Thursday, December 29, 2022

Chapter 11 - Telugu

ఏకాదశ అధ్యాయస్య తెలుగు వ్యాఖ్యానం దశమధ్యాయమునందు అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మా యొక్క సకల విభూతినలు గూర్చి తెల్సినవాడై అమిత తన్మయత్వము అనుభవించెను. తన ముందు తిరిగాడుతున్న కృష్ణుడు కేవల తన ఇష్ట సఖుడు మరియు బంధువు మాత్రమే కాదని, అతను సర్వవిశ్వాసార్వభౌముడని, సకలైశ్వర్యములు ప్రభువని గమనించి అంజలి ఘటిస్తూ కృష్ణుడిని "కమల పత్రాక్ష" అని సంబోధించాడు. కమలమువంటి కన్నులు గలవాడా అన్న కీర్తన అత్యంత విశేషణమైనదిగా పేర్కొనబడినది. రామాయణ కావ్యములో సుందర కాండలో, రామ మహాభక్తుడైన ఆంజనేయుడు, తనను తాను "రామ దూత" గా అభివర్ణించుకొన్నప్పుడు, సీతా మహా సాధ్వి రాముని చారిత్రం మరియు ఆయనను ఈ విధముగా ఆంజనేయుడు దర్శించాడో వివరించమని కోరుతుంది రామః కమలపత్రాక్ష సర్వ భూత మనోహరః రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజా అంటూ ఆంజనేయుడు రాముణ్ణి శ్లాఘిస్తాడు. ఈ విశేషణం కేవలం విష్ణుస్వరూపమైన మహాపురుషలకే సంబంధించినదని మనకి ఇక్క అవగతం అవుతున్నది. అర్జునుడు కృష్ణుని దివ్యవిభూతుల మహత్యం గురించి తెలిసికొన్న వాడై అయన విశ్వరూపసందర్శనం కొరకై ఆకాంక్ష వ్యక్త పరుస్తాడు. కానీ ఆ యొక్క కోరికను అత్యంత వినయసంపన్నుడై తనకు అర్హత ఉందని పరమాత్మ భావిస్తేనే ఆ భాగ్యం ప్రసాదించమని ప్రాధేయపడతాడు. మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో । యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ।। 4 ।। ఈ సందర్భములో కృష్ణుని పట్ల అర్జునుని భక్తి భావమునందు గల స్వల్ప వ్యత్యాసం మనం గమనించ వచ్చు. పదవ అధ్యాయమందలి పదిహేడవ శ్లోకములో కృషుడిని "యోగీ" అని సంభోదించగా ఇచట "యోగీశ్వరా" అని పిలుస్తున్నాడు. అనగా, పరమ యోగులకు కృష్ణుని ఈశ్వరునిగా అర్జునుడు గుర్తుఎరిగి వ్యవహరిస్తున్నట్టుగా మనం గమనించ వచ్ఛు. మనయొక్క అర్హతార్హతలు నిర్ణయించునది ఎవరు? గీతాగ్రంథము లోని అయిదవ అధ్యాయములో పేర్కొన్నట్టు, "విద్యా వినయతే సంపన్న". మన ప్రయత్నము ఎంత బృహత్కరమైనప్పటికిన్నీ అందులో వినయం లోపించిన యెడల భగవంతుని సంపూర్ణ కృపా కటాక్షములు తప్పని సరిగా మనకు లభించవు. ఇతిహాసమునందు ఎన్నో మంది రాక్షసీ మరియు అసురీ ప్రవుత్తిచిత్తులైన వారు అమరత్వ ప్రాప్తినకై ఘోర తపస్సులను చేసిన వారే. కానీ భగవంతుడు వారి అహంకార చిత్తము గమనించిన వాడై, వారి కోర్కెలను తగు పరివర్తనం గావించి వర ప్రధానమును చేయుట మనకి తెలిసిన విషయమే. ఇందున మనకు ప్రస్ఫుటఉదాహరణాలు హిరణ్య కశిపుడు, రావణా శురుడు ఇత్యాదులు. కానీ అదే సమయములో విభీషణుడు తన తపస్సు ఫలితముగా తనకు "సదా ధర్మమార్గాచరణ జీవన" వరము ప్రసాదించమని అడగగా, అతనికి "చిరంజీవత్వం" అనుగ్రహించాడు. తొమ్మిదవ శ్లోకము మొదలు పదునాల్గవ శ్లోకము పర్యంతము, భగవానుని అమోఘమైన విశ్వరూప వర్ణనం సంజయుడు గావిస్తాడు. భగవంతుని విశ్వరూపనగా అది ఎట్టిది ? విశ్వమంతటి నందు ఆ భగవద్ స్వరూపము సందర్శించడమనేనా ? అర్జనుడు ఆ యొక్క బ్రహ్మాన్డ రూపమునందు అసంఖ్యాకములైన ముఖములు, కన్నులు, ఆయుధములు, ఆభరణములు ఇత్యాదులు దర్శించగలిగెను. ఆ రూపము అనేకమైన దివ్య మాలలు ధరించి సుగంధములను అనులేపనము గావించి దేదీప్యమానముగా విరాజిల్లుతుండెను. అనంతములైన సూర్యుల కాంతి కన్నను ఆయన యొక్క తేజము హెచ్చిల్లుతూ ఉండెను. ఈ దివ్యరూప వర్ణనము సంజయుడు ఎవని తో చేయుచుండెను ? ధృతరాష్ట్రుని తోనే గదా ? ధృతరాష్టునికి కృష్ణుని దివ్యమహిమలు నూతన విషయములు గావు గదా ? కౌరవ పాండవుల సంధి ప్రయత్న సందర్భములో శాంతి దూత విచ్ఛేసిన శ్రీ కృష్ణుడు, ఆ గుడ్డి రాజు తన మహిమల ప్రభావములను గుర్తెరెగి అయినను జననష్టదాయకమైన యుద్ధము ను విరమిస్తాడేమోనన్న భావనతో అతనికి తన యొక్క విశ్వరూప సందర్శన భాగ్యము ను ప్రశాదించెను. ఇంతటి పరమోతృకృష్టమైన దివ్య దర్శనం గావించినను ఆ కౌరవ రాజు యుద్దమునకే ఎందువలన మొగ్గు చూపెను ? కృష్ణుడు ధర్మ పక్షపాతి కదా, తదునుగుణంగా ఆయన యొక్క విశేష కరుణ పాండవుల పట్ల ఉన్నదని తెల్సి కూడా కౌరవులు ఈ ఆత్మహత్యాసాదృశ్యకమైన ఈ యుద్ధమునకు దుస్సాహసించెను ? ఈ సర్వ జగత్ పరమాత్మ యొక్క లీలా మయా వినోదనమునకు వర్తించుచున్నదన్న విషయం మనకు అవగతమవవలెను కదా ? భాగవత కథా సందర్భమునందు కూడా శ్రీ కృష్ణుడు యశోదా మాతనకు ఈ సకల విశ్వము తనయందే నిండి ఉందన్న సత్యము ఆవిష్కరింప చేసెను గదా ? కానీ ఆమె ఆ సర్వేశ్వరుని మాయా మోహమునకు లొంగినదై తదుపరి క్షణము నిండి కృష్ణుని తన యొక్క గారాల పట్టి అనే వ్యవహరించెను కదా ? ఈ మాయనుండి విముక్తి పరమయోగీశ్వరులకు కూడా అసాధ్యము అయిన యెడల సామాన్యులకు ఏమి సాధనం, ఆ పరమేశ్వరుని సంపూర్ణ శరణాగతి తప్ప ? భగవంతుని విశ్వరూపమును దర్శించిన అర్జునుడు ఆనందతన్మయత్వం తో ఆ రూపము ను కీర్తించ సాగెను. ఆ భగవంతుని అనంత బాహువులు, పాదములు సర్వత్ర వ్యాప్తి చెంది ఉండెనట. ఇదే మాదిరి ఆ లీలామానుష రూపమును పురుష సూక్తము కూడా వర్ణిస్తున్నది. స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః । స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ । స భూమిం॑-విఀ॒శ్వతో॑ వృ॒త్వా । అత్య॑తిష్ఠద్దశాంగు॒లమ్ ॥ అర్జునుడు ఆ స్వామిని కీర్తిస్తూ, ఈ సర్వ జగత్తు నీ యొక్క కనుసన్నలనలోనే చరిస్తున్నది. కఠోపనిషత్తు నందు పేర్కొన్నట్టు భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్యః భయాద్ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః సకల దేవతలు నీ యందు మిక్కిలి భయావర్తులై తమ తమ కర్తవ్యములను ఆచరిస్తున్నారు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని । కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ఈ యొక్క భయానక రూపమును చూచిన వీరాధివీరుడు, విజయనామధేయుడైన అర్జునుడు భయకంపితుడై కుపితుడై ఉన్నాడు. సృష్టి స్థితి లయకారకుడు ఆ భగవానుడే. ఇచట అర్జునుడు స్వామీ యొక్క లయకారక స్వరూపమును దర్శించు చున్నాడు. ఆయనచే తన యొక్క సకల బంధుజనములు, మిత్రులు గ్రసించబడుచున్నారు. అర్జునుడు మిగిలిన పాండవులతో పోలిస్తే కృష్ణుని తో మిక్కిలి సమయం గడిపి ఉన్నాడు. కృష్ణ సోదరి అయినా సుభద్ర ను పరిణయమాడి అతనితో బంధుత్వం కూడా సంపాదించు కొన్నాడు. అయన తనకు సముడనే భావన తోనే తన యొక్క రథసారధ్య భాద్యతను కూడా కృషునికి ఇవ్వ అంగీకరించాడు. అయితే ఇప్పుడుకృష్ణుని పట్ల అతనికి ప్రేమ భావన బదులుగా భీతి భావన కలగసాగింది. భగవంతుని సాకార రూపము చూసిన పిమ్మట భీతి భావన కలిగిన మరొక సందర్భం దుష్టసంహారణ కొరకై వెలిసిన నృసింహ అవతార మప్పుడు. ఆ సమయమునందు సమస్త దేవకోటి భయభ్రాంతులై ఆయన రూపమును ఉపసంహరింపమని మరల ప్రహ్లాదుడినే వేడుకొన్నారు ఈ యొక్క మహోతృకృష్టమైన స్వరూపం ని చూసిన అర్జునుడు భయాక్రాంతుడై ఆ భగవంతుని హేతువు మరియు ప్రవృత్తి లను తెలియసుకొనగోరాడు. హే అర్జునా - ఈ సకల విశ్వము, ఘటనలు, ప్రసిద్ధ జనులు, సంస్కృతులు, భాషా స్వరూపములు అన్నియూ కాలగర్భమునందు కలియవలసినవే. భగవానుడే ఆ కాల పురుషుడు. నీవు ఒక నిమిత్తునవి మాత్రమే. ఈ ప్రతిపక్ష సైన్య హతమునకు నీ ప్రమేయాప్రమేయములు అనవసరము. ఈ సృష్టిలోని సకల దేవతా దర్శనము అర్జునుడు ఆ యొక్క విశ్వరూపమునందే గాంచెను. ఆయన ఈ యొక్క సృష్టి కార్యనిర్వహణార్థముకొరకై ఈ దేవతల నియోజించెను. ఇంతటి మహాత్ముని యెడల అర్జునుడు తన యొక్క సఖుడని తలంచి అజ్ఞానంతో చేసిన తప్పిదాలను గుర్తు తెఛ్చి కొని ఆటను పశ్చాత్తాపము చెంద సాగెను. ఈ సందర్భములో మనకు సుపరిచితమైన వెంకటేశ్వర స్త్రోత్ర ము లోని ఈ పంక్తులు జ్ఞాపకము రాక మానవు కదా అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే । క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ హే స్వామీ - నా యందు అపార కృపా కటాక్షములతో నీ యొక్క అమోఘమైన విశ్వరూపము ను నాకు చూపినావు. కానీ నీ యొక్క భయానక స్వరూపము నేను చూడలేకున్నాను. నా యందు దయవుంచి, నీ శాంతాకారమును మరల స్వీకరించు, అని ప్రార్ధించెను. ఈ అధ్యాయము చివరలో భగవానుడు మన అందరి యందు అమిత ప్రేమా వాత్యలాలతో "ఎవరైతే నా యందు నిష్ఠ తో నిరంతరం నన్ను సేవింతురో, సర్వ ప్రాణిల యందు ద్వేషరహితులై ఉండెదరో వారు మాత్రమే నన్ను చెర గలుగు తారు " అని సందేశం ను ఇ చ్ఛేను

No comments:

Post a Comment