంత వరకు) స్ప్రుసిస్తాను

ముందుగా ఒక్క మాయబజార్ లోనే వాడిన వాక్య నిర్మాణం సరి కొత్త నిఘంటువు కి మల్లె ఇంకా తన సేవలు అందిస్తూనే ఉంది.
"ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి" అని రహస్యం భేదిస్తాడు ఘటోద్గజుడు.
"శశిరేఖ కనికట్టు ఏమైనా నేర్చిందా లేక నా కన్ను ఏమైనా చెదిరిందా" పాచిక పారని శకుని మామ.
"పండితులు అంటూ సుద్ద మొద్దులు తయారు అయ్యారు" అంటూ ఎద్దేవా.
"భళి భళి భళి ఓ దేవా !! బాగున్నదయా నీ మాయ" అన్న జానపద తత్త్వం.
"ఇదిగో శశి, నీ బావ సత్యవంతుడై వచ్చాడు" అంటూ అభిమన్యుడిని ఉద్దేశిస్తూ కృష్ణుడు జరగబోయే పరిణామాలు చెప్పబోతే "అయితే మా శశి సావిత్రి అవుతుంది లెండి" అంటూ రుక్మిణి వారిస్తుంది.
"లక్ష శని గ్రహాల పెట్టు మా శకుని మామ" అంటూ అతని కుటిలత్వాన్ని ఒక్క మాట తోనే తేల్చుతాడు కృష్ణుడు. "బాల కుమారులంట, చాలా సుకుమారులంట, పెళ్ళికొడుకు నన్ను చూసి , మురిసి మూర్చ పోవునంట" అన్న మన సావిత్రి.
మరి "అస్మదీయులకు విరుగుడు తస్మదీయులు" అన్న ప్రయోగం, ఆశ్చర్యానికి "ఆసచర్యం" అనిపించడం, "ఆ నీటు గోటు" ఇలా ఎన్నో !!

జగదేక వీరుని కధ లోని ఇంద్రకుమారి తన సఖులని "హల" అని సంభోదించడం చూస్తే దేవలోకం లో ఈయన కొన్నాళ్ళు అక్కడ నివాసం చేసారా అని అనిపిస్తుంది. అట్లాగే మూడు లోకాలు ని పాలించే అమ్మని "జేజి" అని పిలవడం ఆయనకే చెల్లింది. "వరించి వచ్చిన మానవ వీరుడు ఏమయ్యాడని విచారమా" అంటూ ఇంద్ర కుమారి ని ఆట పట్టించడం అతికి నట్టు సరిపోతుంది.

అలాగే మిస్సమ్మ లో "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అన్నప్పుడు స్త్రీ హృదయం ఈయన ఒక్కడికే అర్ధం అయ్యిందా అని అనిపించక మానదు. "చూస్తారా నా conduct certificate" అని NTR అడిగినప్పుడు ఇప్పటికి చూసే వారు పక్కున నవ్వుతారు. "తన మతమేదో తనది, మన మతమసలే తగదోయ్" అన్నప్పుడు చంద్రుడిని ఎలా మన హీరో కలుపు కొన్నాడో చర్చ కొన్నాళ్ళు జరగాల్సిందే. SVR "అదే" అని పదే పదే అనడం ఊత పదం నించి సరసమైన హాస్యం ని పుట్టిస్తారు.

"నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా" చేతులు కట్టుకొని మన NTR అడగడం, "సాహసం సేయరా డింబకా, రాజ కుమారి లభిస్తుంది" కుటిల ప్రోత్సాహం చూపే నేపాలి మాంత్రికుడు. ఇవన్నీచేరి ఈరోజుకి రాజ మౌళి వంటి డైరెక్టర్ లని మళ్లీ తీద్దామా అని అనిపిస్తోంది.

ఈయన నాగుపాము కుబుసం విడిచి నట్టుగా ఒక సినిమా లో వాడిన ప్రయోగాల కనీసపు వాసన కూడా మరో వాటిల్లో రాకుండా పడిన జాగ్రత్త చూస్తే ఇవ్వాల్టి వాళ్ళ దివాలా కోరు తనం కనపడుతుంది. ఉదాహరణ కి గాయం సినిమా లో హిట్ అయ్యిన డైలాగ్ లు హిందీ సత్య లో వినపడితే "అయ్యో" అని అనిపించక మానదు.
అటువంటి మహానుభావుణ్ణి మళ్లీ తలుచుకొనే ప్రయత్నం ని హర్షిస్తారు అని భావిస్తున్నాను.

గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ - చదవడం ఆపాలంటే

  1. ముఫై రోజులు పాటు విడిచి పెట్ట కుండ చదవండి.
  2. ఇండియా లో మీ బందువులని, స్నేహితులని ఒక పదిమంది ని "ఈ వెబ్ సైట్ తెలుసా" అని అడగండి.
  3. ఈ వెబ్ సైట్ లో వ్రాసే రివ్యూ లు చదివి సినిమాలు చూడడమో లేదా చూడక పోవడమో చెయ్యండి.
  4. మీ బాత్ రూం లలో వైర్ లెస్స్ సిగ్నల్ ని జాం చెయ్యండి
  5. డేటా ప్లాన్ ఉన్న సెల్ ఫోన్ ని పొద్దున్నే కనపడకుండా జాగ్రత్త పడండి.
  6. చదివిన చెత్త ని ఇండియా లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి "నిజమా" అని అడగండి.
  7. వారానికి ఒక్కటి అయినా మంచి తెలుగు కధ చదవండి.
  8. ఈ సైట్ వలన వచ్చిన కంప్యూటర్ వైరస్ బాదితులతో తరుచు మాట్లాడుతూ ఉండండి

Monday, January 17, 2011

Multi Tasking

చెట్టు లెక్క గలవా ఓ నరహరి !! పుట్టలెక్కగలవా ఓ నరహరి చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా !! ఓ నరహరి చిగురు కోయగలవా ?
అంటూ చెంచు లక్ష్మి రూపం లో అంజలి దేవి పలు పలు విధములైన పరీక్షలు మన నాగేశ్వర రావు కి పెట్టి న విధము చూసి ఆ రోజుల్లో అమ్మో ఇంత కటినమా అని అనుకొన్నారట. మరి ఇవ్వాల్టి రేపు చెట్టులు, పుట్టలు మరియు పర్వతాలు, లోయలు ఇలా అనితర సాధ్యం కాని రక రకాల విన్యాసాలు అన్ని ఏక కాలం లో చేస్తేనే అది అసలు సిసలైన సామర్ధ్యం !!


"పొద్దున్నే లేచి యోగాచేస్తాను అండి"
"అబ్బా !! ఎంత సేపు చేస్తారు అండి?"
"కనీసం ఒక అర్ధ గంట. అప్పుడే iphone లో సాంగ్స్, టీవీ లో morning news కూడా లాగిన్చేస్తాను అండి. మళ్ళ నైట్ జాబ్స్ ఉంటాయి కదండీ, వర్క్ కి కూడా connect అవుతాం"
"ఓపిక సార్. ఇంత హడావుడి లో యోగా చేస్తున్నారు"

"మనది అంతా express సార్ !! కార్ లో వెళ్ళే టప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్ normal గా working lunch, రాత్రి తినేటప్పుడు ఈనాడు, జ్యోతి కవర్ అయిపోతుంది. లేదా ఇండియా కాల్స్ ఉంటాయి కదా"
"మనం ఈ మధ్య iphone లో గేమ్ లాగించేస్తున్నాము. ఒక చెయ్యి ఖాళి కదా మరి"

"సార్ !! ఇది ఒక పెద్ద addiction అయి పోయింది సార్. ప్రతి రెండు నిమిషాలికి ఒక సారి email చెక్ చేసుకోకుండా ఉండ లేక పోతున్నాను సార్."
"కరెక్ట్ అండి !! నేను అయితే ఒక రోజూ మర్చి పొయ్యాను ఇంటి దగ్గర. పిచ్చి ఎక్కి పోయిందంటే నమ్మండి"

"మా వాడు సోమ వారం kumon, మంగళ వారం కరాటే, బుధ మళ్లీ kumon and సంగీతం, గురు డాన్సు, శుక్ర వారం టెన్నిస్, శని వారం మళ్లీ డాన్సు. అది వారమే గ్యాప్ వచ్చింది అండీ"
"మంచి పని చేస్తున్నారు అండీ. పిల్లలు ఎన్ని అయినా చేస్తారు అండి. మన బాధ్యత అన్ని నేర్పాలి ఎందుకు అంటే ఇప్పుడు అన్ని అవసరమే కదా"

"2 నిముషాలు పాటు ఒకే పని చేయడం ఎలా"
"ఒక మనిషితోనే పది నిముషాలు మాట్లాడం ఎలా"
"కార్లో ఒక్క డ్రైవింగ్ మాత్రమే చేయడం సాధ్యమా"
"ఇంటర్నెట్ చూడ కుండా టీవీ చూడగలమా"
"ఇంటర్నెట్ లేకుండా ఒక చిన్న పేరా వ్రాయడం ఎలా"


అలయక సొలయక వేసట, నొలయక కరి మకరి తోడ నుద్ధం డత రా
త్రులు సంధ్యలు దివసంబులు, సలిపెం బో రొక్క వేయి సంవత్సరముల్

అమ్మో పోతనామాత్య !! ఆ రోజుల్లో కుదిరింది కాని, ఇప్పుడు అయితే వెయ్యి సంవత్సరాలు పాటు ఎన్ని తెలుగు సినిమాలు చూసేసివి అనుకొంటున్నారు ఏనుగు మరియు మొసలి కొట్టుకుంటూనే ? లెక్కలేనన్ని iphone apps డౌన్లోడ్ చేసేసి పిచ్చ టైం పాస్ చేసు కోనేవి.

పెద్దవాళ్ళు చెపుతారు, "వేళ పట్టున కడుపు నిండా ప్రశాంతంగా తిండి తినరా" అని. టైం ఎక్కడ ఉందండీ ?? కనీసం మిగతా ప్రాణులు ప్రకృతి సహజమైన దైనందిక కార్య క్రమాలు అయినా హాయిగా ప్రశాంతంగా కానిస్తాయి. మన ప్రారబ్ధం, ఆ అదృష్టం కూడా కోల్పోతాము వయస్సు పెరిగే కొద్ది.

మనసా వాచా కర్మణ త్రికరణ సుద్దిగా చేసే ప్రార్ధన కు దేవతలు కూడా వశం అవుతారు అట. మనకి అయన వచ్హినా మధ్యలో email కానీ ఫోన్ కానీ వస్తే మనసు పెట్టి మాట్లాడడానికి టైం ఏది ??

Thursday, January 13, 2011

కాలనీ భోగి - 2

"వద్దురా బాబు. చచ్చి పోతాం. అసలు ఇప్పుడు రామవరప్పాడు వరకు ట్రాక్ అంటా శుబ్రం చేసారంట" అని నిరుత్సుహపరిచాను నేను. "అవున్రా మాఇంట్లో కిందటి సంవత్సరం వాయదీసారు. పట్టాలెంబడ మళ్లీ కన పడ్డాము అని తెలిసిందో ఇంకా అంతే" అన్నాడు హరి. "సరే రా. మరి మనం single quarters పక్కన ఉన్న కొమ్మలు కొట్టు కోద్దాం అయితే" అని సాయి త్వర పెట్టాడు. మొత్తం మేము ఒక పది మంది చేరి వెళ్ళే సరికి జయ గాడి బ్యాచ్ రక రకాల పరికరాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. కొంత కిరాతార్జునీయం జరిగిన తర్వాత మా కాలనీ జ్యూరీ వద్దకి వెళ్ళాం అందరు కలిసి. మా కాలనీ లో సాధారణముగా ఇలాంటి తగాదాలు తీర్చడానికి సెంటర్ లో బాబా కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర 24x7 కష్టమర్ సర్వీసు అందిస్తూ కొంత మంది కూర్చుని ఉండేవాళ్ళు. వాళ్ళు మా గొడవంతావిన్న తర్వాత సగం సగం తీసుకోమని తీర్పు ఇచ్చారు.



భోగి ఇంకా నాలుగు రోజులు ఉంది అనగా ఒక ఇద్దరు గ్యాంగ్ మాన్లు మా ఇంటి దగ్గర మాధ్యాన్నశుభ గడియల్లో ఒక శ్రేష్టమైన స్లీపెర్ ని మా ఇంటి దగ్గర పడేసి వెళ్ళేరు. మా బ్యాచ్ అంతా ఆ రోజు దాన్ని తాకి మరి తనువూ తీరా అస్వాదించాము. ఇంక నా సంగతి చెప్పక్కర్లేదు. మా లైన్ క్రికెట్ టీం కాప్టైన్ సాయి గాడు మర్నాటి మ్యాచ్ లో ఆల్రెడీ ఓపెనింగ్ బాటింగ్ confirm చేసేసాడు. ఇంతలో తాడికొండ లో చదివే మా అన్నయ్య సంక్రాంతి సెలవలకి ఇక్కడకి వచ్చాడు. వాడికి మా ఫ్రెండ్స్ కి మధ్య అంత సయోధ్యత ఉండేది కాదు. "సరే రా !! రేపు పొద్దున్నే గ్రౌండ్ లో కలుద్దాం అని వెళ్లి పోయారు" మా జనం అంతా. మా వాడికి అప్పట్లో కమ్యునిస్ట్ భావాలూ చాలా ఉండేవి. "అమ్మా !! ఇలా రైల్వే సొమ్ము ఈ భోగి మంటల్లో తగల పెట్టడం ఏమైనా బావుందాఅని తర్కం మొదలు పెట్టాడు. మా వాడు కాలనీ లో ఉండక పోవడం వల్ల మా prestige గురుంచి పెద్ద అవగాహన లేదు. వాడితో ఇలాంటి విషయాల్లో అనవసరంగా తల దూర్చ వద్దని వార్నింగ్ ఇచ్చి మా జనాలు తో మ్యాచ్ గురించి మాట్లాడడానికి హడావుడిగా వెళ్లి పోయాను.


మర్నాడు క్రికెట్ మ్యాచ్ తో తలమునకలు అయిపోయినంత బిజీ. అసలే బాల్ బేట్ మ్యాచ్. చివరకి వాళ్ళ లెగ్ umpire తొండి చెయ్యడంతో మ్యాచ్ కాన్సిల్ అయిపోయింది. గొడవ అవ్వడం తో మా జనాలు చాల సేపు చర్చ చేసాం. సాయంత్రం ఎప్పుడో ఈసురో మంటూ ఇంటికి చేరితే, మా వాడు తలుపు దగ్గరే స్వాగతం చెపుతూ వంకర నవ్వులు నవ్వుతు ఎదురు వచ్చాడు. ఏదో తేడాగా అనిపించి ఒక్కసారి గా ఇంటి వెనక్కి వెళ్లి స్లీపెర్ కోసం చూసాను. "ఇంకేముంది. గుండె గుభేల్మంది". అక్కడ స్లీపెర్ లేదు. "అమ్మా, అమ్మా !! స్లీపెర్ ఏది ?" అంటూ గావు కేకలు పెట్టాను. మా అక్కయ్య ఈ దుర్మార్గం చూడ లేనట్టు గా అక్కడ నించి మౌనంగా వెళ్లి పోయింది. మా వాడి నవ్వులు ఆగట్లేదు. "పాపం !! కాలనీ ఆంజనేయస్వామి గుడి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోవాలి అట. పట్టుకు పోయార్రా", mystery విడతీసింది మా అమ్మ నింపాదిగా. "నాన్నగారే చెప్పారు. గుడి వాళ్ళు అడిగితే కాదనగలరా. ఇంకా 10-12 దాకా ఇస్తారు అట", మా వాడు పరమ సంతోషంగా చెప్పాడు. "అమ్మా !! ఏంటమ్మా. ఇంక రెండు రోజుల్లో భోగి. మీకు ఎవ్వరకి అర్ధం అవ్వడం లేదు", అంటూ కన్నిళ్ళని అతి కష్టం మీద అపుకొంటూ అరిచాను. "అసలు భోగి అంటే ఏమిటో తెలుసా ? ముందరి సంవత్సరం లోని చెత్త ని కాల్చేసి కొత్త వస్తువులు సంపాదించు కోవాలి అని. ఇట్లా మంటలు పందాలు వేసు కోమని కాదు", మా వాడి నోటికి అడ్డు ఆపు లేకుండా పోతోంది. ఇలాంటి వార్తలు ఎంత వేగంగా పాకి పోతాయి అంటే, ఒక గంట వ్యవధి లో మా బాచ్ ఒక్కరు ఒక్కరు గా వచ్చి నన్ను పిలవడం మొదలు పెట్టారు. సాయి గాడి చెయ్యి పట్టుకొని మరి "సారి" చెప్పాను. భోగి మంట మీద ఆశలు ఇంక వదిలేసాం.



నేను, సాయి గాడు మర్నాడు కొంచం ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెట్టాము. "ఏమి చేస్తాము రా. నువ్వు ట్రై చేసావు. కుదరలేదు అంతే", అన్నాడు సాయి నిర్లిప్తంగా. వాడు అంత కూల్ గా react అవుతాడు అని నేను ఊహించలేదు. జయా గాడు సైకిల్ మీద మమ్మల్ని చూస్తూ వెకిలిగా నవ్వుతు వెళ్ళాడు. విషయం వాడికి తెలిసింది అన్నమాట. "ఇంక కాపలా ఎందుకు రా వేస్ట్" అన్నాను నేను. "లేదురా నేను, బ్లడ్ శీను, జిం మనోహర్, ఇంకో ఇద్దరు ఉంటాము లేరా" అన్నాడు సాయి. నాకు వాడు ఇంకా నా ఫ్రెండ్ గా ఉన్నందుకు "మా కాలనీ ఆంజనేయస్వామి" థాంక్స్ చెప్పుకుంటూ, ఏమైనా నిన్న తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని లెంపలు వేసుకొన్నాను.


మర్నాడు పొద్దున్నే నాలిగింటికి భోగి మంట మొదలు పెట్టాము. థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీ గా రెట్టించిన ఉత్సాహంతో అన్ని పేర్చుకోవడం మాకు కనిపిస్తూనే ఉంది. నాకు ఎలాగు మాది అయిదు ఇంటికి అయిపోతున్దిలే అని సాయి మరియు తదితరులు కు నా వంతు సహాయం అందిస్తూ ఉన్నాను. ఇంకా అన్ని అయిపోయాయి అని అనుకొంటుండగా, మా జనాలు ఎక్కడ నించో అప్పటివరకు ఉన్న దాని కంటే రెండింతలు తీసుకు వచ్చి రెడీ గా ఉన్నారు. మా భోగి మంటలు సమయాల్లో ప్రత్యర్ధి వర్గం నించి ఒకడు సదా గూడచారి తిరుగుతూ ఉంటాడు. నాకు అయితే ఆశ్చర్యం కి అంతు చిక్కట్లేదు. సాయి గాడు చిరునవ్వుతో పని కానిస్తున్నాడు. సర్లే మనం గెలుస్తున్నాము కదా ఎట్లాగు అని నేను కూడా పెద్ద ప్రశ్నలు వెయ్యలేదు. ఇలా థర్డ్ లైన్ వాళ్ళు ఆరు గంటలకే ముగిస్తే, మేము దిగ్విజయంగా కనీసం ఆరున్నర వరకు నడిపించాము. ఎనలేని సంతోషంతో అందరు చప్పట్లు, అరుపులు, కేరింతలు కొట్టుకొంటూ ఇళ్ళకి చేరాము.

మా అమ్మ, అన్నయ్య నేను చేరే సరికి విపరీతమైన కోపంతో ఊగిపోతున్నారు. "రౌడీ వెధవలు మితి మీరు పోతున్నారు కాలనీ లో", అంటూ మా అమ్మ తిట్ల పురాణం ఎత్తుకోంది. నెమ్మదిగా నాకు అసలు విషయం తెలిసింది ఒక గంట తర్వాత. మా ఇంటి వెనకాల ఫెన్సింగ్ లో కుడి పక్క భాగం, సాయి గాడి ఇంటి గేటు, హరి వాళ్ళ ఫెన్సింగ్ లో ఒక చెక్క దిమ్మ క్రితం రోజు రాత్రి ఎవరో కొట్టేసారట. మేమంతా "తెలు కుట్టిన దొంగలు" మయ్యాము అని మీకు వేరే చెప్పక్కర్లేదు అని అనుకొంటా.

Tuesday, January 11, 2011

కాలనీ భోగి - 1

"ఏంట్రా !! భోగి ఇంకా పది రోజులు. తెలుస్తోందా" అన్నాడు రామ కృష్ణ ఎండు గడ్డి పుల్లల్లో నించి పొగ పీలుస్తూ. "థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీ గా చాలా పోగేసారు" ఉప్పుందించాడు హరి గాడు. "ఏదో ఒకటి చెయ్యాలి రా !! లేకపోతె ఇంకా వేస్ట్ మనం" కొంచం విరక్తి గా అన్నాడు సాయి. "మరి నువ్వు ఏమంటావు సతీష్ గా, ఏమి మాట్లాడక పొతే ఎలా రా", రెట్టించాడు ఈ సారి.
"చూద్దాం లేరా, ఇంకా టైం ఉంది కదా" అంటూ తొందర గా ఈ టాపిక్ అయిపోతే బావుండు అని లేవ పోయాను నేను. "నీ అబ్బ !! నీకు పరిస్తితి అర్ధం కావడం లేదురా. లాస్ట్ భోగి మంటల్లో వాళ్ళే గెలిచారు. మన మంట కన్నా కనీసం ఒక గంట ఎక్కువ సేపు మండింది వాళ్ళది. నీకు సెకండ్ లైన్ పరువు ఏమి అయిన అర్ధం అవుతోందా" అని కొంచం గట్టి గానే అన్నాడు సాయి.
"మరి వాళ్ళ దగ్గర కాలనీ IOW (Inspector of Works) కొడుకు జయ గాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న మరి వాళ్ళ ఆఫీసు నించి చాలా వరకు విరిగి పోయిన గేట్స్, కాలనీ లో పోగు అయిన చెక్క అంతా వాళ్ళకే ఇస్తాడు. పెద్ద మంట అయ్యింది అంటే అవ్వదా " అంటూ ధర్మ సూక్ష్మం వివరించాడు హరి.
"క్రితం సంవత్సరం ట్రాక్ పక్కన తుమ్మలతో చాలానే పోగేసాం కదరా. లాస్ట్ లో సతీష్ గాడు ఇప్పిస్తా అన్న స్లీపెర్ కట్టె వచ్చుంటే మన దే సూపర్ అయ్యేది. సుడి లేదురా మనకి" అన్నాడు నిర్లిప్తంగా సాయి . ఏది అయితే ఎవ్వడు మాట్లాడకూడదు అని అనుకొన్నాడో అదే మళ్లీ మధ్యలోకి వచ్చి పడింది. నేను ఇబ్బంది గా కదుల్తు "అరె ఏమి చెయ్యనురా, అప్పటికి ట్రై చేశాను కదరా". అంటూ దీనంగా అన్నాడు. "సర్లే రా, సాయంత్రం నించి మొదలు పెడదాం. అస్సలు ఏమి చెయ్యకుండా ఉండము కదా" అని అక్కడ నించి అందరు కదిలారు.
విజయవాడ లోని సత్యనారాయణ పురం రైల్వే కాలనీ లో భోగి మంటలు అంటే అది ఒక వరల్డ్ కప్ పోటి లాగా జరుగు తుంది. కాలనీ లో ప్రతి లైన్ లో కనీసం 30-35 quarters ఉంటాయి. ఈ లైన్ ల మధ్యల్లో క్రికెట్ మ్యాచ్ పోటీలు, కొట్లాటలు, రాయభారాలు అన్నీ వీర లెవెల్ లో ఉండేవి. ఇంకా భోగి పండగ అప్పుడు మా కాలనీ లో మాత్రమే ఒక విచిత్రమైన పోటి ఉండేది. ఎలా మొదలు అయ్యిందో ఏమో కానీ, ఒక లైన్ వాళ్ళు వేసిన భోగి మంట పక్క లైన్ వాళ్ళ మంట కంటే పెద్దగా మరియు ఎక్కువ సేపు ఉంటె వాళ్ళు ఇక కాలర్ ఎగర వేసి తిరగ దానికి free license వచ్చిన్దన్నమాటే. దీని కోసం జనం దగ్గర ఉన్న చెక్క సామానులు, కాలనీ లో పెరిగిన పిచ్చి చెట్లు, ట్రాక్ వెంబడి ఉన్న తుమ్మ పొదలు ఇలా అన్ని రకాల సామాగ్రి కోసం చాల డిమాండ్ ఉండేది. మా లైన్ లో ఆడపిల్లలు భోగి మంట బాగా పెద్దగా వస్తే మమ్మల్ని చూసే అదో రకం చూపుల తో మా జన్మ తరించేది. పైగా నాకు ఈ సీజన్లో లో ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది. మా నాన్నగారు రైల్వే లో PWI (track inspector) ఉద్యోగం లో ఉండే వారు. ఆ మధ్య కాలంలో విజయవాడ డివిజన్ లో అంత బ్రిటిష్ వాళ్ళు వేయించిన రైల్వే ట్రాక్స్ లో చెక్క స్లీపెర్ లు తీసేసి సిమెంట్ స్లాబ్ స్లీపెర్లు వేసే ప్రాజెక్ట్ వర్క్స్ జరిగేవి. దాంతో ఈ చెక్క స్లీపెర్లు చాల వరకు అవతల పారేయడం లేదా auction లో అమ్మేయడం చేసే వాళ్ళు. మా నాన్నగారు ట్రాక్ ఇన్స్పెక్టర్ కావడంతో అడపా తడప కాలనీ లో వాళ్ళు వాళ్ళ quarter కి ఫెన్సింగ్ లేదా ఇంటికి గేటు వేయించు కొంటామంటే అయన లోపాయికారీ గా వాళ్ళ కి సహాయ పడే వాళ్ళు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేయించిన స్లీపెర్ కట్టెలు కావడం తో చాల నాణ్యంగా చాల సేపు మంచి మంట ని ఇస్తూ కాలేవి ఇవి. ప్రపంచం లో అందరకి స్లీపెర్ లు మా నాన్నగారు sanction చేసే వాళ్ళు కానీ మా లైన్ పరువు గురించి అయన ఎ మాత్రం ఖాతరు చేసే వాళ్ళు కాదు. మా లైన్ లో seniors భోగి ని organize చేసే అప్పుడు ఎప్పుడు మాదే పై చేయి. ఒక రెండు భోగి పండగల క్రితం కాలనీ లోకి మేము కొత్తగా రావడం, మా నాన్నగారు ఏదో మూడ్ లో కుర్రాళ్ళు ముచ్చట పడటం చూసి ఒక స్లీపెర్ కట్టి ఇవ్వడం, మా భోగి మంట కాలనీ మొత్తానికే పెద్దది అవ్వడం తో నా లెవెల్ చాలా విపరీతంగా పెరిగి పోయింది. కానీ తర్వాత ఇది ఏదో అయన ఉద్యోగానికే ఎసరు పెట్టేది గ అని అనిపించిందో ఏమో, మా నాన్నగారు ససేమిరా అన్నారు. మా టీం అంత ట్రాక్ వెంబడి పడుతూ లేస్తూ తుమ్మ మొక్కలు, ఇంకా రకరకాల చెక్క సరుకు పోగు చేసినా కూడా థర్డ్ లైన్ వాళ్ళ కాలి గోటి కి కూడా సరి పోలేదు. మా ఓటమికి మిగతా కారణాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి కొంచం కండ పుష్తి ఉన్న వాళ్ళు మా బలగం లో నించి ఇంజనీరింగ్ లో సీట్ రావడమో లేదా transfer అయ్యి వేరే ఊరు వెళ్లి పోవడమో జరిగాయి. ఇంకా చివరి నిమిషంలో మా భోగి మంట సామాన్లు కొన్ని మా రక్షణ లోపించడంతో తగ్గడం, మంట జరిగే సమయంలో ఒక strategy లేకుండా సరుకు వెయ్యడం ఇలాంటివి. కానీ ఇన్ని కారణాలు ని తుంగలోకి నెట్టి వేసి సంవత్సరం పొడుగూత సతీష్ గాడు ఇస్తా అన్న స్లీపెర్ ఇవ్వక పోవడం వల్లే మా లైన్ పరువు గంగలో కలిసింది అన్న మాట నిలిచి పోయింది.

ఈ సంవత్సరం ఎలా అయినా స్లీపెర్ సంపాదించాలి అన్న పట్టుదలతో మా నాన్నగారి దగ్గర ఈ విషయం ప్రతిపాదించా. అయన ఏ కళ మీద ఉన్నారో కానీ "చూద్దాం లేరా" అని అన్నారు. కానీ షరా మాములుగా వచ్చే సంవత్సరం పదో తరగతి. ఈ వేషాలు అన్ని మానేయాలి మరి అంటూ హెచ్చరించారు. అదే పదివేలు అని అనుకోని మా జనాలు అందరు దగ్గర పని అయిపోయినంత build-up ఇచ్చా. సాయి గాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బి తబ్బిబ్బు అయి పోయి స్పెషల్ shake హ్యాండ్ ఇచ్చాడు. హరి గాడు ఇంక చెప్పక్కర్లేదు. రామ కృష్ణ అయితే సంతోషించాడు కానీ చివర్లో "అరె !! గారంటీ ఏనా" అంటూ చిన్న డౌట్ వేలిపుచ్చాడు. "మదర్ ప్రామిస్" రా ఇస్తా అన్నారు అని మల్లి భరోసా ఇచ్చా. "అయినా కానీ మనం కొంచం సంపాదిద్దాము రా. మొన్న తుఫాన్ కి single quarters పక్కన ఉన్న చెట్టు పడి పోయింది కదా. ఇంకా కొన్ని కొమ్మలు అలాగే ఉన్నాయి. జయ గాడు వాళ్ళు వెళ్ళే లోపే మనం వెళ్లి ముక్కలు చేసి పట్టుకు వద్దాము" అని నూతన ఉత్షాహం తో చెప్పాడు సాయి. "అరె !! ఈ సారి భోగి ముందర రాత్రి ఎవ్వరు నిద్ర పోకూడదు. దొంగ నాయాళ్ళు రా వాళ్ళు. మనం కాపలా కాయక పొతే ఇంక అంతే, తెలుసా" అని హెచ్చరించాడు హరి. "ఆల్రెడీ గ మన దగ్గర బానే ఉన్నాయి రా. మళ్లీ ట్రాక్ వెంబడి వెళ్ళాలి అంటావా" అడిగాడు రామ కృష్ణ.
-- సశేషం

Monday, January 10, 2011

దేశం - నా కళ్ళతో

  1. దేశం చలి కన్నా ధర్నాలు, బంద్ లు, దీక్షలు గురించి ఎక్కువగా వణుకుతోంది.
  2. విజయవాడ సరిహద్దుల్లో ఉన్న థెర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇంకా "నార్ల తాతారావు" గారి పేరు మీదే ఉంది. ఇంకా ఎవరి కంటా పడినట్టు లేదు.
  3. "ఆరంజ్" సిన్మా లో నటించిన వాళ్ళ పేర్లు కంటే పోస్టర్ సమర్పించిన వాళ్ళ పేర్లు బాగా పెద్దగా కనపడుతున్నాయి. విజయవాడ లో సిన్మా పోస్టర్స్ సమర్పించడానికి కూడా చాల పోటీ ఉన్నట్టు ఉంది.
  4. బస్సుల్లో, ట్రైన్స్ లో జనాలు ఇదివరకు లో లాగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడం బదులు సెల్ ఫోన్ సంగీతం మత్తు లో తేలియాడుతున్నారు. హెడ్ ఫోన్స్ షేర్ కాన్సెప్ట్ చాల బావుంది.
  5. షాపింగ్ మాల్స్ లోపలి వెళ్ళే మగ వాళ్లకి సెక్యూరిటీ చెక్ తప్పదు. ఆడ వాళ్ళు బాంబులు తీసుకెళ్ళినా అడిగే వాడు లేడు
  6. చంద్ర బాబు ఆ మధ్య దేశం లో మరుగు దొడ్లు లేక పోయినా జనం బతుకు తారు కాని, సెల్ ఫోన్ లో లేకుండా ఒక్క క్షణం కూడా ఉండ లేరు అన్నది అక్షర సత్యం. తుమ్మిన వెంటనే ఎవరికీ అయినా చెప్పకుండా ఉండలేక పోతున్నారు.
  7. అమెరికా నించి ఎవరు అయిన కనపడితే, మీరు నికృష్టం మైన జీవితం గడుపు తున్నారు అని చాల మంది పని కట్టుకు చెప్పడం ఈ మధ్య ఆనవాయితి అయినట్టుంది.
  8. దేశం లోని తొంబై శాతం వనరులు జనాభా లోని ఐదు నిండి పది శాతం ధనికులు వాడుతున్నారు. ఇంకా మంచి నీరు కూడా లేని ప్రజలు కో కొల్లలు.
  9. హైదరాబాద్ లో ఇళ్లన్నీ ఇంద్ర భవనంలు - రోడ్లు అన్ని నరక కూపాలు
  10. కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వర్గ కూటమి ఎర్పడినాడు విజయవాడ నగరం అంతా నిద్ర హారాలు మని పేపర్లతోనే సంభాశించింది.
  11. ప్రజలు అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే క్రమంలో ఇరవైనాలుగు గంటలు హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూనే ఉన్నారు.
  12. దేశంలో "భక్తీ", "టి టి డి" చానల్స్ పుణ్యమా అని పదమూడు, పన్నెండు శతభ్డాలు లో జరిగినట్టు "భక్తీ" ఉద్యమం జరుగుతున్నది.
  13. పెళ్లి శుభ లేఖలలో "పెద్దలు నిర్ణయించిన సుముహూర్తం గాన విచ్చేసి వధూ వరులను ఆశీర్వచ వలసినది" అనే బదులుగా "రిసెప్షన్ కి వచ్చి మా విందు (ఒక్కొక్క ప్లేటు ఎన్ని రూపాయలో కూడా చెప్పవచ్చు) ఆరగించి, ట్రాఫ్ఫిక్ ఇబ్బందులు కాన త్వరగా వెళ్ళిపొండి" అని కూడా అచ్చు వెయ వచ్చు.
  14. ప్రవాసాంధ్రులు అంటే విపరీతమైన సానుభూతి పెరిగింది.

Sunday, January 9, 2011

Sorry Sir

సారీ సార్ !!


"Good Morning Sir, How can I help you?" అంటూ అత్యంత సన్నిహితంగా King Fisher Airlines employee మా కుటుంబాన్ని సాదరంగా తిరుపతి విమనాశ్రయములొ ఆహ్వానించింది. మా చిన్నవాడి మొదటి సంవత్సరం నిండా గానే పుట్టు వెంట్రుకలు Pittsburgh వెంకటేశ్వర స్వామి గుడి లో ఇచ్చినా, మా కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి, కొండ మీద తప్పని సరిగా Foreign Barber Shop లో కాపాడుకొన్నవి మరియు మళ్లీ వచ్చినవి అన్నీ కలిపి శ్రీవారికి సమర్పించి గోవిందాకితమైన మనస్సులతో తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి విమాశ్రయం చేరామ్. "Your boarding pass Sir, Have a nice flight" అంటూ చిరునవ్వుతో బ్యాగేజ్ ట్యాగ్స్ తో సహా చేతికి టికెట్స్ ఇచ్చింది, ఇంగ్లీష్ లో మాట్లాడే ఒక తెలుగు అమ్మాయి. భారత దేశంలో స్త్రీ ని గౌరవించే సాంప్రదాయంని మా ఆవిడ ఎంతలా ఉపయోగించుకుంటుంది అంటే, కనీసం లైన్ లో నిల్చోకుండా "నేను రావాలా" అంటూ దగ్గరలో ఉన్న కుర్చీ లో నించి సైగ చేసింది. పిల్లలు ఉన్నారన్న సెంటిమెంట్ బాగా పనిచేసి "Not needed Sir" అంటూ అంత దూరంనించే ID-Check చేసేసి చక చక పని కానిచ్చేసింది మా King Fisher ఫ్రెండ్.


మమ్మల్నిAirport దగ్గర దించిన టాక్సీ అబ్బాయి దార్లోనే దట్టంగా కమ్మిన మబ్బులిని గమనించి "దిగుతుందా సామీ, ఇమానం?" అంటూ సందేహం వ్యక్త పరిచాడు. చాలా దేశాలు మీదుగా విమానాల్లో తిరిగిన అంతర్జాతీయత అనుభవం అంతా ఉపయోగించి చాలా క్లుప్తంగా "అట్లా ఏమీ ఉండదు, సూపర్ గా విమానాలు దిగుతాయి" అని బదులు ఇచ్చాను, ఒక్క గంట క్రితం. హైద్రాబాద్ నించి తిరుపతి వచ్చే విమానం దిగిన తర్వాత మళ్లీ అదే దాన్లోనే తిరుపతి నిండి వెళ్లే వాళ్ళు వెళ్తారు. చదువుకొన్న వాడి కంటే చాకలి వాడు మేలు అన్న సామెత ని నిజం చేస్తూ, "Due to poor visibility conditions the flight from Hyderabad is unable to land on time. Expected delay timeis 15 minutes. Sorry for the inconvinience" అంటూ announcement వినపడింది. ఆ వార్తని ధృవీకరిస్తూ మరో 10 నిమిషాలు తర్వాత King Fisher అధికారి ఒకాయన ప్రయాణికుల లాం జ్ లోకి వచ్చి మళ్లీ అదే వార్త ని చిరునవ్వు తో చదివాడు. "weather is bad. Sorry" అంటూ జాలిగా చూస్తూ నిలబడ్డాడు.


ఒక 10 మంది ఔత్సాహికులు ఆయన్ని చుట్టుమిట్టి విశ్రుతంగా ప్రశ్నల వర్షం మొదలు పెట్టారు.
ప్రయాణీకుడు 1: Is flight still in air ?
King Fisher: Yes Sir. The pilot is trying his best to land the flight sir.
ప్ర 2: Ooh !! The flight still in Air ? How long it can stay like that ?
KF: Not sure sir but we are trying our best sir.
ప్ర 3: Do you know if the weather is going to improve ?
KF: Not sure sir. Sorry sir.
ప్ర 4: How come the flights can not land now when its cloudy. How they are managing in night times.
KF: Sir. There are night operations here sir. Tirupathi is a small airport which has no feclities to land the flights in the poor visibility conditions.
ప్ర 5: Can you not take us to Chennai and fly us form there ? (ఈ ప్రశ్న వినగానే నా గుండెల్లో రాయి పడింది. చెన్నై వెళ్తే "ఎలాగూ ఇంత దూరం వచ్చాం కాదండి, కొంచం shopping ఆది చేసుకొని వెళ్దాం" అనే మా ఆవిడ మొహం గుర్తు వచ్చి.)
KF: I will get back to you sir. Give me five minutes.
అంటూ "బ్రతుకు జీవుడా" అని అనుకొంటూ అక్కడ నించి జారుకొన్నాడు. నాకు నెమ్మదిగా వాతావరణ ప్రభావాలు కూడా Airlines వాళ్ళ అసమర్ధత గా ఆపాదించ వచ్చు అన్న నిజం అవగాహన లోకి రావడం మొదలు అయ్యింది. Flash back లో ఇలాంటి పరిస్థితులలొ విజయగర్వంతోAirport staff "you lost all your rights" అనే తెల్ల మొహాలు గుర్తుకు వచ్చి ఒక్క సారి ఒళ్ళు గగుర్పొడించింది. ఒక్క 15 నిమిషాలు తర్వాత మళ్లీ దీన వదానాలతో ఇందాక వచ్చినాయాన ఇంకో ఇద్దరు ని వెంట పెట్టుకొని లాంజ్ లోకి ప్రవేశించారు. మళ్లీ ప్రశ్నలు ప్రిపేర్ అయి ఉన్నారు ఏమో పెద్దగా టైమ్ వేస్ట్ చెయ్యకుండా మళ్లీ కొంత మంది వాళ్ళు చుట్టూ మూగారు.


ప్ర 1: What is the status ?
KF: Sir, the flight from hyderabad has been diverted to chennai and will arrive in Tirupathy once the weather improves Sir. Sorryfor the inconvinience Sir.
ప్ర 2: My good ness. I have a connecting flight to Mumbai. I have to catch the flight at any cost. Can you pursue the option of taking us to Chennai ? (నాకు ఈ వ్యక్తి ని ఏదో ఒకటి చేసి ఇక్కడ నించి తీసుకెళ్ళి పోతే బావుంటుందేమో అని అనిపించింది.)
KF:(అందరినీ ఉద్దేశిస్తూ) Your attention please. Any one having connecting flight to catch అంటూ బిగ్గరగా అరిచాడు. జనమధ్యం లో నించి ఆశగా చూస్తూ ఒకాయన "Yes" అంటూ బోర్డింగ్ పాస్ పట్టుకొని ఆయన్ని చేరాడు. "I have to go to Mangalore" అనిఅంటూ చుట్టూ ఉన్న వాళ్ళని ఏమిటి మీ nuicense అన్నట్టు చూశాడు.
KF: What time is your flight sir ?
Magalore: 2:00 pm KF: 2:00 pm ? Then wait here sir. No problem అని ముంబై ఆయన్ని బ్రతిమాలే పని మీద తన శక్తులు అన్నీ ఒడ్దడానికి ఉద్యుక్తుడుఅయ్యాడు.
ప్ర౩: (ఈయన ప్రవాసాంధ్రుడు) Excuse me sir. In the case of of flight not making to Tirupathy, what is the alternative ?
KF: Sir, we will arrange alternative sir. Definitely sir. Sorry for the inconvinience sir. ప్రవాసాంధ్రుడు: Exactly !! What its going to be ?
KF: Sir, weather is improving sir. There will be no problem sir. (ఆయన ఒక్క దీర్ఘ నిట్టూర్పు చుట్టూ పక్కల వాళ్ళకి కూడా వినపడింది.)
KF: Sir, we will arrange alternative sir. We will fly every one in Indian Airlines flight which is scheduled at 1:30 pm sir. అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనిపిచ్చింది నాకు. కానీ వీళ్ళ విమానంకి ఉన్న ప్రాబ్లమ్ మరి Indian Airlines వాళ్ళకి ఉండదా ? ఇంకా అందరినీ ఆ flight లో పట్టించగలరా ? ఇలా ప్రశ్నలు నా మనస్సు లో ఉదయించినా, ప్రవాసాంధ్రుడు ఏమీ మాట్లాడక పోయే టప్పటికి నాకు ఎందుకులే మౌనంగా ఉంది పోయాను .ఇప్పుడు అసలు అయిన ప్రశ్న ఒక మూల నించి వచ్చింది. "Are you not going to provide break fast and coffee ?" అని.


KF: We will try our best sir. Just give us 10 minutes sir. మళ్ళీ ఈ ప్రశ్న ని అడిగిన వారికి కృతజ్ఞతలు మనస్సు లోనే తెలుపుతూ వాళ్ళు బయట పడ్దారు. కొంత సేపు అయిన తర్వాత ఇంగ్లీష్ లో మరియు తెలుగు భాషల్లో ఇంకో ప్రకటన వినపడినది. "Due to bad weather, the flight from Tirupathy and Hyderabad is delayed. King Fisher passengers will be provided with break fast. Please proceed to Airport Canteen". మగ పెళ్లి వాళ్ళు విడిది నించి కదిలి నట్టు గా అందరు కొంచం హడావుడి గా కాంటీన్ వైపు వెల్ల సాగారు. ఇంతలో దీనికి అంత మూల కారణం అయిన ప్రయాణికుడు, Airlines సిబ్బంది కనపడితే "Are you not going to provide coffee" అంటూ చాలా అప్‌సెటింగ్ గా అడిగాడు. అప్పటికే బిక్కచచ్చి ఉన్న ఆయన "Certainly Sir" అంటూ బదులు ఇచ్చాడు.OK. The announce did not mention about coffee" అని రుసరుసలడాడు. మీరందరూ ఊహించిన విధంగానే ఆయన "Extremely Sorry Sir" అంటూ బదులు ఇచ్చాడు.


ఒక అయిదారుగురు King Fisher వాళ్ళు క్యాంటీన్ దగ్గర నిల్చోని విడిది కి విచ్చేసిన పెద్దలకు ఏమీ కావాలో అడిగి మరి మేపడం మొదలు పెట్టారు. ఇంతలో ఇన్దాకటి కాఫీ లవర్ కొత్తగా Pringles కావాలన్న మనస్సులు ఉన్న కోర్కె ని వేలి పుచ్చాడు. "సార్. ఆది 150/- సార్". అంటూ బేలగా. వంకరగా నవ్వి ఆయన "తప్పదు" అన్న expression ఇచ్చాడు మన కాఫీ లవర్. ఓటమి అంగీకరించి ఒక pringles డబ్బా ని అందిచాడు, కింగ్ ఫిషర్ ఏర్‌లైన్స్ స్టాఫ్ కుర్రాడు.


ఈ జనాభా ని ఒక గంట పాటు మేపిన తర్వాత మొత్తానికి చెన్నై కి మళ్ళిన విమానం తిరుపతి కి వస్తోంది అన్న శుభ వార్త దావనలమ్లా ఏర్‌పోర్ట్ అంత పాకింది. క్యాంటీన్ వాళ్ళు తప్ప మిగతా అందరు హర్షం వ్యక్తపరిచారు. (కాఫీ లవర్ ని గమనించలేదు). ఇంతలో నా ఇండియా మొబైల్ నంబర్ కి మా నాన్నగారు ఫోన్ చేసి "ఏరా !! తిరుపతి అంతా మేఘ వృతం - విమానాల రాక పోకలకి తీవ్ర అంతరాయాం అని టీవీ-9 లో స్క్రోలింగ్ వస్తోంది. ఏమీ అయ్యింది ?" అని అదుర్ధా గా అడిగారు. విషయం అంతా ఎక్స్‌ప్లేన్ చేసి మేము హైద్రాబాద్ చేరే వరకు టీవీ-9, టీవీ-5, టీవీ-1 వగైరా చ్యానెల్స్ చూడొద్దూ అని గట్టిగా చెప్పాను.


చివరగా మరోసారి KF వచ్చి కాపాడిన వారికి సారీ చెపుతూ ఉంటే ఇక ఉండబట్ట లేక అడిగాను. "ఏమండీ !! ఈ వెదర్ ప్రాబ్లమ్ ని మీరు సృస్టించారా ?" అని. "No Sir. Certainly No Sir" అంటూ బదులు ఇచ్చాడు ఆయన. "మరి సారీ అరిగే దాకా సారీ ఎందుకు చెప్తున్నారు అండీ" అని మళ్లీ అడిగా. "people do not understand sir. thats why we tell sorry sir" అని ఇక వెళ్ళరా అన్నట్టు గా చూసాడు అతను.


(ఈ మధ్య ఇండియా ప్రయాణం లో ఎదురు అయిన సంఘటన. ఎందుకో తెలియదు కానీ ప్రయాణీకుల స్తోమత ని గుర్తుఏరిగి కస్టమర్ సర్విస్ అందిస్తున్నారు అన్న నిజం తెలిసింది. మామూలు బస్సుల్లో లేక ట్రేన్స్ లో ఎవడు ఏమీ పట్టించు కోడు కానీ ఇలా కొంచం డబ్బు ఖర్చు పెట్టిన వాడికి అన్వరసమైన మర్యాద. పైగా చాలా మందికి ఈ ప్రపంచం లో తమకి తెలియని విషయం లేదు, అన్న విషయం ఈ సంధర్భాలు లో గమనించ వచ్చు.)