విష్ణు సహస్ర నామ ఆవిర్భావం
సాధారణంగా, మన సంప్రదాయాల్లో మానవ శ్రేయస్సు కోసం ఏర్పరచబడిన ఏ పూజలు, స్త్రోత్రాలు ఇతరత్రా బహుశా ఋషిప్రోక్తం లేదా స్వయానా భగవంతుని నించి అందించబడినవి. కొన్ని ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల సంభాషణల నించి గ్రహించబడ్డవి. ఇదే విష్ణుసహస్ర నామ పారాయణ ఫలశృతి భాగంగా
కేనో పాయేన లఘన విష్ణోర్నామ సహస్రకం
పట్యతే పండితైర్నిత్యం శ్రోత మిచ్యామ్యాహం ప్రభో !!
వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.
వీళ్ళని రోజూ సహస్ర నామాల, స్త్రోత్రాలు అంటూ బెదర కొట్టకండీ మరీను, ఏదో ఒక ఉపాయం చెప్పండీ అనగా, "సర్లే" మరి, కనీశం రామ నామ జపం చెయ్యమను, సరి పోతుంది అని మనకి పరిష్కారం సూచిస్తాడు ఆ పరమాత్మ.
శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే
సహస్ర నామ తత్తుల్యం రామ నమ వరాననే
వేదాలు సరేసరి. అవి అపౌరుషేయాలు. సృష్టికి ముందే ఈ సృష్టికి మూలమైన స్థితి కారక శక్తి ద్వారా మనకి అందించబడ్డాయని మనం విశ్వసిస్తున్నాము. కొన్ని ఇతిహాశాంతర్గతంగా మనకి అందించబడ్డాయి. ఉదాహరణకి, రామాయణ ఇతిహాసం ద్వారా మనకి సుందరకాండ పారాయణ, ఆదిత్యహృదయం ఇత్యాదివి మానవ శ్రేయస్సు నిమిత్తం నిక్షిప్తమైనాయి. లేదా మానవాళి నిమయామావళిని నిర్దేశించే భగవద్గీత మహాభారతంర్గతమైనదే. మరికొన్ని, మనం వ్రతాల్లో, పూజల్లో "సౌనకాది ముని సంవాదే" అని ప్రస్తావించబడడం కూడా తరచూ గమనిస్తూ ఉంటాం. అయితే విష్ణుసహస్రనామాలకి మాత్రం ఒక విశిష్టత ఉంది. ఇది భగవంతుని సమక్షంలో, అయన ఆజ్ఞా ఆదేశలమేరకు మేరకు ఒక భక్తుడు ఇంకో భక్తుడికి ఉపదేశించబడినది.
అయితే ఇక్కడ ఈ సంఘటనని మనం కొంచం విస్తారంగా ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇంత గొడవెందుకు, కృష్ణుడే స్వయానా ఇది భగవద్గీత లాగానే ఆయనే ఎవరోఒకరిని ఎంచుకొని ఉపదేశం చేస్తే పోయేది కదా అని. అయన ప్రత్యక్షంగా నిలబడి భీష్ముడి చేత స్త్రోత్రం చేయించుకోవడం ఎందుకు? ఇవన్నీ మనకి బాగా అర్ధం అవ్వాలి అంటే, మనకి కృష్ణుడి అవతారం, దాని యొక్క మూల ఉద్దేశ్యం బాగా అవగతం అవ్వాలి.
కృష్ణావతారం మిగతా అవతారాలకంటే చాలా భిన్నమైనది. ఉదాహరణకి రామావతారంలో శ్రీరామచంద్రుడు, కేవలం మానవుడి గానే పూర్తిగా వ్యవహరించాడు. అయన తనకేదో దైవాంశ, అద్భుత శక్తులు ఉన్నట్టు ఎక్కడా కనపడదు. రావణ సంహారం తర్వాత దేవతలు ప్రత్యక్షమై ఆయన్ని విష్ణుమూర్తి అవతారమని స్తుతిస్తూ ఉంటే, "అహం రామస్య దశరధ పుత్రాణాం" అనే సమాధానమిస్తాడు. అయితే కృష్ణుడు అలా కాదు. తన అవతార ఆవిర్భావం, సమాప్తం అంతా అయన అధీనమే అని స్పష్టంగా తెలియపరుస్తాడు. మనం సినిమాల్లో చూసుంటాం. చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. ఇది పూర్తిగా అసంబద్దంగాను, నమ్మశఖ్యముగా ఉండదు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ? అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు.
అయితే కృష్ణుడు తన అవతారం మొత్తం తాను వచ్చిన ప్రయోజనం నెరవేర్చే దాని కోసరం చాలా బాధ్యత పడ్డాడు. తన చిన్నతనంనించే భగవద్గీత సారాంశం ఉపదేశించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే వినేవాళ్ళకి గురి కుదరాలంటే తానెవరో తెలియడం ముక్ష్యం. కృష్ణలీలల పేరిట మహిమలు ప్రదర్శించాడు. అయినా, నందనవనంలో అయన అంటే మూఢ భక్తి పెరిగిందే తప్ప వేదోపనిషత్తుల సారాంశమైన విజ్ఞానం అందుకొనే పరిపక్వత అగుపించలేదు. ఇకపొతే ఆ కాలంలో ప్రాచుర్యంలో లో రాజగణం ఆయన్ని అహంకారంతో ఒక సామాన్య యాదవుడు గానే చూసింది.
మహాభారతం లో మొట్టమొదట కృష్ణుడు పాండవులని కలవడం ద్రౌపది స్వయంవరంలో. అయన పెద్ద దాపరికాలు లేకుండా, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుని "మీరు ఎన్ని కష్టాలు పడ్డరయ్యా ! పాపం లక్క ఇళ్ల తగాలాపడినప్పుడు నానా అవస్థలు పడి తప్పించుకొన్నారటగా. తర్వాత ఏకశిలా నగరం లో యయావరం చేసికోవాల్సి వచ్చిందికదా" అంటూ ఎటువంటి మొహమాటం పడకుండా పరామర్శిస్తాడు. ధర్మరాజు మొదట ఆశ్చర్యపడినా, కృష్ణుడి తన తమ్ములతో సహా దైవాంశ పురుషుడిగానే గుర్తించి ,దర్శించి శరణాగతి చేస్తాడు. అయితే భక్తుడికి పరీక్షలు తప్పవు. ఒక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి నినిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!
అయన భక్తుని ఆర్తికి మురిసిపోయాడు. "అయినను పోయి రావలయు హస్తినకు" అంటూ రాయబారానికి సిద్దమయితే, "మీరు వెళ్తారా ? మీరే వెళ్తారా ? నాకు కుటిలాత్ములైన కౌరవులమధ్యకు మీరు వెళ్లడం నాకు ఎంత సుతరామూ ఇష్టం లేదు" అని దిగులు పెట్టుకొన్న ధర్మరాజు ప్రేమ కు లొంగి పోయాడు. అలాగే ఆర్త రక్షణ కోసరమై, ఆడిన మాటని కూడా తప్పాడు. "ఆయుధం పట్టను" అన్న పెద్ద మనిషి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగా" తీరున బీష్మునిపై ఎగసిన సన్నివేశం భక్తా వేశా పరాకాష్ట. తనతో సాన్నిహిత్యం చేసి అరివీర పరాక్రమ వంతుడు, ధీరుడు అయిన అర్జునికి, తాను అవతారమంతా ఎదురుచూసిన మానవ శ్రేయస్సు, మనుగడ కోసరం నిర్దేశించ బడిన సందేశం భగవద్గీత రూపం లో అందించాడు. అయితే ఇంత విజ్ఞానం అంధింపపడిన తర్వాత కూడా, అభిమన్యుని మరణం తర్వాత నిర్వీర్యమైన అర్జునిని చూసి చాల నిరుత్సాహ పడ్డాడు. నీవు భగవంతుని మీద భారం వేసి కర్తవ్య దీక్ష నిర్వర్థించమనీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా, కరుణ్ణి నిర్జించడానికి ధర్మా ధర్మాల తర్కం చేస్తున్న అర్జునిని చూసి ఆశ్యర్యపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి
సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు. చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు అది మానేసి తర్కం చేయడం చూసి విచారపడ్డాడు. బహుశా మానవాళి, వేదసారమైన భగవద్గీత వంటి గ్రంధసారాంశం గ్రహించడానికి సిద్ధంగా లేదేమో అని సంశయ పడ్డాడు.
మహాభారతయుద్ధం అనంతరం జరిగిన బంధుజన ప్రాణ నష్టం ని కళ్లారా చూసిన ధర్మరాజు తీవ్ర మనః వైక్లబ్యము చెందుతాడు. యుధిష్టరుడు, అజాత శత్రువు, ధర్మానికి ప్రతీకగా కొనియాడబడ్డ అంతటి ధర్మరాజు విషాద యోగానికి గురికాబడతాడు. స్వస్తిర ధర్మ రాజ్య పాలన జరపడాలన్న కాంక్షతో శ్రీ కృష్ణుడు ధర్మరాజు ని అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం కోసరమై ఎదురుచూస్తున్న భీష్ముడి దగ్గరకి తీసికెళ్ళతాడు. "సర్వజగత్తునకు మూలకారణము, అనాదిమధ్యలయుడు, సమస్త జగములు నీలోనే లీనమైన ఉన్నవాడివి కృష్ణా, నీకు తెలియని ధర్మములు నేను ధర్మజునికి ఎలా బోధించగలనని" భీష్ముడు కృష్ణుడి అడగగా, "ఒక భక్తుడికి భగవంతుని పట్ల ఆర్తి, ప్రేమ ఆ భక్తుని ద్వారానే తెలపబడాలని" విష్ణుసహస్ర నామ ఆవిష్కరణకి ఆదేశిస్తాడు.
అయితే కృష్ణుడు తన అవతారం మొత్తం తాను వచ్చిన ప్రయోజనం నెరవేర్చే దాని కోసరం చాలా బాధ్యత పడ్డాడు. తన చిన్నతనంనించే భగవద్గీత సారాంశం ఉపదేశించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అయితే వినేవాళ్ళకి గురి కుదరాలంటే తానెవరో తెలియడం ముక్ష్యం. కృష్ణలీలల పేరిట మహిమలు ప్రదర్శించాడు. అయినా, నందనవనంలో అయన అంటే మూఢ భక్తి పెరిగిందే తప్ప వేదోపనిషత్తుల సారాంశమైన విజ్ఞానం అందుకొనే పరిపక్వత అగుపించలేదు. ఇకపొతే ఆ కాలంలో ప్రాచుర్యంలో లో రాజగణం ఆయన్ని అహంకారంతో ఒక సామాన్య యాదవుడు గానే చూసింది.
మహాభారతం లో మొట్టమొదట కృష్ణుడు పాండవులని కలవడం ద్రౌపది స్వయంవరంలో. అయన పెద్ద దాపరికాలు లేకుండా, బ్రాహ్మణ వేషంలో ఉన్న ధర్మరాజుని "మీరు ఎన్ని కష్టాలు పడ్డరయ్యా ! పాపం లక్క ఇళ్ల తగాలాపడినప్పుడు నానా అవస్థలు పడి తప్పించుకొన్నారటగా. తర్వాత ఏకశిలా నగరం లో యయావరం చేసికోవాల్సి వచ్చిందికదా" అంటూ ఎటువంటి మొహమాటం పడకుండా పరామర్శిస్తాడు. ధర్మరాజు మొదట ఆశ్చర్యపడినా, కృష్ణుడి తన తమ్ములతో సహా దైవాంశ పురుషుడిగానే గుర్తించి ,దర్శించి శరణాగతి చేస్తాడు. అయితే భక్తుడికి పరీక్షలు తప్పవు. ఒక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని
అయన భక్తుని ఆర్తికి మురిసిపోయాడు. "అయినను పోయి రావలయు హస్తినకు" అంటూ రాయబారానికి సిద్దమయితే, "మీరు వెళ్తారా ? మీరే వెళ్తారా ? నాకు కుటిలాత్ములైన కౌరవులమధ్యకు మీరు వెళ్లడం నాకు ఎంత సుతరామూ ఇష్టం లేదు" అని దిగులు పెట్టుకొన్న ధర్మరాజు ప్రేమ కు లొంగి పోయాడు. అలాగే ఆర్త రక్షణ కోసరమై, ఆడిన మాటని కూడా తప్పాడు. "ఆయుధం పట్టను" అన్న పెద్ద మనిషి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి "కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగా" తీరున బీష్మునిపై ఎగసిన సన్నివేశం భక్తా వేశా పరాకాష్ట. తనతో సాన్నిహిత్యం చేసి అరివీర పరాక్రమ వంతుడు, ధీరుడు అయిన అర్జునికి, తాను అవతారమంతా ఎదురుచూసిన మానవ శ్రేయస్సు, మనుగడ కోసరం నిర్దేశించ బడిన సందేశం భగవద్గీత రూపం లో అందించాడు. అయితే ఇంత విజ్ఞానం అంధింపపడిన తర్వాత కూడా, అభిమన్యుని మరణం తర్వాత నిర్వీర్యమైన అర్జునిని చూసి చాల నిరుత్సాహ పడ్డాడు. నీవు భగవంతుని మీద భారం వేసి కర్తవ్య దీక్ష నిర్వర్థించమనీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా, కరుణ్ణి నిర్జించడానికి ధర్మా ధర్మాల తర్కం చేస్తున్న అర్జునిని చూసి ఆశ్యర్యపడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించుకోవాలి
సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు. చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. యుద్ధం చేయడానికి వచ్చిన అర్జునుడు అది మానేసి తర్కం చేయడం చూసి విచారపడ్డాడు. బహుశా మానవాళి, వేదసారమైన భగవద్గీత వంటి గ్రంధసారాంశం గ్రహించడానికి సిద్ధంగా లేదేమో అని సంశయ పడ్డాడు.
మహాభారతయుద్ధం అనంతరం జరిగిన బంధుజన ప్రాణ నష్టం ని కళ్లారా చూసిన ధర్మరాజు తీవ్ర మనః వైక్లబ్యము చెందుతాడు. యుధిష్టరుడు, అజాత శత్రువు, ధర్మానికి ప్రతీకగా కొనియాడబడ్డ అంతటి ధర్మరాజు విషాద యోగానికి గురికాబడతాడు. స్వస్తిర ధర్మ రాజ్య పాలన జరపడాలన్న కాంక్షతో శ్రీ కృష్ణుడు ధర్మరాజు ని అంపశయ్య మీద స్వచ్ఛంద మరణం కోసరమై ఎదురుచూస్తున్న భీష్ముడి దగ్గరకి తీసికెళ్ళతాడు. "సర్వజగత్తునకు మూలకారణము, అనాదిమధ్యలయుడు, సమస్త జగములు నీలోనే లీనమైన ఉన్నవాడివి కృష్ణా, నీకు తెలియని ధర్మములు నేను ధర్మజునికి ఎలా బోధించగలనని" భీష్ముడు కృష్ణుడి అడగగా, "ఒక భక్తుడికి భగవంతుని పట్ల ఆర్తి, ప్రేమ ఆ భక్తుని ద్వారానే తెలపబడాలని" విష్ణుసహస్ర నామ ఆవిష్కరణకి ఆదేశిస్తాడు.
కిమేకం దైవతంలోకే కింవాప్యేకం పరాయణం
స్తువంతః కామ్ కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం
కోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః
కింజపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార భందనాత్