Thursday, March 17, 2016

భారత మాత కి జై

జన్మంతా నికృష్టమైన ఘోరాలూ, పాపాలు చేసినా ఆ చివరి క్షణములో "నారాయణా" అంటే చాలు, ఏ రికమండేషన్ అక్కరలేకుండానే,VIP దర్శనాలు కూడా ఆపేసి స్వామి వారి చరణారవింద కటాక్షం కలగ చేస్తార"ట".

మళ్ళీ "ట" లు,  "టపాకాయలు", ఏంటీ.. కళ్ళు పోతాయి వెధవ అనుమానము నువ్వునూ !!

అయ్యో భలే వారే.. మన శాస్త్రం లో చెప్పిన తర్వాత మళ్ళీ అనుమానమా!! కాక పొతే ఒక చిన్నపాటి సందేహం!!

మరి కానీ.. ఇంకా ఆలశ్యం ఎందుకు. వదులు .. 

అంటే, వాడుగా ఆ జీవుడు అనక పోయినా,  ఎవడైనా అంటావా లేక చస్తావా అని మెడ మీద కట్టి పెట్టి నప్పుడు, సరేలే అంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ నాలుగక్షరాలు అని గుటుక్కు మన్నాడే అనుకోండి, అప్పుడు కూడా వైకుంట వాశి అవుతాడా అని... 

చిక్కు ప్రశ్నే !! దీనికి సమాధానం స్లోగన్లు ద్వారా దేశోద్దారణ చేద్దామనుకొంటున్న RSS పెద్దలని అడిగితే విటమిన్-డి పాలలాంటి చిక్కటి సమాధానం దొరకొచ్చు అనుకొంటా. 

బానే ఉంది.. అయినా "హిందూ" దేశ అభిమానులు ఏమంత తప్పు చేశారని ఇప్పుడు మిగతా పెద్దలంతా కల్సి మూకుమ్మడి గా ఇంత హడావుడి చెయ్యలట. ఆ చేసేదేదో, 19 వ శతాబ్దం లోనే, కిరణ్ చంద్ర చటర్జీ వ్రాసిన "భారత మాత" నాటకాన్ని బహిష్కరించుంటే ఏ గొడవ ఉండేది కాదు కద. పోనీ, ఆ రోజుల్లో స్వతంత్ర సమరావేశం లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చి పోయామండీ అనుకొందామంటే, వారణాశి లో మహాత్మా గాంధీ గారు "భారత మాత" గుడి అవిష్కరిస్తూ, ఈ స్వరూపం కుల మత తత్వాలకు అతీతం గా అందరికి ఆరాధ్యం అవుతుంది అని అన్నప్పుడు, అయ్యా బాపూజీ !! బాగానే ఉంది గాని, మేమంతా ఈ కొత్త దేవత ని అంగీకరించాలంటే, కొన్ని మార్పులు చేర్పులు చేయ వలసి ఉంటుంది. మచ్చుక్కి, ఈ  భారత మాత కాషాయం కి బదులు ఆకూ పచ్చ చీర కట్టండి.. అసలు చీర కాకుండా శాల్వార్ కమీజ్ వంటి వస్త్ర ధారణ చేయించ గలరా ?? ఇంకా మాట్లాడాలంటే, భారత "మాత" కి బదులు "మియా" , "బాబు" లేక "భాయ్" వంటి ఇత్యాదులు ని ఖాయం చెయ్యగలరా అని అడిగుండవచ్చు కదా. పోనీ, గాంధీ గారంటే భక్తీ శ్రద్దలతో అడగాడినికి మొహమాట పడ్డారనుకొన్నా, కాంగీయుల అరవై సంవత్సరాల పాలన లో భారత మాత చల్లని చూపులతోనే, కుల మత వర్గ ప్రాంతీయ విభేద రహిత (భరిత) నవ సమాజ నిర్మాణం ఎటువంటి మొహమాటాలు లేకుండా నిర్మించుకోన్నాము కదా. 

అతి తెలివి ప్రదర్శించ కండి !! అప్పటికి ఇప్పటికి సాపత్యమా ? ప్రభుత్వం అంటే బజారు రౌడీలా ? మేం ఏమి, ఎంత, ఎలా తినాలో, మాట్లాడాలో దిశా నిర్దేశం చేస్తూ ఉంటే గాజులు తొడుక్కొని కూర్చోవాలా? (మీకు తెలియదేమో మొన్న మహిళా దిన ఉత్సవ సందర్భం గా "గాజులు తోడుక్కోవడం" అన్న ప్రయోగాన్ని నిషేదించడం అయినది). మొన్నటికి మొన్న ఉత్తర ప్రదేశ్ లో గో మాంసం తిన్నాడన్న నెపం మీద చంపేయడం అయినది. ఏ మేము ఈ దేశ వాశులం కాదా?? ఏంటీ నిభంధనలు ?? 

ఎక్కడో మారు మూల గ్రామంలో, ఎవరో కొంత మంది అతి వాదులు చేసిన మురికి కి  జాతి మొత్తం పసుపు నీళ్ళు చల్లు కోవాలంటే ఎలా? దాని కోసం  మీరంతా చేసిన గోల అంతా ఇంతా? ఒక ప్రముఖ సినీ నటుడు మొత్తం దేశానికే "అసహన" రోగం వచ్చిందని అని అన్నాడే ? ఏదో ఒక సాకు పెట్టుకొని అధికారానికి రాలేదన్న అక్కసు నంతా మొత్తానికే వెల్లడి చేస్తున్నారు కద. ఆ మధ్య ఏమీ పస లేని లలిత్ మోడీ వ్యవహారాన్ని భుజాన వేసికొని ప్రతిపక్షం మొత్తం వర్షా కాల సమావేశాలు సమయాన్ని "మూర్చ" రోగం వచ్చిన వాళ్ళ కి మల్లే అరుపులు కేకలు తో హొరెత్తించారే ? (అది మొదలు పాలక పక్షం ప్రతినిధులు మూర్చ రోగ ఉపశమనానికి తాళల గుత్తులు పక్కనే పెట్టుకొని తిరుగుతున్నట్టు వినికిడి). 

అవును !! ఆర్ధిక కుంభకోణాలు మేము ఈ మాత్రం సహించము గాక సహించము. (అదే విధం గా ఆర్ధిక కుంభకోణాల పై విచారణలు కూడా). సరే అసలు విషయానికి వస్తే, ఈ బాజాపా ప్రభుత్వం లో కనీ వినీ ఎరుగని రీతిలో పర మత అసహనం ఏర్పడింది.  హిందువులు కాని వారందురూ, ఆత్మ న్యూనతా మరియు అభద్రతా భావం తోను మనుగడ సాగిస్తున్నారు అన్నది అవునన్నా కాదన్నా అక్షర సత్యమ్. ఇలాంటి భావన ఏనాడు స్వతంత్ర భారతం లో ఇనాటి వరకు కలగనే లేదన్నవిషయం గమనించాలి 

నిజమే?? విభజన అప్పటి విషయాలు అప్పటి కొంత భావోద్వేగాలు అని పక్కన పెట్టినా, 84 లో తలపాగా కట్టిన వాడికి తల నీడ లేకుండా చేసిన సంఘటనల మాటో ?? ఇందిరమ్మ ని పొట్టన పెట్టుకొన్న ఇద్దరి సిక్కుల పాపానికి (పుణ్యానికి), మొత్తం జాతిని అత్యంత సహనంగా అసహనానికి గురి చేసిన ఘనత మాట అప్పుడే మరిచారా? కాశ్మీర్ లో వందలకొద్దీ పండిట్ లను ఊచకోత కోసి, సుమారు అయిదు లక్షల మందిని నిరాశ్రయులు చేస్తే, "ష్ !! గప్ చిప్" గా ఉండండి అని నిజాన్ని సమాధి చేసిన ఘటనలు మాటో ? త్రిపుర లో సరస్వితి, దుర్గా పూజలని క్రైస్తవ ఉగ్రవాదం తో దగ్గర ఉండి నిషేదింప చేయడమే కాక అడ్డొచ్చిన హిందువులని ఆ అమ్మలకే బలి ఇచ్చారు? బాబ్రీ మస్జిద్ పొగ పెట్టి ఆ మంటల్లోనే చలి కాచుకొన్న సంస్కృతి మీది !! ఈ కుహనా సిద్ధాంతాలకి కాలం చెల్లింది కాబట్టే సమస్త ప్రజ మిమ్మల్ని పక్కన పెట్టింది.. మీరు భారత దేశం ని చిన్నా బిన్నం చేసిందే కాకుండా, మీ దృతరాష్ట్ర ప్రేమతో కొన్ని విష సర్పాలని పాలు పోసి పెంచారు. ఇప్పుడు అవి కాటు వేయించుకోక పొతే అలక పాన్పు ఎక్కుతున్నాయి. వీటి కోరలు పీకాల్సిందే !! చేసి చూపిస్తాం కూడా

అంతవరకు మిమ్మల్ని ఉండనిస్తే చూద్దాం. అయినా మీ ఒక్క విపరీత ధోరణి వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతోందో గమనిస్తున్నారా? ఇంత కాలం ఆక్షేపణ లేని "భారత మాత" ని తల మీద కత్తి పెట్టినా నెత్తురు ఇస్తాడు కాని తల్లి (దేశ) ప్రేమ ని ఒప్పుకొనంటున్నాడు ఒక పెద్ద  మనిషి. దేశం కోసం ప్రాణం ఇవ్వాల్సిన యువ రక్తమే, అదే దేశ వినాశం కోసరం నినాదాలు ఇస్తోంది !! ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ  నటులు,కళా కారులు, విద్యార్ధి సంఘాలు మరియు కొంత మేరకు పత్రికా రంగం ఈ ఒరవడికి వత్తాశు పలుకుతోంది. చూశారా, మీ నిర్వాకం  ఎటువంటి పరిణామాలకి దారి తీస్తోందో? 

ఏమి చేస్తాం ?? పదవీ కాంక్ష తప్ప మరేమి కానని డొల్ల రాజకీయవాదుల నించి ఇంకేమి ఆశించగలం ?? స్వదేశం లో ఉంటూ, దేశాన్ని  ప్రేమించమనడం అంత చేదు అయిపోయిందా? చరిత్ర లో అభ్రహమ్ లింకోన్, చర్చిల్ ఇలాంటి నేతలంతా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల దేశ నిర్మాణానికే కదా ప్రజలని ప్రాణాలైన ఇమ్మని ప్రభోదించారు ? అప్పట్లో, యూనియన్ సేనలు నివ్వు చెప్పావు కాబట్టి మేము దేశాన్ని ప్రేమించాము అంటే ఏమయ్యేది? మరి ఇప్పడు మీరు అంటున్నారు కాబట్టి "భారత" దేశ కీర్తిని మేము అంగీకరించం అన్న వాళ్లకి వత్తాసు పలికే పెద్ద మనుషలని ఏ  విధం గా అర్ధం చేసికోవాలి?

మన అదృష్టం ఏంటంటే ప్రతీ విషయంలోనూ, ఈకలు ఏరడం  మరియు భూతద్దాల్లో చూడడం లాంటి పనులు బహు కొద్ది మంది మాత్రమే అత్యంత సమర్దవంతం గా చేయడం వల్ల, మిగతా చాల శాతం వ్యవస్థ దాని అంతట దానిగా నడుస్తోంది, పరిగెడుతూనే ఉంది . ఇదే సమయంలో, విజయ్ మాల్య లాంటి ప్రబుద్దులు  వేల కోట్లు బకాయిలు పెట్టి దేశాన్నివదిలి యదేచ్చగా విలాసంగా విహారాలు చేస్తూనే ఉన్నారు. భారత మాత కి జై అన్నా లేకే పోయినా సరిహద్దు లో సైనికులు ఎండనక, వాననక  మంచు కొండల్లో ప్రాణాలు నిలపెట్టుకోవడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆవలి దేశం నించి ఉగ్ర వాద దాడులు కోన్ సాగుతూనే ఉన్నాయి, మన సైనికులు శక్తివంచన లేకుండా వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశ సామాన్య పౌరుడు నిత్య జీవన సంగ్రామం చేస్తూనే అయిదేళ్ళ తర్వాత వచ్చే ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగస్వామ్యం అవడానికి ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోగా తనకి ఇష్ట మైన రీతి లో "జై హింద్" అని గాని "భారత్ మాత కి జై"  అని గాని అప్పుడప్పుడు అంటూ తన దేశ భక్తి వ్యక్త పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు 

Wednesday, October 23, 2013

సచిన్ శకం

  • ఈ బొంబాయి కుర్రాడికి 16 సంవత్సరాలే అట !!
  • గవాస్కర్, విశ్వనాథ్ వీళ్ళు ఎవరు పనికి రారు అట !!
  • దొంగ వెధవలు !! చిన్న పిల్ల వాడు అని కూడా చూడ కుండా చూడండీ.. పాపం రక్తం ముక్కు నించి !!
  • మూడు సిక్సర్లు, ఒక్క ఓవర్ లో !! ఖాదిర్ గాడి మొహం చూడాలి !!
  • ఏంటీ వరల్డ్ రికార్డా !! ఇంత కన్నా చిన్న వాడు ఎవడయిన టెస్ట్ సెంచరీ కొట్టాడా?
  • వన్ డే లో ఓపెనర్ గా ఇరగ దీశాడు గా !! 49 బాల్స్ లో 82..
  • సరే నయ్య !! అసలు వన్ డే లో సెంచరీ కొడతాడ అని !!
  • మొత్తానికి 79 మాచేస్ ఆడితే ఒక్క సెంచరీ కొట్టాడు అండీ!!
  • ఇసుకతుఫాన్ వచ్చింది అంటే నమ్మండి !! స్టీవ్ వా గాడి మొహం చూడాలి !!
  • బాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అన్నీ ఒక్కడే చెయ్యాలి అంటే కష్టమే మరి !! అయినా ఏమీ చేస్తాడు అండీ మిగతా వాళ్ళు దండగ మారిన వెధవలు అయితే !!
  • అన్యాయం గా అఖ్తర్ గాడు సచిన్ ని అవుట్ చేసాడు అండీ !! కొంచం నీతి జాతి ఉంటె మళ్లీ వెనక్కి పిలిచి ఉండే వాళ్ళు !!
  • చెన్నై లో పాకిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ 
    • కష్ట పడి 136 కొట్టాడు కాని పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిపించ లేక పోయాడు అండీ !! అయినా సచిన్ సెంచరీ చేస్తీ ...
    • నోరు ముయ్యి !! విపరీతమైన బ్యాక్ పైన్ పాపం !! అయినా సచిన్ ని అనే వాడివి అయ్యావా ?? ఎంత ధైర్యం ??
  • కెప్టెన్  గా పనికి రాడండీ !! అబ్బే లాభం లేదు !!
  • సచిన్ భార్య అయిదు సంవత్సరాలు పెద్దది అటగా??
  • సచిన్ నాన్న చని పోయాడు. 
    • పాపం అండీ !! మన సచిన్ వాళ్ళ నాన్న చని పోయాడు అట 
    • అయితే, దేశం కోసం అడాల్సిన వరల్డ్ కప్ మధ్యలో ఇంటికి వస్తాడ?
    • వాళ్ళ అమ్మ చూడండీ !! అదే మాట అతనితో చెప్పి మల్లి వెనక్కి పంపింది అట 
  • సచిన్ ఎల్బో ఇంజురీ 
    • సచిన్ పని అయిపొయింది !!
    • టెన్నిస్ ఎల్బో అని... పాపం అండీ !! ఎట్లా ఇండియా టీం ఇంక 
    • అబ్బే !! ఇక లాభం లేదు... ఇదివరకు లాగ అయితే ఆడలేడు 
  • లక్ష్మన్, ద్రావిడ్ ని చూడండి !! సచిన్ ఒక్క రోజు అయినా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడ ?
  • సచిన్ బ్రాండ్ అంబాసిడర్  అయి పోయాడు !! అంత డబ్బు కోసమే నండి.. ఈ హడావుడి అంతా 
  • వన్ డే డబల్ సెంచరీ 
    • అస్సలు ఊహించమా? మన లైఫ్ టైం జరుగుతుంది అని అనుకోలా 
    • సర్లే వయ్యా !! ఇంకో రికార్డు... అంతేగా !!
  • సచిన్ ఇంకా ఒక చిన్న డబల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ లో ఉంటాడు అట. నిజం గా గ్రేట్ అండీ 
  • పాకిస్తాన్ మీద చేల రేగి పోయాడు గా !! వరల్డ్ కప్ లో వాళ్ళ వాళ్ళ కాదు మన మీద గెలవడం !! ఇప్పటి దాక ఆడింది ఒక ఎత్తు, ఇప్పుడు కొట్టిన 95 ఒక ఎత్తు !!
  • సచిన్ కి భారత రత్న ఇవ్వాలి అండీ 
  • ఫైనల్ లో ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ !! సచిన్ ఏమి పీకాడండి.. లారా, పాంటింగ్ చూడండీ !! ఇంపార్టెంట్ మ్యాచ్ లలో చెలరేగి పోతారు 
  • ఇంగ్లాండ్ మీద నాలగవ ఇన్నింగ్స్ లో సెంచరీ !! అందరి నోళ్ళు మూయించాడు గా !!
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ఆస్ట్రేలియా లో చూసారా !! పిచ్చ ఫారం లో ఉన్నాడుగా !! సెంచరీ మీద సెంచరీ 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ఆస్ట్రేలియా పిచ్ ల మీద సచిన్ ఒక్కడే ఇంత క్లాసు గా అడగలడు !! (లక్ష్మన్ కన్నానా)
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • మళ్లీ  వరల్డ్ కప్ వచ్చింది గా ?? సచిన్ దీని తర్వాత అయినా... 
  • మళ్ళీ వరల్డ్ కప్ లో మాక్సిమం రన్స్ సచినే 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • 30 సంవత్సరాలు అయిన తర్వాత, మొత్తానికి ఇండియా మళ్లీ వరల్డ్ కప్ నెగ్గారు కదా 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • ప్రతి ఒక్క పిల్ల నాయాలు సచిన్ ని క్లీన్ బౌల్డ్ చేస్తున్నారు ఈ మధ్య 
    • సచిన్ రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ వన్ డే నించి రిటైర్ అవుతున్నాడు అట 
    • సచిన్ టెస్ట్ మాచేస్ నించి రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ రాజ్య సభ కి ఎంపీ గా అయ్యాడు అట !!  
    • సచిన్ టెస్ట్ మాచేస్ నించి రిటైర్మెంట్ ఎప్పుడు అండీ ??
  • సచిన్ ఇంకా క్రికెట్ ఆడడు అట.. అయ్యో !! ఇంకా చూడమా ఇంకా సచిన్ ని 
24 సంవత్సరాలు పాటు, తన చుట్టూ నోళ్ళు ఆడుతున్నా, తనని కాదు అని అన్నట్టు గా అతను తనకి తెల్సిన పని చేసికొంటూనే ఉన్నాడు.
ఒక సుశిక్షితుడైన సైనికుడు లాగ 
ఒక కర్తవ్య నిమగ్నుడైన కార్మికుడు  లాగ 
ఒక ఔత్సహికుడైన విద్యార్ధి లాగ 
ఒక నిజాయితి పరుడైన పౌరుడు లాగ 

Saturday, August 31, 2013

ఈ రోజు ముక్ష్యాంశాలు

 "హైదరాబాద్ లో ఉన్న వారంతా తెలంగాణ వారే" -  దామోదర  (జ్యోతి)
"హైదరాబాద్ అందరిది" - తెదేపా ఎమెల్యే లు (ఈనాడు)
"ఇంకా వెయ్యి ఏళ్ళు అయినా హైదరాబాద్ సీమంధ్ర వాళ్ళది అవదు" - హరీష్(జ్యోతి)
"హైదరాబాద్ లో సభ జరిపే హక్కు సీమాంధ్రులకు లేదు" - నాగం (జ్యోతి)
"రాజ్యాంగ బద్దం గా ఎవరు అయినా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు" - డి ఎస్ (జ్యోతి)
"సీమాంధ్ర వాదనలో న్యాయం ఉంది" - చంద్రబాబు (ఈనాడు)
 "తెలంగాణ రాష్ట్రం ఆపే శక్తి ఎవరికీ లేదు" - మధు యాష్కి(జ్యోతి)
 "తెలంగాణ ప్రక్రియ ని వేగవంతం చేయాలి" ఉద్యమ నిర్మాత నాయకులు (ఈనాడు)
"తెలంగాణ ని విభజించి ప్రభుత్వం తప్పు చేసింది"  మధు సూధన్ గుప్తా (సాక్షి)
"తల మొండెం వేరు చేయద్దు" - సచివాలయ ఉద్యోగులు (ఈనాడు)
"విభజిస్తే సీమంద్రకారం" - ఎవరో (సాక్షి)
"ముఖ్య మంత్రిది  అవకాశవాదం" - కోదండ రామ్ (ఈనాడు)
"జగన్ నిరాహార దీక్ష ఎందుకు ఎవరి కోసం" - మోత్కుపల్లి (జ్యోతి)
"ఏడు రోజుల దీక్షతో నీరశించిన జగన్" - నిమ్స్ వైద్యులు (సాక్షి)
"దీక్షలు బగ్నం చేసినా ప్రజల మధ్యనే ఉంటాం" - విజయమ్మ (సాక్షి)
"యాత్ర ఎందుకో చెప్పండి" - ఎ పీ ఎన్ జి ఓ సంఘం అద్యక్షుడు (ఈనాడు)

మాకు  స్కూల్ ఫంక్షన్ లో వార్తలు ని పేరడీ చేసి చదివే ప్రోగ్రాం ఒకటి ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు అవి ప్రత్యేకం గా అక్కరలేదు అనుకొంటా. తెలుగు వాడికి విస్తర్లో అమ్మ (తెలంగాణ తల్లి అయినా, తెలుగు తల్లి అయినా) అన్నీ పెట్టినా, అవకాయో లేక గొంగురో లేదు అని అక్షేపిస్తాడు అట. తెలుగు పేపర్లలో, టీవీ ల్లో గత నాలుగు సంవత్సరాల నించి రకరకాల పచ్చడ్ల పండగే. కాకా పొతే తిని తిని (విని చదవి) కడుపు నెప్పి ఎక్కువ అయినట్టు ఉన్ది.





Sunday, August 11, 2013

ధర్మాచరణ

మనం ఇది చాల సందర్భాల్లో వింటూ ఉంటాము. యుద్ధం లో సైనికుడు ఒక శత్రువుని మరియు ఒక పచ్చి ఉన్మాది మానవత్వం ఊహించని విధంగా అన్నెం పున్నెం తెలియని అమాయకులని చంపడాన్ని రెండింటిని "హత్య" అని అనడం లెదు. మొదటిది కర్తవ్యమ్ అయ్యి ఆ దేశ ప్రజలచే కొనియాడ బడితే రెండో దాన్ని అత్యంత హేయమైన కిరాతకం గా చిత్రీకరించ బడుతుంది. ఒకటి వృత్తి ధర్మం అయితే రెండవది అధర్మం అంటున్నారు.

రామాయణం లోని అరణ్య కాండ లో శ్రీ రాముడు భరద్వాజ ఆశ్రమం లో సీతా లక్ష్మణ సహేతుడై ముని ని తన ఆశ్రమ నిర్మాణానికి ఒక అనువైన ప్రదేశం సూచించ మని అడుగుతాడు. ఆయనే శ్రీ మహా విష్ణుడిగా గుర్తు ఎరిగిన మహర్షి రాముడిని అక్కడే అరణ్యవాసం చేయమని కోరతాడు. దానికి శ్రీ రామ చంద్రుడు, సున్నితంగా నిరాకరిస్తూ తన ధర్మం ఋషులతో గడపడానికి సమ్మతించదని చెప్పి నిరాకరిస్తాడు. పైగా ఒక ఉదాహరణ చెపుతూ మీ ఆశ్రమం లో ఉండే సాదు జంతువులని క్రూర మృగాల నించి రక్షించే క్రమం లో నేను వాటిని సంహరించి నప్పుడు, మీ మనస్సులు ఏ  సందర్భం లో అయినా కష్టం కలిగి నాకు అకారణ శాపంనకు కూడా కారణం అవచ్చు అని చెపుతాడు. నిజంగానే అన్ని భూతాల్లో ఒకే పర బ్రహ్మం ని దర్శించే స్తాయి మహర్షికి ఉందని అదే ధర్మాన్ని దుష్ట శిక్షణ నిమిత్తమై వచ్చిన రాముడు పాటిస్తే అవతార ప్రయోజనం నేరవేర్చేది ఎలా?

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.మత సంప్రదాయాల్లో పాటింపులు మరియు  పట్టింపులు వల్ల ఒకడిని ఒకడు కొన్ని వేల సంవత్సరాలు పాటు ద్వేషిస్తూనే ఉండటం దాని వల్ల చరిత్ర లో అతి దారుణమైన యుద్దాలు... అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. మరి అందరికి ధర్మ పరిశీలన చేయడం కుదురుతుందా?

ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. మదర్ తెరిస్సా తనకి ముక్కు మొహం తెలియని వాళ్లకి వచ్చి ఏ మాత్రం స్వార్ధం లేకుండా తన జీవిత కాలం సేవ చేసినది. విశ్వా మిత్రుడు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన "గాయత్రీ" మహా మంత్రాన్ని మానవాళి బుద్ది సక్రమం గా ప్రచోదనం చేసికొనే అవకాశాన్ని కలిగించి ఈ విశ్వానికి "మిత్రుడు" అయ్యాడు.ఇక్కడ ధర్మంని ధర్మం గానే దర్శించ వచ్చు.

కొన్ని సందర్భాల్లో ధర్మం సామాన్య ప్రజలకి అధర్మం గా కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీ షిర్డీ సాయిబాబా హైందవ సనాతన ధర్మం లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా వైదిక సంస్కృతి కి కట్టుబడి ప్రవర్తించినట్టు గా దాకలాలు లెవు. అనగా అయన ఈ కట్టుబాట్లకు అతీతుడు. అదే విధంగా శ్రీ కృష్ణుని బాల్యం లో అంతా చోర లీలలు గురించి భాగవతం లో చూస్తే, మన లాంటి వాళ్ళు అనుకరణ సాధ్యం కాని విధంగా ఉంటుంది. అనగా జ్ఞాని ని అనుకరిస్తే సామాన్యుల విషయంలో అది అధర్మంగా పరిగణింప పడుతుంది.

ఇంకొన్ని సార్లు, అధర్మ ప్రవర్తన బయటి ప్రపంచానికి ఉత్తమ మైన ధర్మం గా కనపడే అవకాశం ఉంది. మనం చాల మంది దొంగ సన్యాశులను చూస్తూ ఉంటాం. బయట ఎన్నో ధర్మ పన్నాలు చెపుతున్నా, అంతర్ముఖంలో బహు కుతంత్రాలు కుటిల నీతులు మాయం తో వారి జీవన పయనం ఉంటుంది. వీళ్ళతో చాల ప్రమాదం సమాజానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక పొతే అధర్మ ప్రవర్తన ఉండే అధర్మ పరులు గుర్తించడం కొంచం సులభమే అనుకొంటా.

మరి ధర్మ పరిశీలన ఇంత సంక్లిష్టం అయినప్పుడు తప్పొప్పులను ఎంచడం మన లాంటి వాళ్లకు సాధ్యమా? అలాగే జీవిత పర్యంతం తన ధర్మాన్ని ఎరిగి ఆచరణ చేయడం అంత సులభమైన విషయమా? మనం చాల మంది అంటూ ఉండడం చూస్తూ ఉంటాము. నాకు నా పరిధి లో నేను సక్రమం గా ఉంటె సరి పోదా అని. నిజంగా మనం అంత వరకు ఎటువంటి అంతర్మధన కు గురి కాకుండా సక్రమం గా విధి నిర్వహణ చేయ గలమా? ఎందుకు మన ధర్మం మన జీవన స్తితి ని బట్టి మరూతూ ఉంటుంది కదా. కొడుకు గా, తమ్ముడిగా, అన్నయ్య, భర్త గా, చెల్లెలు, అక్క, తల్లి, తండ్రి, స్నేహితుడు, పరిచయస్తుడు ఇట్లా రక రకాల స్తాయిల్లో రక రకాలు గా.

ఉదాహరణకి, యుధిస్టరుడు మొత్తం భారతం సర్వ పాత్రల్లో ధర్మానికి ప్రతీకగా చెపుతారు కదా. అయన ఎంత ధర్మానికి కట్టుబడ్డాడు అంటే, అజ్ఞాత వాశం ఉత్తర గోగ్రహణం లో అర్జనుడు బయటపడి పోయినప్పుడు, పాండవులు నిజం గా గడువు సక్రమం గా పూర్తి చేసారా లేదా అన్న మీమాంశ వస్తుంది. సరే యుద్ద భూమిలో ద్రోణ, భీష్మ మాటలు వినక తప్పక యుద్ధం కొనశాగించి అర్జనుని చేతిలో అవమానిమ్పబడిన కౌరవ రాజు కు భీష్మ పాండవ పక్షపాతి అని అనుమానం వీడక ఒక వేగు ని పిలిచి "ధర్మ రాజుని" ఈ సమస్య పై నివృత్తి ని కోరమని అడుగుతాడు. అంటే ధర్మ రాజు నిజం గా గడువు పూర్తి అయ్యింది అంటే, దుర్యోధనుడు ఇంక పై దాని గురుంచి ఆలోచించడు.అటువంటి ధర్మ వేత్త మరి భార్య ని అధర్మంగా పందెం లో ఒడ్డాడే అని మనకి అనిపించక మానదు. ధర్మ రాజు తాను ఓడాక భార్య ఒడ్దే అధికారం ఉంటుందా? అసలు భార్య ను పందెంలో ఒడ్డే అధికారం భర్త కి ఉంటుందా? కాని ఈ ధర్మ సూక్ష్మం తెలిసే ధర్మ రాజు అసలు తన్ను పందెంలో ఒడ్దే అవకాశమే లేదు అని పూర్తి గా నమ్మి నేను "ధర్మ" విజితనా లేక "అధర్మ" విజిత నా అని సభని ప్రశ్నిస్తుంది. తెలిసినా చెప్పితే కురు వంశం ఏమి అవుతుందో అని  భయ పడ్డ భీష్ముడు ఆ ప్రశ్న దాటి వేస్తాడు. వివరించిన వికర్ణుడిని స్తాయి లేదని కర్ణుడు నిలువరిస్తాడు. అసలు సర్వ స్వతంత్రుడై జూదం ఆడుతున్న ధర్మ రాజు ద్రౌపది ని పందెంలో పణంగా పెట్టనే లెదు. తన అధీనంలో ఉన్న రాజ్యాలని, సంపదని, తమ్ముళ్ళని చివరకి తన్ని పందెంలో ఒడ్డి కౌరవ రాజు అయిన దుర్యోధనునకు బానిస అవుతాడు. అప్పటి వరకు దుర్యోధనుని ప్రతినిధిగా జూదం ఆడుతున్న శకుని ఆజ్ఞ మేరకు ద్రౌపది ని చివరగా పందెం లో ఒడ్డుతాడు. ఆ సమయంలో శకుని ద్రౌపది నే కాదు మరి ఎవరి ని పందెంలో ఒడ్డమన్నా అతను ఆజ్ఞ పాలించవలసిందే. అతంక ముందు వరకు ధర్మ రాజు "రాజ" ధర్మం వహిస్తే ఆ తర్వాత "సేవక" ధర్మం పాటించాడు. సేవకుడి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అందులో సాధ్యాసాధ్యాలు చూసికొనే బాధ్యత యజమానిదె. ఒకవేళ తన్ని పందెంలో ఒడ్డే ముందర కనక ద్రౌపది ని ఒడ్డ మని శకుని సలహా ఇచ్చి అయన అది చేస్తే అప్పుడు ధర్మ రాజు అధర్మ పరుడో కాదో నిర్ణయించే అధికారం మనకి ఉండచ్చు.

మరి ఈ కత్తి మీద సాము లాంటి ధర్మాచరణ అందరికి సాధ్యమా? తన ధర్మాన్ని తను నిర్వత్తిస్తే భగవంతుడు హర్షిస్తాడా? స్వధర్మాన్ని పాలించే వాళ్ళకి సత్య దర్శనం కలిగి శోకం తొలుగు తుందా?  ఇదే ధర్మ రాజు యుద్ధం అయిన జరిగిన జన నష్టం ని చూసి విపరీతమైన శోకానికి గురి అవుతాడు. కాగ నిత్యం ధర్మ పరాయణుడైన అయన ఆ విధం గా శోకించడం చూడ లేక "కిమేకం దైవతం కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్నామానవా శుభం" అని భీష్ముడిని అడిగేలా చేసి అయన కి విష్ణు సహస్ర నామ స్త్రోత్ర సారము తద్వారా సత్య సందర్శనం కలిగేలా చేస్తాడు ఆ భగవానుడు.

మన స్వధర్మం మనం పాటించినప్పుడు, సంఘర్షణలు ఎదురు అయినా, దానిలో తప్పు ఒప్పులు ఆయనకే సమర్పించ గలిగి నప్పుడు ఆయనే భాద్యత వహించి మన్ని తరింప చేయ గలడు అన్నది ఇక్కడ మనకి అర్ధం అవుతుంది.

*** కొంత మంది మహాను భావులు చెప్పిన ఒకటి అరా మంచి మాటల సారాన్ని అక్కడ ఇక్కడ జోడించి రాసిన వ్యాక్యాలు ఇవి. అంతే కాని నేను ఇంత గంభీర మైన విషయాలు గురించి వ్రాసేంత ప్రాజ్ఞుడిని కాదు మరియు అర్హుడిని అంత కన్నా కానే కాదు.

Wednesday, December 19, 2012

ఏది నాది

రావు గారు మొత్తం జిల్లాలోకే  పేరుమోసిన మోతుబరి. స్వతహా గా దక్షత కలవాడు అవటం చేత వారసత్వంగా వచ్చిన దాన్ని పోషణ, పెంపకం తో పాటు ఇతరత్రా దాదాపు దేశం అంతా వ్యాపార కేంద్రాలు నెలకొన్నాయి. వ్యవహారానికి సొంత ఊరు "కొంత" అయిపోవడంతో, ఎంతో ఇష్టం అయిన ఇంటిని మరియు ఊళ్ళో ఉన్న పొలాలని  పినతండ్రి అల్లుడు, భూపతి దగ్గర వాడు అవడంతో బాటు పదిలం గా చూసికొంటాడు అన్న నమ్మకంతో అప్పచెప్పి పై రాష్ట్రం కి భార్య పిల్లలు తో వెళ్ళాడు. సహజం గా వ్యాపారం లో అందే వేసిన చెయ్యి అవడంతో రాణింపు కి ఏమి దొక లేకుండానే ఇంతింతై వటుడింతై అన్నట్టు గా కొద్దికాలం లోనే పేరు, హోదా, పరపతి అయన పరం అయ్యాయి. ఊరికి కొత్తలో చాల సార్లు, నెమ్మదిగా కొన్ని సార్లు, తర్వాత తప్పదంటే వచ్చే వాడు. పిల్లలు కూడా కొత్త ప్రదేశంలో అలవాటు అయిపోవడంతో,రాకపోకలు పూర్తి గా తగ్గాయి.


భూపతి కొత్తల్లో ఉత్త పుణ్యానికి మంచి హంగు ఉన్న ఇల్లులో ఉండనిచ్చి నందుకు ఎంతో కృతజ్ఞత తో ఉంటూ తర్వాత పెద్దగ పొలం లెక్కలు కూడా చెప్పనవాసం లేక పోవడం తో , నెమ్మది నెమ్మది గా కలిసి వచ్చిన ఆశ్వర్యం కి బాగానే అలవాటు పడ్డాడు. మొదట్లో మాటల  సందర్భంలో, "నాదేముంది అండీ !! అంతా రావు గారి దయ" నించి కొన్నాళ్ళు అయిన తర్వాత అయన ఉనికి తగ్గడం తో ఇదంతా తన ప్రయోజనమే అన్న మిడిసిపాటుకి అలవాటు పడ్డాడు. అందరికి తన యొక్క వైభవం అర్ధం అయ్యే "లాగా" తర్వాత "వరకు" విశీదీకరించే వకాల్త పుచ్చు కొని చాల వరకు సఫలీకృతుడు కూడా అయ్యాడు. కొన్ని ఏళ్ళు ఇట్లానే గడిచిన తర్వాత ఒక నాడు రావు గారు రావడం, విషయం అర్ధం అవ్వడం జరిగాయి. వెంటనే దేశానికే ప్రముఖుల్లో ఒక్కడైన అయన భూపతి రోడ్డు పాలు చేయడానికి పెద్ద సమయం పట్టలేదు అని చెప్పనక్కర్లేకుండా జరిగి పోయింది.


ఇది చాల మామూలు కధ లాగానే ఉంది కదా, దీన్ని గురించి ఇంత కష్ట పడ్డాడు అని ఆశ్చర్య పడుతున్నారా? కొంచం అలోచించి చూడండి, ఇది మన అందరి కథ లాగ అనిపించడం లేదండీ? మనం ఏదీ అడగకుండానే మొత్తం సృష్టి మొత్తం ప్రకృష్టమైన శరీరం అనే ఇల్లు ఇచ్చి దానికి తోడు మాట, ఆలోచన అనే ఆస్తులు కూడా  జోడించిన తర్వాత ఆ పరమాత్మ ఎప్పుడైనా మన నించి ఏమీ ఆశించకుండా ప్రేక్షకుడి గానే మిగిలి ఉంటున్నాడు. అయితే ఈ ప్రపంచం ని "నా" అద్దం లోంచి చూస్తూ చివరికి ఇదంతా నా ప్రయోజకత్వమే అన్న భావజాలం నించి చివర వరకు బయటకు రాలేక పోతూ అంతా నాది అంటూనే చివరకి ఏమీ మిగలకుండా ఈ శరీరం లోంచి బయటకు నెట్టివేయ బడుతుంటాం. ఈ విషయమై రామాయణ అంతర్గతంగా ఒక ప్రస్తావన ఉంటుంది.

అరణ్య కాండ లో భరతుడు, రాములి వారిని తిరిగి  అయోధ్య కి రమ్మని శత విధాలు గా ప్రాధేయ పడతాడు. చుట్టూ వున్న మంత్రులు, పరివారం చివరకి  కైక కూడా ఆయన్ని బ్రతిమాలిన కూడా, పితృవాక్య పరిపాలనకి బద్దుడైన కారణానికి, రాముడు తిరిగి అయోధ్యకి రాలేడు అన్న నిర్ణయం నిర్ధారణ అవుతుంది. దేశం రాజ హీనం అవ్వకూడదు అన్న కారణానికి, వన వాసం గడువు పూర్తి అయ్యే వరకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని అక్కడే ఉన్న మంత్రి ఒక ప్రస్తావన చేయడం జరుగుతుంది. అప్పుడు భరతుడు ఒక్క సారిగా ఏదో దొంగతనం జరిగి తున్నట్టుగా ఉలిక్కి పడతాడు అట. "నాది" కాని దాన్ని ఈ విధంగా అనుభవించమని చెపుతారు ఆ మంత్రి గణాన్ని ప్రశ్నించడం జరుగుతుందని వ్యాఖ్యానం. చివరకి "రాముని" ప్రతినిధి గా రాజ్యం ఏలుతాను అని ఒప్పుకొని అయన "పాదుకలు" కి పట్టాభిషేకం జరుపుతాడు.

భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుత శరీరాన్ని ఒక పరికరంగా భావిస్తూ ఈ ప్రాపంచిక భోగాలని అనుభవిస్తూనే, నిత్యం ఈ నాది కాని  దాన్ని "సాక్షి భూతం" గానే చూడమని ప్రాజ్ఞులు హెచ్చరించారు. ఎవరో నూటికో కోటికో ఒకటి అర ఈ సత్యాన్ని తెలుసు కొని తరించారనుకొంటా. అంతెందుకు అండీ ఇప్పడి వరకు వ్రాసింది కూడా "నా" ప్రజ్ఞే అని తలచుకోవడం లోనే తెలుస్తోంది, మనం ఏ పాటి బొంట్లమో అని.

Friday, March 23, 2012

యుగాది

In the universe that we are in, you can witness everything has a begining, growth and decay. In Sanatana Dharma, all devine virtues are associated as per natural order of the universe. The nature is in pause state during the winter and springs back into action at the begining of Chaitra Masam. Yuga + Aadi means "begining of new era". The pournami (Full Moon) that occurs in the month of Phalguna Masam is called "Kamuni Punnami" (HOLI) in telugu regional dialect. And Amavasya thats followed is (No Moon) called "Soonya Amavasya". Is there any mythological signicance for this? While, TarakaSura, the cruel demon was troubling all worlds with his atrocities, all sane people were waiting for the son of Shiva & Parvati. As they know,only Lord Subramanyeswara can put an end to this siffering and they encourage Manmadha to invoke Love between Lord and Lordess. (On the day of Kamuni Punnama). As Lord Shiva gets angry and turn Manmadha into ashes, there is no "Want" left in the universe and everything became absolute stand still for next 15 years in the Lord Brahma calendar. Again, with absolote love and kindness towards entire universe, Lord orders Brahma to resume creation (Srushti) on this auspicious day of UGADI. Lets welcome ShobhaKrit year with anticipation of new begining. సృష్టి లో అన్ని మొదలవుతాయి, వృద్ది చెందుతాయి, అలాగే అంతం అవుతాయి. హిందూ సంప్రదాయం లో  ఇదే క్రమాన్ని దృష్టి లో మన దేవతా స్వరూపాలని కూడా నిర్వచించారు.  అందరికి తెలిసిందే, చైత్రం లో అప్పటి వరకు నిద్రాణమైన ప్రకృతి మేల్కొని  తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఉద్యుక్తమవుతుంది. ఇది మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. మరల ఇదే రోజు ఒక కొత్త యుగాన్ని సృష్టి కర్త అయిన బ్రహ్మ ప్రారంభించాడు కావున ఈ రోజుని యుగ ఆది గా మనం అందరం పండగ చేసికొంటున్నాము

అయితే ఇదే సందర్భంలో, మన ఆంధ్ర దేశం లో కొన్ని వాడుకలో ఉన్న  పదాలు గురించి కొంత మేరకు విశ్లేషణ చేస్తే కొన్ని పురాణ సంభంధం అయిన చిక్కు ముడులు వీడతాయి. ఉగాది ఒక పక్షం ముందర వచ్చే పౌర్ణమి ని "కాముని పున్నమ"(హోలీ పండగ ) అంటున్నాం. అలాగే యుగాది ముందర వచ్చే ఫాల్గుణ కృష్ణ అమావాస్య ని "శూన్య అమావాస్య" అంటాం. దీనికి వెనక ఏమైనా పరమార్ధం ఉందా అని ప్రశ్నవేస్తే ఉందనే చెప్పాలి.

తారకాశురుడు వర బలం తో విజ్రుంభన  చేస్తూ సర్వ లోకాలని తల్లడిల్ల చేస్తున్నఅప్పుడు వాడిని చంప గలవాడు సాక్షాత్తు శివుని కుమారుడే అవటం తో దేవతా గానం అంతా సుబ్రమణ్య జననం కోసరం నిరీక్షిస్తూ ఉంటారు. అయితే అది దంఫతులు అయిన ఆ పార్వతి పరమేశ్వరులు నిరంతరం ధ్యానం లో నిమగ్నం అయి ఉండడంతో, వారి మన్మధుడిని ప్రేరేపించి శివుని లో కామ ప్రచోదనం కొరకు కార్య సిద్ది ని నెరవేర్చు కొందామని ప్రణాళిక రచిస్తారు.అది మన్మధుని యొక్క వైభవం కీర్తించ బడిన రోజు కావున ఆ యొక్క రోజు "కాముని పున్నమ" గా ప్రసిద్ది చెందపడింది.

కాగ పరమ శివుని కోపాగ్ని గురి అయ్యి మన్మధుడు దగ్ధం అవబడుతాడు. అయితే పరం శివుని మూడవ కన్ను తెరవడం తో ఒక్క మన్మధుడు ఒక్కడే నశించ బడ్డాడ లేక సకల లోకాలు నిర్జించ బడినట్టా ? నిజానికి  కామమునకు అనగా కోర్కె కు కారణం అయిన మన్మధుడు నశించడం తో సృష్టి అంతటా నిస్తేజం  అనగా శూన్యం నెలకొంది. ఈ విధంగా ఒక పదిహైను బ్రహ్మ సంవత్సరాలు గడిచి పోయాయి. కాముని పున్నమ తర్వాత వచ్చే అమావాశ్య ని "శూన్య అమావాశ్య" గా పేర్కొన పడుతోంది.

దయా సముద్రుడైన ఆ పరమేశ్వరుడిని మరల సృష్టి ని సృజించడానికి శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మ ప్రేరేపించడంతో, అయన ఆదేశంతో మరల బ్రహ్మ సరి కొత్త యుగానికి ఆద్యం నేలకోలుపుతాడు. ఇన్ని రహస్యాలని సమీకరించ బడిన ఈ యొక్క రోజుని మనమందరం ఒక కొత్త దనాన్ని ఆహ్వానిస్తూ, ఆశిస్తూ ఈ పండగని జరుపు కోవడం జరుగుతుంది.

Monday, November 7, 2011

కృష్ణం వందే జగద్గురుం


కొన్ని విషయాలని యధాలాపం గా చదువుతాం, వింటాం, అర్ధం చేసికొంటాం. అకస్మాత్తుగా మన పక్కన ఉన్న పిల్లవాడో లేక స్నేహితుడో మనం చదివిన లేదా విన్న విషయంపై ఒక ప్రశ్న వేస్తాడు. "అరేరే !! మనకి ఈ విషయం ఎందుకు తట్టలేదురా" అనుకునే సందర్భాలు కొల్లలు. కాకపోతే ఈ యొక్క ప్రేరేపణ వెంటనే జరగవచ్చు లేదా కొన్ని విషయాలలో చాల సంవత్సరాలు కూడా పట్టా వచ్చు.
చాల రోజులు అయింది అనుకొంటా, కృష్ణావతారం సినిమా చూసి !! మన NTR చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. మళ్లీ ఎవరికీ అయినా నమ్మకం కలగదేమో అని, ఆ బోయడు ముసలంలో మిగిలిన చివరి ముక్కని సానదీసి బాణానికి తగిలించు కొన్నాడని కూడా సినిమా లో చూపిస్తారు.  నేను కూడా సరేలే ముని శాపం మరియు యాదవ ముసలం అన్ని కలిసొచ్చాయి కదా అని అనుకోని సరి పెట్టుకొన్నా ఇన్నాళ్లూను. అయితే మొన్న ఎప్పుడో ఈ సందర్భంలో గురించి ప్రస్తావిస్తూ ఒక అయన "ఏమండీ !! ఇది అసలు నమ్మశఖ్యముగా ఉందా" అని ప్రశ్నించారు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?
విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు. ఏమో మరి అసలు ఆ కోణములో అసలు అలోచిన్చనే లేదు మరి ఇన్నాళ్లూను.
అట్లాగే ఇంకొక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!