Thursday, March 26, 2020

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

సాధారణంగా, మన సంప్రదాయాల్లో మానవ శ్రేయస్సు కోసం ఏర్పరచబడిన ఏ పూజలు, స్త్రోత్రాలు ఇతరత్రా బహుశా ఋషిప్రోక్తం లేదా స్వయానా భగవంతుని నించి అందించబడినవి. కొన్ని ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల సంభాషణల నించి గ్రహించబడ్డవి. ఇదే విష్ణుసహస్ర నామ పారాయణ ఫలశృతి భాగంగా

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యతే  పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.


శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

వేదాలు సరేసరి. అవి అపౌరుషేయాలు. సృష్టికి ముందే ఈ సృష్టికి మూలమైన స్థితి కారక శక్తి ద్వారా మనకి అందించబడ్డాయని మనం విశ్వసిస్తున్నాము. కొన్ని ఇతిహాశాంతర్గతంగా మనకి అందించబడ్డాయి. ఉదాహరణకి, రామాయణ ఇతిహాసం ద్వారా మనకి సుందరకాండ పారాయణ, ఆదిత్యహృదయం ఇత్యాదివి మానవ శ్రేయస్సు నిమిత్తం నిక్షిప్తమైనాయి. లేదా మానవాళి నిమయామావళిని నిర్దేశించే భగవద్గీత మహాభారతంర్గతమైనదే. మరికొన్ని, మనం వ్రతాల్లో, పూజల్లో "సౌనకాది ముని సంవాదే" అని ప్రస్తావించబడడం కూడా తరచూ గమనిస్తూ ఉంటాం.  అయితే విష్ణుసహస్రనామాలకి మాత్రం ఒక విశిష్టత ఉంది. ఇది భగవంతుని సమక్షంలో, అయన ఆజ్ఞా ఆదేశలమేరకు మేరకు ఒక భక్తుడు ఇంకో భక్తుడికి ఉపదేశించబడినది. 

అయితే ఇక్కడ ఈ సంఘటనని మనం కొంచం విస్తారంగా ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంత గొడవెందుకు, కృష్ణుడే స్వయానా ఇది భగవద్గీత లాగానే ఆయనే ఎవరోఒకరిని ఎంచుకొని ఉపదేశం చేస్తే పోయేది కదా అని. అయన ప్రత్యక్షంగా నిలబడి భీష్ముడి చేత స్త్రోత్రం చేయించుకోవడం ఎందుకు? ఇవన్నీ మనకి బాగా అర్ధం అవ్వాలి అంటే, మనకి కృష్ణుడి అవతారం, దాని యొక్క మూల ఉద్దేశ్యం బాగా అవగతం అవ్వాలి. 

కృష్ణావతారం మిగతా అవతారాలకంటే చాలా భిన్నమైనది. ఉదాహరణకి రామావతారంలో శ్రీరామచంద్రుడు, కేవలం మానవుడి గానే పూర్తిగా వ్యవహరించాడు. అయన తనకేదో దైవాంశ, అద్భుత శక్తులు ఉన్నట్టు ఎక్కడా కనపడదు. రావణ సంహారం తర్వాత దేవతలు ప్రత్యక్షమై ఆయన్ని విష్ణుమూర్తి అవతారమని స్తుతిస్తూ ఉంటే, "అహం రామస్య దశరధ పుత్రాణాం" అనే సమాధానమిస్తాడు. అయితే కృష్ణుడు అలా కాదు. తన అవతార ఆవిర్భావం, సమాప్తం అంతా అయన అధీనమే అని స్పష్టంగా తెలియపరుస్తాడు. మనం సినిమాల్లో చూసుంటాం. చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. ఇది పూర్తిగా అసంబద్దంగాను, నమ్మశఖ్యముగా ఉండదు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు.

అయితే కృష్ణుడు తన అవతారం మొత్తం తాను వచ్చిన ప్రయోజనం నెరవేర్చే దాని కోసరం చాలా బాధ్యత పడ్డాడు.  తన చిన్నతనంనించే భగవద్గీత సారాంశం ఉపదేశించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే వినేవాళ్ళకి గురి కుదరాలంటే తానెవరో తెలియడం ముక్ష్యం. కృష్ణలీలల పేరిట మహిమలు ప్రదర్శించాడు. అయినా, నందనవనంలో అయన అంటే మూఢ భక్తి పెరిగిందే తప్ప వేదోపనిషత్తుల సారాంశమైన విజ్ఞానం అందుకొనే పరిపక్వత అగుపించలేదు. ఇకపొతే ఆ కాలంలో ప్రాచుర్యంలో లో రాజగణం ఆయన్ని అహంకారంతో ఒక సామాన్య యాదవుడు గానే చూసింది.

మహాభారతం లో మొట్టమొదట కృష్ణుడు పాండవులని కలవడం ద్రౌపది స్వయంవరంలో. అయన పెద్ద దాపరికాలు లేకుండా, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుని "మీరు ఎన్ని కష్టాలు పడ్డరయ్యా ! పాపం లక్క ఇళ్ల తగాలాపడినప్పుడు నానా అవస్థలు పడి తప్పించుకొన్నారటగా. తర్వాత ఏకశిలా నగరం లో యయావరం చేసికోవాల్సి వచ్చిందికదా" అంటూ ఎటువంటి మొహమాటం పడకుండా పరామర్శిస్తాడు. ధర్మరాజు మొదట ఆశ్చర్యపడినా, కృష్ణుడి తన తమ్ములతో సహా దైవాంశ పురుషుడిగానే గుర్తించి ,దర్శించి శరణాగతి చేస్తాడు. అయితే భక్తుడికి పరీక్షలు తప్పవు. ఒక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!

అయన భక్తుని ఆర్తికి మురిసిపోయాడు. "అయినను పోయి రావలయు హస్తినకు" అంటూ రాయబారానికి సిద్దమయితే, "మీరు వెళ్తారా ? మీరే వెళ్తారా ? నాకు కుటిలాత్ములైన కౌరవులమధ్యకు మీరు వెళ్లడం నాకు ఎంత సుతరామూ ఇష్టం లేదు" అని దిగులు పెట్టుకొన్న ధర్మరాజు ప్రేమ కు లొంగి పోయాడు. అలాగే ఆర్త రక్షణ కోసరమై, ఆడిన మాటని కూడా తప్పాడు. "ఆయుధం పట్టను" అన్న పెద్ద మనిషి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగా"  తీరున బీష్మునిపై ఎగసిన సన్నివేశం భక్తా వేశా  పరాకాష్ట. తనతో సాన్నిహిత్యం చేసి అరివీర పరాక్రమ వంతుడు, ధీరుడు అయిన అర్జునికి, తాను అవతారమంతా ఎదురుచూసిన మానవ శ్రేయస్సు, మనుగడ కోసరం నిర్దేశించ బడిన సందేశం భగవద్గీత రూపం లో అందించాడు. అయితే ఇంత విజ్ఞానం అంధింపపడిన తర్వాత కూడా, అభిమన్యుని మరణం తర్వాత నిర్వీర్యమైన అర్జునిని చూసి చాల నిరుత్సాహ పడ్డాడు. నీవు భగవంతుని మీద భారం వేసి కర్తవ్య దీక్ష నిర్వర్థించమనీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా, కరుణ్ణి నిర్జించడానికి ధర్మా ధర్మాల తర్కం చేస్తున్న అర్జునిని చూసి ఆశ్యర్యపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు అది మానేసి తర్కం చేయడం చూసి విచారపడ్డాడు. బహుశా మానవాళి, వేదసారమైన భగవద్గీత వంటి గ్రంధసారాంశం గ్రహించడానికి సిద్ధంగా లేదేమో అని సంశయ పడ్డాడు.

మహాభారతయుద్ధం అనంతరం జరిగిన బంధుజన ప్రాణ నష్టం ని కళ్లారా చూసిన ధర్మరాజు  తీవ్ర మనః వైక్లబ్యము చెందుతాడు. యుధిష్టరుడు, అజాత శత్రువు, ధర్మానికి ప్రతీకగా కొనియాడబడ్డ అంతటి ధర్మరాజు విషాద యోగానికి గురికాబడతాడు. స్వస్తిర ధర్మ రాజ్య పాలన జరపడాలన్న కాంక్షతో శ్రీ కృష్ణుడు ధర్మరాజు ని అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం కోసరమై ఎదురుచూస్తున్న భీష్ముడి దగ్గరకి తీసికెళ్ళతాడు. "సర్వజగత్తునకు మూలకారణము, అనాదిమధ్యలయుడు, సమస్త జగములు నీలోనే లీనమైన ఉన్నవాడివి కృష్ణా, నీకు తెలియని ధర్మములు నేను ధర్మజునికి ఎలా బోధించగలనని" భీష్ముడు కృష్ణుడి అడగగా, "ఒక భక్తుడికి భగవంతుని పట్ల  ఆర్తి, ప్రేమ ఆ భక్తుని ద్వారానే తెలపబడాలని" విష్ణుసహస్ర నామ ఆవిష్కరణకి ఆదేశిస్తాడు.

కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం 
స్తువంతః కామ్ కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం 
కోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః 
కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ 

సమస్త సృష్టిలోకెల్లా సర్వ శక్తిమంతుడైన భగవంతుడెవ్వడు ? ఎవరి శరణాగతి మనం కోరవలెను? ఎవరిని ప్రార్ధించంవల్ల మానవాళి కి శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి? అన్నిటి కన్నా ఈ ధర్మం గొప్పది ? ఎటువంటి జపం చేయడం వల్ల, ఈ చావు పుట్టుకల సంసార బంధనాల నించి విముక్తి కలుగుతుంది... అంటూ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా, సమస్త జగత్తునకు విష్ణు సహస్ర నామావళి, భీష్ముని ద్వారా అందించ బడింది

Thursday, January 30, 2020

దైవం మానుష్య రూపేణా

దైవం మానుష్య రూపేణా 

*********************************************************************************
నేను అమెరికా మొదటిసారి వస్తున్నప్పుడు, పక్కన కూర్చున్న ఒక వయస్సు మళ్ళిన సిక్కు వ్యక్తి మాటలు కలుపుతూ, "ఎన్నాళ్ళు కోసం ఈ దేశానికీ వస్తున్నావని" అడిగాడు. "రెండు ఏళ్ళకి మించి ఒక్క రోజు కూడా ఉండబోనని" చెప్పినప్పుడు నా యొక్క దృఢ సంకల్పాన్ని లెక్క చేయకుండా తన గుబురు గడ్డం చాటునుండి పక్కున నవ్వాడు.  సరేలే. దారిన పోయే దానయ్య ఈయనతో నాకెందుకని నా మానాన నేను ఉండిపోయాను. జీవితం కొంచం ఎక్కువగా చదివేడో ఏమి పాడో, నా విషయమేమి కర్మ, నాలాంటి కొన్ని వేల, లక్షల మంది ఆ రెండు సంవత్సరాలు ఎప్పుడు అవుతాయా అనుకొంటూనే శేష జీవితం గడిపేస్తున్నాము.

అయితే, ఇక్కడి ప్రవాసులుకు అన్నిటికన్నా దుర్లభమైన అనుభవం ఏంటంటే, అకస్మాత్తుగా తన వారిని స్వదేశంలో శాశ్వతంగా కోల్పోవడం. విషయం తెల్సిన వెంటనే, చుట్టూ ఉన్న స్నేహితులు పెట్టె సర్ది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి, విమానాశ్రయం వరకు వచ్చి దిగపెట్టడం వంటివి చక చక జరిగి పోతాయి. కాకపోతే 24 గంటలు పాటు, ఈ బాధని ద్రిగమింగుతూ ప్రయాణం చేయడం, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఎట్లా చేయగలగడం అన్న విషయం ఆలోచిస్తేనే చాల కష్టం గా అనిపిస్తుంది. నా ఒక మిత్రుడు, తన తండ్రి కోల్పోయి ఇదే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, "అస్సలు ఈ అబ్బాయి ఇండియా వరకు క్షేమంగా వేళ్ళగలడా" అని చాల భయపడ్డాను. అతను, న్యూయార్క్ లో ఇండియా విమానం ఎక్కే వరకు సమాచారం అందింది కానీ, మిగతా విషయాలు అన్నీ మళ్ళీ అతను తిరిగి ఒక నెల తర్వాత వచ్చే వరకు తెలియలేదు. 
న్యూయార్క్ లో ఎయిర్ పోర్ట్ నా పాటికి ఒక మూల కూర్చొని ఉంటె, ఎక్కడ నిండి వచ్చాడో తెలియదు ఒక పాకిస్తానీ ముస్లిం వ్యక్తి వచ్చి నా పక్కనే కూర్చొని, "ఆప్ బడే దుఃఖే లగ్ రహే హై" అంటూ మాట కలిపేడు, అంటూ నా మిత్రుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవాన్ని  నాతో పంచుకున్నాడు. చనిపోయిన తన తండ్రి వయస్సు ఉన్న ఆ పాకిస్తానీ వ్యక్తి, ప్రయాణం మొత్తం, ఈ అబ్బాయిని సముదాయిస్తూ, దారి పొడుగూతా తనకు సాధ్యమైనంత స్వాంతన కలిగిస్తూ, దుబాయ్ చేరిన తర్వాత లాహోర్ వెళ్లాల్సిన తన విమానం లో వెళ్లాడని చెప్పుకొచ్చాడు, నా మిత్రుడు. ఆయనతో మాట్లాడుతుంటే అచ్చం మా నాన్న తో మాట్లాడినట్టు ఉందంటే నమ్మవు నివ్వు.. బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ భగవంతుడే అయన రూపంలో వచ్చేడని అనిపించిందంటే నమ్ము సత్యా..."
*********************************************************************************
అమ్మా!! రాజా రాజేశ్వరీ !! చాల కష్టాలు పడ్డాము తల్లీ !! ఎట్లా అయినా మా ఆయనకి ఈ ఇంటర్వ్యూ గట్టెక్కే మార్గం చూపించు తల్లీ, అంటూ తనకి చినప్పటినించీ చిర పరిచితురాలాయన ఏకైక దైవం, ఆ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మకి త్రికరణ సిద్ది గా నమస్కరించింది, శ్రావణి. దాదాపు 40 ఏళ్ల క్రిందటి మాట. మెకానికల్ ఇంజనీర్ బ్యాక్ గ్రౌండ్ తన భర్త కి, అమెరికా లో చదువు అయిన తర్వాత మొదటి ఉద్యోగ ప్రయత్నం, కొంచం కష్ట తరమైందనే చెప్పాలి. ఇండియా లో చిన్న పల్లెటూరు నించి వచ్చిన శ్రావణికి ఎటువైపు చూసినా తనకి మాట సాయం చేసే వాళ్ళు ఎవరూ కనపడడం లేదు. ఊసుపోక, పక్కెనే ఉన్న లైబ్రరీకి చేరి, అన్య మనస్కంగా అక్కడ పడిఉన్న మ్యాగజిన్ లు తిరుగావెయ్యడం చూసి, కొద్దో గొప్పో పరిచయం ఉన్న లైబ్రేరియన్ మేరీ, " వాట్స్ రాంగ్ శ్రావణి ?? ఈస్ ఎవరీ థింగ్ ఆల్రైట్??", అంటూ అడిగింది. ఈవిడ కెందుకొచ్చిన గొడవ అనుకొంటూ, తన ఆయనకి లోకల్ కంపెనీ లో రేపే ఇంటర్వ్యూ ఉందనీ, ఎవరైనా మెకానికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళ రిఫరెన్స్ ఉంటే బావుంటుందని అనుకొంటున్నాని చెప్పింది.  "రియల్లీ.. లెట్ మీ సి ఇఫ్ పాల్  కాన్ హెల్ప్ యు.." అని తన ఫోన్ నెంబర్ మరియు అడ్రస్ తీసికోంది మేరీ.
ఈవిడ ఎప్పటికి కుదిరి, ఆ పాల్ అన్న ఆయనికి చెప్పాలి అనుకొంటూ, నెమ్మదిగా తన అపార్టుమెంట్ కి చేరింది. తనకి చిన్నప్పటినించి చేత అయిన, దుర్గ, లక్ష్మి అష్టోత్తర నామావళి మననం చేసికొంటూ ఉండగానే, ఒక గంట తర్వాత ఇంటి ముందర డోర్ బెల్ మోగింది. ఎవరా అనుకొంటూ తలుపు తీయగానే, ఒక క్రిస్టియన్ పాస్టర్ తెల్ల గౌన్ వేసికొని, "I believe you are thinking of me" అంటూ నవ్వుతూ అడిగాడు. ఈయన గురుంచి నేను ఆలోచించేదేమిటని అనుకొంటూ అసలు సంగతి ఆరా తీస్తే, ఈయన్ని లైబ్రేరియన్ మేరీ పంపించందని మరియు ఈయన పాస్టర్ అవ్వక ముందర తన అయనకి ఎక్కడైతే ఇంటర్వ్యూ ఉందొ అక్కడే ఒక పెద్ద మెకానికల్ ఇంజనీర్ గా పని చేసాడని తెల్సింది. అయన, తన భర్త resume తీసికోవడం, అందులో తగిన చేంజెస్ చేయడం, రిఫరెన్స్ ఇవ్వడం తర్వాత ఉద్యోగం లో చేరడం చక చక జరిగి పోయాయి.
బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ భగవంతుడే పాల్ రూపంలో వచ్చేడని అనిపించిందంటే నమ్ము సత్యా..."
*********************************************************************************
"స్వామి నాథన్ గారు అనడం అయితే అన్నారు గాని.. అదేమన్నా సాధారణమైన విషయమా.. మనలాంటి వాళ్ళు పని అయితే చేస్తాము కానీ గుడి కట్టడం అంటే మామూలు విషయమా", ఒక శనివారం వాలంటీర్స్ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ నించి  డ్రైవ్ చేస్తూ మనోజ్ తన పక్కనున్న స్నేహితుడి తో అన్నాడు.

"ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు" అన్న సామెత ఒకప్పటి సంగతేమో. ఇవ్వాళ రేపు, ఈ రెండూ కొద్దో గొప్పో డబ్బు ఉన్న వాడికి, లోన్స్ ఇత్యాది వంటివి జోడించుకొంటే ఎక్కడైనా సుసాధ్యాలే.. అయితే అమెరికాలో కొన్ని చిన్న ప్రదేశాల్లో సంకల్ప బలం ఎంత గొప్పదైనా కూడా గుడి కట్టడం అన్న విషయం చాలా సందర్భాల్లో, "భగీరథ" ప్రయత్నమే అవుతుంది.

"చూద్దాము బాసు... నివ్వు అన్నట్టు ఇది అంత ఈజీ పని కాదు" అనుకొంటూ  తమ ఇళ్ళకి వెళ్లారు. "ఇంతింతై వటుడింతై" అన్నట్టు, శంకు స్థాపన, భూమి పూజ, నిధుల సేకరణ ఇత్యాది పనులు చక చక సాగి పోయాయి. మొదటి నించి గుడి పనుల్లో చురుగ్గా ఉన్న మనోజ్ అదే సంవత్సరం, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సంవత్సరం మూడు నాలుగు సార్లు ఇండియా ప్రయాణం పడటంతో,  గుడి కోసం తాను విరాళంగా ఇద్దామనుకొన్న డబ్బు ఇట్టే ఖర్చు అవ్వడం కూడా జరిగి పోయింది.

"మనోజ్.. మా కంపెనీ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి వచ్చిందోయ్. కానీ ఆ  skill set ఇవ్వాళ రేపు దొరకడం చాల కష్టం. దాదాపు 20 ఏళ్ల క్రితం అందరూ వదిలేసిన వర్క్. నీకు ఎవడైనా తెలిసిన వాళ్ళుంటే చెపుతావా" అంటూ తన పరిచయస్తుడు ఒకడు ఎదో మాటల సందర్భంలో అన్నాడు. వివరాలు కనుక్కొంటే, తాను ఎప్పుడో చెన్నై లో పని చేసినప్పటి ప్రాజెక్ట్ లాంటిదే అవడం వల్ల ఆ పని చేయడం పెద్ద కష్టం అవ్వలేదు. అమ్మవారి గుడి కి తాను మొదట ఎంత విరాళం ఇద్దామనుకొన్నాడో సరిగ్గా అదే మొత్తం ఈ ప్రాజెక్ట్ లో సహాయ పడ్డం ద్వారా మనోజ్ కి ముట్టింది.

బహుశా "దైవం మనుష్య  రూపేణా" అంటే ఇదేనేమో. "ఆ అమ్మవారే  అతని రూపంలో వచ్చి తన పని చేయించు కొందేమో సత్యా..."
*********************************************************************************
తమిళ్ బ్రాహ్మిణ్ అబ్బాయి కష్టం లో ఉంటే పాకిస్తానీ ముస్లిం వ్యక్తి వచ్చి మాట సాయం చేయడం యాదృచ్చికమా లేదా ఆ భగవంతుడికి సరిగ్గా ప్రాబ్లెమ్ అర్ధం అవ్వలేదంటారా?

దుర్గమ్మ ని పూజిస్తే క్రిస్టియన్ పాస్టర్ ప్రత్యక్షం అవ్వడం ఏంటండీ!! దేవుడి కంప్యూటర్ లో వైరస్ ఏమైనా ఉందంటారా?

అమ్మవారి గుడికి కంప్యూటర్ ప్రాజెక్ట్ కి కనెక్షన్ ఏంటో మరి.. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక...
*********************************************************************************



Wednesday, February 27, 2019

సినిమా ప్రయోగాలు


నలుగురు తెలుగు వాళ్ళు కలిశారంటే మామూలుగా మాట్లాడుకొనే టాపిక్ "సినిమా". మనకి చూడ్డం కన్నా విశ్లేషణ మీదే ఆసక్తి ఎక్కువ అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదన్న నా అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తారు అనుకొంటా. విళంబి నామ సంవత్సరంలో మన తెలుగు సినిమా రంగం లో కొన్ని జరిగిన కొన్ని ప్రయోగాలని స్పృశిద్దామని ఒక చిన్న ప్రయత్నం, ఈ శీర్షిక !!

రంగస్థలం: మన సినిమాల్లో మామూలుగా హీరో అసాధ్యమైనది అంటూ ఏమీ ఉండదు. అయన చాల చురుగ్గా ఆలోచించ కలడు, వందల కొద్దీ కండలు తిరిగిన మగ ధీరులును ఒక్క చిటికన వేలుతో మట్టి కరిపించ గలడు, అయన శక్తి సామర్ధ్యాలు అత్యంత నిపుణులు అయిన వైద్యులు కూడా ఒక అంతు పట్టని చిదంబర రహస్యం అనే మూస నైపధ్యం లో కొన సాగుతున్న సగటు ప్రేక్షకులకు, కొంచం విన్నూత్నంగా వినికిడి శక్తి లేని ఒక పల్లెటూరి యువకుడు కూడా ఈ పాత్ర పోషించవచ్చు అని చేసిన ఈ ప్రయత్నం నిజంగా హర్షించ దగినదే !! గోదావరి జిల్లా మాండలీకంలో సాగిన ఈ 1980 దశాబ్దంలోని గ్రామీణ సంఘర్షణ కధా చిత్రం కొంత కొత్తగా వైవిధ్యంగా అనిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదనుకొంటా !! ముక్ష్యంగా మిగతా విషయాలు ఎలా ఉన్నా, గోదావరి యాస అందులోని ప్రత్యేకతలని ఈ చిత్ర కధా నిర్మాణం లో ఈ దర్శకుడు చాల నేర్పు గా వాడుకొన్నాడని నా వరకు కలిగిన అభిప్రాయం

మహానటి: మన తెలుగు చిత్ర పరిశ్రమ లో గత కొన్నీ సంవత్సరములగా "ఇక్కడ అన్నీకృత్తిమంగా తయారుచేయబడగలవు" అనే టాగ్ లైన్ తో నడుస్తున్న తరుణంలో, "సహజత్వం" అనే పదాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ తెర మీద కొన్ని తరాల ప్రేక్షలకులను మంత్రం ముగ్దులను చేసిన "మహా నటి" సావిత్రి తెర వెనుకాల జీవితాన్ని మరల అందరికి పరిచయం చేసిన అత్యంత అద్భుతమైన ప్రయత్నమే ఈ చిత్రం. హిందీ చలన చిత్ర పరిశ్రమ లో ఈ "బయోపిక్" ఒరవడి కొనసాగుతున్నాకానీ, తెలుగులో ఈ మొదటి ప్రయత్నం కొంచం సాహసోపేతమే అని చెప్పవచ్చు. ఎందు చేతనంటే మన తెలుగు చిత్ర ప్రేక్షకుల అంచనాలు చాల భిన్నంగా ఉంటాయి. ఒక రెండున్నర గంటలు పాటు ఒక వ్యక్తి యొక్క కథ చెప్పడంలో చాల నేర్పు, నైపుణ్యం కూడిన ప్రయాస. మహానటి సావిత్రి జీవనం అందులో ఉద్దాన పతనాలు, ఎదుర్కొన్న ఒడిదిడుకులు, మానవీయ సంబంధాలు ఇత్యాది నైపద్యాలు నా ఉద్దేశ్యంలో అత్యంత నైపుణ్యంగా తెర కెక్కించారని నా అభిప్రాయం.

C/O కంచరపాలెం: నాలుగు ఉప నదుల ప్రవాహం, మలుపులు, మజిలీలు కోనసాగుతూనె చివరికి ఒకే చోట చేరడం, ఒక అత్యద్భుతమైన ప్రయత్నం.  ఎప్పుడైతే ఒక సగటు ప్రేక్షకుడు సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ కధ గురించి ఆలోచిస్తాడో, ఆ చిత్ర దర్శకుడి ప్రయత్నంలో పూర్తిగా కృతకృత్యుడు అయ్యాడనే మనం భావించ వచ్చు. ఈ సినిమా లో ప్రత్యేకం ఏంటంటే, ఒక నాలుగు ప్రేమ కధలు తాలూకు పాత్రలు ప్రేక్షకుని మనసు పూర్తిగా కట్టివేయగా, చివర ఈ నాలుగు మార్గాల కూడలి ఒకటే అంటూ ముగింపు పూర్తిగా అనూహ్యం. సాధారణంగా మన తెలుగు సినిమాలు ఈ మధ్య కొంచం వైవిద్యం కూడిన కథనైపథ్యం తో ఉంటే, అవి దిగుబడి ఉత్పత్తులు అవుతున్నాయి. కాగా, ఈ చిత్రం చిన్నదైనా పూర్తి సహజత్వాన్ని ఆపాదించుకోవడం అభినందనీయం.

2018 లో చాల మంచి సినిమాలు విడుదల అయ్యి అవి మన అందరి మనస్సులు చూరకొన్న మాట వాస్తవమే అయినా, విన్నూత్నంగా జరిగిన మొదటి ప్రయత్నాలనే ఇక్కడ స్పృశించబడినవి. 

వాజపేయి

సంస్కృతం లో "వాజపేయి" అనగా వేదములు నిర్వచించిన మహా యజ్ఞాలను జరిపిన వాడు అని అర్ధం. ఇటీవల పరమ పదించిన అటల్ బిహారీ వాజపేయి గారు ఏ విధం గా సార్ధక నామధేయులు అయ్యారో మనం ఇక్కడ మననం చేసికొనే ప్రయత్నం చేద్దాం

  • వాజపేయి  తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటిని జాతి ప్రయోజనాలకు సదా దోహద పడే యజ్ఞం తన జీవితం యావత్తు 93 సంవత్సరాల పాటు చేశారు
  • శత్రువు వెన్ను పోటు పొడిచినా చెదరక సైనిక స్థయిర్యాన్ని ప్రోత్సహిస్తూ కార్గిల్ విజయ పోరాట యజ్ఞాన్ని ముందుండి నడిపించారు
  • దీర్ఘ కాల ప్రయోజనాలు దృష్టి లో ఉంచుకొని ప్రపంచానికి ఎదురొడ్డి భారత దేశం పరమాణు శక్తి గా నిలిపే క్రమం లో మహోత్కృష్టమైన యజ్ఞాన్ని నిర్వహించారు
  • "వసుదైక కుటుంబం" భారత దేశం ప్రతిపాదించిన  సిద్ధాంతం అని ఐక్య రాజ్య సమితి లో చాటించి సౌభ్రాతుత్వ యజ్ఞాన్ని రాజకీయాలకి అతీతంగా నిర్వహించారు
  • 1971 యుద్ధం లో చారిత్రాత్మక విజయం సాధించిన ప్రధాని ఇందిరా గాంధీ ని "దుర్గ" గా అభివర్ణించి రాజకీయ అతీత నైతిక యజ్ఞం నిర్వహించారు 
  • సరిహద్దు లకు హద్దులు చాటుతూ మొదటి సారి ఢిల్లీ నించి లాహోర్ కి బస్సు ఏర్పాటు ద్వారా ప్రయత్న లోపం లేని శాంతి యజ్ఞాన్ని చేశారు 
  • 13 విభేద భావ జాల పార్టీలను ఏకత్రాటి పై నడిపి సమైక్య యజ్ఞాన్ని అయిదు సంవత్సరాలు పాటు నడిపించారు
  • రాజకీయ వేత్త, హాస్య చతురత, కవి, సమయస్ఫూర్తి, అంకిత భావం, సిద్ధాంత ప్రమాణ వ్యక్తిత్వం ఇలా తన జీవితం అంతా బహుముఖ ప్రజ్ఞ యజ్ఞాన్ని నిరాటంకంగా నిర్వహించారు
ఈ విధంగా అటల్ బిహారీ వాజపేయి తన జీవనాన్నిదేశ ప్రయోజన యజ్ఞంలో పూర్ణాహుతి గావించారని అనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు

సీతా రామ దాంపత్యం


మరికొద్ది రోజుల్లో మనమందరం శ్రీ రామ నవమి జరుపుకోబోతున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ "సీతా రామ కళ్యాణం" గురించి కొంచం వివరణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పండగ భారత దేశంలో మారు మూల గ్రామాలలో వివిధ పద్ధతులు ఆచారాలకు అనుగుణంగా జరప బడుతున్నది. ఎప్పుడో త్రేతా యుగం లో జరిగిన సీతా రాముల కల్యాణం ఇంకా ఎందుకని చేస్తున్నాం అన్న తర్కాలోచన లేని రోజుల్లో పండగ గుర్తులు ఏవయ్యా అంటే రేడియో లో విన్న భద్రాచలం లో కళ్యాణ ప్రత్యక్ష ప్రసారం, గుళ్ళో మిరియాలు వేసినా తియ్యగానే ఉండే పానకం !! ఒక్క సారి అసలు త్రేతా యుగం అనేది ఎప్పుడు హిందూ కాల  మానం ప్రకారం ఎప్పుడు అయ్యింది అని ఆలోచిస్తే, సీతా రామ కళ్యాణం రమారమి ఒక 2.6 మిలియన్ సంవత్సరాలు జరిగి ఉండచ్చు అన్న నిజం తెలిస్తే మనమందరం ఆశ్చర్య చకితులు అవకమానము. అయితే ఇన్నీ సంవత్సరాల తర్వాత కూడా మనము ఈ సీత రామ కల్యాణ వైభయాన్ని ఇంత ఘనంగా ఎందుకు జరుపుకొంటున్నామో, ఈ సందర్భంగా మానవాళికి ఇవ్వబడిన సందేశం ఏంటి, ఇది కేవలం పండగేనా లేక మన జీవన విధానాలను సన్మార్గములో మార్చుకోగలిగిన అపురూపమైన అవకాశమా.. పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 

జగత్తులో అందరి కంటే ముందరి వారు, అన్నింటింకి మూలా దారం ఎవరయ్యా అంటే, "ఆ అది దంపతులు శివ పార్వతులు" మనకి స్పురణకి వస్తారు. అమ్మ వారికి, అయ్య వారికి మధ్య దాపరికాలు ఉండవు. హెచ్చు తగ్గులకు అసలే తావు లేదు. మనకి అందిన పురాణాలు, వాంగ్మయాలు, వ్రతాలు, వ్రత  కల్పాలు అన్నీ, అమ్మ తన పిల్లల మీద దయతో, ఆదరంతో అయ్య ని అడుగుతుంది, అయన చెప్పడం జరగ బడుతుంది. ఆ కరుణ ని అవధులు, పరిమితులు ఉండవు. ఉదాహరణకి, మనమందరం ఉద్దరింప బడ డానికి, "విష్ణు" సహస్ర నామ పారాయణం ఉదహరింప బడితే, అమ్మ వెంటనే,

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యకే పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.

శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

సీత రాములు మన అందరి లాగానే సామాన్యమైన మానవులాగానే దాంపత్య వైభవము గురించి అవతరించిన దంపతులు. మన అందరి లాగానే వాళ్ళు కూడా సుఖ దుఃఖాలు, కోప తాపాలు వంటి సామాన్యమైన అనుభూతులు అనుభవించిన వారే. అందుకనే ఏ దంపతులైనా "సీతా రాములల్లె కలకాలం అన్యోనంగా పది కాలాలు వర్ధిల్లమని" ఆశీర్వాదం ఇవ్వడం మనమందరమ్ చూస్తూనే ఉంటాం. ఈ ఆశీర్వాదం ఎప్పుడూ "శివ పార్వతులల్లె" లేక "రుక్మిణి కృష్ణులల్లే"  అని ఎప్పటికి ఉండదు. అయితే ఎందుకని వీరి దాంపత్య వైభవం ఇంత ప్రత్యేకత ఎందుకని సమకూరిందో తెలిసికొనే ప్రయత్నం చేద్దాం. 

వారి దాంపత్యాన్ని గురించి ప్రస్తావించే ముందర, అస్సలు ఎవరి గురించయ్యా మనం మాట్లాడ బోయేది?

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రేమేయం 
సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం 
అజానుభాహుం అరవింద దళాయ తాక్షం 
రామం నిశాచర వినాశకరం నమామి 

రాముడంటే ఎటువంటి వాడు?

రామో విగ్రహవాన్ ధర్మః !! రామో దుర్నాభి బాషితే !! 
రామః కమల పత్రక్షా సర్వ సత్వ మనోహారః 
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే 
తెజశా దిత్య సంకాశః క్షమయః పృధివీ సమః 
బృహస్పతి సమో భుధ్యా యశసా వాశావో పమః 

రామ చంద్రుడు ధర్మానికి పూర్తి ప్రతిరూపం. రాముని మాటకు రెండు భావాలూ ఉండవు. రాముని నమ స్మరణతోనే ఈ ప్రకృతి అంతా పులకరిస్తుంది అట. కోటి సూర్యులకు తుల్యమైన తేజస్సు తో బాటు పృథ్వి కి సమానమైన వినయ సంపన్నుడు, బుద్ధి లో బృహస్పతి, ధైర్యశాలి ఆ రామ చంద్రుడట. శ్రీ మహావిష్ణువుని రామావతారంలో రెండు ప్రయోజనాలు. ఒకటి రావణాసురుని అంతం ఇంకొకటి మానవాళి కి ధర్మాచరణ వైశిష్టత గురించి ఇచ్చిన ప్రత్యక్ష నిదర్శనం. ఇది కృష్ణ, నరసింహ వంటి ఇతర అవతారాలకు  పూర్తి విరుద్ధం. 

మరి సీతమ్మ తల్లో !!

ఇయం సా ధర్మ శీలస్యా  మైదిలస్య మహాత్మనా 
సుతా జనక రాజస్యా భ ర్త్రు దృడ వ్రతా 

సకల ధర్మాత్ముడైన జనక మహారాజు నాగలి పట్టి దున్నుతుండగా భూమి నిండి ఉద్భవించిన మహా సాధ్వి. జనకుడు ఈ అయోనిజను మామూలు వ్యక్తులకు ఇచ్చి తన తండ్రి బాధ్యతను అంత సులభంగా నిర్వర్చించాలని అనుకోలేదు. అనితర సాధ్యమైన మహా శివుని విల్లు చేపట్టే ధీరుని కి మాత్రమే సీతాదేవి ని పరిణయమాడ గలిగిన అర్హుడని నిర్ణయించాడు. 

హనుమ సీతాదేవి చూసిన సిద్ది సర్గలో ఈ విధంగా భావించి సంతుష్టుడు అవుతాడు. 

రాజ్యం వా త్రిషు లోకేషు సీతవా జనకాత్మజా 
త్రై లోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్  కలామ్ 

ఒక వేళ శ్రీ రామునకు కనుక సీత మరియు ముల్లోక రాజ్యాధికారం లలో ఒకటి మాత్రమే ఎన్నుకోవాలంటే, ఒక్క ముహూర్త సమయం కూడా ఆలోచించ కుండా సీతాదేవిని కోరుకొంటాడు. రాముని మనస్సు లో ఏముందో సీత ఎల్లా వేళలా తెలుస్తుంది, అదే విధం గా సీతా దేవి ఏమి కోరుకుంటుందో శ్రీ రామునికి సదా విదితమే !! వారిద్దరిది బాధ్యతాయుత మైన దాంపత్యం. పరస్పరం ఇరువురు కర్తవ్యమ్ గుర్తు చేసికొంటూనే ఉంటారు. మీ తండ్రి దశరధుడు నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాశం చెయ్య మంటే, ఈ అస్త్రాలు శస్త్రాలు వెంట పెట్టు కొని ఎందుకు వచ్చావయ్యా? రాక్షసులతో ప్రత్యక్ష వైరం లేకపోగా వాళ్ళ అందరిని సంహరిస్తానంటివే, అంటూనే సీతా దేవి రాముని దుష్ట శిక్షణ కై పరోక్షం గా దృడ సంకల్పుడిని చేస్తుంది. "సీతా !!  శరణా గతి చేసిన ఋషులను రక్షించడమే నా ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధన లో నాకు ఎన్ని అడ్డంకులు ఎదురు అయినా నేను లెక్క చేయను" అని ప్రతిజ్ఞ చేయిస్తుంది. ఇదే విషయం ని లంక లో నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు, రామునికి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది . "రామా, మనశా వాచా కర్మణ, నిన్నే స్మరిస్తునాను అయ్యా !! మరి ఎందుకని వచ్చి నన్ను రక్షించవు ? నీవు శరణా గతులని రక్షిస్తావంటివే, మరి ఎందుకని నన్ను ఈ లంక లో నిండి, ఈ రాక్షసుల బారి నిండి కాపాడి తీసి కెళ్లవు ? నా వ్రతం లో గాని లేక తపస్సు లో గాని ఏమైనా లోపం ఉన్నదా" అంటూ హనుమ తో శ్రీ రాముడు కి సందేశం పంపిస్తుంది !!

వారిరువురు క్షణ కాలమైనా వియోగం భరించలేరు. అంతటి శ్రీరాముడు కూడా దుష్ట రాక్షస ప్రమేయంతో సీతాపహరణం జరిగిన వేళ నిస్సహాయుడు అవుతాడు. 

ఉపవాశ కృ శాం దీనాం నిశ్స్వ సంతీం  పునః పునః 
దదర్శ శుక్ల పక్షా ధౌ చంద్ర రేఖాం మివానలామ్ 

అపహరింపబడిన సీతాదేవి, శోకసముద్రురాలై అశోక వనంలో సదా పతి  చింతనతో అనుక్షణం గడుపుతూ ఉంటుంది. అదే విధంగా శ్రీ రామచంద్రుడు కూడా సర్వము కోల్పోయినవాడల్లే నిశ్శక్తుడై గడుపుతూ ఉంటాడు. ఇదేవిషయం హనుమ అశోకవనంలో ప్రస్థావిస్తాడు. 

నిత్యం ధ్యాన పరో రామో నిత్యం శోక పరాయణ 
నాన్యచింత యతే కించిత్ సతు కామవశమ్ గతః 

అమ్మా!! శ్రీ రామచంద్రుడు సకలావశ్తలందు నీ ధ్యాశ లోనే మునిగి, నిన్ను చేరుకొనడం అన్న ఆలోచన తప్ప వేరే ఏమీ కోరిక లేని వాడై ఉన్నాడమ్మా.. అంటూ హనుమ వివరిస్తాడు . అదే విధం గా సీతమ్మ తల్లి కూడా, 

దీనోవా రాజ్య హీనోవా వామో మే భర్త సమే గురు 
తమ్ నిత్య మనురక్తాస్మి యధా సూర్యం సువర్చలా 

రాక్షస రాజు రావణుడు సీతాదేవి ని ఐహిక లాభాలతో ప్రలోభపెడితే, ఆ అమ్మ, "నా రాముడు దీనుడైనా, రాజ్య హీనుడు అయినా, అతడే నాకు గురువు. నేను సదా నా పతికి  అనురక్తురాలును" అని అంటుంది.

ఇదే భావం అరణ్య కాండలో మరొక సందర్బం లో కూడా వెల్లడిస్తుంది. 14 సంవత్సరాల అరణ్య వాసం తండ్రి ఆజ్ఞ శిరసావహించడానికి ఉద్యుక్తుడు అవుతూ, "సీతా !! ఈ శాసనం నాకు మాత్రమే వర్తిస్తుంది. నీవు నా వెంట వచ్చి అరణ్యవాస కష్టాలు అనుభవించవల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు" అని అనగా ఆ దేవి, "భర్త వెంట లేకపోవడమే తనకి అత్యంత దుర్భరమైన కఠిన శిక్ష" అని పేర్కొంటుంది. 

సీతా రాముల కళ్యాణం కమనీయం !! వారి దాంపత్యం ఆదర్శప్రాయం  !! ఇప్పటికి, ఎప్పటికి రామాయణ వైభవమే మనకి సదా పూజ్యనీయం !! రామాయణ వైభవం తలిచి, కొలిచి ఎందరో మహానుభావులు తరించారు. అన్నింటి కన్నా ముక్ష్యంగా రామ నామ పారాయణంనకు  మంగళ ప్రదుడైన హనుమ మన వెంటే ఉంటాడు. 

యత్రః యత్రః  రఘునాదః కీర్తనం 
తత్రః తత్రః క్రుతమస్తః కాంజలీమ్ 

రామ నామం మానవ జీవితాల్లో ఎంతగా ఇమిడీ కృతం అయ్యిందంటే,  మన పేర్ల్లల్లో  రామ నామం చేరుస్తాం, మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాముడినే తలుస్తాం, మన సంప్రదాయం ప్రకారం వివాహ శుభ పత్రికల్లో కూడా ఆ నాటి సీత రామ తలంబ్రాలే ఆ కొత్త జంటకి ఆశీర్వాదం కావాలన్నా తలంపు తోనే

జానక్యః కమలాంజలి పుటేయః పద్మరాగాయితః 
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితః 
స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్ర నీలయితః 
ముక్తస్తా శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికః 

అన్న శ్లోకం ముద్రిస్తాం . ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా ధన్య వాదాలు తెలుపుతూ, ఆ రామానుగ్రహం  మన అందరి పైనా సదా ఉండాలి అని కోరూతూ "సర్వే జనః సుఖినో భవంతు", "జై శ్రీ రామ్"

Tuesday, July 12, 2016

చక్ర భ్రమణం

సరోజా ! ఇది చూసావా.. ఈ రోజు ఉష్ణోగ్రత వివరాలు - 44 c.. ఇంకేముంది! దుంప తెగిందన్న మాటే !

అయ్యా బాబోయ్! ఇంకా రోహిణి కార్తె చూస్తే కనీశం నెల పైనే ఉంది. రాను పోను, మొత్తం ఆరు కిలోమీటర్లు, కాలి నడక ! ఎట్లా నెగ్గుకొస్తారో ఏమిటో !

ఎట్లా ఏముంది..  ఉద్యోగం అన్నాక తప్పుతుందా! పోనీ ఎండ ఒక్కటి అనుకొంటే పర్వాలేదు.. సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయినా కూడా వాడ గాల్పులాయే!

పోనీ సైకిల్ ఒకటి తీసికోరాదండీ.. హంబరో, హీరో నో ?

తీసికొంటే, బావుంటుంది కానీ, మనకి వచ్చే జానా బెత్తడు జీతానికి, ఉన్న పళాన వెయ్యి రూపాయల  ఖర్చు అంటే మాటలా? పోనీ సెకండ్ హ్యాండ్ తీసుకొందామంటే, ఎవరినో మోసిన ఇనప సామాను మన ఇంటికి ఎందుకంటావ్..

అయిందిగా ఆ ముచ్చట కూడా! మీ బావ 15 ఏళ్ల నాటి అంటగట్టిన సైకిల్ ఒక్క మూడు నెలలు వాడారో లేదో, పాత ఇనప సామాన్ల వాడు కూడా ఛీ పొమ్మంటున్నాడు.

 ఇది ఇప్పట్లో తెమిలేది కాదులే. ఈ వేసవి కాలం ఎలాగోలా నడపాల్సిందే.. 

దాదాపు నలభై ఏళ్ల క్రిందటి మాట! రామారావు బెజవాడ లో ఒక ఆడిటర్ గారి ఆఫీస్ లో గుమస్తా. వరసే కదా అని దూరపు చుట్టాలమ్మాయిని చేసికొన్నా, సరోజ అందం, అణుకువలకి అత్యంత ముగ్దుడైన రామరావు చాలా దగ్గరగానే సంసారం చేయసాగాడు. ఎంత దగ్గరగా అంటే, పెళ్ళైన సంవత్సరం తిరక్కుండానే, అదృష్టం ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించింది. "లక్ష్మీ దేవోయ్, రామరావ్! ఇంక నీకు తిరుగు లేదంటే నమ్ము!", అని పిల్లని చూట్టానికి వచ్చిన పైన మామ గారు సెలవిస్తే, శుక్రవారాలు తలుపు దగ్గరగా కూడా వెయ్య రాదని సరోజ కి స్త్రిక్ట్ వార్ణింగ్ ఇచ్చాడు. పిల్ల పుట్టడం తో కొద్దీ పాటి ఎడబాటు సంభవించినా, భర్త బాధ్యతలని ఏనాడు రామ రావు విస్మరించక పోవడంతో, మిగతా ఏడుగురు లక్ష్మీల మాట ఎట్లా ఉన్నా, సంతాన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించడంతో, మరో ఇద్దరు మగ పిల్లల ఇట్టే పుట్టడం, రామరావు "కుటుంబ రావు" గా పరివర్తనం చెందడం ఇట్టే జరిగి పోయాయి. 

రామారావు స్వతహాగా తెలివైన వాడు. బండెడు సంసారం మరియు ఇతరత్రా కుటుంబ కారణాల రీత్యా,  వాళ్ళ నాన్న పదో తరగతి దాటగానే, ఇంక నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. అన్నయ్యల దెగ్గర చేరి, ఇంకో రెండు సంవత్సరాలు బండి లాగించాడు రామ రావు. ఈ క్రమంలో, తెలిసిన బంధువులాయన దగ్గర అకౌంట్స్ చూడడం, పన్నుల కి సంబందించిన వ్యవహారాల్లో కొద్దో గొప్పో, రాణింపుసంపాదించుకున్నాడు. తర్వాత, ఇంక నా వల్ల కాదురా అని రామ రావు ని అదే ఊర్లో ఉన్న ఆడిటర్ గారి దగ్గర లెక్కలు చూసే పనిలో పెట్టేసాడు.  ఈ క్రమంలో రామరావు చురుకు, ఉత్సాహం చూసి నచ్చిన ఆ ఆడిటర్ గారు, నెమ్మదిగా కొంచెం పేరు ఉన్న వ్యాపారస్తుల అకౌంట్స్ చూడమని పురమాయించాడు. పేరుకు "రాముడైనా", మనస్తత్వం అంతా ఆంజనేయుడవటం, అతి కొద్దీ కాలం లోనే యజమాని నమ్మకాన్నిచూరగొని, హెడ్ గుమస్తా గా ప్రమోషన్ రావడం, తన కింద ఇంకో ఇద్దరు గుమస్తా లను నియమించడం ఇట్టే జరిగి పోయాయి. మరీ డిగ్రీ అయినా లేకపోతే ఎం బావుంటుంది అని, ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రైవేట్ గా B.COM పూర్తి చేసాడు. గవర్మెంట్ ఉద్యోగం కాదనే కానీ, రామరావు పని చేసే సంస్థ వారికి  మిగతా వ్యాపారాలు కూడా ఉండడం తో అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతి నిండా పనే.  

"అసలే ప్లస్ లో ఉన్నావ్! పైగా జీతం కూడా పెరిగింది.. నక్కని తొక్కావురా రామారావ్!", అంటూ నెల్లూరు నించి కాకినాడ ప్రయాణం చేస్తూ ఊరు మీదుగా వెళ్తూ ఆగి పలకరించక పోతే ఏమి బావుంటుందని ఆగిన బాబాయ్ వరుస అయ్యే బంధువు ఇచ్చిన కితాబు. "ఎం ప్లస్సో బాబాయ్! ఈ సంసారరధచక్రాలు లాగడం అంటే మాటలు కాదు. గత అయిదు సంవత్సరాల్లో,  గానుగెద్దు తిరిగినట్టు ఆఫీస్ నించి ఇంటికి, ఇంటి నించి ఆఫీస్ కి ఎండైనా, వానైనా కాలి నడక తప్పట్లేదు కదా. ఒక్క సైకిల్ కొనుక్కొందామంటే, ఏదీ..", అంటూ వాపోయాడు రామారావు. "ఏమి చేస్తాం నాయనా, త్రేతా యుగంలో శ్రీ రాముడికే తప్పలేదు ఈ సంసార ఈతి బాధలు, కలియుగం లో రామరావు మాత్రం తప్పించమంటే ఎట్లా", అంటూ  తన బండి టైం అవ్వడం తో బయలుదేరాడు. 

చూస్తూనే పిల్లలు స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టారు. రామరావు నడవటం అన్నా, నడవక్కర లేకుండా గమ్యం చేరే సమస్త చరా చర ప్రాణి కోటి అన్నా తెలియని ద్వేషం పెంచుకున్నాడు. "ఆహా! మనం కూడా భూ కైలాష్ సినిమా లో నారదుడికి మల్లె ఆకాశ మార్గం లో ప్రయాణిస్తే ఎంత బావుంటుందో కదా.. వెదవ పిచ్చుక ఒక చోటి నించి ఇంకో చోటికి ఎంత హాయి గా ఎగురుతోందో కదా..", ఇలా సాగేవి అతని ఆలోచనలు రోజు తనకి తప్పని నడక ప్రయాణంలో. పోనీ ధరించి సైకిల్ కొందామంటే, ప్రతి సంవత్సరం పెరిగే యాబయ్యో, వందో జీతం తో పాటు ఇంటి ఖర్చులు ఇంకొంచం పై చెయ్యి కావడం తో బొటాబోటిగా సరి పోయేది. ఎప్పుడైనా, పండక్కో లేదా యజమాని ఇంట్లో శుభ కార్యాలకో లభించే అదనపు ఆదాయం, భార్య పిల్లలకి బట్టలు కొనగా మిగిలే అనిర్వచనీయమైన సంతోషానికి సాక్షీ భూతం గా నిలబడి, తన కష్టాన్ని తనలోనే అణుచుకొనే వాడు. 

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా, ఎండా కాలం లో మాత్రం నెట్టి మీద ఒక రుమాలు గుడ్డ కట్టుకొని నడవాలంటే అంతంత దూరం నడవాలంటే ప్రాణం ఉసూరుమనేది. "ఈ నెలలో అయినా సైకిల్ కొనాల్సిందే", అని ఆ రోజుకి నలభై ఒకటో సారి గట్టిగా తనకి తాను చెప్పు కొన్నాడు. అందులోనూ క్రితం రోజు రాత్రి "installments లో అయినా వెధవ సైకిల్ ఒకటి కొందామండీ" అంటూ భార్య ఊతం కూడా రామ రావు దృఢ నిర్ణయానికి కారణ భూతం అయిందేమో.  మొత్తానికి రాబోయే ఆదివారంకి శుభ ముహూర్తం నిర్ణయించుకున్నారు, భార్యా భర్తలిద్దరూ. శనివారం ఒన్ తౌన్ లో ఉన్న సైకిల్ షాప్ కి వెళ్లి ఇంస్టాల్మెంట్ వివరాలు అన్నీ వాకబు చేసి ఇంటికి చేరే టప్పటికి, ఇంటి నిండా పండగ వాతావరణం కనిపించింది. కొంచం ఎడమ కన్ను అదురుతున్నప్పటికిన్నీ గుండె దిటవు చేసికొని, సరోజ ఇచ్చిన కూజా నీళ్లతో గొంతు తడుపుతుండగా, "ఏమండీ విన్నారా ? మా పెదనాన్న గారి అబ్బాయి, అదేనండి మా అమెరికా అన్నయ్య రేపు మన ఇంటికి వస్తున్నారట !! ఈ రోజే కబురొచ్చింది" అంటూ ఉబ్బి తబ్బిబ్బు అవుతూ చెప్పింది. ఎప్పుడో పెళ్లి నాటికి చూశాడాయన్ని రామ రావు. "సరే అంత పెద్ద హోదా గల వాళ్ళు మనని  గుర్తు పెట్టుకొని మరీ వస్తున్నారంటే ఆనందించ దగ్గ విషయమే కానీ, "దీనికి నా సైకిల్ కి ఏమైనా లింక్ ఉందా" అని గునిసాడు. "మరి ఎం చేస్తాం, చెప్పండి? రాక రాక మన ఇంటికి వస్తున్నారాయె. వస్తూ పిల్లలికి ఏదో ఒకటి  తేక పోరు. ఏదో మన స్తాయి లో వాళ్ళ పిల్లలికి బట్టలయినా ఇవ్వక పోతే ఎలా చెప్పండి?", అంటూ అనునయనంగా చెప్పింది సరోజ. సరే, తప్పుతుందా అనుకొంటూ, సైకిల్ అడ్వాన్సు కోసం పక్కన పెట్టిన డబ్బుతో , సరోజ చెప్పిన వస్తువులు కొనడంతో నిమగ్నం అయ్యాడు. వచ్చిన చుట్టాలతో అమెరికా విశేషాలు మాట్లాడుతూ ఉండగా రామారావు ఏదో సందర్భంలో, "ఏమండీ ! మీ దేశం లో ఖాళీ సమయాల్లో ఏమి చేస్తూ ఉంటారండీ", అని అడిగాడు. "ఖాళీ ఎక్కడండీ ? అమెరికా లో ప్రతి నిమిషం విలువైనదే నండీ! కానీ రోజు సాయంత్రాల్లో మాత్రం, నేను నా భార్య కనీసం ఒక్క అర గంట అయినా నడుస్తూ ఉంటాం. వ్యాయాయం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదండీ", అనగానే భార్యా భర్తలు ఇద్దరూ మోహా మొహాలు చూసుకొన్నారు. రామా రావు కి మళ్ళీ నడక కష్టాలు తప్పలేదు.

కానీ రోజులు అన్నీ ఒకే మాదిరి గా ఉండవు కదా. మారే ప్రపంచ పరిస్థితులతో పాటుగా భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా పగ్గాలు విడిచిన రేసు గుర్రం లాగా పరిగెత్తడం మొదలు పెట్టింది. రామారావు ఎంత పని ఒత్తిడి ఉన్నా, C.A పరీక్షలు పట్టు పట్టి పాస్ అయ్యాడు. అసలే అకౌంట్స్ మరియు పన్నుల వ్యవహారాలులో మంచి అనుభవం గడించిన వాడు అవ్వడం మూలాన, అతనికి అంటూ ప్రాక్టీస్ ఏర్పడడం పెద్ద కష్టం అవ్వలేదు. అదృష్ట వశాత్తూ పిల్లలు ముగ్గురూ ఆణి ముత్యాలుకి మల్లె చదువు లోనూ, గుణము లోనూ ఎవ్వరికీ తీసిపోని విధంగా నిలబడ్డారు. అమ్మాయి ఈ మాత్రం కోచింగ్ అవసరమే లేకుండా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ సంపాదించింది. మొగ పిల్లలు ఇద్దరూ అమ్మాయి అంత కాక పోయినా గవెర్నమెంట్ కాలేజ్ లోనే సీట్లు సంపాదించారు. "లక్షలకి లక్షలు గుమ్మరిస్తే  ఏమి లాభం! స్వతహాగా మెరిట్ ఉండాలండి. మా పిల్లలని చూడండి, అందరికి బ్రహ్మ ప్రళయం అయిన సీట్లు ఇట్టే సంపాదించేసారు", అని అడిగిన వాడికి అడగని వాడికి చెప్పసాగాడు. "ఊరుకోండి! మీరు మరీనూ! పిల్లలకి దిష్టి తగులుతుంది", అంటూ సరోజ ఉప్పు డబ్బాలు కరిగించేసింది.

తన ప్రాక్టీస్ లో గణనీయంగా పెరుగుదల  ఉండడంతో, సైకిల్ కె గతి లేని రామ రావు, ఉన్న పళాన పెద్ద కష్టపడకుండా స్కూటరే కొనేసాడు. సరోజ  చుట్టూ పక్కల వాళ్ళ అందరికి ఒక చిన్న పాటి తేనీటి విందు ఏర్పాటు చేసింది. "మా వారికి వాహన యోగం చిరకాల వాంఛ అండీ. ఇన్నాళ్లకి నెరవేరింది" ఆంటూ తెగ మురుసుకు పోయింది. గుళ్లో పూజారి నిమ్మకాయలు మీదుగా స్కూటర్ నడప మన్నప్పుడు మొదలు రామ రావు నడక అన్న పదానికి దాదాపు స్వస్తి పలికాడు. వీధి చివర ఉన్న కిరాణా కొట్టు కి వెళ్లాలన్నా స్కూటర్ కె పని చెప్పేవాడు.

భార్యా భర్తల పూర్వ జన్మ సుకృతమో ఏమో, అమ్మాయి తన కాలేజ్ లోనే చదువుకొన్న మరో డాక్టర్ అబ్బాయి తో కాణీ కట్నం లేకుండా పెళ్లి జరిగింది. అబ్బాయిలు ఇద్దరూ క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. రామారావు ఉద్యోగ పెరుగుదల తో పాటు, పిల్లలు ముగ్గురూ చేతికి అందిరావడం తో ఒక శుభ మూహూర్తాన మూడు వందల గజాల స్థలంలో లోను తీసికొని చక్కటి ఇల్లు కూడా కట్టుకోగలిగాడు. అమ్మాయి, అల్లుడు స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి ఊళ్ళో మంచి హస్త వాసి గల డాక్టర్ల గా పేరు పొందారు. మొగ పిల్లలు ఇద్దరూ వాళ్ళు పని చేసే కంపెనీలలోనే అవకాశం రావడంతో అమెరికా లో స్థిర పడ్డారు. "ఇంకా, ఆ డొక్కు స్కూటర్ ఏమి నడుపుతావు నాన్న! మంచి కార్ కొనుక్కో అని పెద్దవాడు ఒక A.C కార్ కొని పెట్టాడు. ఎండా కాలం ఏమీ అవస్థ లేకుండా చిన్న వాడు ఇంట్లో అన్ని గదుల్లో A.C పెట్టించాడు.

ఇప్పుడు సరోజకి ప్రొద్దునే వంటకి ఒక మనిషి, ఇంటి పనులు చేయడానికి నమ్మకమైన పని మనుషులు స్థిర పడ్డారు. ఇంకా ఏ మాత్రం కష్ష్ట పడద్దు అంటూ పిల్లలు వాషింగ్ మిషన్లు, డబుల్ డోర్ ఫ్రిడ్జిలు, ఫ్లాట్ స్క్రీన్ టీవీ లు సమస్తం అమర్చారు. సరోజ, రామ రావు లు క్రమ క్రమం గా "సరోజమ్మ గారు, రావు గారు" గా పరి వర్తన చెందారు. ఎప్పుడూ బక్క పలచగా ఉండే రామ రావు కొంచం రంగది వచ్చి ఒళ్ళు కూడా చేసాడు. వయస్సు కి తగినంత పొట్ట కూడా వచ్చి, తన హై క్లాస్ మిత్రులతో అప్పుడప్పుడు ఇంకా కొంచం ఒళ్ళు చేయడానికి దోహద పడే బీర్, స్కాచ్  వంటి అలవాట్లు కూడా  సంక్రమించాయి. రోజూ అలవాటు గా దైనందిక సీరియళ్లు అన్నీ ముగించు కొని పదుకొనె ముందు న్యూస్ ఛానెల్స్ లో ప్రపంచంలో సామాన్యుడికి అవసరం లేని విషయాల పైన తీవ్రమైన చర్చలన్నింటి లోనూ  లీనమై, కొన్ని మంచి పాయింట్స్ రేపటి క్లబ్ లో మిత్రులతో పంచు కోవడానికి బాగా మననం చేసికొని పడుకొన్నాడు. కొంచం మగత గా నిద్ర పడుతూ ఉండగా, కొంచం గుండెల్లో భారం గా అనిపించడం మొదలు అయ్యింది. ఏంటో అర్ధం గాక భార్య ని లేపుదామా అనుకొంటూనే, "ఎందుకులే కంగారు పడుతుంది, అదే తగ్గుతుంది లే, కొంచం సేపు చూద్దాం" అని అనుకొన్నాడు.. ఏ తెల్ల వారు జామునో, రాత్రంతా అటు ఇటు దొర్లుతున్న రామ రావు ఇంక లాభం లేదు అనుకోని సరోజని నిద్ర లేపి హాస్పిటల్ కి  తీసికెళ్ళమని చెప్పాడు.

వెంటనే, ఊళ్ళో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి చేరిన రామ రావు కి, వైద్య శాస్త్రం లో ఉన్న అన్ని రకాల టెస్ట్స్ చేసిన తర్వాత, వార్త విని హూటా హూటా న పరిగెత్తుకొచ్చిన అమ్మాయి తో చీఫ్ డాక్టర్ ఇలా చెప్పాడు. "ఎం లేదమ్మా!! నీకు తెలియంది ఏముంది. ఒంట్లో కొవ్వు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. ఒక నాలుగు రోజులు ఆబ్సెర్వేషన్ లో ఉంచి పంపిస్తాం", అంటూ రామ రావు వంక తిరిగి, "రావు గారు! తిండి లో ఉప్పు కారం పూర్తిగా తగ్గించేయాలి. ఇంక నించి రోజూ కనీశం నాలుగైదు కిలోమీటర్లు నడవాలండీ. పాపం మీకు నడక అలవాటు ఉందొ లేదో! కానీ తప్పదు అలవాటు చేసికోవాల్సిందే", అని పక్క రూం లో ఉన్న పేషంట్ ని చూడ్డానికి కదిలాడు.

రచయిత :  గతంలో మధ్య తరగతి కుటుంబాల్లో అదనంగా ఒక వస్తువు కొనాలంటే దాదాపు బ్రహ్మ ప్రళయమే !! టి వి, సైకిల్, పట్టు చీర ఇలాంటి వస్తువు కొనాలంటే వాళ్ళు పడే ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. మారిన పరిస్తుతుల రీత్యా వస్తు సమీకరణ సులభతరం అయినా, వారి జీవితాల్లో వాటి స్తానం లో ఇతరత్రా సమస్యలు చోటు చేసికొన్నాయన్న సందేశం కోసం చేసిన  చిరు ప్రయత్నం 

Thursday, March 17, 2016

భారత మాత కి జై

జన్మంతా నికృష్టమైన ఘోరాలూ, పాపాలు చేసినా ఆ చివరి క్షణములో "నారాయణా" అంటే చాలు, ఏ రికమండేషన్ అక్కరలేకుండానే,VIP దర్శనాలు కూడా ఆపేసి స్వామి వారి చరణారవింద కటాక్షం కలగ చేస్తార"ట".

మళ్ళీ "ట" లు,  "టపాకాయలు", ఏంటీ.. కళ్ళు పోతాయి వెధవ అనుమానము నువ్వునూ !!

అయ్యో భలే వారే.. మన శాస్త్రం లో చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమా!! కాక పొతే ఒక చిన్నపాటి సందేహం!!

మరి కానీ.. ఇంకా ఆలశ్యం ఎందుకు. వదులు .. 

అంటే, వాడుగా ఆ జీవుడు అనక పోయినా,  ఎవడైనా అంటావా లేక చస్తావా అని మెడ మీద కట్టి పెట్టి నప్పుడు, సరేలే అంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ నాలుగక్షరాలు అని గుటుక్కు మన్నాడే అనుకోండి, అప్పుడు కూడా వైకుంట వాశి అవుతాడా అని... 

చిక్కు ప్రశ్నే !! దీనికి సమాధానం స్లోగన్లు ద్వారా దేశోద్దారణ చేద్దామనుకొంటున్న RSS పెద్దలని అడిగితే విటమిన్-డి పాలలాంటి చిక్కటి సమాధానం దొరకొచ్చు అనుకొంటా. 

బానే ఉంది.. అయినా "హిందూ" దేశ అభిమానులు ఏమంత తప్పు చేశారని ఇప్పుడు మిగతా పెద్దలంతా కల్సి మూకుమ్మడి గా ఇంత హడావుడి చెయ్యలట. ఆ చేసేదేదో, 19 వ శతాబ్దం లోనే, కిరణ్ చంద్ర చటర్జీ వ్రాసిన "భారత మాత" నాటకాన్ని బహిష్కరించుంటే ఏ గొడవ ఉండేది కాదు కద. పోనీ, ఆ రోజుల్లో స్వతంత్ర సమరావేశం లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చి పోయామండీ అనుకొందామంటే, వారణాశి లో మహాత్మా గాంధీ గారు "భారత మాత" గుడి అవిష్కరిస్తూ, ఈ స్వరూపం కుల మత తత్వాలకు అతీతం గా అందరికి ఆరాధ్యం అవుతుంది అని అన్నప్పుడు, అయ్యా బాపూజీ !! బాగానే ఉంది గాని, మేమంతా ఈ కొత్త దేవత ని అంగీకరించాలంటే, కొన్ని మార్పులు చేర్పులు చేయ వలసి ఉంటుంది. మచ్చుక్కి, ఈ  భారత మాత కాషాయం కి బదులు ఆకూ పచ్చ చీర కట్టండి.. అసలు చీర కాకుండా శాల్వార్ కమీజ్ వంటి వస్త్ర ధారణ చేయించ గలరా ?? ఇంకా మాట్లాడాలంటే, భారత "మాత" కి బదులు "మియా" , "బాబు" లేక "భాయ్" వంటి ఇత్యాదులు ని ఖాయం చెయ్యగలరా అని అడిగుండవచ్చు కదా. పోనీ, గాంధీ గారంటే భక్తీ శ్రద్దలతో అడగాడినికి మొహమాట పడ్డారనుకొన్నా, కాంగీయుల అరవై సంవత్సరాల పాలన లో భారత మాత చల్లని చూపులతోనే, కుల మత వర్గ ప్రాంతీయ విభేద రహిత (భరిత) నవ సమాజ నిర్మాణం ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మించుకోన్నాము కదా. 

అతి తెలివి ప్రదర్శించ కండి !! అప్పటికి ఇప్పటికి సాపత్యమా ? ప్రభుత్వం అంటే బజారు రౌడీలా ? మేం ఏమి, ఎంత, ఎలా తినాలో, మాట్లాడాలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటే గాజులు తొడుక్కొని కూర్చోవాలా? (మీకు తెలియదేమో మొన్న మహిళా దిన ఉత్సవ సందర్భం గా "గాజులు తోడుక్కోవడం" అన్న ప్రయోగాన్ని నిషేదించడం అయినది). మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో గో మాంసం తిన్నాడన్న నెపం మీద చంపేయడం అయినది. ఏ మేము ఈ దేశ వాశులం కాదా?? ఏంటీ నిభంధనలు ?? 

ఎక్కడో మారు మూల గ్రామంలో, ఎవరో కొంత మంది అతి వాదులు చేసిన మురికి కి  జాతి మొత్తం పసుపు నీళ్ళు చల్లు కోవాలంటే ఎలా? దాని కోసం  మీరంతా చేసిన గోల అంతా ఇంతా? ఒక ప్రముఖ సినీ నటుడు మొత్తం దేశానికే "అసహన" రోగం వచ్చిందని అని అన్నాడే ? ఏదో ఒక సాకు పెట్టుకొని అధికారానికి రాలేదన్న అక్కసు నంతా మొత్తానికే వెల్లడి చేస్తున్నారు కద. ఆ మధ్య ఏమీ పస లేని లలిత్ మోడీ వ్యవహారాన్ని భుజాన వేసికొని ప్రతిపక్షం మొత్తం వర్షా కాల సమావేశాలు సమయాన్ని "మూర్చ" రోగం వచ్చిన వాళ్ళ కి మల్లే అరుపులు కేకలు తో హొరెత్తించారే ? (అది మొదలు పాలక పక్షం ప్రతినిధులు మూర్చ రోగ ఉపశమనానికి తాళల గుత్తులు పక్కనే పెట్టుకొని తిరుగుతున్నట్టు వినికిడి). 

అవును !! ఆర్ధిక కుంభకోణాలు మేము ఈ మాత్రం సహించము గాక సహించము. (అదే విధం గా ఆర్ధిక కుంభకోణాల పై విచారణలు కూడా). సరే అసలు విషయానికి వస్తే, ఈ బాజాపా ప్రభుత్వం లో కనీ వినీ ఎరుగని రీతిలో పర మత అసహనం ఏర్పడింది.  హిందువులు కాని వారందురూ, ఆత్మ న్యూనతా మరియు అభద్రతా భావం తోను మనుగడ సాగిస్తున్నారు అన్నది అవునన్నా కాదన్నా అక్షర సత్యమ్. ఇలాంటి భావన ఏనాడు స్వతంత్ర భారతం లో ఇనాటి వరకు కలగనే లేదన్నవిషయం గమనించాలి 

నిజమే?? విభజన అప్పటి విషయాలు అప్పటి కొంత భావోద్వేగాలు అని పక్కన పెట్టినా, 84 లో తలపాగా కట్టిన వాడికి తల నీడ లేకుండా చేసిన సంఘటనల మాటో ?? ఇందిరమ్మ ని పొట్టన పెట్టుకొన్న ఇద్దరి సిక్కుల పాపానికి (పుణ్యానికి), మొత్తం జాతిని అత్యంత సహనంగా అసహనానికి గురి చేసిన ఘనత మాట అప్పుడే మరిచారా? కాశ్మీర్ లో వందలకొద్దీ పండిట్ లను ఊచకోత కోసి, సుమారు అయిదు లక్షల మందిని నిరాశ్రయులు చేస్తే, "ష్ !! గప్ చిప్" గా ఉండండి అని నిజాన్ని సమాధి చేసిన ఘటనలు మాటో ? త్రిపుర లో సరస్వితి, దుర్గా పూజలని క్రైస్తవ ఉగ్రవాదం తో దగ్గర ఉండి నిషేదింప చేయడమే కాక అడ్డొచ్చిన హిందువులని ఆ అమ్మలకే బలి ఇచ్చారు? బాబ్రీ మస్జిద్ పొగ పెట్టి ఆ మంటల్లోనే చలి కాచుకొన్న సంస్కృతి మీది !! ఈ కుహనా సిద్ధాంతాలకి కాలం చెల్లింది కాబట్టే సమస్త ప్రజ మిమ్మల్ని పక్కన పెట్టింది.. మీరు భారత దేశం ని చిన్నా బిన్నం చేసిందే కాకుండా, మీ దృతరాష్ట్ర ప్రేమతో కొన్ని విష సర్పాలని పాలు పోసి పెంచారు. ఇప్పుడు అవి కాటు వేయించుకోక పొతే అలక పాన్పు ఎక్కుతున్నాయి. వీటి కోరలు పీకాల్సిందే !! చేసి చూపిస్తాం కూడా

అంతవరకు మిమ్మల్ని ఉండనిస్తే చూద్దాం. అయినా మీ ఒక్క విపరీత ధోరణి వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతోందో గమనిస్తున్నారా? ఇంత కాలం ఆక్షేపణ లేని "భారత మాత" ని తల మీద కత్తి పెట్టినా నెత్తురు ఇస్తాడు కాని తల్లి (దేశ) ప్రేమ ని ఒప్పుకొనంటున్నాడు ఒక పెద్ద  మనిషి. దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన యువ రక్తమే, అదే దేశ వినాశం కోసరం నినాదాలు ఇస్తోంది !! ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ  నటులు,కళా కారులు, విద్యార్ధి సంఘాలు మరియు కొంత మేరకు పత్రికా రంగం ఈ ఒరవడికి వత్తాశు పలుకుతోంది. చూశారా, మీ నిర్వాకం  ఎటువంటి పరిణామాలకి దారి తీస్తోందో? 

ఏమి చేస్తాం ?? పదవీ కాంక్ష తప్ప మరేమి కానని డొల్ల రాజకీయవాదుల నించి ఇంకేమి ఆశించగలం ?? స్వదేశం లో ఉంటూ, దేశాన్ని  ప్రేమించమనడం అంత చేదు అయిపోయిందా? చరిత్ర లో అభ్రహమ్ లింకోన్, చర్చిల్ ఇలాంటి నేతలంతా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల దేశ నిర్మాణానికే కదా ప్రజలని ప్రాణాలైన ఇమ్మని ప్రభోదించారు ? అప్పట్లో, యూనియన్ సేనలు నివ్వు చెప్పావు కాబట్టి మేము దేశాన్ని ప్రేమించాము అంటే ఏమయ్యేది? మరి ఇప్పడు మీరు అంటున్నారు కాబట్టి "భారత" దేశ కీర్తిని మేము అంగీకరించం అన్న వాళ్లకి వత్తాసు పలికే పెద్ద మనుషలని ఏ  విధం గా అర్ధం చేసికోవాలి?

మన అదృష్టం ఏంటంటే ప్రతీ విషయంలోనూ, ఈకలు ఏరడం  మరియు భూతద్దాల్లో చూడడం లాంటి పనులు బహు కొద్ది మంది మాత్రమే అత్యంత సమర్దవంతం గా చేయడం వల్ల, మిగతా చాల శాతం వ్యవస్థ దాని అంతట దానిగా నడుస్తోంది, పరిగెడుతూనే ఉంది . ఇదే సమయంలో, విజయ్ మాల్య లాంటి ప్రబుద్దులు  వేల కోట్లు బకాయిలు పెట్టి దేశాన్నివదిలి యదేచ్చగా విలాసంగా విహారాలు చేస్తూనే ఉన్నారు. భారత మాత కి జై అన్నా లేకే పోయినా సరిహద్దు లో సైనికులు ఎండనక, వాననక  మంచు కొండల్లో ప్రాణాలు నిలపెట్టుకోవడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆవలి దేశం నించి ఉగ్ర వాద దాడులు కోన్ సాగుతూనే ఉన్నాయి, మన సైనికులు శక్తివంచన లేకుండా వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ సామాన్య పౌరుడు నిత్య జీవన సంగ్రామం చేస్తూనే అయిదేళ్ళ తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగస్వామ్యం అవడానికి ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోగా తనకి ఇష్ట మైన రీతి లో "జై హింద్" అని గాని "భారత్ మాత కి జై"  అని గాని అప్పుడప్పుడు అంటూ తన దేశ భక్తి వ్యక్త పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు