కొన్ని విషయాలని యధాలాపం గా చదువుతాం, వింటాం, అర్ధం చేసికొంటాం. అకస్మాత్తుగా మన పక్కన ఉన్న పిల్లవాడో లేక స్నేహితుడో మనం చదివిన లేదా విన్న విషయంపై ఒక ప్రశ్న వేస్తాడు. "అరేరే !! మనకి ఈ విషయం ఎందుకు తట్టలేదురా" అనుకునే సందర్భాలు కొల్లలు. కాకపోతే ఈ యొక్క ప్రేరేపణ వెంటనే జరగవచ్చు లేదా కొన్ని విషయాలలో చాల సంవత్సరాలు కూడా పట్టా వచ్చు.
చాల రోజులు అయింది అనుకొంటా, కృష్ణావతారం సినిమా చూసి !! మన NTR చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. మళ్లీ ఎవరికీ అయినా నమ్మకం కలగదేమో అని, ఆ బోయడు ముసలంలో మిగిలిన చివరి ముక్కని సానదీసి బాణానికి తగిలించు కొన్నాడని కూడా సినిమా లో చూపిస్తారు. నేను కూడా సరేలే ముని శాపం మరియు యాదవ ముసలం అన్ని కలిసొచ్చాయి కదా అని అనుకోని సరి పెట్టుకొన్నా ఇన్నాళ్లూను. అయితే మొన్న ఎప్పుడో ఈ సందర్భంలో గురించి ప్రస్తావిస్తూ ఒక అయన "ఏమండీ !! ఇది అసలు నమ్మశఖ్యముగా ఉందా" అని ప్రశ్నించారు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?
విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ? అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు. ఏమో మరి అసలు ఆ కోణములో అసలు అలోచిన్చనే లేదు మరి ఇన్నాళ్లూను.
అట్లాగే ఇంకొక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!