మనం ఇది చాల సందర్భాల్లో వింటూ ఉంటాము. యుద్ధం లో సైనికుడు ఒక శత్రువుని మరియు ఒక పచ్చి ఉన్మాది మానవత్వం ఊహించని విధంగా అన్నెం పున్నెం తెలియని అమాయకులని చంపడాన్ని రెండింటిని "హత్య" అని అనడం లెదు. మొదటిది కర్తవ్యమ్ అయ్యి ఆ దేశ ప్రజలచే కొనియాడ బడితే రెండో దాన్ని అత్యంత హేయమైన కిరాతకం గా చిత్రీకరించ బడుతుంది. ఒకటి వృత్తి ధర్మం అయితే రెండవది అధర్మం అంటున్నారు.
రామాయణం లోని అరణ్య కాండ లో శ్రీ రాముడు భరద్వాజ ఆశ్రమం లో సీతా లక్ష్మణ సహేతుడై ముని ని తన ఆశ్రమ నిర్మాణానికి ఒక అనువైన ప్రదేశం సూచించ మని అడుగుతాడు. ఆయనే శ్రీ మహా విష్ణుడిగా గుర్తు ఎరిగిన మహర్షి రాముడిని అక్కడే అరణ్యవాసం చేయమని కోరతాడు. దానికి శ్రీ రామ చంద్రుడు, సున్నితంగా నిరాకరిస్తూ తన ధర్మం ఋషులతో గడపడానికి సమ్మతించదని చెప్పి నిరాకరిస్తాడు. పైగా ఒక ఉదాహరణ చెపుతూ మీ ఆశ్రమం లో ఉండే సాదు జంతువులని క్రూర మృగాల నించి రక్షించే క్రమం లో నేను వాటిని సంహరించి నప్పుడు, మీ మనస్సులు ఏ సందర్భం లో అయినా కష్టం కలిగి నాకు అకారణ శాపంనకు కూడా కారణం అవచ్చు అని చెపుతాడు. నిజంగానే అన్ని భూతాల్లో ఒకే పర బ్రహ్మం ని దర్శించే స్తాయి మహర్షికి ఉందని అదే ధర్మాన్ని దుష్ట శిక్షణ నిమిత్తమై వచ్చిన రాముడు పాటిస్తే అవతార ప్రయోజనం నేరవేర్చేది ఎలా?
సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.మత సంప్రదాయాల్లో పాటింపులు మరియు పట్టింపులు వల్ల ఒకడిని ఒకడు కొన్ని వేల సంవత్సరాలు పాటు ద్వేషిస్తూనే ఉండటం దాని వల్ల చరిత్ర లో అతి దారుణమైన యుద్దాలు... అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. మరి అందరికి ధర్మ పరిశీలన చేయడం కుదురుతుందా?
ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు. చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. మదర్ తెరిస్సా తనకి ముక్కు మొహం తెలియని వాళ్లకి వచ్చి ఏ మాత్రం స్వార్ధం లేకుండా తన జీవిత కాలం సేవ చేసినది. విశ్వా మిత్రుడు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన "గాయత్రీ" మహా మంత్రాన్ని మానవాళి బుద్ది సక్రమం గా ప్రచోదనం చేసికొనే అవకాశాన్ని కలిగించి ఈ విశ్వానికి "మిత్రుడు" అయ్యాడు.ఇక్కడ ధర్మంని ధర్మం గానే దర్శించ వచ్చు.
కొన్ని సందర్భాల్లో ధర్మం సామాన్య ప్రజలకి అధర్మం గా కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీ షిర్డీ సాయిబాబా హైందవ సనాతన ధర్మం లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా వైదిక సంస్కృతి కి కట్టుబడి ప్రవర్తించినట్టు గా దాకలాలు లెవు. అనగా అయన ఈ కట్టుబాట్లకు అతీతుడు. అదే విధంగా శ్రీ కృష్ణుని బాల్యం లో అంతా చోర లీలలు గురించి భాగవతం లో చూస్తే, మన లాంటి వాళ్ళు అనుకరణ సాధ్యం కాని విధంగా ఉంటుంది. అనగా జ్ఞాని ని అనుకరిస్తే సామాన్యుల విషయంలో అది అధర్మంగా పరిగణింప పడుతుంది.
ఇంకొన్ని సార్లు, అధర్మ ప్రవర్తన బయటి ప్రపంచానికి ఉత్తమ మైన ధర్మం గా కనపడే అవకాశం ఉంది. మనం చాల మంది దొంగ సన్యాశులను చూస్తూ ఉంటాం. బయట ఎన్నో ధర్మ పన్నాలు చెపుతున్నా, అంతర్ముఖంలో బహు కుతంత్రాలు కుటిల నీతులు మాయం తో వారి జీవన పయనం ఉంటుంది. వీళ్ళతో చాల ప్రమాదం సమాజానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక పొతే అధర్మ ప్రవర్తన ఉండే అధర్మ పరులు గుర్తించడం కొంచం సులభమే అనుకొంటా.
మరి ధర్మ పరిశీలన ఇంత సంక్లిష్టం అయినప్పుడు తప్పొప్పులను ఎంచడం మన లాంటి వాళ్లకు సాధ్యమా? అలాగే జీవిత పర్యంతం తన ధర్మాన్ని ఎరిగి ఆచరణ చేయడం అంత సులభమైన విషయమా? మనం చాల మంది అంటూ ఉండడం చూస్తూ ఉంటాము. నాకు నా పరిధి లో నేను సక్రమం గా ఉంటె సరి పోదా అని. నిజంగా మనం అంత వరకు ఎటువంటి అంతర్మధన కు గురి కాకుండా సక్రమం గా విధి నిర్వహణ చేయ గలమా? ఎందుకు మన ధర్మం మన జీవన స్తితి ని బట్టి మరూతూ ఉంటుంది కదా. కొడుకు గా, తమ్ముడిగా, అన్నయ్య, భర్త గా, చెల్లెలు, అక్క, తల్లి, తండ్రి, స్నేహితుడు, పరిచయస్తుడు ఇట్లా రక రకాల స్తాయిల్లో రక రకాలు గా.
ఉదాహరణకి, యుధిస్టరుడు మొత్తం భారతం సర్వ పాత్రల్లో ధర్మానికి ప్రతీకగా చెపుతారు కదా. అయన ఎంత ధర్మానికి కట్టుబడ్డాడు అంటే, అజ్ఞాత వాశం ఉత్తర గోగ్రహణం లో అర్జనుడు బయటపడి పోయినప్పుడు, పాండవులు నిజం గా గడువు సక్రమం గా పూర్తి చేసారా లేదా అన్న మీమాంశ వస్తుంది. సరే యుద్ద భూమిలో ద్రోణ, భీష్మ మాటలు వినక తప్పక యుద్ధం కొనశాగించి అర్జనుని చేతిలో అవమానిమ్పబడిన కౌరవ రాజు కు భీష్మ పాండవ పక్షపాతి అని అనుమానం వీడక ఒక వేగు ని పిలిచి "ధర్మ రాజుని" ఈ సమస్య పై నివృత్తి ని కోరమని అడుగుతాడు. అంటే ధర్మ రాజు నిజం గా గడువు పూర్తి అయ్యింది అంటే, దుర్యోధనుడు ఇంక పై దాని గురుంచి ఆలోచించడు.అటువంటి ధర్మ వేత్త మరి భార్య ని అధర్మంగా పందెం లో ఒడ్డాడే అని మనకి అనిపించక మానదు. ధర్మ రాజు తాను ఓడాక భార్య ఒడ్దే అధికారం ఉంటుందా? అసలు భార్య ను పందెంలో ఒడ్డే అధికారం భర్త కి ఉంటుందా? కాని ఈ ధర్మ సూక్ష్మం తెలిసే ధర్మ రాజు అసలు తన్ను పందెంలో ఒడ్దే అవకాశమే లేదు అని పూర్తి గా నమ్మి నేను "ధర్మ" విజితనా లేక "అధర్మ" విజిత నా అని సభని ప్రశ్నిస్తుంది. తెలిసినా చెప్పితే కురు వంశం ఏమి అవుతుందో అని భయ పడ్డ భీష్ముడు ఆ ప్రశ్న దాటి వేస్తాడు. వివరించిన వికర్ణుడిని స్తాయి లేదని కర్ణుడు నిలువరిస్తాడు. అసలు సర్వ స్వతంత్రుడై జూదం ఆడుతున్న ధర్మ రాజు ద్రౌపది ని పందెంలో పణంగా పెట్టనే లెదు. తన అధీనంలో ఉన్న రాజ్యాలని, సంపదని, తమ్ముళ్ళని చివరకి తన్ని పందెంలో ఒడ్డి కౌరవ రాజు అయిన దుర్యోధనునకు బానిస అవుతాడు. అప్పటి వరకు దుర్యోధనుని ప్రతినిధిగా జూదం ఆడుతున్న శకుని ఆజ్ఞ మేరకు ద్రౌపది ని చివరగా పందెం లో ఒడ్డుతాడు. ఆ సమయంలో శకుని ద్రౌపది నే కాదు మరి ఎవరి ని పందెంలో ఒడ్డమన్నా అతను ఆజ్ఞ పాలించవలసిందే. అతంక ముందు వరకు ధర్మ రాజు "రాజ" ధర్మం వహిస్తే ఆ తర్వాత "సేవక" ధర్మం పాటించాడు. సేవకుడి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అందులో సాధ్యాసాధ్యాలు చూసికొనే బాధ్యత యజమానిదె. ఒకవేళ తన్ని పందెంలో ఒడ్డే ముందర కనక ద్రౌపది ని ఒడ్డ మని శకుని సలహా ఇచ్చి అయన అది చేస్తే అప్పుడు ధర్మ రాజు అధర్మ పరుడో కాదో నిర్ణయించే అధికారం మనకి ఉండచ్చు.
మరి ఈ కత్తి మీద సాము లాంటి ధర్మాచరణ అందరికి సాధ్యమా? తన ధర్మాన్ని తను నిర్వత్తిస్తే భగవంతుడు హర్షిస్తాడా? స్వధర్మాన్ని పాలించే వాళ్ళకి సత్య దర్శనం కలిగి శోకం తొలుగు తుందా? ఇదే ధర్మ రాజు యుద్ధం అయిన జరిగిన జన నష్టం ని చూసి విపరీతమైన శోకానికి గురి అవుతాడు. కాగ నిత్యం ధర్మ పరాయణుడైన అయన ఆ విధం గా శోకించడం చూడ లేక "కిమేకం దైవతం కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్నామానవా శుభం" అని భీష్ముడిని అడిగేలా చేసి అయన కి విష్ణు సహస్ర నామ స్త్రోత్ర సారము తద్వారా సత్య సందర్శనం కలిగేలా చేస్తాడు ఆ భగవానుడు.
మన స్వధర్మం మనం పాటించినప్పుడు, సంఘర్షణలు ఎదురు అయినా, దానిలో తప్పు ఒప్పులు ఆయనకే సమర్పించ గలిగి నప్పుడు ఆయనే భాద్యత వహించి మన్ని తరింప చేయ గలడు అన్నది ఇక్కడ మనకి అర్ధం అవుతుంది.
*** కొంత మంది మహాను భావులు చెప్పిన ఒకటి అరా మంచి మాటల సారాన్ని అక్కడ ఇక్కడ జోడించి రాసిన వ్యాక్యాలు ఇవి. అంతే కాని నేను ఇంత గంభీర మైన విషయాలు గురించి వ్రాసేంత ప్రాజ్ఞుడిని కాదు మరియు అర్హుడిని అంత కన్నా కానే కాదు.
రామాయణం లోని అరణ్య కాండ లో శ్రీ రాముడు భరద్వాజ ఆశ్రమం లో సీతా లక్ష్మణ సహేతుడై ముని ని తన ఆశ్రమ నిర్మాణానికి ఒక అనువైన ప్రదేశం సూచించ మని అడుగుతాడు. ఆయనే శ్రీ మహా విష్ణుడిగా గుర్తు ఎరిగిన మహర్షి రాముడిని అక్కడే అరణ్యవాసం చేయమని కోరతాడు. దానికి శ్రీ రామ చంద్రుడు, సున్నితంగా నిరాకరిస్తూ తన ధర్మం ఋషులతో గడపడానికి సమ్మతించదని చెప్పి నిరాకరిస్తాడు. పైగా ఒక ఉదాహరణ చెపుతూ మీ ఆశ్రమం లో ఉండే సాదు జంతువులని క్రూర మృగాల నించి రక్షించే క్రమం లో నేను వాటిని సంహరించి నప్పుడు, మీ మనస్సులు ఏ సందర్భం లో అయినా కష్టం కలిగి నాకు అకారణ శాపంనకు కూడా కారణం అవచ్చు అని చెపుతాడు. నిజంగానే అన్ని భూతాల్లో ఒకే పర బ్రహ్మం ని దర్శించే స్తాయి మహర్షికి ఉందని అదే ధర్మాన్ని దుష్ట శిక్షణ నిమిత్తమై వచ్చిన రాముడు పాటిస్తే అవతార ప్రయోజనం నేరవేర్చేది ఎలా?
సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.మత సంప్రదాయాల్లో పాటింపులు మరియు పట్టింపులు వల్ల ఒకడిని ఒకడు కొన్ని వేల సంవత్సరాలు పాటు ద్వేషిస్తూనే ఉండటం దాని వల్ల చరిత్ర లో అతి దారుణమైన యుద్దాలు... అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. మరి అందరికి ధర్మ పరిశీలన చేయడం కుదురుతుందా?
ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు. చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. మదర్ తెరిస్సా తనకి ముక్కు మొహం తెలియని వాళ్లకి వచ్చి ఏ మాత్రం స్వార్ధం లేకుండా తన జీవిత కాలం సేవ చేసినది. విశ్వా మిత్రుడు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన "గాయత్రీ" మహా మంత్రాన్ని మానవాళి బుద్ది సక్రమం గా ప్రచోదనం చేసికొనే అవకాశాన్ని కలిగించి ఈ విశ్వానికి "మిత్రుడు" అయ్యాడు.ఇక్కడ ధర్మంని ధర్మం గానే దర్శించ వచ్చు.
కొన్ని సందర్భాల్లో ధర్మం సామాన్య ప్రజలకి అధర్మం గా కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీ షిర్డీ సాయిబాబా హైందవ సనాతన ధర్మం లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా వైదిక సంస్కృతి కి కట్టుబడి ప్రవర్తించినట్టు గా దాకలాలు లెవు. అనగా అయన ఈ కట్టుబాట్లకు అతీతుడు. అదే విధంగా శ్రీ కృష్ణుని బాల్యం లో అంతా చోర లీలలు గురించి భాగవతం లో చూస్తే, మన లాంటి వాళ్ళు అనుకరణ సాధ్యం కాని విధంగా ఉంటుంది. అనగా జ్ఞాని ని అనుకరిస్తే సామాన్యుల విషయంలో అది అధర్మంగా పరిగణింప పడుతుంది.
ఇంకొన్ని సార్లు, అధర్మ ప్రవర్తన బయటి ప్రపంచానికి ఉత్తమ మైన ధర్మం గా కనపడే అవకాశం ఉంది. మనం చాల మంది దొంగ సన్యాశులను చూస్తూ ఉంటాం. బయట ఎన్నో ధర్మ పన్నాలు చెపుతున్నా, అంతర్ముఖంలో బహు కుతంత్రాలు కుటిల నీతులు మాయం తో వారి జీవన పయనం ఉంటుంది. వీళ్ళతో చాల ప్రమాదం సమాజానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక పొతే అధర్మ ప్రవర్తన ఉండే అధర్మ పరులు గుర్తించడం కొంచం సులభమే అనుకొంటా.
మరి ధర్మ పరిశీలన ఇంత సంక్లిష్టం అయినప్పుడు తప్పొప్పులను ఎంచడం మన లాంటి వాళ్లకు సాధ్యమా? అలాగే జీవిత పర్యంతం తన ధర్మాన్ని ఎరిగి ఆచరణ చేయడం అంత సులభమైన విషయమా? మనం చాల మంది అంటూ ఉండడం చూస్తూ ఉంటాము. నాకు నా పరిధి లో నేను సక్రమం గా ఉంటె సరి పోదా అని. నిజంగా మనం అంత వరకు ఎటువంటి అంతర్మధన కు గురి కాకుండా సక్రమం గా విధి నిర్వహణ చేయ గలమా? ఎందుకు మన ధర్మం మన జీవన స్తితి ని బట్టి మరూతూ ఉంటుంది కదా. కొడుకు గా, తమ్ముడిగా, అన్నయ్య, భర్త గా, చెల్లెలు, అక్క, తల్లి, తండ్రి, స్నేహితుడు, పరిచయస్తుడు ఇట్లా రక రకాల స్తాయిల్లో రక రకాలు గా.
ఉదాహరణకి, యుధిస్టరుడు మొత్తం భారతం సర్వ పాత్రల్లో ధర్మానికి ప్రతీకగా చెపుతారు కదా. అయన ఎంత ధర్మానికి కట్టుబడ్డాడు అంటే, అజ్ఞాత వాశం ఉత్తర గోగ్రహణం లో అర్జనుడు బయటపడి పోయినప్పుడు, పాండవులు నిజం గా గడువు సక్రమం గా పూర్తి చేసారా లేదా అన్న మీమాంశ వస్తుంది. సరే యుద్ద భూమిలో ద్రోణ, భీష్మ మాటలు వినక తప్పక యుద్ధం కొనశాగించి అర్జనుని చేతిలో అవమానిమ్పబడిన కౌరవ రాజు కు భీష్మ పాండవ పక్షపాతి అని అనుమానం వీడక ఒక వేగు ని పిలిచి "ధర్మ రాజుని" ఈ సమస్య పై నివృత్తి ని కోరమని అడుగుతాడు. అంటే ధర్మ రాజు నిజం గా గడువు పూర్తి అయ్యింది అంటే, దుర్యోధనుడు ఇంక పై దాని గురుంచి ఆలోచించడు.అటువంటి ధర్మ వేత్త మరి భార్య ని అధర్మంగా పందెం లో ఒడ్డాడే అని మనకి అనిపించక మానదు. ధర్మ రాజు తాను ఓడాక భార్య ఒడ్దే అధికారం ఉంటుందా? అసలు భార్య ను పందెంలో ఒడ్డే అధికారం భర్త కి ఉంటుందా? కాని ఈ ధర్మ సూక్ష్మం తెలిసే ధర్మ రాజు అసలు తన్ను పందెంలో ఒడ్దే అవకాశమే లేదు అని పూర్తి గా నమ్మి నేను "ధర్మ" విజితనా లేక "అధర్మ" విజిత నా అని సభని ప్రశ్నిస్తుంది. తెలిసినా చెప్పితే కురు వంశం ఏమి అవుతుందో అని భయ పడ్డ భీష్ముడు ఆ ప్రశ్న దాటి వేస్తాడు. వివరించిన వికర్ణుడిని స్తాయి లేదని కర్ణుడు నిలువరిస్తాడు. అసలు సర్వ స్వతంత్రుడై జూదం ఆడుతున్న ధర్మ రాజు ద్రౌపది ని పందెంలో పణంగా పెట్టనే లెదు. తన అధీనంలో ఉన్న రాజ్యాలని, సంపదని, తమ్ముళ్ళని చివరకి తన్ని పందెంలో ఒడ్డి కౌరవ రాజు అయిన దుర్యోధనునకు బానిస అవుతాడు. అప్పటి వరకు దుర్యోధనుని ప్రతినిధిగా జూదం ఆడుతున్న శకుని ఆజ్ఞ మేరకు ద్రౌపది ని చివరగా పందెం లో ఒడ్డుతాడు. ఆ సమయంలో శకుని ద్రౌపది నే కాదు మరి ఎవరి ని పందెంలో ఒడ్డమన్నా అతను ఆజ్ఞ పాలించవలసిందే. అతంక ముందు వరకు ధర్మ రాజు "రాజ" ధర్మం వహిస్తే ఆ తర్వాత "సేవక" ధర్మం పాటించాడు. సేవకుడి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అందులో సాధ్యాసాధ్యాలు చూసికొనే బాధ్యత యజమానిదె. ఒకవేళ తన్ని పందెంలో ఒడ్డే ముందర కనక ద్రౌపది ని ఒడ్డ మని శకుని సలహా ఇచ్చి అయన అది చేస్తే అప్పుడు ధర్మ రాజు అధర్మ పరుడో కాదో నిర్ణయించే అధికారం మనకి ఉండచ్చు.
మరి ఈ కత్తి మీద సాము లాంటి ధర్మాచరణ అందరికి సాధ్యమా? తన ధర్మాన్ని తను నిర్వత్తిస్తే భగవంతుడు హర్షిస్తాడా? స్వధర్మాన్ని పాలించే వాళ్ళకి సత్య దర్శనం కలిగి శోకం తొలుగు తుందా? ఇదే ధర్మ రాజు యుద్ధం అయిన జరిగిన జన నష్టం ని చూసి విపరీతమైన శోకానికి గురి అవుతాడు. కాగ నిత్యం ధర్మ పరాయణుడైన అయన ఆ విధం గా శోకించడం చూడ లేక "కిమేకం దైవతం కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్నామానవా శుభం" అని భీష్ముడిని అడిగేలా చేసి అయన కి విష్ణు సహస్ర నామ స్త్రోత్ర సారము తద్వారా సత్య సందర్శనం కలిగేలా చేస్తాడు ఆ భగవానుడు.
మన స్వధర్మం మనం పాటించినప్పుడు, సంఘర్షణలు ఎదురు అయినా, దానిలో తప్పు ఒప్పులు ఆయనకే సమర్పించ గలిగి నప్పుడు ఆయనే భాద్యత వహించి మన్ని తరింప చేయ గలడు అన్నది ఇక్కడ మనకి అర్ధం అవుతుంది.
*** కొంత మంది మహాను భావులు చెప్పిన ఒకటి అరా మంచి మాటల సారాన్ని అక్కడ ఇక్కడ జోడించి రాసిన వ్యాక్యాలు ఇవి. అంతే కాని నేను ఇంత గంభీర మైన విషయాలు గురించి వ్రాసేంత ప్రాజ్ఞుడిని కాదు మరియు అర్హుడిని అంత కన్నా కానే కాదు.
Wonderful Mr Petluri
ReplyDeleteబాగా చెప్పారు.
ReplyDelete