Monday, February 21, 2011

పొగడ్తలు

భగవాన్ కీర్తన  ప్రియ !! ఆయనకే ఈ రిమ్మ తెగులు ఉంటే మనమెంత వాళ్ళ మండీ  ? ఆయనేప్పుడో చేసిన ఘన కార్యలన్నీ ప్రతి నిత్యం "సహాస్రం" పాటు తలుస్తూనే ఉంటామే. ఎవడైనా మన విభూతిని పొగిడితే వెంటనే మనస్సు లో నించి తీసి వేయలా ? ఎంత అన్యాయం అండీ !! అసలు ఇవ్వాల్టి రోజుల్లో ఎవడైనా మనసారా "చాల మంచి చేసారండీ" అన్న అభినందనే కరువై పోతూ ఉన్న రోజుల్లో మళ్లీ ఇది కూడా జోడిస్తే, ఇంకా ఏమైనా ఉందా ?

చెప్పద్దూ !! పొగడ్త లేని నాడు ఏ పని చెసినా నిరర్ధకం అనిపిస్తుంది కదండీ !! కాళ్ళ కి వేసు కొన్న చెప్పులు, కళ్ళకి పెట్టుకొనే జోడు, చేతి కి పెట్టుకొనే వాచ్, నడుముకి పెట్టె బెల్ట్, మెడలో వేలాడే గొలుసు ఇలా కాదేది పొగడ్త కి అనర్హం !! కొత్తగా చొక్కా వేసుకొంటే ఎవడూ బావుంది అని అనక పొతే ఏదో వెలితి. ఆటలైనా, పాటలైనా, మాటలైనా లేక వ్రాతలైన ఇలా ఏది చేసినా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నాం అన్న మాట ఒట్టి నీళ్ళ మీద మూటే !! అంతే కాదండీ మన అలవాట్లు, కార్య సిద్ది, పట్టుదల, నిర్వహణ ఇలా ఏదైనా సరే పక్కవాడు గమనించాలి అనే కోరతాం. లేని నాడు చేసిన పని కి సార్ధకత ఏదండీ ? ఎంత మంది ఉంటారు అండి సఫిలీకృత నిర్వహణకి కారణభూతం "నేను" కాదు అని అనగలిగిన వాళ్ళు. పొగడ్త ని చేయించిన వాడికే వదిలేసి నాదేమి లేదిందులో అని అనుకోవడం నిజానికి సాధ్యమా? పోనీ పొగిడే వాడు మనసార అభినందిస్తాడా అంటే అది ఎట్టి మాత్రం ప్రస్తుత కాల మాన పరిస్తితులలో సాధ్యం కానిది. పైగా రెండు మూడు సార్లు అలవాటు పడిన ప్రాణం నాలుగో సారి ఏమీ ప్రతిస్పందన లేక పొతే లేని పోనీ వైషమ్యం.

అంత పని చేసేసి "అమ్మా !! ఏమీ చేతకాని వాళ్ళని దూత గా పంపిస్తారు. ఉన్నవారంత నా కన్నా అధికులు, సములు గాని, తక్కువ వారు లేరమ్మా" అని త్రికరణ సుద్ది గా అనగలిగిన మానసిక పరిణితి ని ప్రదర్స్తిస్తారు హనుమ సుందర కాండలో. పైగా రాముల వారి దగ్గరకి సీతమ్మ కనుగొనపడినది అన్న వార్త చెప్పిన వారిలో చివరి వ్యక్తి హనుమే. స్వామి మన అందరకి ఏమైనా సందేశం ఇచ్చారా ? ఆచరణ సాధ్యం కానిదా ? ఏమో ..

"పోగిడితే చాలు బాజా కొట్టేమని మా సెగట్రీ ఎట్టించాడు" అంటూ ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు సెలవిచ్చినట్టు, మన మనసు లో సేపెరేట్ గా ఒక డిపార్టుమెంటు ఎట్టించాలేమో ఎవడైనా పొగిడితే బాజా కొట్టేయడానికి, అవి మన తల లో పేరుకు పోకుండా ఉండడానికి.

Wednesday, February 9, 2011

సుగ్రీవ విజయం

 రామాయణ అంతర్గతం గా కిష్కింద కాండ లో వివరింపబడిన ఒక అద్బుత సంఘటన మీకు వివరిస్తాను. ఇది నా ప్రజ్ఞ ఎట్టి మాత్రం కాదు. శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు సంపూర్ణ రామాయణము ప్రవచనం విని మననం చేసికొన్న ఘట్టం. మన జీవితాల్లో ఎలా అన్వఇంచుకోవాలో పెద్దలు మీరు అందరు నిర్ణయం చేసికోండి.

"నీ శత్రువు నాకు కూడా శత్రువే" అని సుగ్రీవునికి అభయం ఇచ్చి వాలి ని యుద్దానికి పిలువయ్యా అని మిత్రుడి కష్టం తనదిగా బావిస్తాడు, శ్రీ రామ చంద్రుడు. అప్పుడు సుగ్రీవుడు సాధారణముగా మన అందరి ప్రవర్తిస్తాడో అలాగే వ్యవహరించాడు. ఎవరైనా ఒక మహానుభావుడు సంపూర్ణ మనస్సు తో మన దగ్గరకి వచ్చి మిత్రత్వం ప్రకటిస్తే "పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు" అన్న చందాన రక రకాల నిర్లక్షానికి గురి చేస్తాము. మా అన్నయ్య ఇంత బలం, వేగము ఉన్నవాడు అని రాముడి ని అనుమానిస్తునట్టు బహిర్గతం చెయ్యకుండా అత్యంత లౌక్యం గా అయన కి సకల పరిక్షలు జరిపించాడు. ఈ క్రమంలో తన మనస్సు లో ఉన్న అనుమానాలు బయట పడకుండా తన పాండిత్యం అంతా ప్రదర్శిస్తాడు. అంటే సుగ్రీవుడు రాముడిని నమ్మాడు "కాని" ఎక్కడో ఏదో అనుమానం. మనమైన కూడా మన జీవితాల్లో ఎక్కడా సంపూర్ణ విశ్వసనీయత, శరణాగతి ప్రదర్సన చేయడానికి సకల అడ్డంకులు ఎదురు అవుతాయి. "కలడో లేడో" సందిగ్నత మనలని సదా వెంటాడుతూనే వుంటుంది. తద్వారా కార్యసిద్ధి మరియు ఆత్మ సంతృప్తి కలగక పోవడం !! ఎన్నో వాటి కోసం వెంపర్లాడిన తర్వాత చివరికి వెలితి. బహుశా మన అందరిలో ఉండే మానసిక జాడ్యం అయ్యుండవచ్చు. వాలిని పిలిచాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు కానీ అన్నీ యాంత్రికమే!! రాముడి సహాయం అందుతుందో లేదో లేక వాలి ని నిహతించే అంత శక్తి రాముడికి ఉందొ లేదో ఇలా అన్నీ అనుమానాలే. అనుకొన్నట్టే కార్యం నెరవేరలేదు.


మళ్లీ మన అందరిలాగానే రాముడి ని నిందిస్తాడు. సరే రాముడు వాలి మరియు సుగ్రీవుడు మధ్య వైవిధ్యం ఎందుకు గమనించలేక పోయాడో అనేది మరొక ధర్మ సూక్షం అనుకోండి. (ప్రాజ్ఞులు చెప్పిన ప్రవచనాలు చాల అందుబాటులో ఉన్నాయి, మీకు నిజముగా తెలుసు కోవాలి అంటే). ఈ సారి సుగ్రీవుడు సంపూర్ణ శరణాగతి చెయ్య గలుగుతాడు. ఇది చెయ్యగలిగిన వాడి మానసిక దృక్పదం ఈ విధం గా మారుతుందో అయన మళ్లీ వాలిని యుద్దానికి పిలవడానికి వెళ్తున్నప్పుడు జరిగిన విషయాల వర్ణన ని గమనిస్తే తెలుస్తుంది.


సుగ్రీవుడు ఈ సారి మార్గ మద్యం లో గతం లో మహాత్ములు నివసించిన ప్రదేశాలు ప్రస్పుటం గా కనపడతాయి. వాటిని దాటుతున్నప్పుడు వారి వారి సత్ప్రవర్తన ని మననం చేసికొంటూ అత్యంత భక్తీ శ్రద్దలతో స్మరిస్తాడు. ఇది ఒక మనిషి లో పాజిటివ్ అవుట్లుక్ ఉంది అన్నదానికి నిదర్శనము కాదా!! ఈ చిన్న మార్పుతో విజయలక్ష్మిని వరించిన సుగ్రీవుడు ని గమనిస్తూ మన జీవితాలని కూడా తీర్చు దిద్ది కోవచ్చు అన్న ఆలోచన తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

Friday, February 4, 2011

నమ్మకాలు - భయాలు

మనం నమ్మిన కొన్ని విషయాలు ఎప్పటకి తప్పు కాకూడదు లేదా ఇంకోలా జరిగితే ఒప్పుకోలేని మనస్తత్వం మనిషి ని మూర్ఖం వైపు కు తిప్పుతుందా ?? అందరు వేసుకోవాల్సిన ప్రశ్న!!  
ఉదాహరణకి భూమి వయస్సు అయిదు వేల సంవత్సరాలు అని కొన్ని ప్రామాణికాలు చెప్పాయి. తర్వాత కాలక్రమేనా పురావస్తు శాస్త్రవేత్తలు "కాదండీ !! 20 నుంచి 100 మిల్లియన్ సంవత్సరాలు ఉంటుందేమో" అని అన్నారు. తర్వాత మళ్లీ సరిదిద్దారు. ప్రస్తుతానికి 4.54 బిల్లియన్ సంవత్సరాలు అని నిర్ధారించారు. ఈలోగా చాల మంది బుర్రలు బద్దలు కొట్టుకొని ఉండి ఉంటారు. సకల జీవ జాలం నించి పరిణితి చెంది అది మానవుడు ఆవిర్భావం ఒక అయిదు నించి ఆరు వేల సంవత్సరాలు క్రితం జరిగి ఉంటుంది అని అన్ని పుస్తకాలలో అచ్చు వేయించారు కొంత మంది పెద్దవాళ్ళు చాన్నాళ్ళ ముందట. పురాణాలూ, బైబిల్ ఇంకా ఇతర చాదస్తాలు అన్నీపక్కకి తోసేసాము అని అన్నారు. నిజమెంతో అని మళ్లీ తర్వాత జరిగే శాస్త్రీయ పరిసోధనాల్లో అనుమానాలు మొదలు అయ్యాయి. రాజ్యం లో ఉన్నవాడు అచ్చువేయించి "నమ్ముతార చస్తారా" అని అన్నప్పుడు, వేరే సిద్ధాంతాల ని హేళన చేసిన నాడు తాత్కాలికం గా అయిన మనుషుల్లో భావోద్వేగాలు వచ్చి ఉండకుండా ఉంటాయా? మీలో ఎవరికీ అయినా భగవంతుడు వేరే మతం వాళ్ళు కొలిచే రూపం లో ప్రత్యక్షం అయ్యి జనావళి కి అంతా "ఒరే మూర్ఖులారా !! మిగతా అన్ని విశ్వాసాలు అన్ని తప్పు. ఈ ఒక్క మతమే నిజం" అని చెప్పాడు అనుకోండి. ఒప్పుకోగల సామర్ధ్యం ఉందా మన అందరిలో ??

Inhibitions అంటే తెలుగు లో ఏంటండి?  "అభ్యంతరము, ఆక్షేపణలు". ఒక్కొక్క కాల మాన పరిస్తితి ని బట్టి మూస గా  వీటి మధ్యలోనే పెరుగుతారు.

యూదులు అంత నిరర్ధకమైన ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. వాళ్ళని నాశనం చీసే తీరాలి  - ప్రపంచం లో ఒక ప్రాంతం అంతా కనీసం ఒక రెండు దశాభ్దాలు పాటు దీన్నే నమ్మింది.

ఆర్యులు, అనార్యులు అనే చీలిక హిందూ దేశాన్ని ఎప్పుడో చీల్చింది - ఉత్తర మరియు దక్షిణ భారతీయులు ఒకే వేదమును నమ్ముతున్నా ఒక జాతి కాదు.

పాకిస్తాన్ అనే దేశం లో ఒక్క మంచి వాడు కూడా పుట్టే/పెరిగే అవకాశమే లేనే లేదు - భారతీయ జాతి అంతా  ఈ సిద్దాంతాన్ని ఇంకా నమ్ముతూనే ఉంది. అలాగే అటువైపు వారు బ్రాహ్మణ భారతీయ సంస్కృతి అత్యంత ప్రమాదకరం. నశింప చేసే హక్కు మా మతం మాకు ఎప్పుడో ఇచ్చింది - ఇది పాకిస్తాన్ దేశ ఉనికి కి ఆయువు పట్టు.


పోనీ ఆధునికులు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలు వేరే విధం గా ఆలోచిస్తారు అని అనుకోవడానికి లేదు. సామాన్యమైన పరిస్తితుల్లో తాము విశ్వసించిన వాటిని తప్పేమో అని ఎవరు అయినా బయటికి అంటే దాన్ని దారుణంగా అణిచి వేసిన సంభందాలు ఎన్నో ఎన్నెన్నో !!


ఆశ్చర్యమైన విషయము ఏంటి అంటే మీరు నమ్మిన విషయము ఇంకొక ప్రాంతం లో కాని సమాజము లో కాని కాలమానము లో పూర్తిగా విరుద్దం అని తెలిస్తే సామాన్యంగా మూర్ఖత్వం ప్రబలుతుంది. బహుశా ఒక శకం మారాలి ఏమో పరిస్తితులు మారటానికి.  అందుకే సమాజం లో పెద్ద పీట లో ఉన్న వాళ్ళు ఇలాంటి సున్నితమైన విషయాల్లో బహు జాగ్రత్త వహించే వాళ్ళు. కొన్ని classified files లో భయంకర నిజాలని అత్యంత గోప్యం గా ఉంచడాన్ని నేను అయితే గొప్ప సమాజ సేవ గానే భావిస్తాను. కొంత శాంతి ఏర్పడినప్పుడు తగు జాగ్రత్త వహించి ప్రజ కి ఇవ్వడాన్ని సమర్ధించాలి అనుకొంటా. ఇవ్వాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ లో సామాన్యమైన ప్రజలు ఇంత మీడియా అత్యుత్సహమును చూపడాన్ని "దేశ ద్రోహం" గా చాల మంది పరిగణించడం లో తప్పు ఏమీ కనపడ్డం లేదు.


ఈ యొక్క మానసిక అడ్డంకులు ఏ స్తాయి లో అయినా ప్రబల వచ్చు. వీటిని ఏ మనిషి అయినా ఒక జీవిత కాలం లో అధిగమించ వచ్చు లేదా ఆ సంఘర్షణ లోనే సతమతం అవ్వ వచ్చు. మీ యొక్క నమ్మకాలు జీవితాలని ఉద్దరించవచ్చు లేదా మౌడ్యం లోకి నెట్టేయ వచ్చు. కొంత మంది విపరీత ధోరణి, కాల యాపన, వృధా వైరాలు, కార్పణ్యాలు, వ్యగ్రతలు ఇలా ఎన్నో జాడ్యాలకు గురి అవ్వడం చూస్తూ ఉంటాము.

అలాగే ఇంకో తీరు ఏంటంటే, మీరు నమ్మే సిద్ధాంతం తప్పు అని పని కట్టుకు చెప్పడం వల్ల కొంత మందికి చాల సంతృప్తి ని ఇస్తుంది ఏమో. పోనీ శాస్త్ర పరమైన సిద్దాంతి కరణ జరిగిన తర్వాత ఇలాంటి విమర్సాత్మక మైన ధోరణి నప్పుతుందేమో కాని అల్లా  టప్ప గా మాట్లాడే వాళ్ళని సమాజ విద్రోహులు గానే పరిగణించాలి. "నిజం నిలకడ మీద తేలుతుంది" అన్న మాట అక్షర సత్యం కాదా. ఇవ్వాళ్ళ రోజున వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని మాటల గారడీ తో తిమ్మి ని బొమ్మి చేసి ప్రజల మీదకు రుద్దే మహాను భావులని చూసిన తర్వాతే భూమి ని పిచ్చి పిచ్చి గా పరిశోదన చేసి వయస్సు కనిపెట్టే ప్రయత్నం ని మానవాళి అందరు హర్షించ వలసిన విషయమే !!! ఇంకా ఇలాంటి నిజాలు ని మరింత నిజమని చెప్ప్పే ప్రయత్నాలు అన్ని చూసి "చాల రోజులు నించి ఇలాంటివి చూసాను" అని మనమందరూ నిలబడిన భూ దేవి ఎన్ని రోజులు నించి చెపుతోందో తెలియాలి కదా.