Tuesday, July 12, 2011

అభిప్రాయలు

 నా అభిప్రాయలు, నా ఇష్టం అని అనుకొన్నప్పుడు పదిమందికి నీ విషయం తెలియాలి అని తాపత్రయం ఎందుకు ? నీకు కలిగిన భావనలు అందరికి తో పంచేసుకోవాలి  అన్న ఆదుర్దా ఎంచేతా ? ఒక వేళ అది రెండో వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తోందని అనిపించినా, నా యొక్క విలువైన ఆలోచనలు చెప్పే తీరుతాను అని అనే మహానుభావులుని ఏమని అనాలి ?
చాలా మంది "నన్ను అడిగితే సార్" అని మొదలు పెడతారు కాని అడిగే దాక ఆగే మర్యాద లేదా శ్రద్ధ వహించరు.అవతల వాళ్ళు అడిగినా అడగక పోయినా తోచింది చెప్పక మానరు. ఈ రోజుల్లో  సోషల్ వెబ్ సైట్స్ లో తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలూ తెలియ పరచడం సర్వ సాధారణం అయ్యింది. దీని వలన మంచి లేదా చెడు ఎంతో చెప్పేటంత గొప్ప వాడిని కాకా పోయినా, ఒక సహజమైన సందర్భాన్ని పరిశీలిద్దాము. మనము అందరు ఏదైనా వార్తలు చదివినా లేక చూసినా ఏ విధంగా స్పందిస్తాము ? లేదా ఎవరు అయినా మీతో ఒక విషయం మీద చర్చ చేసినా సరే. దాని తాలూకు ప్రభావం ఎంతో కొంత అవతలి వారిపై ఉంటుంది అన్న సత్యం నిర్ద్వందం. కాగ నిష్పత్తి మారొచ్చు.
ఎందుకండీ ఇంత ఆందోళన ? ఏమి అవుతుందండి ? ఒక సారి వింటారు, రెండో సారి వినీ విన్నట్టు ఉంటారు, తర్వాత నించి వినడం మానేస్తారు కదా !! ఏదో చేస్తూ, మరేదో ఆలోచిస్తూ వంట పట్టించుకొనే వాటితో మనకి ఎటువంటి ప్రమాదం లేదనుకోండి.ఉదాహరణకి శ్రీ రామ నవమి నాడు మన దర్శక రత్నం రామ గోపాలుడు తన ప్రేలాపాలు అన్నీ త్విట్టేర్ ప్రవేశింప చేసి యువ జనావళి ని ఆలోచించ చేసాను అని సంతృప్తి పడ్డాడట. "వేయి వృక్షాలు" కాదు "విష వృక్షాలు" ప్రశస్తం అని నొక్కి వోక్కా నించాడు. అదేమన్నా అంటే భావ, వాఖ్ స్వాతంత్రం అని అంటారు మరి. మరి ఈ సమాజం లో సదరు ప్రముఖులు అంతా వాళ్ళకి ఇష్తం వచ్చినట్టు వారి వారి భావ జాలాన్ని ప్రదర్శిస్తే ఏమీ తప్పు లేదా ?
ఎవరి గురుంచి అయినా చెడు చెప్పడం ఎంత లోకండి ? రోడ్డున పోయే కుక్కలు కూడా మొరుగు తాయి. దేవుడయితే మరీ ఈజీ ? దిక్కు మొక్కు లేని వాడు కదా ? నేను పదమూడు ఏళ్ళ వయస్సు లో ఇండోర్ కి రైల్ లో వెళ్తూ "రంగ నాయకమ్మ విష వృక్షాలు" ఎదురు కూర్చున్న అయన దగ్గర అరువుచ్చుకొని చదివిన విషయాలు ఇప్పటికి కొన్ని జ్ఞాపకానికి ఉన్నాయంటే కొన్ని సంగతులు చెప్పకనే చెప్పబడతాఎమో. విజ్ఞులు ఆలోచించండి. ఈ రోజున సమాచారం ని లక్షల, కోట్ల మందికి చేరవేసే సాధనాలు ఉన్నాయని ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఇష్టానికి ప్రవర్తించ వచ్చా ? 
నిన్న రాత్రి నిద్ర బాగా పట్టిందండి !!
మా వీధి చివర కుక్క బాగా మొరుగుతోందండి !!
మా కార్ లో ఈ రోజు గ్యాస్ కొట్టిన్చానండి
నాకు గళ్ళ చొక్కా కంటే పూల చొక్కా అంటే ఇష్టం
మొక్క జొన్న పొత్తు కి ఉప్పు కారం అద్దుకొని తినడం ఇష్టం
శని అది వారాల్లో స్నానాలు చెయ్య బుద్ది కాదండీ, అసలు ఎందుకు చెయ్యాలి ?
ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టనే పట్టాడు సుమా
సచిన్ కి భారత రత్న ఇవ్వరాదు !! ఇంకా కొన్ని సంవత్సారాలు ఆగాల్సిందే !!
మాదిరి చొప్పదంటు సమాచారం ఇంటర్నెట్ లో ప్రపంచం అంతా చాటేసుకోవడం మనకి ప్రస్తుత సరదా. మన లాంటి కోన్ కిస్కా గొట్టం గోపాల కృష్ణ లాంటి అభిప్రాయాలు కొంత మందిని ప్రభావితం చేస్తే ప్రపంచానికి ఒనగూరే (అ) ప్రయోజనం కొద్ది మాత్రమే. అయినా కాని నా నించి నా చుట్టూ ఉన్నసమాజం శాస్త్ర బద్ధ జీవనం ఆశిస్తూ ఉన్న అప్పుడు, ఈ పెద్దలందరికీ ఏ నిభందనలు వర్తించవా ?
మరి ఎవడికి వాడు వాడి ఇష్టానుసారం భావ వ్యక్తీకరణ జరపలేనప్పుడు ఎందుకండీ ఈ ప్రజా స్వామ్యం, స్వతంత్రం ?   దిబ్బలో వేసి కొట్టుకోవడానికా ? అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించండి. చరిత్ర లో తమకి అబ్బిన, సిద్దించిన గుణాల ఆధారంగా వారి వారి కాలమానాల్లో ప్రసిద్ది గాంచిన ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే చిరస్మరణీయులు.  కాగ వీళ్ళందరి లో ప్రస్పుటం గా కనిపించేది "ఒదిగి" ఉండగలగడమే. మరియు వీరంతా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొన్నవాళ్ళే. కొద్ది కాలం క్రితమే ప్రముఖ మైన విప్లవాలకి కారణమైన సమాచార మనే పదునైన ఆయుధం, అత్యంత ప్రమాదకరం కాగలదన్న చిన్నపాటి సత్యం సమాజం లో ఉన్నత స్తానాల్లో ఉన్నవాళ్ళ కి తెలియదు అని అనుకోగలమా ? ఆలోచించవలసిందే మరి !!

Sunday, May 22, 2011

రామ రావణ - నిరంతర సంగ్రామం

श्री रामः भगवद्स्वरूपं वा अथवा सामान्य मानवस्वरूपं वा - इति चर्चायाः विषये बहवः जनाः विशेष आसकथाः भवन्ति।अनेक सम्प्रदायानाम् अनेक देवातास्वरूपाः सन्ति किन्तु केवल रामस्य विषये एव एतयाः चर्चा जनाः कुर्वन्ति। बहवः कवयः सहित्यकाराः च प्रशनार्थं अथवा विमर्शानर्थं अपि भगवतः श्री रामस्य उल्लेखनम् एव चिन्वन्ति । वस्तुतः त्रेतायुगं कल्पितं वा अथवा वास्तविकतां वा? मानवजात्याः अस्थित्वं तदा वर्तते वा ? तस्मिन् समये भूगोलकस्थितयः कथं सन्ति ? ते रामायण कव्यानुसारेण वर्तन्ते वा ? समुद्रे सेथु बन्धनं - कथं संभवं ? यदी रामः विष्णोः अवतारं अस्ति चेत् रावणसंहारं किं कारणेन दुष्करकार्यं अभवत्?राम सामन्यजनः साद्रुशः एव क्लेशकारणेन रुदितवान्।तर्हि वयं रामस्य प्रार्थनस्य किं प्रयोजनम् प्राप्नुमः?रामः वालेः वधं वृक्षस्य पश्चात् स्थित्वा कृतवान् - इति धर्मसंमतं वा ? हे भगवान्! रमाणस्य कृते अनेक प्रश्नाः सदा उत्पन्नं भवन्ति।सामान्य जनाः रामस्य चारित्रस्य समावलोकस्य अपेक्ष्य व्यर्थचर्चानि कर्तुं एव अधिक इच्छा प्रदर्शयन्ति।वस्तुतः भगवान् रामः कदापि दैविकमहिमाः न प्रदर्शितवान्।रामः तस्य संपूर्ण अवतारकाले "अहं दशरथस्य पुत्रः" - एतस्य स्वीयपरिचयम् एव कर्तुं इच्छतिवान्।रामस्य समीप जनाः एव रामे वोष्णोः दर्शनं कृतवन्तः।दसरथः, वसिष्ठः विश्वामित्रः, गुहः, साध्वी अहल्य रामे विष्णोः अवतारस्य महिमाम् अभिज्ञातवन्तः।अरण्ये अनेक मुनयः, ऋषयः च रामे विष्णोः दर्शनार्थं दीर्घकालम् प्रतीक्षा कृतवान्तः।सुगीवग्ननुसरेन पारिव्राजकरूपेण आगत्य महाभक्तः हनुमान् रामास्य प्रथमसन्दर्शनस्य अनन्तरं एव भगवतः दर्शनं कृत्वा साष्टाङ्गवन्दनं कृतवान्।रावणकुम्बकर्णयौ तयोः अन्तिम काले भगवतः दर्शनं कृत्वा अञ्जलिं कृतवन्तौ। रमावतारस्य मुख्यप्रयोजनं किं?केवल रावणकुम्भकर्णयोः निवारणं एव वा अथवा कोऽपि अन्य लक्ष्यं अपि अस्ति वा?यदी स्वदर्मस्य पालनस्य विशिष्टं भगवद्गीता सिद्दान्तरूपेण बोधयति चेत् रामावतारं प्रयोगात्मक निरूपणं भवति खलु।रामस्य गुणानाम् अन्वेषणम् वयं अन्यकुत्रचित प्रदेशे कर्तुं न आवश्यकम्। रामो विग्रहवान् धर्मः - इति स्वयं मारीचः उक्तवान्।रामावतारसमये सकल प्राणिनः रामकार्यस्य कृते अतापयन्।रामः कदापि अधर्मकर्यानां समर्धनम् कृतवान्।सः यदा आवश्यकता अस्ति तदा क्षमा प्रदर्शितवान्।सः धमस्य अतिक्रमणं कदापि न असहत् । ये रामस्य संपूर्णविश्वासेन जीवनं यापयन्ति ते क्रमशस् श्री रामतत्वं मनसि स्थापयन्ति।यदी सर्वदा शुष्कवादान् कर्तुं एव इच्छन्ति चेत् तेषां मनसि रावणस्य आह्वानं निश्चयेन कुर्वन्ति। 
 రాముడు మానవుడా లేక దేవుడా అన్న ప్రశ్న మన అందరికి ఎంత ఇష్తమో !! అన్నీ మానేసి చర్చిస్తాము. ఇంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా అయినా కాని ఒక్క శ్రీ రాముడికే దైవాంశ లేదేమో అన్న వాదన ఇంత ఎక్కువగా ఎందుకని ఉంటోంది? జీసస్, గౌతమ బుద్ధుడు లేక కృష్ణుడు - ఇలా మిగతా వాళ్ళు మామూలు మనుషులే అన్న ప్రశ్న లేక చర్చ ఎందుకని మన భారత దేశం లో ఎక్కువ వినపడదు ? అప్పటి లో రంగ నాయకమ్మ రామాయణ విష వృక్ష్యమే కధాంశంగా ఎందుకని ఎన్నుకొన వలసి వచ్చింది ? పోనీ విమర్శకులే ఎక్కువ అని అనుకోవడానికి కూడా లేదు. మొన్నటి మొల్ల ఇంకా విశ్వనాధుల తదితరులని "రామాయణం గురించి అందరు స్పృశించారు కదా, మళ్లీ మీరు కొత్తగా వ్రాసేది ఏముందని" అడగ్గా, నా రాముడిని ఈ విధంగానైనా తలిచే భాగ్యం వస్తోంది కదా సమాధాన పడడం జరిగింది. అంతేకాదు ఆ మధ్యల్లో శ్రీ రామ నవమి నాడు తన త్వీట్స్ ద్వారా విమర్శలు చేసి యువ ప్రజానీకం లో కొద్దో గొప్పో పాపులారిటీ ని కూడా సంపాదించాడు, రాముడి పేరు ఉన్న మన దర్శక రత్నం "రామ్ గోపాల్ వర్మ" .


అసలు త్రేతా యుగం అనేది వాస్తవమా లేక మిధ్యా ? మనవ జాతి యొక్క మనుగడ అన్ని లక్షల సంవత్సరాల మధ్య ఉందా ? అప్పటి బౌగోళిక పరిస్తితులు రామాయణ ఇతిహసంతో ఏకీభవించగలవా ? సముద్రంలో సేతుభందనమా ? రాముడు భగవంతుడైతే రావణుడిని మట్టుపెట్టడానికి అంత కష్త పడాల్సి వచ్చింది ? రాముడు మన అందరిలాగా కష్తం వస్తే ఏడ్చాడు. ఆయన్ని ప్రార్ధిస్తే ఏమి వస్తుంది ? వాలి ని చెట్టు చాటు నిండి ఎందుకని మట్టు పెట్టాల్సి వచ్చింది ? రాముడు సీత కన్నా పెద్దవాడా కాదా ? ఒక వేళ పెద్దవాడు అయితే అది ఎలా సంభవం ? ధర్మాతిక్రమణం కాదా ? రామాయణం కవి కల్పన అని నిరూపించడానికి మా దగ్గర కావలసినంత ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి మీరు ఎవరు?


అయ్యా బాబోయి !! అమ్మో ఇలా మన ప్రశ్నలకి అంతు దరీ లేదు !! కొన్ని యుగాల కి సరిపడా చర్చ జరుగుతూనే వచ్చింది మరియు ఇంకా బవిష్యత్తులో కూడా  కొనసాగుతుంది అని అనడానికి ఏమీ డోకా లేదు. విచిత్రం ఏమిటి అంటే అవతారం చివరి వరకు అయన ఏ కోశానా దైవత్వం ఆపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యక పోగా కేవలం దశరధ తనయుడిగానే తన స్వధర్మాన్ని పాటించడానికే ప్రయత్నం చేసాడు. కాగా రామ అవతరాన్ని చుట్టూ ప్రాప్తి ఉన్న వాళ్ళు విష్ణు స్వరూపం గా గమనించారు, గుర్తించారు, పూజించారు తద్వారా తరించారు.  దశరధుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గుహుడు, అహల్య, సీత దేవి, అరణ్యం లో భగవంతుని రాక కై తపించిన మునులు, ఋషులు, గురువు మాటని గౌరవించి వేచిన శబరి ఇలా అందరు రాముడు నడిచిన ప్రతి సందర్భంలో ఆయనలో పరమాత్మని దర్శించారు. రాజాజ్ఞ మేరకు పూర్వ పరాలు విచారిద్దామని మాయా స్వరూపం లో వచ్చిన "హనుమ" తక్షణం ఎదురుగా ఉన్నది సకల విశ్వం తపించే జగదభి రాముడని వెను వెంటనే గుర్తించి తన యొక్క నిజ స్వరూపాన్ని దార్చాడు. చివరకి రావణ కుంభకర్ణలు కూడా తమ శరీరాలని విడుస్తూ రాముడి లో విష్ణు స్వరూపాన్ని దర్శించి పుణ్య లోకాలని చేరుకో గలిగారు. అయితే అందరూ రావణ వధ అయ్యేవరకు ఈ విషయాన్నీ గోప్యంగానే ఉంచారు.


రామ అవతారం కేవలం రావణ కుంభకర్ణ తదితర రాక్షస నిర్మూలనమేనా లేక మరి ఏదైనా ప్రయోజనమని ఆశించి వచ్చిందా ?ఒక్క మానవ జన్మ  లో సంసారంలో ఉంటూ స్వ ధర్మాన్ని పాటిస్తూ ముక్హ్తి సాధన సిద్దిస్తుందా లేక అది ఒక అభూత కల్పనా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ సాధ్యాసాధాలు నిరూపిస్తూ ధర్తి లో నిలబడ్డాడు. నిర్గుణ, నిరాకర, నిరాధారం అయిన ఆ భగవత్ స్వరూపం మానవాళి యొక్క మార్గ నిర్దేశం కోసం అన్ని భరిస్తూ, పాంచ భౌతిక స్వరూపం తీసికొని అవతారం యావత్తు ప్రకృతి కట్టుబాట్లు కి లోబడి కార్య సాధన ని సాధించాడు.  రాముడు యొక్క గుణగణాలు, విశేషాలు ఏమిటో మనం మరెక్కడో వెతకాల్సిన పని లేదు. మారీచుడు రావణాసురిడితో సంభాషిస్తూ  "ధర్మానికి పోత పోస్తే వచ్చే విగ్రహమే రాముడు" అంటూ అతని కుట్రాలోచానికి అడ్డం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. రామాయణం యావత్తు చుట్టూ ఉన్న ప్రకృతి సర్వం రామ కార్యం నిర్వహించడానికి ప్రతి క్షణం తపించింది, తల్లడిల్లింది. రామావతారం మొత్తం అధర్మాన్ని ఎక్కడ సహించలేదు. కుదిరిన చోట క్షమా గుణాన్ని భోదించింది అట్లాగే అతిక్రమణ ని శిక్షించింది. సులభ మార్గం లో లభించే ఐశ్వర్యాన్ని  తూలనాడింది. జాబాలి వంటి మంత్రులు రాజాపేక్ష చూపిస్తూ జరిపిన అవైదిక సంభాషణలని ఖండించింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరి మాటని ఆదరించే గుణాన్ని మానవాళి కి ఆవిష్కరించింది.


ఆనాటి నిండి రామ నామం యొక్క మహత్తు ని నమ్మిన వారు మననం చేసారు. పారాయణలు నిరంతరం జరిపారు. మనసా వాచా కర్మణా రాముని తత్వాన్ని అవలంభించారు. ఇంత కష్టం మనకేందులే అనుకొన్న వారు, రాముడు అభూత కల్పనే అని వాదనలు జరుపుతూ వస్తున్నారు. నమ్మినప్పుడు  కొలువు బంగారమై వారి వారి మనస్సుల్లో రామత్వాన్ని నింపాడు ఆ సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడే. "రాముడు ఎవడులే" అనుకొన్న ఆలోచనలు రావణ ప్రవుత్తికి దారి తీస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రామ రావణ సంగ్రామం ఈ జగత్తు ఉన్నంత వరకు ఇలా కొన సాగ వలసిందే !! 

Sunday, May 15, 2011

బ్లాగానందం

ఏం సార్ !! ఎలా ఉన్నారు ? ఏంటీ కబుర్లు ?
ఏముందండి !! అంతా మామూలే. విపరీతమైన బిజీ అయిపోయాం సార్ !!
ఏంటి ?? ఈ మధ్య ఏమి వదలట్లేదు ? రానీయండి సార్
ఎంటవి?
అవే సార్ !! బ్లాగులు
***********************************************************************************************
ఏంటి సత్య గారు !! వ్రాసార ? కొత్తగా ఏమైనా ?
అంటే వరల్డ్ కప్ కదండీ !! బాగా దగ్గర ఉండి గెలిపిస్తున్నాము !! ఇది ఇంపార్టంట్ కదా !!
కంపుల్సరీ కదండీ మరి !! సెహ్వాగ్ గాడికి మనం కుర్చీ లో లేకపోతె, అస్సలు బాట్ లేవదు తెల్సా ?
అబ్బ!! నిజమా ? అస్సలు కొంచం ఛాన్స్ ఇస్తే వదలరు గా!! దూసుకెళ్ళి పోటమే !!
ఏంటీ నమ్మరా ? బంగ్లాదేశ్ మీద 175 ఎలా కొట్టాడు అనుకొన్నారు ? కావాలంటే మా ఆవిడని అడగండి ?
***********************************************************************************************

తెలంగాణా మీద మీరు వ్రాసింది చాల బావుంది అండి !! ఏంటి మళ్లీ ఏమైనా వ్రాసార ?
ఇంకా లేదు సార్ !! ఉగాది సెలబ్రేషన్స్ తో బాగా బిజీ అయిపోయాము కదా !!
ఏంటీ మీరు బ్లాగ్లు వ్రాస్తార ? దేని మీద పోలిటిక్స్ మీదా?
అవునండి !! మనసుకి ఏది తోస్తే అది ?
మరి లింక్ పంపండి !!
పంపానండి, ఇది వరకు !! మళ్లీ కావాలి అంటే పంపుతా !!
ఓహ్ అవునా !! కరెక్టే నండి !! అదే లింకా ఇంకా ?
అవునండి !! మళ్లీ ఇంకో సారి పంపుతా

***********************************************************************************************
సత్య గారు !! ఆ మధ్య లో ఏదో వ్రాసారు !! ఇంకా వ్రాస్తున్నారా?
ఏదో సార్ !! మీ దయ !! ఎప్పుడైనా వీలుంటే వ్రాస్తున్నాను.
అవునా ?? వెరీ గుడ్ !! వేటి మీద వ్రాస్తారు ?
ప్రత్యేకంగా ఇది అని ఏమి లేదండి !! ఎలా వీలు అయితే అట్లా !!
ఈ సారి నించి మీరు ఏమి చేస్తారంటే, ఏమైనా వ్రాశారనుకోండి... అప్పుడు నాకు ఒక మెయిల్ కొట్టండి, లింక్ పెట్టి
తప్పకుండా అండీ !!

***********************************************************************************************
మనకి ఇండియా లో అనుకోండి !! ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయండి. ఇక్కడనుకోండి.... ఏమి ఉంటుందండి ? ఈ
రోజు కి నిన్నటికి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా !!
కరెక్ట్ సార్ !! ఇక్కడ అంతా Monday - Friday లైఫ్ కదండీ !!
రొటీన్ లోంచి బయటకు రావాలంటే చాల ప్రయత్నం చెయ్యాలండి !!
మరి అయితే ఇండియా కి వెళ్లి పోండి సార్ !! అక్కడ అయితే సినిమాల్లో ట్రై చేయచ్చు సార్ !!
అంత సీన్ లేదు లెండి బాబు !!
అట్లా కాదు సత్య గారు !! ఇలాంటి లైఫ్ చేంజ్ మొమెంట్స్ ని మిస్ అవ్వకూడదు సార్ !!***********************************************************************************************

Wednesday, April 27, 2011

చరిత్ర మరో సారి

తెలంగాణా ఉద్యమం మళ్లీ ఆగింది. దీని అర్ధం, పరమార్ధం పెరుమాళ్ళ కి ఎరుక. కొన్నాళ్ళ క్రితం ఈ ఉద్యమం నిజమైనదే ఏమో అన్న ఊహ తెలంగాణా మరియు ఏతరలుకి తోచిన మాట వాస్తవమే అని గమనించాలి. దీనికి ముక్ష్య కారణాలు.

  1. ఉద్యమం కనీసం ఒక సంవత్సర కాలం సాగింది. ఇంకా మరెంత కాలం సాగుతుందో చెప్పలేక పోతున్నాము.
  2. ఉద్యమ సారూప్యం ఏ విధంగా ఉన్నా ప్రజా బలం ఉందన్న సత్యాన్ని గమనించాలి.
  3. గతం లో ఈ ఉద్యమం వికృత రూపం తీసుకొని ఉన్నా పూర్తి స్తాయి లో ఇది రూపు మాపడం లేదు.  (చెన్నా రెడ్డి నాయకత్వం లో సాగిన ఉద్యమం తో కలుపుకొని)
  4. తమ అవకాశాలని వేరే ఎవరో పూర్తి స్తాయి లో తన్నుకు పోయారు అని తెలంగాణా ప్రజలు బలంగా విశ్వసించబట్టి.
నేను తెలంగాణా ఉద్యమం యొక్క ప్రస్తుత నాయకత్వానికి, ఎత్తుగడలకి, రూపు రేఖలకి పూర్తి స్తాయి లో వ్యతిరేకం అయినా కూడా ప్రజల ఆకాంక్షల ని తప్పు పట్ట గలమా అన్న ప్రశ్న వేసికోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య ని పక్కకి నెట్టడం సరి అయిన వ్యూహం కాదన్న సంగతి చరిత్ర ఇలాంటి ఒక సందర్భం లోనే ఒక సారి నాయకత్వానికి గుణపాటం నేర్పింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం ఏమైనా ప్రస్తుత పరిణామాలకి పాఠం నేర్పగలదా ? ఇప్పటి వరకు అధ్వానపు అధిష్టానం మరియు రాష్ట్ర (అ)నాయకత్వం స్వీకరించిన నిర్లక్ష ధోరణి రాబోయే తరాలకి ఎటువంటి మార్గ నిర్దేశనం చేయ బోతోంది ?

అప్పటి ఉద్యమం స్వచ్చమైనదా లేక ప్రస్తుత ఆందోళన బలమైనదా ? అసలు ఈ రెండింటి కి సారూప్యమే లేదా ? ఏది నిజమైనది లేదా నిజాయితీ కలది ? అసలు పొట్టి శ్రీ రాములు గారు నిర్వహించిన త్యాగం ఎటువంటిదో తెలుసు కోవాలన్న కుతూహలం తో గూగుల్ లో వెతుకుతూ ఉంటె 2003 లో హిందూ లో రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ఎందుకో ఆసక్తికరంగా కనిపించింది. కొన్ని నిజాలు మీ కోసం.

డిసెంబర్ 1950 లో సర్దార్ వల్లభ్భాయ్ మరణించారు. నెహ్రు ప్రధాన మంత్రి పదవి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు. మరో దశాబ్దం వరకు నెహ్రు అనుకొన్న ఇండియా తీర్చి దిద్దబడడానికి సంసిద్ధం అయ్యింది. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహార శైలి ఇలా దాదాపు అన్ని. కాని అనుకోకుండా జరిగిన కొన్నిసందర్భాలు నెహ్రు గారికి పంటి కింద రాయి లాగ, కంటి లో నలుసు గా మారాయి. అందులో ఒకటి....

బాషా పరమైన రాష్ట్ర ఏర్పాటు. కన్నడ, మలయాళం లేదా ఒరియా ఇలా కాంగ్రెస్ పెద్దలు తమ తమ రాష్ట్ర ఏర్పాటు కోసరం పాటు పాడడం మొదలు పెట్టాయి. ఇందులో తీవ్ర స్తాయి లో గళం విప్పింది మాత్రం ఆంధ్రులే. బాషా పరంగా హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత అధికులు తెలుగు వాళ్లే. అంతే కాకుండా బాషా పరంగా విజయ నగర పాలనా నించి వైభవం ని చవి చూసిన జాతి కూడా తెలుగు వాళ్లే. మద్రాస్ మరియు హైదరాబాద్ లలో అత్యంత చురుకు గా ఆంధ్ర మహాసభ సభ్యులు తమిళుల ఆధిపత్యాన్ని ప్రశ్నించసాగారు. మద్రాస్ అసెంబ్లీ లో ఆంధ్ర శాసన సభ్యులు ఆంధ్ర ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు నకు సంఘీభావం వ్యక్త పరిచారు.

ఆంధ్ర రాష్ట్ర ఆందోళన ఇద్దరికి మాత్రం ఏ మాత్రం రుచించలేదు. నెహ్రు మరియు రాజగోపాలాచారి మాత్రం రాష్ట్ర ఏర్పాటు నకు అది సరి అయిన సమయం కాదని కొట్టి పారేసారు. ఆ సమయం ఏదో, ఎప్పుడు వస్తుందో తేల్చాల్సిందే అని ఆంధ్రులు పట్టుబట్టారు. పొట్టి శ్రీరాములు అన్న ఒక గాంధేయవాది తన జీవితం లో రెండవ సారి నిరాహార దీక్షలో కూర్చొన్నారు. మొదటి సారి మద్రాస్ లోని ఆలయాల్లో హరిజనుల ప్రవేశం కోసం 1946 సంవత్సరంలో దీక్ష చేసారు. అప్పటి మద్రాస్ లో ఉన్న కాంగ్రెస్ వాదులు స్వతంత్ర ఉద్యమం నకు ఇది ఒక అడ్డంకి అని భావించి గాంధీ గారిని పొట్టి శ్రీ రాములు చేత దీక్ష విరమణ చేయమని అభ్యర్ధించారు.  గాంధీ గారి అభ్యర్ధన మేరకు అప్పటి దీక్ష విరమించినా 1952 నాటికి తెలుగు రాష్ట్ర సాధనకై మళ్లీ ఉద్యమం చేపట్టారు.

"ఏదో ఒక నిరాహార దీక్ష అంటూ మొదలు పెట్టారు అని వార్త నా దృష్టి కి వచ్చింది. మనం ఎటువంటి పరి స్తితులలో అయినా కూడా ఈ యొక్క ఆందోళన కి ప్రాధాన్యత ఇవ్వరాదు" అని రాజగోపాలాచారి ఉత్తరం పంపారు పండిట్ నెహ్రు. అప్పటికే శ్రీరాములు గారు ఆరు వారాల బట్టి నిరాహార దీక్ష ని నిర్వహించారు. ఆధిపత్యం లో ఉన్న పెద్దలు ప్రత్యెక రాష్త్ర ఏర్పాటు నకు సరియైన సమయం రాలేదు అనే నమ్మారు అదే విషయం పార్లమెంట్ లో పదే పదే నమ్మించ డానికి ప్రయత్నం చేసారు.  దీక్ష అలాగే కొనసాగింది. రాష్ట్ర నలుమూలల రాజాజీ మరియు నెహ్రు ల వ్యతిరేక నినాదాలు పెల్లుబికాయి. నెహ్రు కి దిగిరాక తప్పలేదు. ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు కై మళ్లీ ఇంకొక లేఖ వ్రాసారు. కాని దురదృష్త వశాత్తు అధికారిక ప్రకటన వచ్చేలోపే పొట్టి శ్రీ రాములు గారు గతించారు. ఆంధ్ర రాష్త్రము అతలాకుతలం అయ్యింది. రైళ్ళు తగల పెట్టారు. పట్టాలు పీకేశారు. ఆంధ్రుల ఆగ్రహం తీవ్రత అంటే ఏంటో దేశమంతా చాటారు. సామరస్యంగా జరగవలసిన  విభజన రక్తపాతం తో జరిగింది.

మళ్లీ రాబోయే తరాలు ఈ విధమైన విభజన ని ఎదుర్కోవాల్సి వస్తుందా ? ఏ పాపం తెలియని నవ తరాల మనస్సులని విభజించే సావకాశం కల్గుతుందా ? చూద్దాం !!

Friday, March 4, 2011

భారత ఉపఖండం లో క్రికెట్

ఒప్పుకోడానికి కష్టం గా ఉన్నా క్రికెట్ స్వరూపము, సారుప్యత పూర్తిగా మారింది భారత ఉపఖండం లో ప్రాచుర్యం పొందిన తర్వాత. నిజంగా విశ్లేసిస్తే ఇది మనకి అసలు తగునా అని అనిపిస్తుంది. గత రెండు మూడు దశాభ్దాలు లలో అన్ని ఆటల తీరు తెన్నులు మారి నట్టే క్రికెట్ కూడా మారినా గత కొన్ని సంవత్సారాలలో జరిగిన పరిణామాలను చూస్తే ఈ విపరీత ధోరణులకి మనమే కారణం అని ఒప్పుకోక తప్పదు. నేను ఉత్తర అమెరికా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక తెల్ల అయన "Cricket used to be a relaxing and laid back sport until you and Pakistanis started winning it" అని అన్నప్పుడు ఈ వెధవలు ఇంతేలే ఇలా జాత్య అహంకారంతో మాట్లాడతారు అని అనుకొన్నాను. చూడగా చూడగా కొంచం నిజమే అనిపిస్తోంది. హైదరాబాద్ లో ఎవడైనా పాకిస్తాన్ టీం విజయం ని హర్షిస్తే వాడు తప్పకుండా "ISI" ఏజెంట్ అని ముద్ర వేసి పడేస్తాము. దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం అమెరికా లో ఇండియా టీం డేవిస్ కప్ ఆడదానికి వస్తే మేము ఒక పది మంది కలిసి "ఇండియా జిందాబాద్" వంటి స్లోగన్ లతో రచ్చ రచ్చ చేసాము. అమెరికా దేశస్తులు మా దగ్గరకి వచ్చి ఫొటోస్ కూడా తీసు కొన్నారు.


ఈ రోజు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మెంబెర్ ఒక అయన మా ఫాన్స్ వేసిన రాళ్ళు గురితప్పి వెస్ట్ ఇండీస్ వాళ్ళ బస్సు మీద పడ్డాయి, కొంచం సర్దుకోండి అని చెప్పడం కొంచం విడ్డురంగానే ఉంది మరి. నిన్న ఇంగ్లాండ్ ఐర్లాండ్ తో ఒడి పోయి నప్పుడు ఎంత మంది క్రికెటర్ ఇళ్ళ మీద రాళ్ళు వేయబడ్డాయి. పోనీ క్రికెట్ కాదు, ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఓడినప్పుడు ? 2007 లో ధోని ఇంటి గోడలు కి నల్ల రంగు వేసారు అంటే సిగ్గు పడ్డవారు ఎంత మంది ? naaku తెలిసిన కొంత మంది "తప్పేముంది అండి" అని కూడా వాదించారు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏమిటి అంటే నిజంగా అవతల టీం బాగా ఆడి నెగ్గినా ఇందులో ఏదో మతలబు ఉంది ఏమో అని వ్యాఖ్యానిస్తున్నారు.

Ashes లో జరిగింది అంటే అవి విశేష పరిస్తితులు అని నేను భావిస్తున్నాను. ఇవ్వాల్టి రోజున క్రికెట్ ఆడేవాళ్ళు మనుష్యులు కాదు రోబోలు అని అనుకోమంటే ఎలా అండి. ఓటమి అస్సలు అట లో ఒక భాగమే కాదు అని వాదించే వాళ్ళని ఏమంటాము అండి ? ఒక మారు విజయవాడ రైల్వే స్టేషన్ లో మ్యాచ్ చూస్తూ ఉన్న సందర్భంలో గంగూలీ ఒక బాల్ కొట్టడం మిస్ అయితే "వీడికి నగ్మా తో తిగుగుళ్ళు ఎక్కువ అయితే బాల్ ఎక్కడ కనపడుతుందండి" అంటూ ఒకడి కామెంట్ వినపడింది. వెంటనే బాల్ ని సిక్స్ కొడితే "గంగూలీ కి తగిలితే దొరకదు గురువు గారు" అని అదే వ్యక్తి.

క్రికెట్ మ్యాచ్ ల కోసం హోమాలు, యజ్ఞాలు మరియు పూజలు. ఎంటండి ఇది ? అర్ధం ఉంటుందా ? పోనీ మనమే అనుకొంటే పాకిస్తాన్ వాళ్ళు మరీ మూర్ఖులు. పక్కన ఉన్న శ్రీ లంక వాళ్ళని అయినా చూసి బుద్ది తెచ్చుకొందాము అని ఉండదు. ఎంత హుందా గా వ్యవహరిస్తారో ఆటలా విషయములో ?

వికెట్ తీసి చాతిలు బాదుకోవడం, సెంచరిలు లు కొట్టి భూమి ని తాకుతూ ప్రార్ధనలు చెయ్యడం పాకిస్తాన్ వాళ్ళే నేర్పించారు అనుకొంటా. డ్రెస్సింగ్ రూం లలో మత ప్రార్ధనలు !! మన వాళ్ళు ఏమి తీసిపోరు లెండి. గవాస్కర్ లాంటి పెద్దలు కూడా సంనయనం ని కోల్పోయి కామెంటరీ చెపుతూ రెచ్చగొడతారు. వాళ్ళు ఏమి మాట్లాడతారో వాళ్ళకే అర్ధం కాదు. వీళ్ళ కామెంటరీ గురించి వ్రాయాలంటే కనీసం ఇంకో నలుగు అయిదు బ్లాగ్ లు పడుతుంది అనుకోండి.

Monday, February 21, 2011

పొగడ్తలు

భగవాన్ కీర్తన  ప్రియ !! ఆయనకే ఈ రిమ్మ తెగులు ఉంటే మనమెంత వాళ్ళ మండీ  ? ఆయనేప్పుడో చేసిన ఘన కార్యలన్నీ ప్రతి నిత్యం "సహాస్రం" పాటు తలుస్తూనే ఉంటామే. ఎవడైనా మన విభూతిని పొగిడితే వెంటనే మనస్సు లో నించి తీసి వేయలా ? ఎంత అన్యాయం అండీ !! అసలు ఇవ్వాల్టి రోజుల్లో ఎవడైనా మనసారా "చాల మంచి చేసారండీ" అన్న అభినందనే కరువై పోతూ ఉన్న రోజుల్లో మళ్లీ ఇది కూడా జోడిస్తే, ఇంకా ఏమైనా ఉందా ?

చెప్పద్దూ !! పొగడ్త లేని నాడు ఏ పని చెసినా నిరర్ధకం అనిపిస్తుంది కదండీ !! కాళ్ళ కి వేసు కొన్న చెప్పులు, కళ్ళకి పెట్టుకొనే జోడు, చేతి కి పెట్టుకొనే వాచ్, నడుముకి పెట్టె బెల్ట్, మెడలో వేలాడే గొలుసు ఇలా కాదేది పొగడ్త కి అనర్హం !! కొత్తగా చొక్కా వేసుకొంటే ఎవడూ బావుంది అని అనక పొతే ఏదో వెలితి. ఆటలైనా, పాటలైనా, మాటలైనా లేక వ్రాతలైన ఇలా ఏది చేసినా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం అన్న మాట ఒట్టి నీళ్ళ మీద మూటే !! అంతే కాదండీ మన అలవాట్లు, కార్య సిద్ది, పట్టుదల, నిర్వహణ ఇలా ఏదైనా సరే పక్కవాడు గమనించాలి అనే కోరతాం. లేని నాడు చేసిన పని కి సార్ధకత ఏదండీ ? ఎంత మంది ఉంటారు అండి సఫిలీకృత నిర్వహణకి కారణభూతం "నేను" కాదు అని అనగలిగిన వాళ్ళు. పొగడ్త ని చేయించిన వాడికే వదిలేసి నాదేమి లేదిందులో అని అనుకోవడం నిజానికి సాధ్యమా? పోనీ పొగిడే వాడు మనసార అభినందిస్తాడా అంటే అది ఎట్టి మాత్రం ప్రస్తుత కాల మాన పరిస్తితులలో సాధ్యం కానిది. పైగా రెండు మూడు సార్లు అలవాటు పడిన ప్రాణం నాలుగో సారి ఏమీ ప్రతిస్పందన లేక పొతే లేని పోనీ వైషమ్యం.

అంత పని చేసేసి "అమ్మా !! ఏమీ చేతకాని వాళ్ళని దూత గా పంపిస్తారు. ఉన్నవారంత నా కన్నా అధికులు, సములు గాని, తక్కువ వారు లేరమ్మా" అని త్రికరణ సుద్ది గా అనగలిగిన మానసిక పరిణితి ని ప్రదర్స్తిస్తారు హనుమ సుందర కాండలో. పైగా రాముల వారి దగ్గరకి సీతమ్మ కనుగొనపడినది అన్న వార్త చెప్పిన వారిలో చివరి వ్యక్తి హనుమే. స్వామి మన అందరకి ఏమైనా సందేశం ఇచ్చారా ? ఆచరణ సాధ్యం కానిదా ? ఏమో ..

"పోగిడితే చాలు బాజా కొట్టేమని మా సెగట్రీ ఎట్టించాడు" అంటూ ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు సెలవిచ్చినట్టు, మన మనసు లో సేపెరేట్ గా ఒక డిపార్టుమెంటు ఎట్టించాలేమో ఎవడైనా పొగిడితే బాజా కొట్టేయడానికి, అవి మన తల లో పేరుకు పోకుండా ఉండడానికి.

Wednesday, February 9, 2011

సుగ్రీవ విజయం

 రామాయణ అంతర్గతం గా కిష్కింద కాండ లో వివరింపబడిన ఒక అద్బుత సంఘటన మీకు వివరిస్తాను. ఇది నా ప్రజ్ఞ ఎట్టి మాత్రం కాదు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు సంపూర్ణ రామాయణము ప్రవచనం విని మననం చేసికొన్న ఘట్టం. మన జీవితాల్లో ఎలా అన్వఇంచుకోవాలో పెద్దలు మీరు అందరు నిర్ణయం చేసికోండి.

"నీ శత్రువు నాకు కూడా శత్రువే" అని సుగ్రీవునికి అభయం ఇచ్చి వాలి ని యుద్దానికి పిలువయ్యా అని మిత్రుడి కష్టం తనదిగా బావిస్తాడు, శ్రీ రామ చంద్రుడు. అప్పుడు సుగ్రీవుడు సాధారణముగా మన అందరి ప్రవర్తిస్తాడో అలాగే వ్యవహరించాడు. ఎవరైనా ఒక మహానుభావుడు సంపూర్ణ మనస్సు తో మన దగ్గరకి వచ్చి మిత్రత్వం ప్రకటిస్తే "పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు" అన్న చందాన రక రకాల నిర్లక్షానికి గురి చేస్తాము. మా అన్నయ్య ఇంత బలం, వేగము ఉన్నవాడు అని రాముడి ని అనుమానిస్తునట్టు బహిర్గతం చెయ్యకుండా అత్యంత లౌక్యం గా అయన కి సకల పరిక్షలు జరిపించాడు. ఈ క్రమంలో తన మనస్సు లో ఉన్న అనుమానాలు బయట పడకుండా తన పాండిత్యం అంతా ప్రదర్శిస్తాడు. అంటే సుగ్రీవుడు రాముడిని నమ్మాడు "కాని" ఎక్కడో ఏదో అనుమానం. మనమైన కూడా మన జీవితాల్లో ఎక్కడా సంపూర్ణ విశ్వసనీయత, శరణాగతి ప్రదర్సన చేయడానికి సకల అడ్డంకులు ఎదురు అవుతాయి. "కలడో లేడో" సందిగ్నత మనలని సదా వెంటాడుతూనే వుంటుంది. తద్వారా కార్యసిద్ధి మరియు ఆత్మ సంతృప్తి కలగక పోవడం !! ఎన్నో వాటి కోసం వెంపర్లాడిన తర్వాత చివరికి వెలితి. బహుశా మన అందరిలో ఉండే మానసిక జాడ్యం అయ్యుండవచ్చు. వాలిని పిలిచాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు కానీ అన్నీ యాంత్రికమే!! రాముడి సహాయం అందుతుందో లేదో లేక వాలి ని నిహతించే అంత శక్తి రాముడికి ఉందొ లేదో ఇలా అన్నీ అనుమానాలే. అనుకొన్నట్టే కార్యం నెరవేరలేదు.


మళ్లీ మన అందరిలాగానే రాముడి ని నిందిస్తాడు. సరే రాముడు వాలి మరియు సుగ్రీవుడు మధ్య వైవిధ్యం ఎందుకు గమనించలేక పోయాడో అనేది మరొక ధర్మ సూక్షం అనుకోండి. (ప్రాజ్ఞులు చెప్పిన ప్రవచనాలు చాల అందుబాటులో ఉన్నాయి, మీకు నిజముగా తెలుసు కోవాలి అంటే). ఈ సారి సుగ్రీవుడు సంపూర్ణ శరణాగతి చెయ్య గలుగుతాడు. ఇది చెయ్యగలిగిన వాడి మానసిక దృక్పదం ఈ విధం గా మారుతుందో అయన మళ్లీ వాలిని యుద్దానికి పిలవడానికి వెళ్తున్నప్పుడు జరిగిన విషయాల వర్ణన ని గమనిస్తే తెలుస్తుంది.


సుగ్రీవుడు ఈ సారి మార్గ మద్యం లో గతం లో మహాత్ములు నివసించిన ప్రదేశాలు ప్రస్పుటం గా కనపడతాయి. వాటిని దాటుతున్నప్పుడు వారి వారి సత్ప్రవర్తన ని మననం చేసికొంటూ అత్యంత భక్తీ శ్రద్దలతో స్మరిస్తాడు. ఇది ఒక మనిషి లో పాజిటివ్ అవుట్లుక్ ఉంది అన్నదానికి నిదర్శనము కాదా!! ఈ చిన్న మార్పుతో విజయలక్ష్మిని వరించిన సుగ్రీవుడు ని గమనిస్తూ మన జీవితాలని కూడా తీర్చు దిద్ది కోవచ్చు అన్న ఆలోచన తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.