Monday, April 17, 2023

Chapter 14 Bhagavad Geeta

श्री गुरुभ्यो नमः ।श्री कृष्णपरमात्मने नमः। मम भावकथनस्य आदौ अहं एका कथा वक्तुं इच्छामि। पूर्वस्मिन् काले एकः काष्ठतक्षकः एकस्मिन् ग्रामे निवसति स्म। सः अतीव दरिद्रः। सः तस्य दरिद्रस्य स्थितिं कारणात् बहु व्याकुलितः अभवत्।सः एकस्मिन् दिने एकेन सदगुरुणा सह तस्य बाधा विषये प्रस्थावितवान्। तत् गुरुः बहु दयालुः स्म। सः गुरुः दयया भावनया सह काष्ठतक्षकस्य दारिद्रस्य निवारणस्य निमित्तं एकं उपदेशं दत्तवान्। सः एकस्य अरण्यमार्गस्य निर्देशनं सूचयित्वा "एषे मार्गे अग्रे गच्छतु, शुभं भूयात्" - इति संदेशं दत्तवान्। काष्ठतक्षकः संतोषेण तस्मिन् मार्गे अधिगच्छति स्म।यथा तत् मार्गे किञ्चित् दूरं प्रचलतिवान् सः सुगन्धबरित दिव्य चन्दन वृक्षाः पश्चति स्म।सः आनन्देन यावत् आवश्यकम् तावत् चन्दन वृक्षस्य शाकान् छिन्नं कृत्वा तस्य स्वगृहं नीत्वा अधिक धनं आर्जितवान्।सः तद् कारणात् दारिद्रस्य विमुक्तः अभवत्। किञ्चित् दिनानन्तरं सः पुनः गुरोः उपदेशं स्मरति स्म।तत् अरण्यमार्गे पुनः अग्रे गन्तुं निर्णयं क्रुतवान्।अस्मिन् समये सः यदा तत् मार्गे किञ्चित् अधिकं दूरं गतवान् तदा रजत खनि दर्शितवान्।सः पुनः यथाचित्तम् रजत संपदानि स्व्ग्रहुम् नीत्वा अधिक धनसमुपार्जनम् कृतवान्।अनन्तरं सः तद् नगरे प्रमुख धनिकश्रेने स्थितवान्। किञ्चित् समयानन्तरं सः पुनः तत् अरण्यमार्गे गत्वा सुवर्णसम्पदान् प्राप्तवान्।अनन्तरं अपि सः विना विश्रामेण पुनः तत् अरण्य मार्गे गत्वा दिव्य वज्र सम्पदान् प्राप्तवान्।यदी वयं तत् काष्ठतक्षकस्य प्रगतेः अवलोकनं करोति चेत्, तस्य सफलतायाः मूल करणं किं?सः अन्तर्दशायां लब्ध्वा लाभानि न गणयित्वा तस्य संपादान्वेषणं सन्ततम् कृतवान्।सादृश प्रकारेण एव भगवान् आदौ कर्म योगस्य ज्ञानं बोधयित्वा अस्माकं मनसि चन्दन सुगन्धा भावनाः स्थापितवान्।अनन्तरं भक्तियोगस्य वैशिषस्य उपदेशं कृत्वा अस्माकं कृते रजत सुवर्ण च सम्पदान् प्रशादितवान्। भगवान् बहुदयालुः।अग्रे भगवान् अमूल्य वज्र सादृश ज्ञान योगस्य महिमाः अस्माकं कृते बोधितुं निस्चयितवान्। तत् क्रमे भगवान् क्षेत्रक्षेत्रेग्नस्य ज्ञानं दत्वा गुण त्रय विशिष्टं बोधितुं उद्युक्तवान्। यथा सप्तम अष्टम च अध्याययोः विवरानुसारेण भौतिक जगत् अपि सृष्टिस्थितिलयस्य चक्रं अनुसरति।लय काले भौतिक शक्तिः प्रकृतिः च भगवति अव्यक्त रूपेण स्थितम् भवति।यदा भगवान् स्रुष्ट्याः कार्यक्रमस्य आरम्बं करोति, प्रकृतिः अपि भगवद् आदेशानुशारेण विभिन्न जीव स्वरूपाणि सृष्टिं करोति।किन्तु भगवान् एव एषायाः सर्वस्रुष्ट्याः बीजप्रदाता अस्ति।प्रकृत्याः सृजित सर्वप्राणिनः त्रीणि गुणैः सह बद्दाः भवन्ति।भगवान् एतस्मिन् अध्याये एतानि त्रीणि गुणानां विवरणं दत्तवान्।सत्व गुणः रजोतमयोः गुनयोः अपेक्षया उत्तमगुणः भवति।सत्वं प्रकाशकं निर्मलम् अनामयं च।सुख सङ्गेन ज्ञान सङ्गेन च बध्नाति।किन्तु कोऽपि नित्यं सत्वगुणेन जीवनं कर्तुं शक्यते वा?यदी कश्चन पुन्यपुरुषाः सत्यलोकं गन्तुं शक्यन्ते तर्ही ते निश्चयेन सत्व गुणाः एव भवन्ति खलु। किन्तु कथं भीष्मस्य मातापितरौ, शान्तनुगङ्गे तमो गुणेन सत्यलोके अव्यहरिताम्?ताभ्याम् काम प्रवृत्तिभ्याम् कारणाभ्याम् एव तौ भूलोके अजनयताम् खलु।भृघुमहर्षेः वृत्तान्तं अपि अन्य एकं उदाहरणं अस्ति।सः महा तपोशक्तिसंपन्नः।किन्तु सः सत्य लोके कैलाशे च क्रोधात् कारणात् ब्रह्मशिवयोः दोषान् परिगाणितवान्।श्री महाविष्णुः भृघुमहर्षेः गर्वभङ्गं कृत्वा तस्य तमोगुणस्थित्याः विनष्टं कृतवान्। सत्वगुणः उत्तमः गुणः किन्तु तत् गुणः अपि भौतिकप्रकृत्याः परिधिना एव वर्तते। अनन्तरं भगवान् रजोगुणस्य व्यवहारस्य विषये उक्तवान्।रजोगुणः सदा भौतिकअस्तित्वविषयैः बध्नाति।प्रपन्चिक व्यवहाराः एव रजोगुणस्य प्राधान्यं भवति।रजोगुणः इन्द्रियभोगासक्त्याः अभिरुच्याः वृद्दीं करोति।रजोगुनप्रधानपुरुषाः श्रीलता क्षमता वृत्ति च विशयेषु तल्लीनाः भवन्ति।रजो गुणस्य तत्वं सम्यक् रीत्य अवगन्तुं विश्वामित्रस्य वृत्तान्तं एकवारं वयं पश्यामः।विश्वामित्रस्य पूर्वाश्र्मनामः कौशिकः, सः एकः राजः।सः एकस्मिन् समये ब्रह्मर्षि वशिष्टस्य आश्रमं गतवान्।वशिष्टः कौशिकस्य सर्वसैन्यानाम् कृते तत्क्षणम् विशेष अथिति सत्काराणि कृतवान्।कौशिकः आश्चर्यं अनुभूत्वा - "कथं भवान् एतेषाम् सर्वेषाम् व्यवस्था कृतवान्" - इति अप्रुच्चत्।"मम आश्रमे कामधेनोः पुत्री नन्दिनी नाम धेनु निवसति स्म।सायाः अमोघदिव्यशक्त्या एतानि सर्वाणि कर्तुं शक्नोमि" - वशिष्टः प्रत्युत्तरं दत्तवान्।कौशिकः नन्दिनीं अपेक्षितवान्।किन्तु नन्दिनी स्वीय रक्षणार्थं अशेषवीराणाम् सृष्टिं कृत्वा कौशिकस्य पराजयं कृतवती।कौशिकः लज्जितभावेन प्रतीकार भावेन च दिव्यअश्त्रशाश्त्रार्थं शिवस्य घोरतपं कृतवान्। भगवान् शिवः सकल अश्त्रशस्त्र सम्पदान् कौशिकाय प्रसादितवान्।कौशिकः नूतन वरबलेन परिपूर्ण आत्मविश्वाशेन पुनः वशिष्टेन सह युद्दं कर्तुं तस्य आश्रमं गतवान्।किन्तु वशिष्टस्य तपबलस्य कारणेन कौशिकस्य सर्वअश्त्राणि निरर्धकं अभवन्। कौशिकः खिन्नः अभवत्।अहमपि वशिष्टसादृशं ब्रह्मर्षि स्थरं प्राप्तुं प्रयत्नं करिष्यामि - एतस्य निर्णयं कृत्वा पुनः कौशिकः तपं कर्तुं उद्युक्तवान्।कौशिकस्य तपोमार्गस्य निर्णयं सत्वमेव किन्तु तस्य लक्ष्यं केवल वशिष्टस्य अपेक्षया उन्नत स्थरं प्राप्तुं एव।सः स्पर्धाभावेन इत्युक्ये रजोगुणेन एव तपोबलम् अर्जितुं निश्चयितवान्।कौशिकः पुनः तीव्रतपं कृत्वा ब्रमर्षि स्थर वरं भगवान् ब्राह्मम् आर्थितवान्।किन्तु भगवान् ब्रह्म कौशिकं "राजर्षि" इति सम्बोदितवान्।कौशिकः अनेक वर्षाणि तीव्रतपं कृतवान्।सः तत् मार्गे अनेक प्रतिबन्धकानि विघ्नाः च अनुभूतवान्।अन्ते सः पूर्वदिशे गत्वा अद्भुततपं कृतवान्।सः महिनान्वित गायत्री मन्त्रस्य उपदेशं सकलजनानं कृते कृत्वा "विश्वामित्रः" अभवत्।अनन्तरं तस्य मनसि वशिष्टस्य चिन्ता न आसीत्।एकस्मिन् दिने यदा विश्वामित्रः अतीव बुभुक्षाम् अनुभूतवान्, इन्द्रः तस्य परीक्षां कर्तुं विश्वामित्रं आहारं याचितवान्।सः इन्द्राय अन्नं दत्तवान्।विश्वामित्रः गुणातीतः अभवत्।भगवान् ब्रह्मः विश्वामित्रं सादरेण "ब्रह्मर्षि" इति सम्बोदितवान्।अनन्तरं वशिष्टः अपि मित्रभावेन विश्वामित्रेण सह व्यवहरितवान्।महाभारत काले कर्णः अपि तस्य जीवितपर्यन्तं अर्जुनेन सह रजो भावेन एव व्यवहरितवान्।वस्तुतः कर्णः अपि सकलगुनसंपन्नः योधः च। किन्तु तस्य सर्वशक्तिं केवल मात्सर्यभावनया एव यापितवान्।तदैव कर्णस्य पतनस्य कारणं अभवत्। अनन्तरं भगवान् तमोगुणस्य लक्षाणानि अपि वर्णितवान्।तमोगुणः सत्वगुणस्य व्यतिरेकः अस्ति।तमोगुणेन बद्धत जनाः निद्रा मान्द्य हिंसा द्युत इत्याति विषयेषु सदा आसक्ताः भवन्ति।ते सत्यान्वेषणं कदापि न कुर्वन्ति। अस्माकं इतुक्ते सर्व प्राणिनां क्षेत्रज्ञाः एतानि त्रीणि गुणैः सह सान्गत्यं कुर्वन्ति।दृष्टान्तरूपेण अहं (यदी भारतराष्ट्रे स्थितम् चेत्) प्रातः काले भगवद्गीतायाः कक्षा समये सत्वगुणेन व्यवहरितुम् इच्छामि।मध्यान्न काले तमोगुनेन आलस्यः मन्दः अस्मि।सायङ्काले कार्यालस्य समये रजोगुणेन व्यवहारम् करोमि। सत्वस्य फलं सात्त्विकं निर्मलं च। रजसः फलं दुःखं भवति। तमसः फलं अज्ञानं भवति।यदी कोऽपि क्षात्रः उत्तमम् परिश्रमं करोति चेत् उत्तमायाः कलाशालायाः प्रवेशं प्राप्नोति।यदी अधमं परिश्रमं करोति चेत् अधमाः कलशालायाः प्रवेशं एव प्राप्नोति।भागवतेन इति उक्तं सत्त्वे प्रलीनाः स्वर्यान्ति नरलोकं रजोलयाः। तमोलयास्तु निरयं यान्ति मामेव निर्गुणाः।। सत्वगुणोपाशनाः ऊर्ध्वलोकानि गच्छन्ति।रजोगुनसंपन्नाः पुनः भूलोकं आगछन्ति।तमोगुणशापग्रस्ताः अधोलोकानि एव प्राप्नुवन्ति।तर्हि भगवन्तं कः प्राप्नोति?जगति सर्व वस्तूनि एतैः त्रिगुणैः बध्नन्ति।किन्तु भगवतः नामानि, गुणाः, रूपाणि च एव गुणातीतं भवन्ति।ये तेषां मनः सदा भगवतः अध्यात्मिक क्षेत्रे स्थापयन्ति ते एव गुणातीतः भवितुं शक्यन्ते।ये पुन्यजनाः एतषां गुनत्रयानां अतीताः भवन्ति ते एषया मायया न पीडिताः वर्तन्ते।एतस्य दिव्य उपदेशं श्रुत्वा अर्जुनः गुणातीतास्य लक्षणानां ज्ञातुं इच्छतिवान्।समदु:खसुख:, स्वस्थ: , समलोष्टाश्मकाञ्चन:, तुल्यप्रियाप्रियः, धीरः, तुल्यनिन्दात्मसंस्तुति:, मानापमानयोः तुल्यः, मित्रारिपक्षयोः तुल्यः, सर्वारम्भपरित्यागी च गुणैः सह न परिग्रहन्ति - इति भगवान उक्तवान्। भगवान् श्री राम चन्द्रस्य कृते एकस्मिन् दिने दसरथः राज्य पत्तभिषेकं गोशितवान्।अग्रिमदिने वनवाशादेशं आदेशितवान्।श्री रामचन्द्रः द्वौ निर्णयौ समनरीत्या एव अङ्गीकृतवान्।इति समलोष्टाश्मकाञ्चनस्य लक्षणं खलु। अन्ते "अहं ब्रह्मणः, नाशरहितस्य मोक्षस्य, शाश्वतस्य च धर्मस्य, दुःखरहितस्य, सुखस्य च प्रतिष्ठा अस्मि तस्मात् हेतोः तादृशः पुरुषः ब्रह्मभूयाय कल्पते इति सन्मया पूर्वमुक्तं तत् युक्तमेव" - इति भगवान् उक्तवान्।

Friday, February 10, 2023

డంబాచారం

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥ సత్య లోకంలో గంభీరంగా సాగుతున్న బ్రహ్మ గారి సభలోకి శుద్ధి మంత్రం చెపుతూ ఒక పవిత్ర వేషధారి అదాట్టుగా ప్రవేశించడంతో ఒక్క సారి సభాసదులందరూ ఉలిక్కి పడ్డారు. ఈయనెవరురా సాక్షాత్ బ్రహ్మ సదస్సు లో కూడా అపవిత్రత గాంచినవాడనుకొంటూ ఆశ్చర్యచకితులయ్యారు. మనిషేమో ఆజానుబాహుడు, శరీరమంతా విబూది రేఖలు, స్వచ్చమైన ధవళ వస్త్రధారి, చేతిలో కమండలం, రుద్రాక్షసహిత నిత్య జపధారి అయిన ఆయన్ని చూసి సత్యలోకములోని అంతటి దివ్య పురుషులు, సకల దేవతా గణం, తపఃసంపన్నులైన ఋషీ కులం, చదువుల తల్లి శారదమ్మ మరియు పవిత్రాపవిత్రల గణనా సమర్ది అయిన హంస కూడా ఒక్క క్షణం నివ్వెర పోయారు. తన సభలో సంభవించిన ఈ అలజడి ని గమనించిన సకల చరాచర సృష్టి కర్త అయిన బ్రహ్మ కూడా ఒక్క సారి తన ధ్యానావస్థ నిండి బయటపడినవాడై తన యొక్క సభకు అకస్మాత్తుగా వేంచేసిన ఆగంతుడిని గమనించారు. ఆహా! ఇంతటి మహోన్నతమైన సదస్సులో నిర్భీతి గా నిలుచొన్న ఈతడు నిశ్చయముగా మహామనీషి అని తలంచి, ఆతనికి సముచిత ఆసనము సమర్పింపచూసారు. అయితే, పరుల కోసముఏర్పాటుచేసిన ఆసనమునను ఆతడు వెంటనే నిరాకరించాడు. బ్రహ్మ మరింత చకితుడై, తన ఒడి లోనే కూర్చొనమని అభ్యర్ధించాడు. అతగాడు మరల అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥' అంటూ శుద్ధిమంత్రము చెపుతూ, ఆచమనము చేసి ఆయన ఒడిలో కూర్చొన్నాడు. బ్రహ్మ గారు అతనిని ఆసక్తిగా మరియు పరీక్షగా చూసి, " ఓరి! డంబాసురా నీవా!! బహుకాలము తర్వాత వేంచేసేవు!! గుర్తుపట్టలేకపోయాను సుమీ!!" అంటూ మురిపం చేశాడు. "ఇది వరలోకన్నా నీకు మరింత డాంబికం పెరిగిందిరా అబ్బాయ్ ! ఏంటి కారణం?" అని ప్రశ్నించారు. నా ప్రవుత్తి సరిగ్గా సరిపోయేటట్టు మరియు ఉపకరణమయ్యేటట్టు ఈ వేళ భూలోకములో చాలా సాధనాలు ఏర్పడ్డాయి తండ్రీ! ఏది మనకు తెలియక పోయినా గూగుల్ లో క్షణభంగుర కాలము లో అన్వేషించి ఎదుటివారికి అది స్వీయప్రజ్ఞ అనే భ్రాంతి ఇట్టే కలుగచేయవచ్చుఁ. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా లభ్యమయ్యే సమాచారాన్ని ప్రతి నిత్యం మనం సొంత తెలివితేటలుగా వినియోగించవచ్చుఁ. అదే నా ప్రగతి కి మూల కారణం అంటూ వివరించాడు. మనలో లేని ప్రజ్ఞ ఎదుటివారికి తనది గా వెల్లడించడమే "డంబాచారం". అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ । ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః గీతాచార్యుడు సాధన సంపత్తి కొరకై ఉండవలసిన ముక్ష్య లక్షణాల్లో ఒకటి "అదంభత్వం" గా పేర్కొంటాడు. అనగా ఓ కపటి, కృత్తిమమైన బాహ్య వ్యక్తిత్వమును పెంపొందించుకుంటాడు. వ్యక్తి అంతర్గతంగా దోషపూరితముగా ఉంటాడు కానీ, బాహ్యంగా మంచి గుణములు ఉన్నట్టు ఒక వేషం సృష్టిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ, బాహ్యంగా ప్రదర్శించే మంచి గుణములు, పైపైకే ఉంటాయి మరియు ఒక డొల్ల మాత్రమే.ఈ ప్రస్తుత కాల మాన పరిస్తుతుల్లో మనమందరము మనకు సహజంగా పొందిన మన స్వీయ శక్తి ని మాత్రమే బయటకు ప్రదర్చించడము సాధ్యమా? ఇన్ని ఉపకరణాల మధ్య లభ్యమయ్యే అనేక సమాచారం ని చూస్తే చాలా సందర్భాలలో అసలు మనకు స్వతహాగా విజ్ఞానం అవసరమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదూ! అయితే, నిర్వచనుసారేణ మనమందరమూ "డాంబికులమేనా"??? I Ln. NCS Srinivasacharyulu bearing membership No: 1343582, from Lions club of Image - 061484, for the last 21 years. I was involved in almost most of the mission critical & service oriented activities of the club and contributed to the success of district level programs organized by the Governer. During this course, I have offered my services at various capcities such as club level, DC and ZC positions. My notable active participations during my membership period are with International Conventions, ISAAME forum, multiple district conventions and many others. At this juncture, keeping the best interests of the club in mind, I would like bring few areas of concerns to your notice. I strongly feel these valid concerns require your immediate attention and possibly should prompt some corrective measures 1) I submit that, "No board meeting held nor seek the permission of board for voting this year not any information provided to board members of the club" 2) I submit that, "No senior member of the club contacted / consulted for selection of member for voting" The team of delegates for voting were filled in credential form by the President & Secretary with the influence and as decided by the senior members, MR. KV Rama Rao and Mr.NCH Nageswara Rao Taking above considerations into view, I request you to reject the LC of Image credential form, which has been submitted already Thanks for your consideration and hoping for an immediate action in this regard from you at the earliest

Friday, February 3, 2023

Chapter 12 Telugu and Sanskrit

ద్వాదశ అధ్యాయస్య తెలుగు వ్యాఖ్యానం అవ్యక్తుడు, అవ్యయుడైనట్టి పరమాత్మ తత్వాన్ని జ్ఞాన యోగముద్వారా ఉపాసించవలెనా లేక సగుణ సాకార స్వరూపమును మనస్సున ప్రతిష్టింపచేసికొని ఉపాసన మార్గమున ధ్యానించ వలెనా అన్న సందేహమును అర్జునుడు భక్తి యోగ అధ్యాయము యొక్క మొదటినందే వ్యక్తపరిచాడు. భగవంతుని అద్భుత విశ్వరూప సందర్శనము తర్వాత అర్జునునికి ఈ సందేహము కల్గుట కొంచం మనకు ఆశ్చర్యము కలిగించక మానదు. స్వామి మనలను జ్ఞాన మార్గమందే తనను సాధించవలెనన్న తలంపు తో ఉన్నయెడల తన సాకార స్వరూపమును ఏల ప్రదిర్శించ వలెను? భగవంతునికి మన యొక్క ప్రవర్తన క్షుణ్ణముగా తెలిసినవాడు కనుకనే సాకార ఉపాశన మార్గమును మనకు ఉపదేశించి ఉన్నాడు. మర్కట - కిషోర న్యాయము నిరాకార జ్ఞానమార్గ ఉపాసకులని మరియు మార్జార-కిషోర న్యాయము సాకార ఉపాసకులకు వర్తిస్తున్నట్టుగా మనకు ఉదాహరణ రూపము లో గోచరిస్తున్నది. ఒక కోతి పిల్ల తన తల్లి పొట్టని పట్టుకొని ఉన్నప్పుడు, తల్లి ఒక చెట్టు నిండి మరొక చెట్టునకు ఎగురుతున్నపుడు, తన తల్లిని గట్టిగా పట్టుకొను బాధ్యత పిల్లదే అవుతున్నది. కానీ ఒక పిల్లి తన పిల్లలను జాగ్రత్తగా మెడను పట్టుకొని ఒక చోటు నిండి మరొక వైపునకు దాట వేయడంలో పూర్తి బాధ్యత తీసికొంటున్నది. నిరాకార, అవ్యక్త మైన భగవంతుడిని ఉపాసన చేయుట సాధ్యమయినప్పటికిన్ని అది సాధారణ మనుష్యులకు కష్టతరము. అందువలనే మనకు ఈ పూజ కైనా ముందర ధ్యాన శ్లోకమును నిర్దేశించారు. ఒక సాకార రూపమైన పరమాత్మ స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించు కొని ఉపాసనచేయాలనే నిర్దేశించారు. ఉదాహరణకు విష్ణుసహస్రనామ స్త్రోత్రపారాయణనకు నాందిగా "శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||" అని స్తుతించినప్పుడు, ఆదిశేషువు పైన లక్ష్మీసమేతుడై శాంతస్వరూపుడై మేఘవర్ణముతో విరాజితుడై మన సంసారభయాలను సదా హరిస్తున్న ఆ విష్ణు ఆకారమును మన మనస్సునందు స్థిరపరుచుకొని లేదా సాదృశ్యమైన రూపమును ధ్యానిస్తూ స్త్రోత్ర పారాయణ చేయడం ద్వారా మన మనస్సు నందు కలిగే వికారములు దూరముగా నుంచవచ్చని ఉద్దేశ్యము. ఎనిమిదవ శ్లోకములో ఎల్లప్పుడూ భగవంతుని యందు మాత్రమే మనస్సు ను లగ్నం చేసి బుద్దిని సమర్పిస్తాడో అతను సదా భగవంతుని యందె నివసిస్తాడని అభయం ప్రసాదిస్తాడు. మనము భగవంతుని యందె నివసించుట అనగా దాని అర్ధమేమి ? మనము ఏదైనా పవిత్ర స్థలము నకు వెళ్ళినప్పుడు ఏ విధముగా శుచిగా ఉండడానికి ప్రయత్నిస్తామో మరియు మన మనస్సు కూడా పరిశుద్ధము గా ఉంచుకొనడానికి ప్రయత్నిస్తామో, అదేవిధముగా మనము నిత్యము భగవంతుని మందిరమునందు నివసిస్తున్నప్పుడు, అదే పవిత్రస్థితి మనయందు ఎల్లవేళలా కొనసాగుతుందని అర్ధము. మన ఆలోచనలు సైతము నిత్యము భగవద్ తత్వమునే ఆపాదించుకొన్నప్పుడు మన ప్రవర్తన కూడా నిర్ద్వందంగా ఉన్నతముగానే ఉంటాయి. ఉదాహరణకు, రామాయణములో భరతుడు, రామ రాజ్యబహిష్కరణ మరియు వనవాస యోగము గురించి తెలిసికొన్నప్పుడు అమితమైన దుఃఖమునకు లోనయ్యాడు. తన తల్లి కైకేయ యొక్క దుర్బుద్ధి నకు మూలకారణము మందర అని తెలిసికొని కుపితుడై ఆమెను శిక్షించాలని క్షణకాలం నిర్ణయించుకొంటాడు. అయితే సంపూర్ణరామార్పితమైన ఆ భరతుడు, తన యొక్క చర్య శ్రీ రామ సమ్మతము కాబోదని తెలిసికొని ఆ ఆలోచనను విరమించుకొంటాడు. సదా భగవంతుని చింతననే చేయు భక్తుడు అధర్మమార్గమునకు కూడా ఎప్పుడూ దూరంగానే ఉంటాడని మనకు ఈ సంఘటన ద్వారా వెల్లడి అవుతున్నది. కానీ సర్వదా భగవంతునుని మన మనస్సులో ఉంచుకొనుట సాధ్యమా ? ఆ మార్గములో ఖఛ్చితంగా ప్రతిబంధకాలు ఎదురువుతాయి. మన యొక్క జీవనం యొక్క ముఖ్యలక్షణం భగవంతునుని మన మనస్సులోకి ఆహ్వానించి స్థిరపరుచోకోవడమే. కానీ ఈ ప్రయత్నం ప్రథమ సందర్భములోనే సఫలీకృతం అవుతుందా ? ఎట్టిపరిస్థితులలో సంభవం కాదు. మనస్సు చంచలమైనది కావున, భగవంతుని ప్రస్తావన కలిగిన వెంటనే పరి పరి విధములుగా భ్రమిస్తుంది. మరి ఏమి సాధనం ? అభ్యాసము చేయుటలో కూడా అసమర్థుడైన వాడికి ఏమిటి సాధనం ?ధనంజయ - నన్ను నీ మనస్సులో స్థాపించుకొనుట సాధ్యం కానీ పక్షంలో నీవు చేసే ప్రతి పనిలో నన్ను అనుసంధానం చేసికొను మార్గము అవలంబించమని ఉపదేశిస్తాడు. భగవంతుని సాధనలో తొమ్మిది మార్గాలు మనసాంప్రదాయములో ఉపదేశిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం మరియు ఆత్మనివేదనం తొమ్మిది సాధనాలుగా పేర్కొనబడింది. మన ఆలయవ్యవస్థ నందు సమాజములో ప్రతి వృత్తి ధర్మము తోనూ అనుసంధానం చేయుట మనము గమనించవచ్చు. బ్రాహ్మణుడు ఆలయము లోని మూలస్వరూపమునకే అతని అర్చనాదులు సమర్పించవలసినది గా నిర్దేశించ బడినది. వ్యాపారవేత్తలు తన సంపాదనలోని కొంత భాగాన్ని ఆలయము కోసరం సమర్పించవలసిందిగా నిర్దేశము చేయబడినది. అదే విధముగా పాలకులు కూడా ఆలయ సంరక్షకులే. స్వామి కార్యక్రమములలో వర్ణవ్యవస్థలోని ప్రతి ఒక్కరిని భాగ్యస్వాములు చేయబడినది. రజకులు స్వామి వస్త్రములు పవిత్రభావనతోనే తయారు చేయుట, వడ్రంగి, కుమ్మరి తన తన ప్రజ్ఞ ను మళ్ళీ స్వామి కార్యమునకే వినియోగించుట.గాయకులూ గాయకులు, నృత్యకారులు, కవులు అందరూ స్వామిని ఉద్దేశించి తమ కళలను వెచ్చించుట ఇత్యాది వాటి వలన మన జీవన శైలి పూర్తి భగవంతుని అధీనము లోనే ఉన్నదన్న భావన తోనే అలవర్చుకొంటారు అదేవిధంగా ఈ వ్యవస్థ లో మనం చేసే అన్నీ పనులు భగవంతుని ఆధీనంలోనే ఉన్నవని అవగతం అయినప్పుడు మన జీవనం సమర్పణ భావన తో కొనసాగుతుంది. నీవు చేసే ప్రతి పని భగవంతుని కోసం చేస్తున్నప్పుడు దానిలో హెచ్చుఁ తగ్గులు గణించుట ఉండదు కదా. భగవంతుడు భక్తిమార్గపరిణితి లోని వివిధ శ్రేణుల గురించి కూడా వివరిస్తాడు. కేవలం భగవంతుని అర్చన యాంత్రికంగా చేయుట కన్నా జ్ఞాన సముపార్జన ప్రశస్తం. జ్ఞాన అన్వేషణ కన్నా ధ్యానం చేయగలగడం విశేషం. ధ్యానం కన్నా కర్మసంగపరిత్యాగం మరింత ఉత్తమం. కానీ ఈ స్థాయి కి చేరుట సులభమా ? దానికొరకు ఏమీ లక్షణములు ఉండవలెను? త్రయోదశ శ్లోకములో భగవంతుడు సర్వ భూతముల యందు సమభావన మరియు ద్వేషరహితభావన కలిగి ఉండుట ఎంత ప్రశస్యమో వివరిస్తాడు. ఈ సందర్భములో మనము గరుత్మంతుని వృత్తాతం పరిశీలిస్తే మనకు దీని అర్ధం సరిగా బోధపడుతుంది. గరుత్మంతుడు వినత పుత్రుడు. కద్రువ అతని సవతి తల్లి. ఈయన నారాయణ మహాభక్తుడు, శక్తిమంతుడు మరియు వినయసంపన్నుడు. ఒక సందర్భములో వినతా కద్రువ మధ్య జరిగిన పందెములో ఆమెతో సహా గరుత్మంతుడు కూడా కద్రువ మరియు ఆమె సంతానానికి(నాగులు) దాసులు అవుతారు. అరే ! నాకు ఇంట శక్తి ఉన్నప్పటికిన్నీ ఇలా దాస్యం చేయవలసి వచ్చిందే అని గరుత్మంతుడు వ్యాకులత చెందుతూ ఉంటాడు. తన దాస్యవిముక్తి మార్గము నాకు ఉపాయం అయన కద్రువని అడుగుతాడు. ఆమె ఆలోచించి దేవలోకమునిండి అమృతము తెచ్చ్చిన పక్షంలో అతని దాస్యవిముక్తి లభిస్తుంది అని చెపుతుంది. ఆయనకు ఉన్న శక్తిసామర్ధ్యాలకు అది పెద్ద విషయం కాదు. ఆయన దేవలోకం నుండి అమృతం తీసికొని వస్తున్నా క్రమములో దేవేంద్రుడు "అర్హత లేని వారికి అమృతము దక్క రాదు" అని అభ్యర్థిస్తాడు. గరుత్మంతుడు ఆ మాటకు అంగీకారము తెలిపి దానికి బదులుగా తనకి ఎల్లప్పుడూ సమస్త నాగులు ఆహారం కావాలని వరం అడుగుతాడు. ఇంద్రుడు దానికి కించిత్ ఆశ్చర్యము చెంది గరుత్మంతుడు నాగుల యందు ద్వేషభావం త్యజించలేదని గమనిస్తాడు. గరుత్మంతుడు నాగులకు అమృతం ఇఛ్చిన తర్వాత దేవేంద్రుడు ఆ అమృతము ను తస్కరిస్తాడు. అనంతరం గరుత్మంతుడు యదేచ్చగా నాగులను తినడం మొదలు పెడతాడు. అతని శక్తిని తాళలేక నాగులు రోజుకు ఒక్క నాగును అతనికి ఆహారంగా ఇవ్వడానికి ఒడంబడిక చేసికొంటారు. ఒకానొక రోజు ఆటను నాగు స్థానములో ఒక మహాపురుషుడిని ఆహారంగా స్వీకరించబోయి తర్వాత నిజాము తెలిసి కొని బాధ పడతాడు. ఆయన స్వతహాగా మహానుభావుడు, విష్ణుభక్తుడు. తనవల్ల జరిగిన ఈ ఘోర జీవ హింస కు పశ్చాతాపపడతాడు. గరుత్మంతుడు ఎప్పుడైతే ద్వేషభావం త్యజిస్తాడో వెంటనే అతనికి మైత్రీ మరియు కారుణ్య భావములు కలుగుతాయి. అతను దేవేంద్రుని వద్దకు వెళ్లి చనిపోయిన నాగులను తిరిగి బతికించడానికి అమృతం అడుగుతాడు. దేవేంద్రుడు మొదట ఎవరికోసం అమృతం వద్దని అన్నాడో వారికోసమే ఈ సారి సంతోషముగా అతనికి అమృతము ఇస్తాడు. ఆటను గరుత్మంతుని లో వచ్చిన మార్పునకు సంతోషిస్తాడు. మనము సామాన్యముగా ఏ పని అయినా సంసారిక ప్రయోజనం కోసమే చేస్తాము కదా. కాను భగవంతుడు ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్య-ఆంతరములో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్ధచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు, అని అంటాడు. అన్నెడ అధ్యాయము చివరి శ్లోకములో భగవంతుడు ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.భగవంతునికి ప్రియుడు అయితే ఏమీ ప్రయోజనం ? యత్పాద పద్మ యుగళం తులసీదళాదై: సంపూజ్య విష్ణుపదవీమ్ అతులామ్ ప్రయాంతి తేనైవ కిమ్ పునరసౌ పరిరబ్దమూర్తి రామేణ వాయు తనయ: కృత పుణ్య పుంజ: శ్రీరాముని పాదపద్మములను తులసీదళములతో పూజించినవారు సాటిలేని పరమ పదము పొందెదరు. అటువంటి శ్రీరామచంద్రుడే హనుమంతునికి అనుగ్రహించి స్వయముగా ఆయనను ఆలింగనం చేసికొంటాడు. భగవద్ ప్రియునకు (ఆంజనేయునకు) ఇంతకన్నా మహద్భాగ్యము ఉంటుందా ? SANSKRIT श्री गुरुभ्यो नमः। श्री कृष्ण परमात्मने नमः पूर्वेषुअध्यायेषु भगवान् अव्यक्तः अव्ययः च - सादृशउल्लेखनं बहुवारं वयं पश्यामः।द्वादश अध्याये प्रथम्न श्लोके एव अर्जुनः सादृश भगवतः उपासनं ज्ञानमार्गेन करणीयं अथवा तस्य सगुण साकाररूपं मनसि स्थापयित्वा उपासनं करणीयं वा - इति प्रश्नं अपृच्छत्। अर्जुनस्य +-मनसि भगवतः अध्बुत विश्वरूपस्य सन्दर्शानान्तरम् एतस्य सन्देहस्य उत्पन्नं अस्माकं कृते किञ्चित् आस्चर्यकारणं भवति खलु।यदी वयं निराकारस्य भगवतः उपासनं ज्ञानमार्गेन करणीयं चेत् भगवान् तस्य अप्रमेय विश्वरूपस्य आविष्करणं किं प्रयोजनस्य कृते कृतवान्? सामान्य जनानां चिन्तनस्य पूर्णस्वरूपं भगवता अवगतम्।तेन कारणेन एव भगवान् अस्माकं कृते सगुण साकार उपासना मार्गं सूचितवान्।एतस्मिन् सन्दर्भे द्वौ उदाहरणौ पश्यामः।मर्कटकिशोर न्यायः - एतद् उदाहरणं निराकार उपासनस्य भक्तजनानां कृते समुचितं भवति। मर्कट्याः शिशवः तेषां मातुः उदर आलंबेन सह वृक्ष्यशाखां मध्ये कूर्दन्ति।किन्तु माता शिशूनाम् रक्ष्णस्य दायित्वं न स्वीकरोति।शिशवः एव सावधानेन तेषां मातुः उदरं गृहीत्वा स्वीयसंरक्षणं कुर्वन्ति।किन्तु मार्जालकिशोर न्यायः मर्कटस्यकिशोरन्यायस्य अपेक्षया बिन्नं भवति। मातुः तस्याः शिशून् अतीव सावधानेन एकात् स्थलात् अन्य स्थलान् नयति।सा संपूर्णदायित्वं स्वीकृत्या शिशूनाम् रक्षणं करोति।साद्रुशप्रकारेण भक्तस्य कृते साकार उपासनमार्गे भगवता एकाग्रचित्तेन उपासना कर्तुं लघुतर मार्गं भवति। तेनकरणेन एव अस्माकं कृते सर्व पूजा विधानानाम् आदौ तस्य भगवतः ध्यान श्लोकस्तुत्याः निर्देशनं भवति।तस्याः पूजायाः मूलदेवतारूपं मनसि स्थापयित्वा एव मुक्ष्यपूजाकार्यक्रमं कर्तुं निर्देशनं भवति।द्रुष्टान्तरूपेण श्री विश्नुसहस्रपारायणस्य पूर्वे वयं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् । लक्ष्मीकान्तं कमलनयनं योगिहृर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् इति ध्यानश्लोकस्य स्तुति कुर्मः खलु।यदा वयं एतस्य स्तुतिं कुर्मः तदा आदिसेषस्य उपरि लक्ष्म्या सह मेघवर्णस्य शान्ताकारस्य विष्णोः दिव्यस्वरूपं मनसि स्मरामः।श्री महा विष्णुः अस्माकं संसारिक भयान् सदा हरन् सर्व प्राणिनः रक्षणं करोति।सादृश भावनेन महाविष्णुं स्मृत्वा वयं स्त्रोत्रपारयणम् कुर्मः चेत् अस्माकं मनोविकारभवानानं निरोधं कर्तुं शक्यामहे। परमात्मनि मयि एव चित्तं स्थापय।मयि एव मतिं योजय।ततः परं मयि एव वसिष्यसि। अत्र संदेहः न वर्तते। इति भगवान् अष्टम श्लोके उक्तवान्।यदी अस्माकं चित्तं सदा परमात्मनि एव स्थापयित्वा जीवनं कुर्मः चेत् अस्माकं मनः एव भगवद् मन्दिरं भविष्यति।यदी कोऽपि पुण्यक्षेत्रं गच्छति चेत् सः सर्वदा पवित्रभावनेन वर्तते खलु। एवमेव यदी वयं परमात्मनि एव चित्तं ध्रुवं कुर्मः चेत् अस्माकं चारित्रं अपि अमलं भविष्यति।दृष्टान्तरूपेन रामायणकाव्ये यदा भरतः रामस्य वनवासयोगं रज्यबहिष्करणप्राप्तिं विषये ज्ञातवान, सः अतीवकुपितः अभवत्। तस्य मातुः दुर्बुद्धेः मूलकारणं मन्दरा - इति ज्ञात्वा तस्याः मारितुं उद्युक्तवान्।किन्तु भरतस्य मनसि संपूर्णरीत्या रामभावन एव अस्ति।मन्दरायाः हिंसा रामस्य कृते न संमतः - इति चिन्तयित्वा भरतः तस्य प्रयत्नस्य प्रत्याहारं कृतवान्।यः सर्वदा भगतवः चिन्तनम् करोति सः कदापि अधर्ममार्गेन न व्यवहरति।सदा भगवती एव मनः स्थिरं कर्तुं कदापि सुलभउपायः न। तस्मिन् मार्गे अनेक प्रतिबन्धनानि निश्चयेन संभवन्ति।अस्माकं जीवनानाम् परमलक्ष्यं भगवति एव मनः स्थापयितुं भवति।किन्तु वयं एतस्य भक्तिमार्गस्य सिद्धिम् प्रथम प्रयत्ने एव प्राप्तुं शक्यामहे वा? कदापि न। मनः यावत् भगवति स्थिरं कर्तुं प्रयत्नं करोति तदैव बहूनि अन्यसंसारकिर विषयेषु परिभ्रमणम् कर्तुं इच्छति।तर्हि किं साधनम् ? "धनञ्जय! यदी मयि चेतः निस्चलं स्थापयितुं न शक्नोषि तर्हि चित्तस्य पुनः पुनः स्थापेन मां प्राप्तुं यतस्व।" - इति भगवान् सर्व जनानां कृते संदेशं दत्तवान्। अभ्यासे अपि भगवद्प्राप्तिं असमर्थः अस्ति चेत् किं करणीयं?जीवने नारायणभावेन सर्व कर्माणि करणीयं।भक्तजननां कृते नवप्रकार भागवतधर्मआभ्यासं कर्तुं निर्देशनं गुरुजनैः दत्तम्।श्रवणं, कीर्तनं, स्मरणं, पादसेवनं, अर्चनं, वन्दनं, दास्यं, सख्यं, आत्मनिवेदनं च भगवतसेवाकर्माणि भवन्ति।भारतदेशे आलय व्यवस्थायाम् वयं एतस्य विधानस्य रचनाः द्रष्टुं शक्यामहे।ब्राह्मणाः वेदविहितकार्यक्रमाणि आलयस्य मुक्ष्यदेवतस्य कृते कृतवन्तः।वणिजाः तस्य व्यापारस्य लाभस्य किञ्चित् भागं देवालस्य कृते वितरणं कृतवन्तः।पालाकाः आलय धर्माध्यक्षता कृतवन्तः।शिल्पकारकाः तस्य प्रतिभा आलयस्य कृते समर्पयन्ति।तक्षकः, रजकः.कुम्भकारः च इत्यादि अनेक वृत्ति निपुणाः तेषु जीवनेषु भगवद्उद्देशैः तेषां कर्माणि कृतवन्तः। एवमेव गायाकाः नर्तकाः कवयः साहित्यकाराः च अपि तेषां कौशल्याम् भगवदर्पितं कृतवन्तः।अनन्तरं भगवान् भक्तस्य परिणित्याः श्रेणीनाम् विषये उक्तवान्।अभ्यासयोगात् विवेकः प्रश्स्थारः।विवेकात् चिन्तनम् विशिष्यते। चिन्तनात् अपि कर्मप्रयोजनपरित्यागः विशिष्यते। त्यागात् बन्धनस्य संसारस्य नाशः भवति। किन्तु संपूर्ण भक्तिभावनं प्राप्तुं अस्माकं कृते किं लक्षणं प्रधानतः आवश्यकं भवति?त्रयोदश श्लोके भगवान् सर्वभूतानाम् कृते अद्वेष्टा भावनायाः विषये अपि प्रस्थावितवान्। एतस्मिन् सन्दर्भे गरुक्मन्तस्य वृत्तान्तं वयं एक वारं पश्यामः।गरुक्मन्तः विष्णोः महाभक्तः विनयशीलः च। सः विनतायाः पुत्रः।कद्रुवा तस्य विमाता अभवत्।विनता कद्रुवा द्वयोः मध्ये एकात् पणात् कारणात् गरुक्मन्तः कद्रुवायाः दासः अभवत्।गरुक्मन्तः एतस्य दास्यस्य विमुक्तिं कर्तुं निश्चयं कृतवान्। सः माता कद्रुमं कथं तस्य दास्यविमुक्तिं कर्तुं शक्यते – इति प्रार्थयतिवान्।सा किञ्चित् चिन्तयित्वा यदी गरुक्मन्तः स्वर्गात् अमृतं नयति चेत् दास्यस्य विमुक्तिं प्राप्नोति - इति उक्तवती। गरुक्मन्तः बहुः समर्थः। सः स्वर्गलोकात् अमृतं गृहीत्वा स्वस्थालं आगन्तुं उद्युक्तवान्।विना योग्येन अमृतं न ददातु - इति देवेन्द्रेण उक्तः। गरुक्मन्तः तद् प्रतिपादनं अन्गीकृत्वा एकं वरं आकाङ्क्षितवान्। गरुक्मन्तः द्वेषभावेन सर्व नागजाति प्राणिनः तस्य कृते आहारं भवेत् - एतद् वरं अपृच्छत्।तत् पश्चात् गरुक्मन्तः विना निर्बन्धेन सर्व नागानां वधं कुर्वन् जीवनं यापयतिवान्।अनन्तरं प्रतिदिनं एकं नागं गरुक्मन्तस्य आहारार्थं दातुं संधिः अभवत्।एकस्मिन् समये सः भ्रमेण नागप्राणिनि स्थाने एकं महापुरुषं खादितुम् प्रयत्नं कृतवान्। तदनन्तरम् सः तस्य स्वकृत घोरजीवहिंसाकार्याणां कृते अतीव दुःखं अनुभूतवान्।पञ्चात्ताप भावेन सः द्वेषभावं त्यजितवान्। तस्मिन् मनसि द्वेषभावन स्थाने मैत्री कारुण्य भावनौ आगच्छताम्।मृत नागाप्राणिनः पुनर्जीवनार्थं इन्द्रं अमृतं दातुं प्रार्थयतिवान्। इन्द्रः संतोषेन गरुक्मन्तं अमृतं दत्तवान्। सामान्यतः जनाः भगवतः पूजां चिन्तनम् च कोऽपि सांसारिकप्रयोजनार्थं एव कुर्वन्ति।किन्तु भगवान् वदति - यः पुरुषः निःस्पृहः शुद्दः चतुरः तटस्तः अपगतभयः सर्वेषां कर्माणां फलं त्यजन् भगवद्भक्तः च वर्तते सः मम अभीष्टः भवति।भगवद्प्रियः भवितुं एव सर्वोत्कृष्ट स्थिति भवति । द्वादश अध्याये भगवान् भक्तिमार्गस्य लक्षणानि लाभानि विस्तारेण बोधितवान्।ये तु भक्तिमन्तः, विश्वासयुक्ताः मन्निश्टाह् यथाप्रतिपादितं धर्मयुक्तं साधुसमानम् इदं च आचरन्ति ते पुरुषाः मम अत्यन्तं अभीष्टाः भवन्ति - इति भगवान अन्तिम श्लोके उक्तवान्।यदी कोऽपि भगवद्प्रियः भवति चेत् किं प्रयोजनम्? यत्पादपद्मयुगळम् तुलसीदलैः संपूज्य विष्णुपदानीं अतुलां प्रयान्ति तेनैव किं पुनरसौ परिरब्धमूर्ती रामेण वायु तनयः कृतपुण्य पुन्जः ये श्री रामस्य पदान् तुलसी दलैः पूज्यन्ते ते परमपदं निश्चयेन प्राप्नुवन्ति। अन्जनेयः तस्य आकुण्ठितभक्तिभावनेन भगवतः प्रियः वर्तते। तेन कारणेन श्री रामः एव अन्जनेयं आलिङ्गनं कृत्वा अतुल सुखानि प्रसादितवान्। अन्जनेयस्य भाग्यस्य वर्णनं कर्तुं शक्यते वा? कदापि न।

Thursday, December 29, 2022

Chapter 11 - Sanskrit

श्री गुरुभ्यो नमः। श्री कृष्ण परमात्मने नमः दशमोध्याये श्री कृष्णस्य विभूतीन् श्रुत्वा अर्जुनः अतीव संतोषं अनुभूतवान्। तस्य मोहं अपि अन्तं अभवत्।भगवान् श्री कृष्णः केवलं तस्य प्रियमित्रः न, सः सर्व विश्वानाम् ऐश्वर्याणाम् मूलकारणः - एतस्य ज्ञानं अपि अधीतवान्।एतस्य अध्यायस्य प्रारम्भे अर्जुनः श्री कृष्णस्य प्रेमादरणस्य कृते कृतज्ञता भावेन अञ्जलिं कुर्वन् तस्य भाषणं आरम्बं कृतवान्। सर्वजगतः श्रुष्टि स्थिति लयाणां मूलकारणं श्री कृष्णः एव - एतद् विश्वाशं कृत्वा अर्जुनः भगवतः कीर्तनं करोति।अर्जुनः द्वितीय श्लोके कृष्णं "कमल पत्राक्ष" एतेन सम्बोधनेन कीर्तयतिवान्।सादृश कीर्तनं रामस्य महा भक्तः श्री अन्जनेयः अपि रामायण काव्ये सुन्दर काण्डे कृतवान्।यदा आन्जनेयः "अहं रामदूतः" - इति प्रकटितवान् सीता महासाध्वि रामस्य लक्षणानि व्यक्तीकर्तुं पृच्छति। रामः कमल पत्राक्षः सर्व भूत मनो हरः | रूप दाक्षिण्य सम्पन्नः प्रसूतो जनकात्मजे|| एतेन प्रकारेण अन्जनेयः रामस्य श्लाघनं कृतवान्।कमलपत्रे अक्षिणी यस्य सः - कमलपत्राक्षः।एतद् लक्षणं केवल महा पुरुषस्य चिह्नं भवति।इति अहं मन्ये।अर्जुनः कृष्णस्य दिव्य विभूतीनाम् महिम्नः श्रुत्वा भगवतः विश्वरूप संदर्शनं कर्तुं इच्छतिवान्।किन्तु तद् विज्ञापनं अर्जुनः बहुना आदरेण कृतवान्।यदी अहं भवतः परमोत्रुकृष्ट रूपं दृष्टुं योग्यः चेत् कृपया मह्यं तद् वरं ददातु - एतस्य विज्ञापनं अर्जुनः चतुर्थ श्लोके कृतवान्| मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो | योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् || 4|| अर्जुनः दसम अध्यायस्य सप्तादस श्लोके, कृष्णं योगीं नामेन सम्बोधितवान्।अर्जुनेन भगवतः दिव्यस्वरूपस्य महिम्नः इदानीं सम्यक् अवगतः। तत् कारणेन अर्जुनः एतस्मिन् श्लोके भगवन्तं "योगीश्वर" - इति सम्बोधितवान्। अस्माकं अनुग्रहयोग्यता कः निर्णयति?यद्यपि वयं कोऽपि प्रयोजनस्य कृते तीव्र प्रयत्नं कुर्मः, यदी तस्याम् कामनायाम् नम्रता न भवति चेत् भगवान् निश्चयेन तद् संपूर्ण फलितं न ददाति। इतिहासे बहवः जनाः तेषाम् इष्टकाम्यसिद्दयर्थं उद्धततपः कृतवन्तः। हिरण्यकशिपः रावणः इत्यादि इतर राक्षसाः सर्वे अमरत्वप्राप्तिं तपः कृतवन्तः। किन्तु भगवान् तेषां अहन्कारप्रवृत्तिं गणयित्वा अमरत्ववरप्रदानं न प्रसिदितवान्।किन्तु यदा विभीषणः सदा धर्ममार्गस्य जीवनस्य वरं आकाङ्क्षयतिवान्, भगवान् तस्य कृते " चिरञ्जीवत्वं" अनुग्रहितवान्।नवमश्लोकतः चतुर्थदसश्लोक पर्यन्तं संजयः भगवतः विश्वरूपस्य वर्णनं विस्तारेन कृतवान्।भगवतः विश्वरूपं कथं भवति।भगवति ब्रह्माण्डरूपे अर्जुनः अनेक मुखानि नयनानि दिव्य आभरणानि दिव्य आयुधानि च दर्शितवान्।भगवान् दिव्य मालाः अम्बराणि धारयित्वा दिव्य गन्धान् अनुलेपनं कृत्वा देदीप्यमानेन प्रकाशयति।कोटि सूर्याणां प्रकाशस्य अपेक्षया भगवान् अधिक तेजोमयः अस्ति।सर्वजगत् भगवतः विश्वरूपे स्थितम् अजुनः दर्शितवान्।भगवतः अद्बुत विश्वरूपस्य वर्णनं संजयः केन सः करोति स्म? धृतराष्ट्रेण सह खलु ?धृतराष्टस्य कृते कृष्णस्य महिमाम् नूतन विषयं कदापि न।कौरव पाण्डवयोः शान्ति प्रयत्न सन्दर्भे अपि भगवान् तस्य विश्वरूप दर्शनं धृतराष्ट्रस्य कृते प्रासिदितवान्।भगवतः अपरिमित शक्तिं ज्ञात्वा अपि सः किं विश्वाशेन युद्दनिवारणस्य प्रयत्नं न कृतवान्?यदी वयं सावधानेन अवलोकामः चेत् एतद् मायास्वरूपस्य प्रभावं अवगन्तुं शक्यामः।सर्वजगत् सदा भगवतः मायया पीडितः।भगवतः अपार अनुग्रहं पाण्डवानां कृते अस्ति - एतद् विषयं ज्ञात्वा अपि कौरवाः आत्मघातकयुद्दं कर्तुं निर्णयतिवन्तः।कारणं किं? ते सर्वे अपि भगवतः मयामोहिताः आसन्।तस्याः मायायाः विमुक्तिमार्गं केवल भगवद् संपूर्ण शरणागतिम् एव। भागवथा कथायम् अपि भगवान् श्री कृष्णः माता यशोदायै विश्वरूपसंदर्शनभाग्यं दत्तवान्।तत् समये भगवतः मुखे यशोदा सर्वजगत् दर्शितवति।यशोदा बालकस्य मुखे सकलकोटि ब्रह्माण्डानि दृष्ट्वा आश्चर्यं परमानन्दस्थितिं च अनुभूतवती।किन्तु अनन्तरं भगवता मायया तद् विषयं विस्मरितवति।यथावत् कृष्णः सामान्य बालकः इति चिन्तयित्वा एव व्यवहरति स्म।वयं अपि अस्न्माकं जीवनेषु कतिपय सन्दर्भेषु भगवतः अनुग्रहं अनुभवामः किन्तु सदा अप्रमत्तेन जीवनाचरणं कर्तुं न शक्यामहे।तर्हि किं साधनं? पुनः निरन्तर भगवद्भक्तिः एव खलु। भगवतः विश्वरूपं दृष्ट्वा अर्जुनः अतीव आनन्देन तद् रूपस्य वर्णनं करोति स्म।भगवतः अनन्त बाहवः पादाः अक्षाणि सर्वत्र प्रवृद्दवन्ति।पुरुषसूक्त्याम् अपि भगवतः स्वरूपस्य वर्णनं साद्रुशप्रकारेण अस्ति। स॒हस्र॑शीर्षा॒ पुरु॑षः । स॒ह॒स्रा॒क्षः स॒हस्र॑पात् । स भूमिं॑-विँ॒श्वतो॑ वृ॒त्वा । अत्य॑तिष्ठद्दशाङ्गु॒लम् ॥ सर्वश्रुष्टिः सर्वशक्तिमतस्य भगवतः अधीनेन चलति। भयादस्याग्निस्तपति भयात्तपति सूर्यः । भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः सर्वजगत् भागवते भीत्या एव व्यवहरति। दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि | तद् स्वरूपं दृष्ट्वा अर्जुनः भयकंपितः अभवत्।सर्व प्राणिनः भगवतः मुखे प्रविशन्ति।यथा तीव्रवेगाः पतङ्गाः ज्वलितम् अग्निम् आत्मविनाशाय प्रविशन्ति तथा एव तीव्रगमनाः प्राणिनः तव मुखानि अपि नाशाय विशन्ति। भगवान् श्रुष्टि स्थिति लय कारकः।विश्वस्य एताः त्रीणि स्थितयः भगवता एव शाशितः।इदानीं अर्जुनः भगवतः उग्रलयकारकस्वरूपं दर्शितवान्।अर्जुनस्य सर्वबन्धुजनाः मित्राः च भगवता ग्रसितः - इति दृष्ट्वा सः भीतः अभवत्। अर्जुनः कृष्णस्य इष्टसखा।सः इतर पाण्डवानां अपेक्षया अधिक समयं कृष्णेन सह यापयतिवान्।सः सुबद्राम् परिणयनम् कृत्वा कृष्णस्य बान्धव्यं अपि प्राप्तवान्।अनेक सन्दर्भे कृष्णस्य सूचानानुसारेण एव व्यवहरितवान्। तत् कारणेन एव अर्जुनः तस्य रथिनः दायित्वं कृष्णं नियोजयतिवान्। किन्तु भगवतः विश्वरूपसन्दर्शानन्तरम् अर्जुनस्य मनसि क्रमशः प्रेमभावना स्थाने भीतिभावना उत्पन्नं भवति।यद् कृष्णस्यरूपं अर्जुनेन अद्य पर्यन्तं अवगतः तद् स्वरूपं इदानीं समग्रं भिन्नं भवति।अन्यस्मिन् सन्दर्भे अपि भगवतः भयानक रूपस्य दृष्टान्तं इदानीं पश्यामः।यदा दुष्टसम्हरणार्थम् तस्य प्रियभक्तः प्रह्लादस्य रक्षणार्थं च भगवान् उग्र नृसिंहस्य अवतारं स्वीकृतवान् तदापि सर्व देवलोकाः अतीव भयकम्पिताः अभवन्।ते सर्वे भगवन्तं तस्य उग्ररूपस्य उपसंहरणार्थम् प्रार्थनाः कृतवन्तः। इदानीं भगवतः विश्वरूपस्य संदर्शनं कृत्वा अतीव भीतिम् अनुभवयित्वा सः भगवतः प्रकृतिं हेतुं च ज्ञातुं इच्छतिवान्।द्वित्रिंशत्तम श्लोके भगवान् इति उक्तवान्।कालः एव सर्व विश्वान् विनश्यति।सकलघटनाः प्रसिद्दपुरुषाः देशाः भाषाः संस्कृतयः योधाः च कालेन एव ग्रास्यते।भगवान् एव कालपुरुषः।विना अर्जुनस्य योगदानेन अपि प्रत्यनीकेषु योधानां समाहर्तुम् भविष्यति।अहं सर्वान् लोकान् संहर्तुं प्रवृद्दः कालोऽस्मि।प्रतिपक्षसैन्येषु ये योधाः सन्ति तान् त्वं न मारयसि चेदपि अवश्यं ते मृताः भविष्यन्ति।द्रोणः भीष्मः जयद्रदः कर्णः अन्ये सर्वे अपि मया पूर्वमेव निहताः।मया निहतानेव त्वं नाशय।व्यथां मा कुरु। शत्रून् जेष्यसि। भगवान् एव वायुः यमः अग्निः वरुणः शशाङ्कः प्रजापतिः प्रपितामहः च।अर्जुनः कृष्णे एव सर्व देवानाम् दर्शनं कृतवान्। विश्वस्य निर्वहणार्थम् भगवान् एव केचन देवान् नियुक्तवान्।किन्तु ते सर्वे भगवतः विविधानि रूपाणि एव। अर्जुनः भक्त्या सहस्र्वारं भगवतः प्रणामं कृतवान्। पुनः पुनः प्रणामं कृतवान्। भगवान् श्री कृष्णः एव सर्व शक्तिमतः - इति ज्ञात्वा, अर्जुनः पुनः भगवतः स्थुतिं कृतवान्।हे - अनन्तवीर्य, अनन्तविक्रम - अहं त्वां सर्वतः नमस्करोमि।अहं त्वं मम प्रिय सखा इति मत्वा तस्य विशेष महिमानम् न ज्ञात्वा प्रायः बहूनि दोषानि कृतवान्।कृपया क्षमा एतस्मिन् सन्दर्भे अहं श्री वेङ्कटेस्वर स्थोत्रस्य अन्तिम पङ्क्तीः स्मरामि। अज्ञानिना मया दोषा न शेषान्विहितान् हरे । क्षमस्व त्वं क्षमस्व त्वं शेषशैल शिखामणे ॥। भगवान् - भवान् मम कृते कृपेण स्वस्य अमोघ विश्वरूपं प्रदर्शितवान्।।विश्वरूप! किरीटधारयित्वेन गदाधारयित्येन चक्रपाणयित्येन च यत् सौम्यं रूपं मां प्रदर्शियितवान् असि तदैव रूपं अहं दृष्टुं इच्छामि।हे अनन्तभाहो!कृप्याय पुनः शन्तस्वरूपं स्वीकरोतु - अन्ते अर्जुनः इति प्रार्थयितवान्। भगवान् दयामयः।यदा अर्जुनः विश्वरूपस्य दर्शनस्य इच्छा प्रकटयतिवान्,तस्य अद्वितीय अप्रमेय च दिव्यरूपं प्रदर्शितवान्।इदानीं अर्जुनस्य प्रार्थनाम् अन्गीकृत्वा पुनः तस्य सोव्म्यरूपं धारयतिवान् ।अध्यायस्य अन्ते भगवान् सर्वजनणाम् कृते एकः परमोत्क्रुष्टसंदेशं दत्तवान्।यः पुरुषः मदर्थकर्मकारी मन्निष्टः मत्सेवकः विषयसङ्गरहितः सर्वप्राणिषु द्वेषरहितः च भवति सः मां उपगच्छति।

Chapter 11 - Telugu

ఏకాదశ అధ్యాయస్య తెలుగు వ్యాఖ్యానం దశమధ్యాయమునందు అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మా యొక్క సకల విభూతినలు గూర్చి తెల్సినవాడై అమిత తన్మయత్వము అనుభవించెను. తన ముందు తిరిగాడుతున్న కృష్ణుడు కేవల తన ఇష్ట సఖుడు మరియు బంధువు మాత్రమే కాదని, అతను సర్వవిశ్వాసార్వభౌముడని, సకలైశ్వర్యములు ప్రభువని గమనించి అంజలి ఘటిస్తూ కృష్ణుడిని "కమల పత్రాక్ష" అని సంబోధించాడు. కమలమువంటి కన్నులు గలవాడా అన్న కీర్తన అత్యంత విశేషణమైనదిగా పేర్కొనబడినది. రామాయణ కావ్యములో సుందర కాండలో, రామ మహాభక్తుడైన ఆంజనేయుడు, తనను తాను "రామ దూత" గా అభివర్ణించుకొన్నప్పుడు, సీతా మహా సాధ్వి రాముని చారిత్రం మరియు ఆయనను ఈ విధముగా ఆంజనేయుడు దర్శించాడో వివరించమని కోరుతుంది రామః కమలపత్రాక్ష సర్వ భూత మనోహరః రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజా అంటూ ఆంజనేయుడు రాముణ్ణి శ్లాఘిస్తాడు. ఈ విశేషణం కేవలం విష్ణుస్వరూపమైన మహాపురుషలకే సంబంధించినదని మనకి ఇక్క అవగతం అవుతున్నది. అర్జునుడు కృష్ణుని దివ్యవిభూతుల మహత్యం గురించి తెలిసికొన్న వాడై అయన విశ్వరూపసందర్శనం కొరకై ఆకాంక్ష వ్యక్త పరుస్తాడు. కానీ ఆ యొక్క కోరికను అత్యంత వినయసంపన్నుడై తనకు అర్హత ఉందని పరమాత్మ భావిస్తేనే ఆ భాగ్యం ప్రసాదించమని ప్రాధేయపడతాడు. మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో । యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ।। 4 ।। ఈ సందర్భములో కృష్ణుని పట్ల అర్జునుని భక్తి భావమునందు గల స్వల్ప వ్యత్యాసం మనం గమనించ వచ్చు. పదవ అధ్యాయమందలి పదిహేడవ శ్లోకములో కృషుడిని "యోగీ" అని సంభోదించగా ఇచట "యోగీశ్వరా" అని పిలుస్తున్నాడు. అనగా, పరమ యోగులకు కృష్ణుని ఈశ్వరునిగా అర్జునుడు గుర్తుఎరిగి వ్యవహరిస్తున్నట్టుగా మనం గమనించ వచ్ఛు. మనయొక్క అర్హతార్హతలు నిర్ణయించునది ఎవరు? గీతాగ్రంథము లోని అయిదవ అధ్యాయములో పేర్కొన్నట్టు, "విద్యా వినయతే సంపన్న". మన ప్రయత్నము ఎంత బృహత్కరమైనప్పటికిన్నీ అందులో వినయం లోపించిన యెడల భగవంతుని సంపూర్ణ కృపా కటాక్షములు తప్పని సరిగా మనకు లభించవు. ఇతిహాసమునందు ఎన్నో మంది రాక్షసీ మరియు అసురీ ప్రవుత్తిచిత్తులైన వారు అమరత్వ ప్రాప్తినకై ఘోర తపస్సులను చేసిన వారే. కానీ భగవంతుడు వారి అహంకార చిత్తము గమనించిన వాడై, వారి కోర్కెలను తగు పరివర్తనం గావించి వర ప్రధానమును చేయుట మనకి తెలిసిన విషయమే. ఇందున మనకు ప్రస్ఫుటఉదాహరణాలు హిరణ్య కశిపుడు, రావణా శురుడు ఇత్యాదులు. కానీ అదే సమయములో విభీషణుడు తన తపస్సు ఫలితముగా తనకు "సదా ధర్మమార్గాచరణ జీవన" వరము ప్రసాదించమని అడగగా, అతనికి "చిరంజీవత్వం" అనుగ్రహించాడు. తొమ్మిదవ శ్లోకము మొదలు పదునాల్గవ శ్లోకము పర్యంతము, భగవానుని అమోఘమైన విశ్వరూప వర్ణనం సంజయుడు గావిస్తాడు. భగవంతుని విశ్వరూపనగా అది ఎట్టిది ? విశ్వమంతటి నందు ఆ భగవద్ స్వరూపము సందర్శించడమనేనా ? అర్జనుడు ఆ యొక్క బ్రహ్మాన్డ రూపమునందు అసంఖ్యాకములైన ముఖములు, కన్నులు, ఆయుధములు, ఆభరణములు ఇత్యాదులు దర్శించగలిగెను. ఆ రూపము అనేకమైన దివ్య మాలలు ధరించి సుగంధములను అనులేపనము గావించి దేదీప్యమానముగా విరాజిల్లుతుండెను. అనంతములైన సూర్యుల కాంతి కన్నను ఆయన యొక్క తేజము హెచ్చిల్లుతూ ఉండెను. ఈ దివ్యరూప వర్ణనము సంజయుడు ఎవని తో చేయుచుండెను ? ధృతరాష్ట్రుని తోనే గదా ? ధృతరాష్టునికి కృష్ణుని దివ్యమహిమలు నూతన విషయములు గావు గదా ? కౌరవ పాండవుల సంధి ప్రయత్న సందర్భములో శాంతి దూత విచ్ఛేసిన శ్రీ కృష్ణుడు, ఆ గుడ్డి రాజు తన మహిమల ప్రభావములను గుర్తెరెగి అయినను జననష్టదాయకమైన యుద్ధము ను విరమిస్తాడేమోనన్న భావనతో అతనికి తన యొక్క విశ్వరూప సందర్శన భాగ్యము ను ప్రశాదించెను. ఇంతటి పరమోతృకృష్టమైన దివ్య దర్శనం గావించినను ఆ కౌరవ రాజు యుద్దమునకే ఎందువలన మొగ్గు చూపెను ? కృష్ణుడు ధర్మ పక్షపాతి కదా, తదునుగుణంగా ఆయన యొక్క విశేష కరుణ పాండవుల పట్ల ఉన్నదని తెల్సి కూడా కౌరవులు ఈ ఆత్మహత్యాసాదృశ్యకమైన ఈ యుద్ధమునకు దుస్సాహసించెను ? ఈ సర్వ జగత్ పరమాత్మ యొక్క లీలా మయా వినోదనమునకు వర్తించుచున్నదన్న విషయం మనకు అవగతమవవలెను కదా ? భాగవత కథా సందర్భమునందు కూడా శ్రీ కృష్ణుడు యశోదా మాతనకు ఈ సకల విశ్వము తనయందే నిండి ఉందన్న సత్యము ఆవిష్కరింప చేసెను గదా ? కానీ ఆమె ఆ సర్వేశ్వరుని మాయా మోహమునకు లొంగినదై తదుపరి క్షణము నిండి కృష్ణుని తన యొక్క గారాల పట్టి అనే వ్యవహరించెను కదా ? ఈ మాయనుండి విముక్తి పరమయోగీశ్వరులకు కూడా అసాధ్యము అయిన యెడల సామాన్యులకు ఏమి సాధనం, ఆ పరమేశ్వరుని సంపూర్ణ శరణాగతి తప్ప ? భగవంతుని విశ్వరూపమును దర్శించిన అర్జునుడు ఆనందతన్మయత్వం తో ఆ రూపము ను కీర్తించ సాగెను. ఆ భగవంతుని అనంత బాహువులు, పాదములు సర్వత్ర వ్యాప్తి చెంది ఉండెనట. ఇదే మాదిరి ఆ లీలామానుష రూపమును పురుష సూక్తము కూడా వర్ణిస్తున్నది. స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః । స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ । స భూమిం॑-విఀ॒శ్వతో॑ వృ॒త్వా । అత్య॑తిష్ఠద్దశాంగు॒లమ్ ॥ అర్జునుడు ఆ స్వామిని కీర్తిస్తూ, ఈ సర్వ జగత్తు నీ యొక్క కనుసన్నలనలోనే చరిస్తున్నది. కఠోపనిషత్తు నందు పేర్కొన్నట్టు భయాదస్యాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్యః భయాద్ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః సకల దేవతలు నీ యందు మిక్కిలి భయావర్తులై తమ తమ కర్తవ్యములను ఆచరిస్తున్నారు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని । కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ఈ యొక్క భయానక రూపమును చూచిన వీరాధివీరుడు, విజయనామధేయుడైన అర్జునుడు భయకంపితుడై కుపితుడై ఉన్నాడు. సృష్టి స్థితి లయకారకుడు ఆ భగవానుడే. ఇచట అర్జునుడు స్వామీ యొక్క లయకారక స్వరూపమును దర్శించు చున్నాడు. ఆయనచే తన యొక్క సకల బంధుజనములు, మిత్రులు గ్రసించబడుచున్నారు. అర్జునుడు మిగిలిన పాండవులతో పోలిస్తే కృష్ణుని తో మిక్కిలి సమయం గడిపి ఉన్నాడు. కృష్ణ సోదరి అయినా సుభద్ర ను పరిణయమాడి అతనితో బంధుత్వం కూడా సంపాదించు కొన్నాడు. అయన తనకు సముడనే భావన తోనే తన యొక్క రథసారధ్య భాద్యతను కూడా కృషునికి ఇవ్వ అంగీకరించాడు. అయితే ఇప్పుడుకృష్ణుని పట్ల అతనికి ప్రేమ భావన బదులుగా భీతి భావన కలగసాగింది. భగవంతుని సాకార రూపము చూసిన పిమ్మట భీతి భావన కలిగిన మరొక సందర్భం దుష్టసంహారణ కొరకై వెలిసిన నృసింహ అవతార మప్పుడు. ఆ సమయమునందు సమస్త దేవకోటి భయభ్రాంతులై ఆయన రూపమును ఉపసంహరింపమని మరల ప్రహ్లాదుడినే వేడుకొన్నారు ఈ యొక్క మహోతృకృష్టమైన స్వరూపం ని చూసిన అర్జునుడు భయాక్రాంతుడై ఆ భగవంతుని హేతువు మరియు ప్రవృత్తి లను తెలియసుకొనగోరాడు. హే అర్జునా - ఈ సకల విశ్వము, ఘటనలు, ప్రసిద్ధ జనులు, సంస్కృతులు, భాషా స్వరూపములు అన్నియూ కాలగర్భమునందు కలియవలసినవే. భగవానుడే ఆ కాల పురుషుడు. నీవు ఒక నిమిత్తునవి మాత్రమే. ఈ ప్రతిపక్ష సైన్య హతమునకు నీ ప్రమేయాప్రమేయములు అనవసరము. ఈ సృష్టిలోని సకల దేవతా దర్శనము అర్జునుడు ఆ యొక్క విశ్వరూపమునందే గాంచెను. ఆయన ఈ యొక్క సృష్టి కార్యనిర్వహణార్థముకొరకై ఈ దేవతల నియోజించెను. ఇంతటి మహాత్ముని యెడల అర్జునుడు తన యొక్క సఖుడని తలంచి అజ్ఞానంతో చేసిన తప్పిదాలను గుర్తు తెఛ్చి కొని ఆటను పశ్చాత్తాపము చెంద సాగెను. ఈ సందర్భములో మనకు సుపరిచితమైన వెంకటేశ్వర స్త్రోత్ర ము లోని ఈ పంక్తులు జ్ఞాపకము రాక మానవు కదా అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే । క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ హే స్వామీ - నా యందు అపార కృపా కటాక్షములతో నీ యొక్క అమోఘమైన విశ్వరూపము ను నాకు చూపినావు. కానీ నీ యొక్క భయానక స్వరూపము నేను చూడలేకున్నాను. నా యందు దయవుంచి, నీ శాంతాకారమును మరల స్వీకరించు, అని ప్రార్ధించెను. ఈ అధ్యాయము చివరలో భగవానుడు మన అందరి యందు అమిత ప్రేమా వాత్యలాలతో "ఎవరైతే నా యందు నిష్ఠ తో నిరంతరం నన్ను సేవింతురో, సర్వ ప్రాణిల యందు ద్వేషరహితులై ఉండెదరో వారు మాత్రమే నన్ను చెర గలుగు తారు " అని సందేశం ను ఇ చ్ఛేను

Thursday, June 25, 2020

Father's Day

మునపటికి చాన్నాళ్ల క్రితం సత్య లోకంలో  మన బ్రహ్మ గారు  ఒక రోజు కొలువై ఉన్నప్పుడు  సరస్వతీ దేవి వీణ శృతి సరి చేసుకొంటూ, "రోజూ ఈయన గారి వాహనం హంసధ్వని రాగాలాపనేనా, కొంచం వెరైటీ గా ఉంటుంది, కదనకుతూహలం ట్రై చేద్దాం" అనుకొంది.  అమ్మవారి ఈ మానససంచలనానికి రవ్వంత ఉలిక్కిపడిన బ్రహ్మ గారు, ఎందుకొచ్చిన గొడవలే అనుకోని, తన సృష్టి కార్యక్రమంలో భాగంగా, చేసినవన్నీ సత్కర్మలే అయినా, కొద్దిగా ఋషి ఋణం బకాయిపడిన సంధర్భంవల్ల, ఒక జీవిని భూలోకం పంపే ప్రయత్నంలో పడ్డారు. వాడు ఉన్నవాడు ఉండక, "స్వామి, ఇంత కాలం హాయిగా సత్య లోకంలో వేళకి తింటూ పడుకొంటూ, అమ్మ వీణాగానశ్రవణం చేస్తూ మీఇరువురి సంరక్షణలో ఇలా కాలం వెళ్ళబుస్తున్నాను. అసలే ఇప్పడు కరోనా అనే మహమ్మారి మరియు దాని మిత్రగణాలు పలు వేరియంట్ రూపధారులై స్వైర విహారం చేస్తున్న సమయం లో ఇప్పుడు భూలోకం పంపించడం ఏమైనా న్యాయంగా ఉందా", అంటూ దీనవదనంతో అడిగిన ఆ జీవికి, బ్రహ్మ ఇలా సెలవిచ్చాడు. "చూడు నాయనా, దేవుడు అన్నిచోట్లా ఉండడం సాధ్యం కాదనే, అమ్మ ని సృష్టించాడు. ఆ అమ్మ సంరక్షణలో, నీవు నిశ్చింత గా భూలోకంలో కాలం వెళ్ళబుచ్చవచ్చు", అని ఆ మధ్య  మదర్స్ డే సందర్భంగా విష్ణుమూర్తి పంపిన వాట్సాప్ మెసెజ్  గుర్తు తెచ్చుకొని చెప్పాడు. ఈ దెబ్బతో, సరస్వతి దేవి కూడా ట్యూన్ మార్చి మళ్ళీ హంసధ్వని రాగం ఆలాపన మొదలయ్యేటప్పటికీ కొంచం మనస్సు కుదుట పడింది. అయితే, ఈ సన్నివేశం అంతా ప్రత్యక్షం గా చూసిన నారదుడు చాలా సంతుష్టుడై, వైకుంఠానికి నారాయణ నామస్మరణ చేసికొంటూ, "అయ్యా ! మాతృమూర్తి వైభవం గురించి బ్రహ్మ పలికిన పలుకులు మీతో మనవి చేస్తానని", కధా వృత్తాంతం అంతా వివరించాడు. ఇది అంతా సావధానంగా విన్న విష్ణుమూర్తి, "బావుందోయ్ నారదా !! మరి అయితే అదే బ్రహ్మ గారిని తల్లి దైవమైతే, తండ్రుల పరిస్థితి ఏంటని కనుక్కురా", అని ప్రేరేపించాడు". నారదుడు తిరుగుటపా లో మరల సత్య లోకానికి వచ్చి బ్రహ్మ దేవుడికి ఈ ప్రశ్నని విన్నవించాడు. "ఈ విష్ణుమూర్తి ఎదో ఒక పితలాటకం పెట్టకుండా మానడు కదా" అని మనస్సు లో అనుకొంటూ, "ఇదిగో అబ్బాయ్, నారదా !! నీకు ఒక నెలరోజులు సెలవ ఇస్తున్నాను. నీవు భూ లోకం వెళ్లి అన్ని దేశాలు తిరిగి అస్సలు ఈ తండ్రులు ఏమీ వెలగపెడుతున్నారో కాస్త కనుక్కొని రా" అని పురమాయించి, విష్ణుమూర్తి విసిరిన బౌన్సర్ నించి లాఘవంగా అప్పటికి తప్పించుకున్నాడు. "అలాగే, ఈ సారి భూలోకంలోకి వెళ్లి నప్పుడు, మాస్కులు, గ్లోవ్స్ శానిటైజర్స్ వగైరాలు దగ్గర పెట్టుకోవడం మరవద్దు నాయనా ", అంటూ హెచ్చరిక కూడా చేసి తిరిగి తన సృష్టి కార్యక్రమం లో నిమగ్నం అయ్యాడు

నెల పైన ఒక వారం గడిచేసరికి తిరిగేసరికి, తిరిగి సత్య లోకానికి చేరిన నారదుడు, "తండ్రీ !! మీరేమో అంతా తిరిగి పరిస్తుతులు గమనించమన్నారు, కానీ ఈ తండ్రుల చేసే పనుల జాబితా  అంతా సేకరించేపాటికి, కొంచం ఆలస్యం అయ్యింది,  క్షంతవ్యుడిని" అంటూ తాను ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు.
  • అయ్యా, మహానుభావా !! భూలోకంలో తండ్రులు అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇళ్ళు తుడవడం ఇత్యాది విద్యల్లో మునపటి కన్నా చాలా ప్రతిభావంతులయ్యారు. అంతే కాక, వారు తమ ఈ ప్రావీణ్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా నిత్యం అప్రమత్తులై ఉండగలడం విశేషం. 
  • భూలోకం లో, ఇటీవల కాలంలో "మదర్స్ డే" అన్న ఒక సంబరం ఒకటి చేస్తున్నారు. దాని కోసరం, ఈ తండ్రి వర్గం అందరూ అహర్నిశలూ శ్రమించి, వారి వారి కుటుంబ సభ్యులందరి చేతా మాతృమూర్తలందరిని తమ తమ స్థాయికి మించి సత్కరిస్తున్నారు. మరి కొంత మంది ఔత్సాహికులయితే, తమ భార్యామణులకు ఆ రోజు పూర్తిగా విశ్రాంతి నిచ్చి కాలు కూడా కింద పెట్టనియ్యకుండా అన్నీ దగ్గరవుండీ చూసుకొంటూ ఆనంద తన్మయలు అవ్వడం గమనించాను. అదే విధము గా భూలోకం లో "ఫాథర్స్ డే" అన్న మరో ఒక సంబరం కూడా జరుపుకొంటారు అట. కానీ ఇది మదర్స్డే కి  బిన్నంగా, తండ్రి అని పిలవబడే వ్యక్తే, ఆ తారీకును గుర్తు ఉంచుకొని, బజార్లో గ్రీటింగ్ కార్డు అది కూడా సేల్ లో ఉన్నది ఒకటి కొని, పిల్లల చేత దస్తకత్తులు చేయించుకొని అదే చూసుకొంటూ మురిసిపోవడం గమనించాను 
  •  ఇక నూతన వస్త్ర ధారణ విషయానికి వస్తే, తనకున్న బట్టల్లో కొంచం కొత్తగా కనపడే చొక్కా ఒకటి బయటకి తీసి, బాగా ఇస్త్రీ చేసి తన పిల్లల చేత ఇప్పించుకొని ఒక రెండు ఫోటోలు తీయించుకొని వాట్సాప్ లలో షేర్ చేసికొని మళ్ళీ ఆ చొక్కాని నలగకుండా తన అల్మారా లో జాగ్రత్త గా పెట్టుకోవడం నేను ప్రస్ఫుటం గా గమనించాను 
  • పిల్లల భవిష్యత్తు కోసరం నిద్రాహారాలు మాని, స్కూలు, కాలేజీలంటూ తమ కుటుంబ సంపాదనని పైసా పైసా పోగేసి, వెనకేసి, మొత్తానికి తన పిల్లలని తన శక్తిమేరకు ప్రయోజకులు అయ్యారన్న సంతృప్తి తో కొంచం విశ్రాంతి తీసికొందామని అనుకొంటూ ఉండగానే, "అమ్మా ! నేనింత వాడిని అయ్యానంటే, అది అంతా నీ గొప్పతనమే అమ్మా" అంటూ తన పిల్లలు అర్ద్రోక్తి గా ఫోన్లో పలికిన పలుకులు కర్ణాకర్ణి గా వినపడడం చాలా సాధారణం గా నేను గమనించాను
*****************************************************************************
అందరికి  "ఫాథర్స్ డే" శుభాకాంక్షలు. కొంచం సరదాగా రాసుకున్న పై మాటలని మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. 

"మాతృ దెవొ భవ ! పితృ దేవో భవ ! ఆచార్య దేవో భవ ! అతిధి దేవో భవ !" అన్నది మన సనాతన ధర్మానికి పునాదిగా నిలిచిన వేదోక్తి. మన సంప్రదాయంలో పితృస్థానానికి ఇచ్చిన గౌరవం మహోతృష్టమైనది. త్రేతాయుగామందడి శ్రీ రామచంద్రుడు పితృ వాక్య పరిపాలనా యజ్ఞమునకు ఎంత తాపత్రయ పడ్డాడో జగమెరిగిన సత్యం. వరం పుచ్చుకొన్న కైక, మాతృమూర్తి కౌసల్య ఇత్యాదులకు ధర్మ సూక్ష్మమును వివరించి తన కర్తవ్యపాలన నిర్వర్వర్తించాడు. మరో అవతార పురుషుడైన జమదగ్ని సుతుండు పరశురాముడు తన తండ్రి మాటని ఏ విధంగా జవదాటలేదో మనందరికీ విదితమే.

తండ్రి నిత్యం నిస్వార్ధంగా ఫలాపేక్షరహితం గా పిల్లల అభ్యున్నతిని కోరుకొనే వాడు. సంప్రదాయం ఏదైనప్పటికీ ఈ ఆదివారం తండ్రి స్థానంలో నిలిచిన ఆ దేవతా స్వరూపాన్ని తలిచి సంతోషిద్దాం 

**************HAPPY FATHERS DAY TO ALL****************

Thursday, March 26, 2020

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

విష్ణు సహస్ర నామ ఆవిర్భావం

సాధారణంగా, మన సంప్రదాయాల్లో మానవ శ్రేయస్సు కోసం ఏర్పరచబడిన ఏ పూజలు, స్త్రోత్రాలు ఇతరత్రా బహుశా ఋషిప్రోక్తం లేదా స్వయానా భగవంతుని నించి అందించబడినవి. కొన్ని ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల సంభాషణల నించి గ్రహించబడ్డవి. ఇదే విష్ణుసహస్ర నామ పారాయణ ఫలశృతి భాగంగా

కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం 
పట్యతే  పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!

వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.


శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే 
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే 

వేదాలు సరేసరి. అవి అపౌరుషేయాలు. సృష్టికి ముందే ఈ సృష్టికి మూలమైన స్థితి కారక శక్తి ద్వారా మనకి అందించబడ్డాయని మనం విశ్వసిస్తున్నాము. కొన్ని ఇతిహాశాంతర్గతంగా మనకి అందించబడ్డాయి. ఉదాహరణకి, రామాయణ ఇతిహాసం ద్వారా మనకి సుందరకాండ పారాయణ, ఆదిత్యహృదయం ఇత్యాదివి మానవ శ్రేయస్సు నిమిత్తం నిక్షిప్తమైనాయి. లేదా మానవాళి నిమయామావళిని నిర్దేశించే భగవద్గీత మహాభారతంర్గతమైనదే. మరికొన్ని, మనం వ్రతాల్లో, పూజల్లో "సౌనకాది ముని సంవాదే" అని ప్రస్తావించబడడం కూడా తరచూ గమనిస్తూ ఉంటాం.  అయితే విష్ణుసహస్రనామాలకి మాత్రం ఒక విశిష్టత ఉంది. ఇది భగవంతుని సమక్షంలో, అయన ఆజ్ఞా ఆదేశలమేరకు మేరకు ఒక భక్తుడు ఇంకో భక్తుడికి ఉపదేశించబడినది. 

అయితే ఇక్కడ ఈ సంఘటనని మనం కొంచం విస్తారంగా ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంత గొడవెందుకు, కృష్ణుడే స్వయానా ఇది భగవద్గీత లాగానే ఆయనే ఎవరోఒకరిని ఎంచుకొని ఉపదేశం చేస్తే పోయేది కదా అని. అయన ప్రత్యక్షంగా నిలబడి భీష్ముడి చేత స్త్రోత్రం చేయించుకోవడం ఎందుకు? ఇవన్నీ మనకి బాగా అర్ధం అవ్వాలి అంటే, మనకి కృష్ణుడి అవతారం, దాని యొక్క మూల ఉద్దేశ్యం బాగా అవగతం అవ్వాలి. 

కృష్ణావతారం మిగతా అవతారాలకంటే చాలా భిన్నమైనది. ఉదాహరణకి రామావతారంలో శ్రీరామచంద్రుడు, కేవలం మానవుడి గానే పూర్తిగా వ్యవహరించాడు. అయన తనకేదో దైవాంశ, అద్భుత శక్తులు ఉన్నట్టు ఎక్కడా కనపడదు. రావణ సంహారం తర్వాత దేవతలు ప్రత్యక్షమై ఆయన్ని విష్ణుమూర్తి అవతారమని స్తుతిస్తూ ఉంటే, "అహం రామస్య దశరధ పుత్రాణాం" అనే సమాధానమిస్తాడు. అయితే కృష్ణుడు అలా కాదు. తన అవతార ఆవిర్భావం, సమాప్తం అంతా అయన అధీనమే అని స్పష్టంగా తెలియపరుస్తాడు. మనం సినిమాల్లో చూసుంటాం. చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. ఇది పూర్తిగా అసంబద్దంగాను, నమ్మశఖ్యముగా ఉండదు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు.

అయితే కృష్ణుడు తన అవతారం మొత్తం తాను వచ్చిన ప్రయోజనం నెరవేర్చే దాని కోసరం చాలా బాధ్యత పడ్డాడు.  తన చిన్నతనంనించే భగవద్గీత సారాంశం ఉపదేశించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే వినేవాళ్ళకి గురి కుదరాలంటే తానెవరో తెలియడం ముక్ష్యం. కృష్ణలీలల పేరిట మహిమలు ప్రదర్శించాడు. అయినా, నందనవనంలో అయన అంటే మూఢ భక్తి పెరిగిందే తప్ప వేదోపనిషత్తుల సారాంశమైన విజ్ఞానం అందుకొనే పరిపక్వత అగుపించలేదు. ఇకపొతే ఆ కాలంలో ప్రాచుర్యంలో లో రాజగణం ఆయన్ని అహంకారంతో ఒక సామాన్య యాదవుడు గానే చూసింది.

మహాభారతం లో మొట్టమొదట కృష్ణుడు పాండవులని కలవడం ద్రౌపది స్వయంవరంలో. అయన పెద్ద దాపరికాలు లేకుండా, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుని "మీరు ఎన్ని కష్టాలు పడ్డరయ్యా ! పాపం లక్క ఇళ్ల తగాలాపడినప్పుడు నానా అవస్థలు పడి తప్పించుకొన్నారటగా. తర్వాత ఏకశిలా నగరం లో యయావరం చేసికోవాల్సి వచ్చిందికదా" అంటూ ఎటువంటి మొహమాటం పడకుండా పరామర్శిస్తాడు. ధర్మరాజు మొదట ఆశ్చర్యపడినా, కృష్ణుడి తన తమ్ములతో సహా దైవాంశ పురుషుడిగానే గుర్తించి ,దర్శించి శరణాగతి చేస్తాడు. అయితే భక్తుడికి పరీక్షలు తప్పవు. ఒక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!

అయన భక్తుని ఆర్తికి మురిసిపోయాడు. "అయినను పోయి రావలయు హస్తినకు" అంటూ రాయబారానికి సిద్దమయితే, "మీరు వెళ్తారా ? మీరే వెళ్తారా ? నాకు కుటిలాత్ములైన కౌరవులమధ్యకు మీరు వెళ్లడం నాకు ఎంత సుతరామూ ఇష్టం లేదు" అని దిగులు పెట్టుకొన్న ధర్మరాజు ప్రేమ కు లొంగి పోయాడు. అలాగే ఆర్త రక్షణ కోసరమై, ఆడిన మాటని కూడా తప్పాడు. "ఆయుధం పట్టను" అన్న పెద్ద మనిషి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగా"  తీరున బీష్మునిపై ఎగసిన సన్నివేశం భక్తా వేశా  పరాకాష్ట. తనతో సాన్నిహిత్యం చేసి అరివీర పరాక్రమ వంతుడు, ధీరుడు అయిన అర్జునికి, తాను అవతారమంతా ఎదురుచూసిన మానవ శ్రేయస్సు, మనుగడ కోసరం నిర్దేశించ బడిన సందేశం భగవద్గీత రూపం లో అందించాడు. అయితే ఇంత విజ్ఞానం అంధింపపడిన తర్వాత కూడా, అభిమన్యుని మరణం తర్వాత నిర్వీర్యమైన అర్జునిని చూసి చాల నిరుత్సాహ పడ్డాడు. నీవు భగవంతుని మీద భారం వేసి కర్తవ్య దీక్ష నిర్వర్థించమనీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా, కరుణ్ణి నిర్జించడానికి ధర్మా ధర్మాల తర్కం చేస్తున్న అర్జునిని చూసి ఆశ్యర్యపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు అది మానేసి తర్కం చేయడం చూసి విచారపడ్డాడు. బహుశా మానవాళి, వేదసారమైన భగవద్గీత వంటి గ్రంధసారాంశం గ్రహించడానికి సిద్ధంగా లేదేమో అని సంశయ పడ్డాడు.

మహాభారతయుద్ధం అనంతరం జరిగిన బంధుజన ప్రాణ నష్టం ని కళ్లారా చూసిన ధర్మరాజు  తీవ్ర మనః వైక్లబ్యము చెందుతాడు. యుధిష్టరుడు, అజాత శత్రువు, ధర్మానికి ప్రతీకగా కొనియాడబడ్డ అంతటి ధర్మరాజు విషాద యోగానికి గురికాబడతాడు. స్వస్తిర ధర్మ రాజ్య పాలన జరపడాలన్న కాంక్షతో శ్రీ కృష్ణుడు ధర్మరాజు ని అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం కోసరమై ఎదురుచూస్తున్న భీష్ముడి దగ్గరకి తీసికెళ్ళతాడు. "సర్వజగత్తునకు మూలకారణము, అనాదిమధ్యలయుడు, సమస్త జగములు నీలోనే లీనమైన ఉన్నవాడివి కృష్ణా, నీకు తెలియని ధర్మములు నేను ధర్మజునికి ఎలా బోధించగలనని" భీష్ముడు కృష్ణుడి అడగగా, "ఒక భక్తుడికి భగవంతుని పట్ల  ఆర్తి, ప్రేమ ఆ భక్తుని ద్వారానే తెలపబడాలని" విష్ణుసహస్ర నామ ఆవిష్కరణకి ఆదేశిస్తాడు.

కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం 
స్తువంతః కామ్ కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం 
కోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః 
కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్ 

సమస్త సృష్టిలోకెల్లా సర్వ శక్తిమంతుడైన భగవంతుడెవ్వడు ? ఎవరి శరణాగతి మనం కోరవలెను? ఎవరిని ప్రార్ధించంవల్ల మానవాళి కి శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి? అన్నిటి కన్నా ఈ ధర్మం గొప్పది ? ఎటువంటి జపం చేయడం వల్ల, ఈ చావు పుట్టుకల సంసార బంధనాల నించి విముక్తి కలుగుతుంది... అంటూ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా, సమస్త జగత్తునకు విష్ణు సహస్ర నామావళి, భీష్ముని ద్వారా అందించ బడింది