Friday, February 10, 2023
డంబాచారం
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥
సత్య లోకంలో గంభీరంగా సాగుతున్న బ్రహ్మ గారి సభలోకి శుద్ధి మంత్రం చెపుతూ ఒక పవిత్ర వేషధారి అదాట్టుగా ప్రవేశించడంతో ఒక్క సారి సభాసదులందరూ ఉలిక్కి పడ్డారు. ఈయనెవరురా సాక్షాత్ బ్రహ్మ సదస్సు లో కూడా అపవిత్రత గాంచినవాడనుకొంటూ ఆశ్చర్యచకితులయ్యారు. మనిషేమో ఆజానుబాహుడు, శరీరమంతా విబూది రేఖలు, స్వచ్చమైన ధవళ వస్త్రధారి, చేతిలో కమండలం, రుద్రాక్షసహిత నిత్య జపధారి అయిన ఆయన్ని చూసి సత్యలోకములోని అంతటి దివ్య పురుషులు, సకల దేవతా గణం, తపఃసంపన్నులైన ఋషీ కులం, చదువుల తల్లి శారదమ్మ మరియు పవిత్రాపవిత్రల గణనా సమర్ది అయిన హంస కూడా ఒక్క క్షణం నివ్వెర పోయారు. తన సభలో సంభవించిన ఈ అలజడి ని గమనించిన సకల చరాచర సృష్టి కర్త అయిన బ్రహ్మ కూడా ఒక్క సారి తన ధ్యానావస్థ నిండి బయటపడినవాడై తన యొక్క సభకు అకస్మాత్తుగా వేంచేసిన ఆగంతుడిని గమనించారు. ఆహా! ఇంతటి మహోన్నతమైన సదస్సులో నిర్భీతి గా నిలుచొన్న ఈతడు నిశ్చయముగా మహామనీషి అని తలంచి, ఆతనికి సముచిత ఆసనము సమర్పింపచూసారు. అయితే, పరుల కోసముఏర్పాటుచేసిన ఆసనమునను ఆతడు వెంటనే నిరాకరించాడు. బ్రహ్మ మరింత చకితుడై, తన ఒడి లోనే కూర్చొనమని అభ్యర్ధించాడు.
అతగాడు మరల
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం᳚ గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥'
అంటూ శుద్ధిమంత్రము చెపుతూ, ఆచమనము చేసి ఆయన ఒడిలో కూర్చొన్నాడు.
బ్రహ్మ గారు అతనిని ఆసక్తిగా మరియు పరీక్షగా చూసి, " ఓరి! డంబాసురా నీవా!! బహుకాలము తర్వాత వేంచేసేవు!! గుర్తుపట్టలేకపోయాను సుమీ!!" అంటూ మురిపం చేశాడు. "ఇది వరలోకన్నా నీకు మరింత డాంబికం పెరిగిందిరా అబ్బాయ్ ! ఏంటి కారణం?" అని ప్రశ్నించారు.
నా ప్రవుత్తి సరిగ్గా సరిపోయేటట్టు మరియు ఉపకరణమయ్యేటట్టు ఈ వేళ భూలోకములో చాలా సాధనాలు ఏర్పడ్డాయి తండ్రీ! ఏది మనకు తెలియక పోయినా గూగుల్ లో క్షణభంగుర కాలము లో అన్వేషించి ఎదుటివారికి అది స్వీయప్రజ్ఞ అనే భ్రాంతి ఇట్టే కలుగచేయవచ్చుఁ. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా లభ్యమయ్యే సమాచారాన్ని ప్రతి నిత్యం మనం సొంత తెలివితేటలుగా వినియోగించవచ్చుఁ. అదే నా ప్రగతి కి మూల కారణం అంటూ వివరించాడు.
మనలో లేని ప్రజ్ఞ ఎదుటివారికి తనది గా వెల్లడించడమే "డంబాచారం".
అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ ।
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః
గీతాచార్యుడు సాధన సంపత్తి కొరకై ఉండవలసిన ముక్ష్య లక్షణాల్లో ఒకటి "అదంభత్వం" గా పేర్కొంటాడు. అనగా ఓ కపటి, కృత్తిమమైన బాహ్య వ్యక్తిత్వమును పెంపొందించుకుంటాడు. వ్యక్తి అంతర్గతంగా దోషపూరితముగా ఉంటాడు కానీ, బాహ్యంగా మంచి గుణములు ఉన్నట్టు ఒక వేషం సృష్టిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ, బాహ్యంగా ప్రదర్శించే మంచి గుణములు, పైపైకే ఉంటాయి మరియు ఒక డొల్ల మాత్రమే.ఈ ప్రస్తుత కాల మాన పరిస్తుతుల్లో మనమందరము మనకు సహజంగా పొందిన మన స్వీయ శక్తి ని మాత్రమే బయటకు ప్రదర్చించడము సాధ్యమా? ఇన్ని ఉపకరణాల మధ్య లభ్యమయ్యే అనేక సమాచారం ని చూస్తే చాలా సందర్భాలలో అసలు మనకు స్వతహాగా విజ్ఞానం అవసరమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదూ! అయితే, నిర్వచనుసారేణ మనమందరమూ "డాంబికులమేనా"???
I Ln. NCS Srinivasacharyulu bearing membership No: 1343582, from Lions club of Image - 061484, for the last 21 years. I was involved in almost most of the mission critical & service oriented activities of the club and contributed to the success of district level programs organized by the Governer. During this course, I have offered my services at various capcities such as club level, DC and ZC positions. My notable active participations during my membership period are with International Conventions, ISAAME forum, multiple district conventions and many others.
At this juncture, keeping the best interests of the club in mind, I would like bring few areas of concerns to your notice. I strongly feel these valid concerns require your immediate attention and possibly should prompt some corrective measures
1) I submit that, "No board meeting held nor seek the permission of board for voting this year not any information provided to board members of the club"
2) I submit that, "No senior member of the club contacted / consulted for selection of member for voting"
The team of delegates for voting were filled in credential form by the President & Secretary with the influence and as decided by the senior members, MR. KV Rama Rao and Mr.NCH Nageswara Rao
Taking above considerations into view, I request you to reject the LC of Image credential form, which has been submitted already
Thanks for your consideration and hoping for an immediate action in this regard from you at the earliest
Friday, February 3, 2023
Chapter 12 Telugu and Sanskrit
ద్వాదశ అధ్యాయస్య తెలుగు వ్యాఖ్యానం
అవ్యక్తుడు, అవ్యయుడైనట్టి పరమాత్మ తత్వాన్ని జ్ఞాన యోగముద్వారా ఉపాసించవలెనా లేక సగుణ సాకార స్వరూపమును మనస్సున ప్రతిష్టింపచేసికొని ఉపాసన మార్గమున ధ్యానించ వలెనా అన్న సందేహమును అర్జునుడు భక్తి యోగ అధ్యాయము యొక్క మొదటినందే వ్యక్తపరిచాడు. భగవంతుని అద్భుత విశ్వరూప సందర్శనము తర్వాత అర్జునునికి ఈ సందేహము కల్గుట కొంచం మనకు ఆశ్చర్యము కలిగించక మానదు. స్వామి మనలను జ్ఞాన మార్గమందే తనను సాధించవలెనన్న తలంపు తో ఉన్నయెడల తన సాకార స్వరూపమును ఏల ప్రదిర్శించ వలెను?
భగవంతునికి మన యొక్క ప్రవర్తన క్షుణ్ణముగా తెలిసినవాడు కనుకనే సాకార ఉపాశన మార్గమును మనకు ఉపదేశించి ఉన్నాడు. మర్కట - కిషోర న్యాయము నిరాకార జ్ఞానమార్గ ఉపాసకులని మరియు మార్జార-కిషోర న్యాయము సాకార ఉపాసకులకు వర్తిస్తున్నట్టుగా మనకు ఉదాహరణ రూపము లో గోచరిస్తున్నది. ఒక కోతి పిల్ల తన తల్లి పొట్టని పట్టుకొని ఉన్నప్పుడు, తల్లి ఒక చెట్టు నిండి మరొక చెట్టునకు ఎగురుతున్నపుడు, తన తల్లిని గట్టిగా పట్టుకొను బాధ్యత పిల్లదే అవుతున్నది. కానీ ఒక పిల్లి తన పిల్లలను జాగ్రత్తగా మెడను పట్టుకొని ఒక చోటు నిండి మరొక వైపునకు దాట వేయడంలో పూర్తి బాధ్యత తీసికొంటున్నది. నిరాకార, అవ్యక్త మైన భగవంతుడిని ఉపాసన చేయుట సాధ్యమయినప్పటికిన్ని అది సాధారణ మనుష్యులకు కష్టతరము. అందువలనే మనకు ఈ పూజ కైనా ముందర ధ్యాన శ్లోకమును నిర్దేశించారు. ఒక సాకార రూపమైన పరమాత్మ స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించు కొని ఉపాసనచేయాలనే నిర్దేశించారు. ఉదాహరణకు విష్ణుసహస్రనామ స్త్రోత్రపారాయణనకు నాందిగా
"శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||"
అని స్తుతించినప్పుడు, ఆదిశేషువు పైన లక్ష్మీసమేతుడై శాంతస్వరూపుడై మేఘవర్ణముతో విరాజితుడై మన సంసారభయాలను సదా హరిస్తున్న ఆ విష్ణు ఆకారమును మన మనస్సునందు స్థిరపరుచుకొని లేదా సాదృశ్యమైన రూపమును ధ్యానిస్తూ స్త్రోత్ర పారాయణ చేయడం ద్వారా మన మనస్సు నందు కలిగే వికారములు దూరముగా నుంచవచ్చని ఉద్దేశ్యము.
ఎనిమిదవ శ్లోకములో ఎల్లప్పుడూ భగవంతుని యందు మాత్రమే మనస్సు ను లగ్నం చేసి బుద్దిని సమర్పిస్తాడో అతను సదా భగవంతుని యందె నివసిస్తాడని అభయం ప్రసాదిస్తాడు. మనము భగవంతుని యందె నివసించుట అనగా దాని అర్ధమేమి ? మనము ఏదైనా పవిత్ర స్థలము నకు వెళ్ళినప్పుడు ఏ విధముగా శుచిగా ఉండడానికి ప్రయత్నిస్తామో మరియు మన మనస్సు కూడా పరిశుద్ధము గా ఉంచుకొనడానికి ప్రయత్నిస్తామో, అదేవిధముగా మనము నిత్యము భగవంతుని మందిరమునందు నివసిస్తున్నప్పుడు, అదే పవిత్రస్థితి మనయందు ఎల్లవేళలా కొనసాగుతుందని అర్ధము. మన ఆలోచనలు సైతము నిత్యము భగవద్ తత్వమునే ఆపాదించుకొన్నప్పుడు మన ప్రవర్తన కూడా నిర్ద్వందంగా ఉన్నతముగానే ఉంటాయి. ఉదాహరణకు, రామాయణములో భరతుడు, రామ రాజ్యబహిష్కరణ మరియు వనవాస యోగము గురించి తెలిసికొన్నప్పుడు అమితమైన దుఃఖమునకు లోనయ్యాడు. తన తల్లి కైకేయ యొక్క దుర్బుద్ధి నకు మూలకారణము మందర అని తెలిసికొని కుపితుడై ఆమెను శిక్షించాలని క్షణకాలం నిర్ణయించుకొంటాడు. అయితే సంపూర్ణరామార్పితమైన ఆ భరతుడు, తన యొక్క చర్య శ్రీ రామ సమ్మతము కాబోదని తెలిసికొని ఆ ఆలోచనను విరమించుకొంటాడు. సదా భగవంతుని చింతననే చేయు భక్తుడు అధర్మమార్గమునకు కూడా ఎప్పుడూ దూరంగానే ఉంటాడని మనకు ఈ సంఘటన ద్వారా వెల్లడి అవుతున్నది.
కానీ సర్వదా భగవంతునుని మన మనస్సులో ఉంచుకొనుట సాధ్యమా ? ఆ మార్గములో ఖఛ్చితంగా ప్రతిబంధకాలు ఎదురువుతాయి. మన యొక్క జీవనం యొక్క ముఖ్యలక్షణం భగవంతునుని మన మనస్సులోకి ఆహ్వానించి స్థిరపరుచోకోవడమే. కానీ ఈ ప్రయత్నం ప్రథమ సందర్భములోనే సఫలీకృతం అవుతుందా ? ఎట్టిపరిస్థితులలో సంభవం కాదు. మనస్సు చంచలమైనది కావున, భగవంతుని ప్రస్తావన కలిగిన వెంటనే పరి పరి విధములుగా భ్రమిస్తుంది. మరి ఏమి సాధనం ?
అభ్యాసము చేయుటలో కూడా అసమర్థుడైన వాడికి ఏమిటి సాధనం ?ధనంజయ - నన్ను నీ మనస్సులో స్థాపించుకొనుట సాధ్యం కానీ పక్షంలో నీవు చేసే ప్రతి పనిలో నన్ను అనుసంధానం చేసికొను మార్గము అవలంబించమని ఉపదేశిస్తాడు. భగవంతుని సాధనలో తొమ్మిది మార్గాలు మనసాంప్రదాయములో ఉపదేశిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం మరియు ఆత్మనివేదనం తొమ్మిది సాధనాలుగా పేర్కొనబడింది. మన ఆలయవ్యవస్థ నందు సమాజములో ప్రతి వృత్తి ధర్మము తోనూ అనుసంధానం చేయుట మనము గమనించవచ్చు. బ్రాహ్మణుడు ఆలయము లోని మూలస్వరూపమునకే అతని అర్చనాదులు సమర్పించవలసినది గా నిర్దేశించ బడినది. వ్యాపారవేత్తలు తన సంపాదనలోని కొంత భాగాన్ని ఆలయము కోసరం సమర్పించవలసిందిగా నిర్దేశము చేయబడినది. అదే విధముగా పాలకులు కూడా ఆలయ సంరక్షకులే. స్వామి కార్యక్రమములలో వర్ణవ్యవస్థలోని ప్రతి ఒక్కరిని భాగ్యస్వాములు చేయబడినది. రజకులు స్వామి వస్త్రములు పవిత్రభావనతోనే తయారు చేయుట, వడ్రంగి, కుమ్మరి తన తన ప్రజ్ఞ ను మళ్ళీ స్వామి కార్యమునకే వినియోగించుట.గాయకులూ గాయకులు, నృత్యకారులు, కవులు అందరూ స్వామిని ఉద్దేశించి తమ కళలను వెచ్చించుట ఇత్యాది వాటి వలన మన జీవన శైలి పూర్తి భగవంతుని అధీనము లోనే ఉన్నదన్న భావన తోనే అలవర్చుకొంటారు
అదేవిధంగా ఈ వ్యవస్థ లో మనం చేసే అన్నీ పనులు భగవంతుని ఆధీనంలోనే ఉన్నవని అవగతం అయినప్పుడు మన జీవనం సమర్పణ భావన తో కొనసాగుతుంది. నీవు చేసే ప్రతి పని భగవంతుని కోసం చేస్తున్నప్పుడు దానిలో హెచ్చుఁ తగ్గులు గణించుట ఉండదు కదా. భగవంతుడు భక్తిమార్గపరిణితి లోని వివిధ శ్రేణుల గురించి కూడా వివరిస్తాడు. కేవలం భగవంతుని అర్చన యాంత్రికంగా చేయుట కన్నా జ్ఞాన సముపార్జన ప్రశస్తం. జ్ఞాన అన్వేషణ కన్నా ధ్యానం చేయగలగడం విశేషం. ధ్యానం కన్నా కర్మసంగపరిత్యాగం మరింత ఉత్తమం.
కానీ ఈ స్థాయి కి చేరుట సులభమా ? దానికొరకు ఏమీ లక్షణములు ఉండవలెను? త్రయోదశ శ్లోకములో భగవంతుడు సర్వ భూతముల యందు సమభావన మరియు ద్వేషరహితభావన కలిగి ఉండుట ఎంత ప్రశస్యమో వివరిస్తాడు. ఈ సందర్భములో మనము గరుత్మంతుని వృత్తాతం పరిశీలిస్తే మనకు దీని అర్ధం సరిగా బోధపడుతుంది. గరుత్మంతుడు వినత పుత్రుడు. కద్రువ అతని సవతి తల్లి. ఈయన నారాయణ మహాభక్తుడు, శక్తిమంతుడు మరియు వినయసంపన్నుడు. ఒక సందర్భములో వినతా కద్రువ మధ్య జరిగిన పందెములో ఆమెతో సహా గరుత్మంతుడు కూడా కద్రువ మరియు ఆమె సంతానానికి(నాగులు) దాసులు అవుతారు. అరే ! నాకు ఇంట శక్తి ఉన్నప్పటికిన్నీ ఇలా దాస్యం చేయవలసి వచ్చిందే అని గరుత్మంతుడు వ్యాకులత చెందుతూ ఉంటాడు. తన దాస్యవిముక్తి మార్గము నాకు ఉపాయం అయన కద్రువని అడుగుతాడు. ఆమె ఆలోచించి దేవలోకమునిండి అమృతము తెచ్చ్చిన పక్షంలో అతని దాస్యవిముక్తి లభిస్తుంది అని చెపుతుంది. ఆయనకు ఉన్న శక్తిసామర్ధ్యాలకు అది పెద్ద విషయం కాదు. ఆయన దేవలోకం నుండి అమృతం తీసికొని వస్తున్నా క్రమములో దేవేంద్రుడు "అర్హత లేని వారికి అమృతము దక్క రాదు" అని అభ్యర్థిస్తాడు. గరుత్మంతుడు ఆ మాటకు అంగీకారము తెలిపి దానికి బదులుగా తనకి ఎల్లప్పుడూ సమస్త నాగులు ఆహారం కావాలని వరం అడుగుతాడు. ఇంద్రుడు దానికి కించిత్ ఆశ్చర్యము చెంది గరుత్మంతుడు నాగుల యందు ద్వేషభావం త్యజించలేదని గమనిస్తాడు. గరుత్మంతుడు నాగులకు అమృతం ఇఛ్చిన తర్వాత దేవేంద్రుడు ఆ అమృతము ను తస్కరిస్తాడు. అనంతరం గరుత్మంతుడు యదేచ్చగా నాగులను తినడం మొదలు పెడతాడు. అతని శక్తిని తాళలేక నాగులు రోజుకు ఒక్క నాగును అతనికి ఆహారంగా ఇవ్వడానికి ఒడంబడిక చేసికొంటారు. ఒకానొక రోజు ఆటను నాగు స్థానములో ఒక మహాపురుషుడిని ఆహారంగా స్వీకరించబోయి తర్వాత నిజాము తెలిసి కొని బాధ పడతాడు. ఆయన స్వతహాగా మహానుభావుడు, విష్ణుభక్తుడు. తనవల్ల జరిగిన ఈ ఘోర జీవ హింస కు పశ్చాతాపపడతాడు. గరుత్మంతుడు ఎప్పుడైతే ద్వేషభావం త్యజిస్తాడో వెంటనే అతనికి మైత్రీ మరియు కారుణ్య భావములు కలుగుతాయి. అతను దేవేంద్రుని వద్దకు వెళ్లి చనిపోయిన నాగులను తిరిగి బతికించడానికి అమృతం అడుగుతాడు. దేవేంద్రుడు మొదట ఎవరికోసం అమృతం వద్దని అన్నాడో వారికోసమే ఈ సారి సంతోషముగా అతనికి అమృతము ఇస్తాడు. ఆటను గరుత్మంతుని లో వచ్చిన మార్పునకు సంతోషిస్తాడు.
మనము సామాన్యముగా ఏ పని అయినా సంసారిక ప్రయోజనం కోసమే చేస్తాము కదా. కాను భగవంతుడు ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్య-ఆంతరములో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్ధచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు, అని అంటాడు. అన్నెడ అధ్యాయము చివరి శ్లోకములో భగవంతుడు ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.భగవంతునికి ప్రియుడు అయితే ఏమీ ప్రయోజనం ?
యత్పాద పద్మ యుగళం తులసీదళాదై: సంపూజ్య విష్ణుపదవీమ్ అతులామ్ ప్రయాంతి
తేనైవ కిమ్ పునరసౌ పరిరబ్దమూర్తి రామేణ వాయు తనయ: కృత పుణ్య పుంజ:
శ్రీరాముని పాదపద్మములను తులసీదళములతో పూజించినవారు సాటిలేని పరమ పదము పొందెదరు. అటువంటి శ్రీరామచంద్రుడే హనుమంతునికి అనుగ్రహించి స్వయముగా ఆయనను ఆలింగనం చేసికొంటాడు. భగవద్ ప్రియునకు (ఆంజనేయునకు) ఇంతకన్నా మహద్భాగ్యము ఉంటుందా ?
SANSKRIT
श्री गुरुभ्यो नमः। श्री कृष्ण परमात्मने नमः
पूर्वेषुअध्यायेषु भगवान् अव्यक्तः अव्ययः च - सादृशउल्लेखनं बहुवारं वयं पश्यामः।द्वादश अध्याये प्रथम्न श्लोके एव अर्जुनः सादृश भगवतः उपासनं ज्ञानमार्गेन करणीयं अथवा तस्य सगुण साकाररूपं मनसि स्थापयित्वा उपासनं करणीयं वा - इति प्रश्नं अपृच्छत्। अर्जुनस्य +-मनसि भगवतः अध्बुत विश्वरूपस्य सन्दर्शानान्तरम् एतस्य सन्देहस्य उत्पन्नं अस्माकं कृते किञ्चित् आस्चर्यकारणं भवति खलु।यदी वयं निराकारस्य भगवतः उपासनं ज्ञानमार्गेन करणीयं चेत् भगवान् तस्य अप्रमेय विश्वरूपस्य आविष्करणं किं प्रयोजनस्य कृते कृतवान्?
सामान्य जनानां चिन्तनस्य पूर्णस्वरूपं भगवता अवगतम्।तेन कारणेन एव भगवान् अस्माकं कृते सगुण साकार उपासना मार्गं सूचितवान्।एतस्मिन् सन्दर्भे द्वौ उदाहरणौ पश्यामः।मर्कटकिशोर न्यायः - एतद् उदाहरणं निराकार उपासनस्य भक्तजनानां कृते समुचितं भवति। मर्कट्याः शिशवः तेषां मातुः उदर आलंबेन सह वृक्ष्यशाखां मध्ये कूर्दन्ति।किन्तु माता शिशूनाम् रक्ष्णस्य दायित्वं न स्वीकरोति।शिशवः एव सावधानेन तेषां मातुः उदरं गृहीत्वा स्वीयसंरक्षणं कुर्वन्ति।किन्तु मार्जालकिशोर न्यायः मर्कटस्यकिशोरन्यायस्य अपेक्षया बिन्नं भवति। मातुः तस्याः शिशून् अतीव सावधानेन एकात् स्थलात् अन्य स्थलान् नयति।सा संपूर्णदायित्वं स्वीकृत्या शिशूनाम् रक्षणं करोति।साद्रुशप्रकारेण भक्तस्य कृते साकार उपासनमार्गे भगवता एकाग्रचित्तेन उपासना कर्तुं लघुतर मार्गं भवति।
तेनकरणेन एव अस्माकं कृते सर्व पूजा विधानानाम् आदौ तस्य भगवतः ध्यान श्लोकस्तुत्याः निर्देशनं भवति।तस्याः पूजायाः मूलदेवतारूपं मनसि स्थापयित्वा एव मुक्ष्यपूजाकार्यक्रमं कर्तुं निर्देशनं भवति।द्रुष्टान्तरूपेण श्री विश्नुसहस्रपारायणस्य पूर्वे वयं
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिहृर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्
इति ध्यानश्लोकस्य स्तुति कुर्मः खलु।यदा वयं एतस्य स्तुतिं कुर्मः तदा आदिसेषस्य उपरि लक्ष्म्या सह मेघवर्णस्य शान्ताकारस्य विष्णोः दिव्यस्वरूपं मनसि स्मरामः।श्री महा विष्णुः अस्माकं संसारिक भयान् सदा हरन् सर्व प्राणिनः रक्षणं करोति।सादृश भावनेन महाविष्णुं स्मृत्वा वयं स्त्रोत्रपारयणम् कुर्मः चेत् अस्माकं मनोविकारभवानानं निरोधं कर्तुं शक्यामहे।
परमात्मनि मयि एव चित्तं स्थापय।मयि एव मतिं योजय।ततः परं मयि एव वसिष्यसि। अत्र संदेहः न वर्तते। इति भगवान् अष्टम श्लोके उक्तवान्।यदी अस्माकं चित्तं सदा परमात्मनि एव स्थापयित्वा जीवनं कुर्मः चेत् अस्माकं मनः एव भगवद् मन्दिरं भविष्यति।यदी कोऽपि पुण्यक्षेत्रं गच्छति चेत् सः सर्वदा पवित्रभावनेन वर्तते खलु। एवमेव यदी वयं परमात्मनि एव चित्तं ध्रुवं कुर्मः चेत् अस्माकं चारित्रं अपि अमलं भविष्यति।दृष्टान्तरूपेन रामायणकाव्ये यदा भरतः रामस्य वनवासयोगं रज्यबहिष्करणप्राप्तिं विषये ज्ञातवान, सः अतीवकुपितः अभवत्। तस्य मातुः दुर्बुद्धेः मूलकारणं मन्दरा - इति ज्ञात्वा तस्याः मारितुं उद्युक्तवान्।किन्तु भरतस्य मनसि संपूर्णरीत्या रामभावन एव अस्ति।मन्दरायाः हिंसा रामस्य कृते न संमतः - इति चिन्तयित्वा भरतः तस्य प्रयत्नस्य प्रत्याहारं कृतवान्।यः सर्वदा भगतवः चिन्तनम् करोति सः कदापि अधर्ममार्गेन न व्यवहरति।सदा भगवती एव मनः स्थिरं कर्तुं कदापि सुलभउपायः न। तस्मिन् मार्गे अनेक प्रतिबन्धनानि निश्चयेन संभवन्ति।अस्माकं जीवनानाम् परमलक्ष्यं भगवति एव मनः स्थापयितुं भवति।किन्तु वयं एतस्य भक्तिमार्गस्य सिद्धिम् प्रथम प्रयत्ने एव प्राप्तुं शक्यामहे वा? कदापि न। मनः यावत् भगवति स्थिरं कर्तुं प्रयत्नं करोति तदैव बहूनि अन्यसंसारकिर विषयेषु परिभ्रमणम् कर्तुं इच्छति।तर्हि किं साधनम् ?
"धनञ्जय! यदी मयि चेतः निस्चलं स्थापयितुं न शक्नोषि तर्हि चित्तस्य पुनः पुनः स्थापेन मां प्राप्तुं यतस्व।" - इति भगवान् सर्व जनानां कृते संदेशं दत्तवान्।
अभ्यासे अपि भगवद्प्राप्तिं असमर्थः अस्ति चेत् किं करणीयं?जीवने नारायणभावेन सर्व कर्माणि करणीयं।भक्तजननां कृते नवप्रकार भागवतधर्मआभ्यासं कर्तुं निर्देशनं गुरुजनैः दत्तम्।श्रवणं, कीर्तनं, स्मरणं, पादसेवनं, अर्चनं, वन्दनं, दास्यं, सख्यं, आत्मनिवेदनं च भगवतसेवाकर्माणि भवन्ति।भारतदेशे आलय व्यवस्थायाम् वयं एतस्य विधानस्य रचनाः द्रष्टुं शक्यामहे।ब्राह्मणाः वेदविहितकार्यक्रमाणि आलयस्य मुक्ष्यदेवतस्य कृते कृतवन्तः।वणिजाः तस्य व्यापारस्य लाभस्य किञ्चित् भागं देवालस्य कृते वितरणं कृतवन्तः।पालाकाः आलय धर्माध्यक्षता कृतवन्तः।शिल्पकारकाः तस्य प्रतिभा आलयस्य कृते समर्पयन्ति।तक्षकः, रजकः.कुम्भकारः च इत्यादि अनेक वृत्ति निपुणाः तेषु जीवनेषु भगवद्उद्देशैः तेषां कर्माणि कृतवन्तः। एवमेव गायाकाः नर्तकाः कवयः साहित्यकाराः च अपि तेषां कौशल्याम् भगवदर्पितं कृतवन्तः।अनन्तरं भगवान् भक्तस्य परिणित्याः श्रेणीनाम् विषये उक्तवान्।अभ्यासयोगात् विवेकः प्रश्स्थारः।विवेकात् चिन्तनम् विशिष्यते। चिन्तनात् अपि कर्मप्रयोजनपरित्यागः विशिष्यते। त्यागात् बन्धनस्य संसारस्य नाशः भवति।
किन्तु संपूर्ण भक्तिभावनं प्राप्तुं अस्माकं कृते किं लक्षणं प्रधानतः आवश्यकं भवति?त्रयोदश श्लोके भगवान् सर्वभूतानाम् कृते अद्वेष्टा भावनायाः विषये अपि प्रस्थावितवान्। एतस्मिन् सन्दर्भे गरुक्मन्तस्य वृत्तान्तं वयं एक वारं पश्यामः।गरुक्मन्तः विष्णोः महाभक्तः विनयशीलः च। सः विनतायाः पुत्रः।कद्रुवा तस्य विमाता अभवत्।विनता कद्रुवा द्वयोः मध्ये एकात् पणात् कारणात् गरुक्मन्तः कद्रुवायाः दासः अभवत्।गरुक्मन्तः एतस्य दास्यस्य विमुक्तिं कर्तुं निश्चयं कृतवान्। सः माता कद्रुमं कथं तस्य दास्यविमुक्तिं कर्तुं शक्यते – इति प्रार्थयतिवान्।सा किञ्चित् चिन्तयित्वा यदी गरुक्मन्तः स्वर्गात् अमृतं नयति चेत् दास्यस्य विमुक्तिं प्राप्नोति - इति उक्तवती। गरुक्मन्तः बहुः समर्थः। सः स्वर्गलोकात् अमृतं गृहीत्वा स्वस्थालं आगन्तुं उद्युक्तवान्।विना योग्येन अमृतं न ददातु - इति देवेन्द्रेण उक्तः। गरुक्मन्तः तद् प्रतिपादनं अन्गीकृत्वा एकं वरं आकाङ्क्षितवान्। गरुक्मन्तः द्वेषभावेन सर्व नागजाति प्राणिनः तस्य कृते आहारं भवेत् - एतद् वरं अपृच्छत्।तत् पश्चात् गरुक्मन्तः विना निर्बन्धेन सर्व नागानां वधं कुर्वन् जीवनं यापयतिवान्।अनन्तरं प्रतिदिनं एकं नागं गरुक्मन्तस्य आहारार्थं दातुं संधिः अभवत्।एकस्मिन् समये सः भ्रमेण नागप्राणिनि स्थाने एकं महापुरुषं खादितुम् प्रयत्नं कृतवान्। तदनन्तरम् सः तस्य स्वकृत घोरजीवहिंसाकार्याणां कृते अतीव दुःखं अनुभूतवान्।पञ्चात्ताप भावेन सः द्वेषभावं त्यजितवान्। तस्मिन् मनसि द्वेषभावन स्थाने मैत्री कारुण्य भावनौ आगच्छताम्।मृत नागाप्राणिनः पुनर्जीवनार्थं इन्द्रं अमृतं दातुं प्रार्थयतिवान्। इन्द्रः संतोषेन गरुक्मन्तं अमृतं दत्तवान्।
सामान्यतः जनाः भगवतः पूजां चिन्तनम् च कोऽपि सांसारिकप्रयोजनार्थं एव कुर्वन्ति।किन्तु भगवान् वदति - यः पुरुषः निःस्पृहः शुद्दः चतुरः तटस्तः अपगतभयः सर्वेषां कर्माणां फलं त्यजन् भगवद्भक्तः च वर्तते सः मम अभीष्टः भवति।भगवद्प्रियः भवितुं एव सर्वोत्कृष्ट स्थिति भवति ।
द्वादश अध्याये भगवान् भक्तिमार्गस्य लक्षणानि लाभानि विस्तारेण बोधितवान्।ये तु भक्तिमन्तः, विश्वासयुक्ताः मन्निश्टाह् यथाप्रतिपादितं धर्मयुक्तं साधुसमानम् इदं च आचरन्ति ते पुरुषाः मम अत्यन्तं अभीष्टाः भवन्ति - इति भगवान अन्तिम श्लोके उक्तवान्।यदी कोऽपि भगवद्प्रियः भवति चेत् किं प्रयोजनम्?
यत्पादपद्मयुगळम् तुलसीदलैः संपूज्य विष्णुपदानीं अतुलां प्रयान्ति
तेनैव किं पुनरसौ परिरब्धमूर्ती रामेण वायु तनयः कृतपुण्य पुन्जः
ये श्री रामस्य पदान् तुलसी दलैः पूज्यन्ते ते परमपदं निश्चयेन प्राप्नुवन्ति। अन्जनेयः तस्य आकुण्ठितभक्तिभावनेन भगवतः प्रियः वर्तते। तेन कारणेन श्री रामः एव अन्जनेयं आलिङ्गनं कृत्वा अतुल सुखानि प्रसादितवान्। अन्जनेयस्य भाग्यस्य वर्णनं कर्तुं शक्यते वा? कदापि न।
Subscribe to:
Posts (Atom)