భగవాన్ కీర్తన ప్రియ !! ఆయనకే ఈ రిమ్మ తెగులు ఉంటే మనమెంత వాళ్ళ మండీ ? ఆయనేప్పుడో చేసిన ఘన కార్యలన్నీ ప్రతి నిత్యం "సహాస్రం" పాటు తలుస్తూనే ఉంటామే. ఎవడైనా మన విభూతిని పొగిడితే వెంటనే మనస్సు లో నించి తీసి వేయలా ? ఎంత అన్యాయం అండీ !! అసలు ఇవ్వాల్టి రోజుల్లో ఎవడైనా మనసారా "చాల మంచి చేసారండీ" అన్న అభినందనే కరువై పోతూ ఉన్న రోజుల్లో మళ్లీ ఇది కూడా జోడిస్తే, ఇంకా ఏమైనా ఉందా ?
చెప్పద్దూ !! పొగడ్త లేని నాడు ఏ పని చెసినా నిరర్ధకం అనిపిస్తుంది కదండీ !! కాళ్ళ కి వేసు కొన్న చెప్పులు, కళ్ళకి పెట్టుకొనే జోడు, చేతి కి పెట్టుకొనే వాచ్, నడుముకి పెట్టె బెల్ట్, మెడలో వేలాడే గొలుసు ఇలా కాదేది పొగడ్త కి అనర్హం !! కొత్తగా చొక్కా వేసుకొంటే ఎవడూ బావుంది అని అనక పొతే ఏదో వెలితి. ఆటలైనా, పాటలైనా, మాటలైనా లేక వ్రాతలైన ఇలా ఏది చేసినా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం అన్న మాట ఒట్టి నీళ్ళ మీద మూటే !! అంతే కాదండీ మన అలవాట్లు, కార్య సిద్ది, పట్టుదల, నిర్వహణ ఇలా ఏదైనా సరే పక్కవాడు గమనించాలి అనే కోరతాం. లేని నాడు చేసిన పని కి సార్ధకత ఏదండీ ? ఎంత మంది ఉంటారు అండి సఫిలీకృత నిర్వహణకి కారణభూతం "నేను" కాదు అని అనగలిగిన వాళ్ళు. పొగడ్త ని చేయించిన వాడికే వదిలేసి నాదేమి లేదిందులో అని అనుకోవడం నిజానికి సాధ్యమా? పోనీ పొగిడే వాడు మనసార అభినందిస్తాడా అంటే అది ఎట్టి మాత్రం ప్రస్తుత కాల మాన పరిస్తితులలో సాధ్యం కానిది. పైగా రెండు మూడు సార్లు అలవాటు పడిన ప్రాణం నాలుగో సారి ఏమీ ప్రతిస్పందన లేక పొతే లేని పోనీ వైషమ్యం.
అంత పని చేసేసి "అమ్మా !! ఏమీ చేతకాని వాళ్ళని దూత గా పంపిస్తారు. ఉన్నవారంత నా కన్నా అధికులు, సములు గాని, తక్కువ వారు లేరమ్మా" అని త్రికరణ సుద్ది గా అనగలిగిన మానసిక పరిణితి ని ప్రదర్స్తిస్తారు హనుమ సుందర కాండలో. పైగా రాముల వారి దగ్గరకి సీతమ్మ కనుగొనపడినది అన్న వార్త చెప్పిన వారిలో చివరి వ్యక్తి హనుమే. స్వామి మన అందరకి ఏమైనా సందేశం ఇచ్చారా ? ఆచరణ సాధ్యం కానిదా ? ఏమో ..
"పోగిడితే చాలు బాజా కొట్టేమని మా సెగట్రీ ఎట్టించాడు" అంటూ ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు సెలవిచ్చినట్టు, మన మనసు లో సేపెరేట్ గా ఒక డిపార్టుమెంటు ఎట్టించాలేమో ఎవడైనా పొగిడితే బాజా కొట్టేయడానికి, అవి మన తల లో పేరుకు పోకుండా ఉండడానికి.