రావు గారు మొత్తం జిల్లాలోకే పేరుమోసిన మోతుబరి. స్వతహా గా దక్షత కలవాడు అవటం చేత వారసత్వంగా వచ్చిన దాన్ని పోషణ, పెంపకం తో పాటు ఇతరత్రా దాదాపు దేశం అంతా వ్యాపార కేంద్రాలు నెలకొన్నాయి. వ్యవహారానికి సొంత ఊరు "కొంత" అయిపోవడంతో, ఎంతో ఇష్టం అయిన ఇంటిని మరియు ఊళ్ళో ఉన్న పొలాలని పినతండ్రి అల్లుడు, భూపతి దగ్గర వాడు అవడంతో బాటు పదిలం గా చూసికొంటాడు అన్న నమ్మకంతో అప్పచెప్పి పై రాష్ట్రం కి భార్య పిల్లలు తో వెళ్ళాడు. సహజం గా వ్యాపారం లో అందే వేసిన చెయ్యి అవడంతో రాణింపు కి ఏమి దొక లేకుండానే ఇంతింతై వటుడింతై అన్నట్టు గా కొద్దికాలం లోనే పేరు, హోదా, పరపతి అయన పరం అయ్యాయి. ఊరికి కొత్తలో చాల సార్లు, నెమ్మదిగా కొన్ని సార్లు, తర్వాత తప్పదంటే వచ్చే వాడు. పిల్లలు కూడా కొత్త ప్రదేశంలో అలవాటు అయిపోవడంతో,రాకపోకలు పూర్తి గా తగ్గాయి.
భూపతి కొత్తల్లో ఉత్త పుణ్యానికి మంచి హంగు ఉన్న ఇల్లులో ఉండనిచ్చి నందుకు ఎంతో కృతజ్ఞత తో ఉంటూ తర్వాత పెద్దగ పొలం లెక్కలు కూడా చెప్పనవాసం లేక పోవడం తో , నెమ్మది నెమ్మది గా కలిసి వచ్చిన ఆశ్వర్యం కి బాగానే అలవాటు పడ్డాడు. మొదట్లో మాటల సందర్భంలో, "నాదేముంది అండీ !! అంతా రావు గారి దయ" నించి కొన్నాళ్ళు అయిన తర్వాత అయన ఉనికి తగ్గడం తో ఇదంతా తన ప్రయోజనమే అన్న మిడిసిపాటుకి అలవాటు పడ్డాడు. అందరికి తన యొక్క వైభవం అర్ధం అయ్యే "లాగా" తర్వాత "వరకు" విశీదీకరించే వకాల్త పుచ్చు కొని చాల వరకు సఫలీకృతుడు కూడా అయ్యాడు. కొన్ని ఏళ్ళు ఇట్లానే గడిచిన తర్వాత ఒక నాడు రావు గారు రావడం, విషయం అర్ధం అవ్వడం జరిగాయి. వెంటనే దేశానికే ప్రముఖుల్లో ఒక్కడైన అయన భూపతి రోడ్డు పాలు చేయడానికి పెద్ద సమయం పట్టలేదు అని చెప్పనక్కర్లేకుండా జరిగి పోయింది.
ఇది చాల మామూలు కధ లాగానే ఉంది కదా, దీన్ని గురించి ఇంత కష్ట పడ్డాడు అని ఆశ్చర్య పడుతున్నారా? కొంచం అలోచించి చూడండి, ఇది మన అందరి కథ లాగ అనిపించడం లేదండీ? మనం ఏదీ అడగకుండానే మొత్తం సృష్టి మొత్తం ప్రకృష్టమైన శరీరం అనే ఇల్లు ఇచ్చి దానికి తోడు మాట, ఆలోచన అనే ఆస్తులు కూడా జోడించిన తర్వాత ఆ పరమాత్మ ఎప్పుడైనా మన నించి ఏమీ ఆశించకుండా ప్రేక్షకుడి గానే మిగిలి ఉంటున్నాడు. అయితే ఈ ప్రపంచం ని "నా" అద్దం లోంచి చూస్తూ చివరికి ఇదంతా నా ప్రయోజకత్వమే అన్న భావజాలం నించి చివర వరకు బయటకు రాలేక పోతూ అంతా నాది అంటూనే చివరకి ఏమీ మిగలకుండా ఈ శరీరం లోంచి బయటకు నెట్టివేయ బడుతుంటాం. ఈ విషయమై రామాయణ అంతర్గతంగా ఒక ప్రస్తావన ఉంటుంది.
అరణ్య కాండ లో భరతుడు, రాములి వారిని తిరిగి అయోధ్య కి రమ్మని శత విధాలు గా ప్రాధేయ పడతాడు. చుట్టూ వున్న మంత్రులు, పరివారం చివరకి కైక కూడా ఆయన్ని బ్రతిమాలిన కూడా, పితృవాక్య పరిపాలనకి బద్దుడైన కారణానికి, రాముడు తిరిగి అయోధ్యకి రాలేడు అన్న నిర్ణయం నిర్ధారణ అవుతుంది. దేశం రాజ హీనం అవ్వకూడదు అన్న కారణానికి, వన వాసం గడువు పూర్తి అయ్యే వరకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని అక్కడే ఉన్న మంత్రి ఒక ప్రస్తావన చేయడం జరుగుతుంది. అప్పుడు భరతుడు ఒక్క సారిగా ఏదో దొంగతనం జరిగి తున్నట్టుగా ఉలిక్కి పడతాడు అట. "నాది" కాని దాన్ని ఈ విధంగా అనుభవించమని చెపుతారు ఆ మంత్రి గణాన్ని ప్రశ్నించడం జరుగుతుందని వ్యాఖ్యానం. చివరకి "రాముని" ప్రతినిధి గా రాజ్యం ఏలుతాను అని ఒప్పుకొని అయన "పాదుకలు" కి పట్టాభిషేకం జరుపుతాడు.
భూపతి కొత్తల్లో ఉత్త పుణ్యానికి మంచి హంగు ఉన్న ఇల్లులో ఉండనిచ్చి నందుకు ఎంతో కృతజ్ఞత తో ఉంటూ తర్వాత పెద్దగ పొలం లెక్కలు కూడా చెప్పనవాసం లేక పోవడం తో , నెమ్మది నెమ్మది గా కలిసి వచ్చిన ఆశ్వర్యం కి బాగానే అలవాటు పడ్డాడు. మొదట్లో మాటల సందర్భంలో, "నాదేముంది అండీ !! అంతా రావు గారి దయ" నించి కొన్నాళ్ళు అయిన తర్వాత అయన ఉనికి తగ్గడం తో ఇదంతా తన ప్రయోజనమే అన్న మిడిసిపాటుకి అలవాటు పడ్డాడు. అందరికి తన యొక్క వైభవం అర్ధం అయ్యే "లాగా" తర్వాత "వరకు" విశీదీకరించే వకాల్త పుచ్చు కొని చాల వరకు సఫలీకృతుడు కూడా అయ్యాడు. కొన్ని ఏళ్ళు ఇట్లానే గడిచిన తర్వాత ఒక నాడు రావు గారు రావడం, విషయం అర్ధం అవ్వడం జరిగాయి. వెంటనే దేశానికే ప్రముఖుల్లో ఒక్కడైన అయన భూపతి రోడ్డు పాలు చేయడానికి పెద్ద సమయం పట్టలేదు అని చెప్పనక్కర్లేకుండా జరిగి పోయింది.
ఇది చాల మామూలు కధ లాగానే ఉంది కదా, దీన్ని గురించి ఇంత కష్ట పడ్డాడు అని ఆశ్చర్య పడుతున్నారా? కొంచం అలోచించి చూడండి, ఇది మన అందరి కథ లాగ అనిపించడం లేదండీ? మనం ఏదీ అడగకుండానే మొత్తం సృష్టి మొత్తం ప్రకృష్టమైన శరీరం అనే ఇల్లు ఇచ్చి దానికి తోడు మాట, ఆలోచన అనే ఆస్తులు కూడా జోడించిన తర్వాత ఆ పరమాత్మ ఎప్పుడైనా మన నించి ఏమీ ఆశించకుండా ప్రేక్షకుడి గానే మిగిలి ఉంటున్నాడు. అయితే ఈ ప్రపంచం ని "నా" అద్దం లోంచి చూస్తూ చివరికి ఇదంతా నా ప్రయోజకత్వమే అన్న భావజాలం నించి చివర వరకు బయటకు రాలేక పోతూ అంతా నాది అంటూనే చివరకి ఏమీ మిగలకుండా ఈ శరీరం లోంచి బయటకు నెట్టివేయ బడుతుంటాం. ఈ విషయమై రామాయణ అంతర్గతంగా ఒక ప్రస్తావన ఉంటుంది.
అరణ్య కాండ లో భరతుడు, రాములి వారిని తిరిగి అయోధ్య కి రమ్మని శత విధాలు గా ప్రాధేయ పడతాడు. చుట్టూ వున్న మంత్రులు, పరివారం చివరకి కైక కూడా ఆయన్ని బ్రతిమాలిన కూడా, పితృవాక్య పరిపాలనకి బద్దుడైన కారణానికి, రాముడు తిరిగి అయోధ్యకి రాలేడు అన్న నిర్ణయం నిర్ధారణ అవుతుంది. దేశం రాజ హీనం అవ్వకూడదు అన్న కారణానికి, వన వాసం గడువు పూర్తి అయ్యే వరకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని అక్కడే ఉన్న మంత్రి ఒక ప్రస్తావన చేయడం జరుగుతుంది. అప్పుడు భరతుడు ఒక్క సారిగా ఏదో దొంగతనం జరిగి తున్నట్టుగా ఉలిక్కి పడతాడు అట. "నాది" కాని దాన్ని ఈ విధంగా అనుభవించమని చెపుతారు ఆ మంత్రి గణాన్ని ప్రశ్నించడం జరుగుతుందని వ్యాఖ్యానం. చివరకి "రాముని" ప్రతినిధి గా రాజ్యం ఏలుతాను అని ఒప్పుకొని అయన "పాదుకలు" కి పట్టాభిషేకం జరుపుతాడు.
భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుత శరీరాన్ని ఒక పరికరంగా భావిస్తూ ఈ ప్రాపంచిక భోగాలని అనుభవిస్తూనే, నిత్యం ఈ నాది కాని దాన్ని "సాక్షి భూతం" గానే చూడమని ప్రాజ్ఞులు హెచ్చరించారు. ఎవరో నూటికో కోటికో ఒకటి అర ఈ సత్యాన్ని తెలుసు కొని తరించారనుకొంటా. అంతెందుకు అండీ ఇప్పడి వరకు వ్రాసింది కూడా "నా" ప్రజ్ఞే అని తలచుకోవడం లోనే తెలుస్తోంది, మనం ఏ పాటి బొంట్లమో అని.